ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని బహిష్కరిస్తున్నాం
posted on Mar 18, 2013 11:27AM
'బాద్ షా' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మరణించిన వరంగల్ కు చెందిన అభిమానికి సంతాపం ప్రకటించకపోవడంపై సినీనటి, ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయశాంతి మాట్లాడుతూ…బాద్షా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో తెలంగాణ బిడ్డ మరణించినా సంతాపం తెలపకుండా ఆడియో ఫంక్షన్ నిర్వహించడం సీమాంధ్ర అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బాద్షా సినిమాను బహిష్కరిస్తున్నామన్నారు. కాగా బాద్షా ఆడియో రిలీజ్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రాజు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.