టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

 

 

 TRS telangana, TDP telangana, ap assembly budget session

 

 

శాసనసభ సజావుగా సాగేందుకు సహకరించని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినకపోవడంతో వారిని ప్రభుత్వం ఒకరోజు పాటు సస్పెండ్‌ చేసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సీపీఐ, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈనెల 21న తలపెట్టిన సడక్ బంద్కు అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు ఉదయం హోంమంత్రిని కోరారు.