థాయ్‌ల్యాండ్‌లో అగ్నిప్రమాదం..17 మంది బాలికలు సజీవదహనం

థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని పేద బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్టల్‌లో ఈ ప్రమాదం జరిగింది. చూస్తుండగానే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ కారణంగా చాలా మంది బయటకు రాలేక అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో హాస్టల్‌లో 38 మంది ఉన్నారు. వీరిలో 17 మంది సజీవదహనమవ్వగా..మరో ఐదుగురు గాయపడ్డారు. అయితే మరి కొందరి ఆచూకీ లభించాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu