అందులేనే ప్రత్యేక హోదా దాగి ఉందట..


ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకూ ఎవరికి నచ్చింది వాళ్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కేంద్రమంత్రి బీజేపీ నేత పురందరేశ్వరీ కూడా కొత్తగా చెప్పింది ఏం లేకపోయినా ఆమె చెప్పింది మాత్రం కొత్తగా మాత్రం అనిపించేలా ఉంది. అదేంటంటే.. ఈరోజు విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేవలం ప్రత్యేక హోదా అనే అంశం ఒక్కదాని గురించి మాట్లాడలేమని.. ప్రత్యేక ప్యాకేజీలోనే ప్రత్యేక హోదా అంశం దాగి ఉందని అన్నారు. ప్రత్యేక హోదానా లేదంటే ప్రత్యేక ప్యాకేజీనా అనే దానిపై చర్చ కంటే ఏపీకి ఎంత వరకు న్యాయం జరిగిందనే దానిపై మనం దృష్టిసారించాల్సి ఉందని వెల్లడించారు. ప్రత్యేక హోదా బదులు..ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే నేతలు దాన్ని ఆమోదించకపోయినా ప్రజలు మాత్రం ఆమోదిస్తారని బీజేపీ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. మరి పాపం ఇన్ని రోజులు తెలుగు ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీలోనే ప్రత్యేక హోదా దాగిఉందన్న విషయం తెలియదు అందుకే.. ప్రత్యేక హోదా కావాలంటూ.. నేతలు, పలు పార్టీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా పురందరేశ్వరీ చెప్పినదాన్నిబట్టి అర్ధమవుతుందేమో చూడాలి..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu