రాజమౌళి 'బహుబలి' లో నటి శ్రీదేవి
posted on Apr 25, 2013 4:49PM
.jpg)
ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల సుందరి శ్రీదేవి దాదాపు 15 సంవత్సరాల తరువాత ‘ఇంగ్లీష్ వింగ్లీష్ ’ సినిమాలో నటించి తనలోని నటనా ఏ మాత్రం చావలేదని నిరూపించింది. తాజాగా టాలీవుడ్ ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబళి ’ లో ప్రభాస్ కి తల్లిగా అందాల తార శ్రీదేవి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ల పేర్లను పరిగణలోకి తీసుకున్నాడట. అయితే వీరిద్దరిలో ఎవర్ని ఎంపిక చేయాలో రాజమౌళి తేల్చుకోలేక పోతున్నాడట. ఎందుకంటే వీరిద్దరు నటనలో, పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గరు. ఇద్దరు కోటికి పైగా డిమాండ్ చేస్తున్నారట. మొత్తంగా చూస్తే ఇటీవలే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. ఒకవేళ ఇదే గనుక కరెక్ట్ అయితే పెద్ద సెన్సేషన్ అవుతుందని అంటున్నారు.