బీహార్ లో హోరాహోరీ... ఎన్డీఏకే మొగ్గు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు, మహాకూటమి హోరాహోరీగా తలపడతున్నాయి, నువ్వానేనా అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు, విమర్శలు ప్రతివిమర్శలతో బీహార్ ను వేడెక్కిస్తున్నారు, అయితే పలు సర్వేల్లో ఎన్డీఏకే మొగ్గు ఉందని తేలింది, తాజాగా టైమ్స్ నౌ ఛానల్ ...సి ఓటర్ తో కలిసి జరిపిన సర్వేలో ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతున్నా ఎన్డీఏకే ఆధిక్యం ఉందంటూ చెప్పుకొచ్చింది. టైమ్స్ నౌ ఛానల్ ...సి ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 117 స్థానాలు, మహాకూటమికి 112 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది, ఇతరులు 14 స్థానాల్లో గెలవొచ్చని తెలిపింది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu