కాల్ మనీ.. పట్టుబడ్డవారు 118..వైసీపీ 44

కాల్ మనీ వ్యాపారులతో రాజకీయ నేతలకు ఉన్న లింకులు రోజు రోజుకు బయటపడుతున్నాయి. ఏపీ పోలీసులు తెలిపిన లెక్క ప్రకారం మొత్తం పట్టుబడిన వ్యాపారులు 118 కాగా అందులో ఎక్కువ 44 మంది వైసీపీ పార్టీకి సంబంధించిన వారు. .20 మంది టీడీపీకి.. 13మంది కాంగ్రెస్, ఆరుగురు సీబీఐ కు సంబంధించిన వారు.. మిగిలిన వారు ఏపార్టీకి చెందని వారిగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పోలీసులు నిఘా ఉంచారు. తాడేపల్లి గూడెం, పాలకొల్లు, చింతపూడి, ఏలూరు జంగారెడ్డి గూడెంలో ఈ కేసుకు సంబంధించి 12 కేసులు నమోదు.. 10 మందిని అరెస్ట్ చేశారు. కొంత మంది కాల్ మనీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుపుతున్నారు.