రుణమాఫీపై రంగంలోకి చంద్రబాబు
posted on Jun 23, 2014 11:10AM
ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ పథకం అమలును రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకులు వ్యతరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ పథకాన్ని ఎలాగైనా అమలు చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి. రుణమాఫీ పథకం అమలుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐదు మార్గాలను ఆలోచించినట్లు తెలుస్తోంది. 1. రీషెడ్యూలు, మారటోరియానికి ఆర్టీఐని ఒప్పించడం. 2.బాండ్ల జారీకి ఆర్టీఐ, కేంద్రం అనుమతి తీసుకోవడం. 3. ఎఫ్ఆర్బీఎం చట్టం నుంచి మినహాయింపు కోరడం తద్వార కొత్త అప్పులు తెచ్చి పథకాన్ని అమలు చేయడం. 4. సగం రుణం తక్షణ చెల్లింపు..మిగిలిన సగానికి బాండ్లు. 5. రైతులకే బాండ్లు జారీ..ఐదేళ్లలో తిరిగి చెల్లింపు. ఈ మేరకు ఆర్బీఐ అనుమతి తీసుకునేందుకు ఈనెల 25న కోటయ్య కమిటీ ముంబై వెళ్లబోతోంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్తో ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. ఈ నెల 26న ఢిల్లీ వెళుతున్న బాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతోనూ రుణ మాఫీపై చర్చించనున్నారు.