అజాంఖాన్ ను తిట్టి ఎంఐఎం ను పొగిడిన శివసేన..

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎవరి ప్రత్యేకత వారిది. అందులో శివసేనది ఒక స్టైల్ అయితే.. ఉత్తర ప్రదేశ్ మంత్రి అజాంఖాన్ ది మరో స్టైల్.. కానీ కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఈసారి మాత్రం శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అజాంఖాన్ తిడుతూ.. వేరే పార్టీని పొగిడారు. అందులో ఆశ్చర్యం ఏముందంటారా.. అయితే శివసేన పొగిడింది ఎవర్నో కాదు.. తాము ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఎంఐఎం పార్టీని.. అసలు సంగతేంటంటే.. అజాంఖాన్ తాజాగా పారిస్ లో దుర్మార్గుల బాంబు దాడిని బాబ్రీ మసీదు సంఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు ముస్లింలను రెచ్చగొట్టడం వల్లే పారీస్ ఘటన జరిగిందని.. బాబ్రీలో లేనిపోని విద్వంసం సృష్టించడం వల్లే ముంబైలో బాంబు దాడి జరిగిందని అన్నారు. అంతే అజంఖాన్ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే అజాంఖానే చాలా డేంజరస్ అని.. అజాంఖాన్ లాంటి వారు ఒక్కరుంటే చాలు ఇంక ఉగ్రవాదులు అవసరం లేదు.. ఆయనే పెద్ద ఉగ్రవాది అని మండిపడ్డారు. అంతేకాదు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ  ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడలేదని.. ఒవైసీ నుంచి అజాంఖాన్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu