మరి కొద్ది సేపటిలో బెంగళూరుకు చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా?

నందమూరి తారక రత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరి కొద్ది  సేపటిలో బెంగుళూరు వెళ్లనున్నారు.  కుప్పంలో నిన్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించేందుకు ఆయన బెంగళూరు బయలు దేరుతున్నారు.  తారకరత్నకు వైద్యులు ప్రస్తుతం ఎక్మో అమర్చి  చికిత్స అందిస్తున్నారు.    లోకేష్ కు మద్దతుగా కుప్పంలో యువగళం యాత్రలో పాల్గొన్న  యాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్నఅస్వస్థతకు గురి కావడంతో  ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వెంటనే ఆయనను కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.  

టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.  నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు.

తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుని ఆయనను పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు బెంగళూరు బయలుదేరి వెళుతున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్నను పరామర్శించేందుకు బెంగళూరు బయలుదేరనున్నట్లు సమాచారం.  ఇప్పటికే బాలకృష్ణ బెంగళూరులో ఉన్నారు. ఆయన దగ్గరుండి తారకరత్నకు అందుతున్నచికిత్సను పర్యవేక్షిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu