జయమ్మ అక్రమ ఆస్తుల కేసులో నేడే తీర్పు.. ఓడితే రాజీనామానే..

 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలితకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బెంగళూరు కోర్టు శనివారం తీర్పు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జయలలిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనితో ఈరోజు బెంగుళూరు కోర్టు ఈ కేసు మీద తీర్పు ఇవ్వబోతోంది. జయలలిత తీర్పును వాయిదా వేయాలని పిటిషన్ వేశారంటే, తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జయలలితకు తన ఆదాయాన్ని మించి 66 కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయంటూ దాఖలైన పిటిషన్ మీద సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగింది. ఈ కేసు తీర్పు వస్తున్న సందర్భంగా లక్షల మంది పోలీసులతో తమిళనాడు రాష్ట్రంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. జయలలితకు వ్యతిరేకంగా కనుక కోర్టు తీర్పు వచ్చిందంటే తమిళనాడు రాజకీయాల్లో అది భారీ కుదుపు అవుతుందని, తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని పరిశీలకులు అంటున్నారు. జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కూడా చేసే అవకాశం వుందంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu