కొత్త నియోజకవర్గాలు పెంపు ఇప్పట్లో లేనట్టే..

రాజకీయ పదవులు కోసం ఆశగా ఎదురుచూసే వాళ్లకి నిరాశే ఎదురైంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ, తెలంగాణ రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో.. రాష్ట్రాల్లో కొత్త నియోజక వర్గాలు ఏర్పడుతాయని.. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందని పలువురు ఆశపడ్డారు కానీ అవేమి ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా పరిస్థితులు కనిపించడంలేదు. అయితే గతంలో కూడా ఇరు రాష్ట్రాల ఎంపీ లు కూడా కలిసి ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడారు కానీ..ఇప్పుడు అవన్నీ కుదిరే పరిస్థితులు లేవని కేంద్రం చెబుతుంది. ప్రసుత్తం.. ఏపీలో 175 - తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు  ఏపీలో 225 - తెలంగాణలో 150 సీట్లకు పెంచాలని కోరగా.. 2026 వరకూ నియోజక వర్గాలు పెంచడం కుదరదని..కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధురి మంగళవారం పార్లమెంటులో చెప్పేశారు. దీంతో 2026 వరకూ నియోజకవర్గాల పెంపు సాధ్యమని తెలిసిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu