మరో మలుపు తిరిగిన జయలలిత కేసు..

అక్రమాస్తుల కేసుపై జయలలిత పై ఉన్న ఆరోపణలు తొలగించి కర్ణాటక కోర్టు ఆమె కేసును రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఆ తరువాత ఆమె ఈ నెల 17న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవిని కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు జయలలిత కేసు మరో కొత్త మలుపు తిరిగింది. జయలలిత కేసు తీర్పును సవాల్ చేయాలని కర్ణాటక హైకోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమెపై శిక్ష నిలిపిపేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ కేసు విచారణకు వెళితే జయలలిత మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో జయలలిత తీర్పును సవాల్ చేస్తూ డీఎంకే పార్టీ నేతలు కోర్టులో అప్పీలు చేస్తామని, మాకు ఆ హక్కు ఉందని తెలిపిన సంగతి తెలిసిందే.