ఎవరెస్ట్ కింద చైనా సొరంగం

 

ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్ కింద నుంచి రైలు మార్గం కోసం సొరంగాన్ని తవ్వాలని చైనా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గం నిర్మాణంతో నేపాల్‌తో చైనాకి రైలు సదుపాయం ఏర్పడనుంది. ఇప్పటికే చైనా నుంచి టిబెట్‌కి రైలు మార్గం వుంది. ఖింఘాయ్ - లాసా రైల్వే మార్గాన్ని నేపాల్ వరకూ పొడిగించాలనే పథకానికి చైనా రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం నేపాల్ ప్రభుత్వంతో చైనా చర్చలు జరిపింది. ప్రాజెక్టుకు నేపాల్ నుంచి అనుమతి లభిస్తే 2020 నాటికల్లా ఈ మార్గాన్ని పూర్తి చేయాలని చైనా భావిస్తోంది. ఈ నిర్మాణం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు భారత దేశానికి భద్రతాపరమైన సమస్యలు ఏర్పడవచ్చని పరిశీకులు భావిస్తున్నారు. అలాగే హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వతం ఎవరెస్ట్. మరి హిందూ దేశమైన నేపాల్ ఈ పర్వతానికి సొరంగం వేయడానికి ఎంతవరకు అనుమతిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu