ఇంట్లో బీటెక్ పరీక్ష రాస్తూ అడ్డంగా దొరికిన ఆర్డీవో పుత్రరత్నం..!

ఎక్కడైనా ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తారు..ఎంటీ ఆ వెధవ ప్రశ్న..ఎగ్జామ్‌ని ఎగ్జామ్ సెంటర్‌లో రాస్తారు అని మీరు అనుకోవచ్చు. కాని అందుకు భిన్నంగా తన ఇంటినే ఎగ్జామ్ సెంటర్ చేశాడు. హయత్‌నగర్ నోవా కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నిఖిల్ అనే విద్యార్థి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తన తండ్రి ఆర్డీవో కావడంతో ఆయన పలుకుబడితో పరీక్షను ఇంటిలోనే రాయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే క్వశ్చన్ అండ్ అన్సర్ పేపర్స్ ఇంటికి వచ్చాయి. తనతో పాటు తన స్నేహితుల్ని కూడా పరీక్ష రాయించాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు పరీక్ష రాస్తున్న ఇంటిపై దాడి చేసి ఆర్డీవో కుమారుడు నిఖిల్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. క్వశ్చన్ పేపర్స్ స్వాధీనం చేసుకుని విద్యార్థులను పీఎస్‌కు తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu