ఛత్తీస్గఢ్ సీఎం.. కరీనాతో సెల్ఫీ.. ఇలా చేస్తారా.. కాంగ్రెస్
posted on Nov 21, 2015 11:38AM

ప్రతిఒక్కరూ సెల్ఫీ దిగడం.. దానిని పోస్ట్ చేయడం కామన్ థింగ్. సామాన్య ప్రజల దగ్గర నుండి రాజకీయ నాయకులు వరకూ అందరూ సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకునే వాళ్లే. అయితే అలా సెల్ఫీ దిగి విమర్శలు తెచ్చుకున్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన రాష్ట్రం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ యూనిసెఫ్ ల ఆధ్వర్యంలో బాలల హక్కలపై జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా హాజరయ్యారు. అయితే కార్యక్రమం ముగిసే సమయానికి రమణ్ సింగ్ కరీనా కపూర్ తో సెల్పీ తీసుకున్నారు. అది కాస్త మీడియా కంట పడింది. అంతే ఇక రమణ సింగ్ పై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్నిచాలా సీరియస్ గా తీసుకొని రమణ సింగ్ పై మండిపడుతుంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రి, సినీ తారలతో సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.