జగన్ దొంగల ముఠా నాయకుడు..కాల్వ


 

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన వెంటనే వైసీపీ కార్యకర్తలు కాల్ మనీ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. అంతేకాదు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీనేత యనమల కలుగజేసుకొని కాల్ మనీ గురించి రేపు మాట్లాడుకుందామని చెప్పినా వైసీపీ నేతలు వినకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు వైసీపీ పై మండిపడ్డారు. జగన్ దొంగల ముఠా నాయకుడని.. వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.