తిరుమలపై కేంద్ర హోం శాఖ నజర్

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, అలాగే 13న లడ్డూ విక్రయ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటలపై టీటీడీని వివరణ కోరింది.

అలాగే ఈ ఘటనల వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సజీవ్ కుమార్ జిందాల్  ఆది, సోమ వారాల్లో (జనవరి 19, 20)  తిరుమలలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన టీటీడీ అధికారులతో భేటీ అవుతారు. తరువాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారు.   టీటీడీ పాలకమండలి పాలకమండలి వ్యవహారాల్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. చరిత్రలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి.