ప్రాణం తీసిన సెల్ఫీ

 

సెల్ఫీల పిచ్చి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు అది కాస్త ముదిరి సాహసాలు చేస్తూ ఫోటోలు తీసి మరీ పెడుతున్నారు యువత. అలా సాహసం చేసి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకుంది ఓ యువతి. ఈ ఘటన ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో చోటుచేసుకుంది. అన్నా ఉర్సూ అనే యువతి ఓ సెల్ఫీ తీసి పోస్ట్ చేయాలనుకుంది అది కూడా మామూలుగా కాదు రైలు పైకి ఎక్కి. అనుకున్నదే తడువుగా వెంటనే రైలు పైకి ఎక్కింది. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె కాలు పొరపాటున హైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలవ్వగా ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె రైలు ఎక్కుతున్నప్పుడు ఎక్కొద్దని హెచ్చరించానని ఆమె వినిపించుకోకుండా ఎక్కిందని అక్కడ ఉన్న ప్రయాణికుడు తెలిపాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu