సింహాను మించిన సినిమా తీస్తా: బోయపాటి
posted on Apr 25, 2013 2:22PM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సెకండ్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించి దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ..''సింహ తరువాత నందమూరి బాలకృష్ణ గారి తో సినిమా చేయబోతున్న, సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో తెలుసు. సింహ మించిన సినిమా తీస్తా..అని చెబితే తొందరపాటు అవుతుంది. కాని ఆ స్థాయికి మాత్రం తగ్గదు. బాలయ్య బాబు నుంచి అభిమానులు ఏమికోరుకుంటారో ..అవన్ని మేళవిస్తూ ఆయన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా..ఇందులో రాజకీయ అంశాలు ఉంటాయి కాని కథకు ఎంత వరకు అవసరమో అంతే ఉంటాయని'' అని చెప్పారు. బాలయ్యతో సినిమా అయ్యాక తాను చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.