అనుకూలంగా ఉంటే ముడుపులిస్తామన్నారు.. సీబీఐ జడ్జి

బొగ్గు కుంభకోణంలో నిందితులకు అనుకూలంగా ఉండాలని దానికి ఎంత కావాలంటే అంత ముడుపులు చెల్లిస్తామని నన్ను లోపర్చుకోవాలని చూశారని సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ స్కాంకు సంబంధించిన ఒక నిందితుడి తరపు న్యాయవాది తనను కలిశాడని, తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామని ఆఫర్ కూడా చేశారని తెలిపారు. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జడ్జి హెచ్చరించారు. దీంతో జడ్జి మాటలకు ఖంగుతిన్న న్యాయవాది అతనికి క్షమాపణలు చెప్పారు. అయితే జడ్జి గారు, తనను మభ్యపెట్టడానికి ప్రయత్నించిన న్యాయవాది పేరును మాత్రం బటయపెట్టలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu