వైసీపీ నేతలకు నెహ్రూపై అంత ఇంట్రస్ట్ ఎందుకో.. ?


 

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆపార్టీ నేతలకే అర్దంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పార్టీలో ఉన్న కొంతమంది నేతల వల్ల పార్టీకి లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే నాయకుల కంటే.. వివాదాస్పద నాయకులే ఎక్కవ తయారయ్యారు వైకాపాలో.. దానికి తోడు ఇప్పుడు మరో నేతను పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. అయితే తీసుకొచ్చేది వేరే పార్టీలోని ఏబలమైన నేతనో అయితే పార్టీకి కాస్త బలంగా అన్న ఉండేది.. కానీ తాము తీసుకురావాలని చూసేది  మాజీ మంత్రి దేవినేని నెహ్రూని.. ప్రస్తుతం ఫేడవుట్ లో ఉన్న నెహ్రూనే పార్టీలోకి తీసుకురావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే నెహ్రూ ఎంట్రీకి అభ్యంతరం చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారంట. అందులో మొదటి వ్యక్తి  వంగవీటి రాధా. నెహ్రూ కనుక పార్టీలోకి వస్తే తాము వెంటనే పార్టీ వీడతామని ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి రాధా చెప్పారంటా. వంగవీటి రాధా ఒక్క విషయమే కాదు.. ఒకవేళ నెహ్రూ కనుక వైసీపీ లోకి వస్తే  ఆయన సామాజిక వర్గంతో బలం చేకూరవచ్చు కానీ కాపు సామాజిక వర్గం నుండి వ్యతిరేకత వస్తుందని అనుకుంటున్నారు.. మొత్తానికి ఎంతోమంది బలమైన నాయకులు ఉండగా.. వైసీపీ మాత్రం నెహ్రూపై ఎందుకు ఇంట్రస్ట్ చూపుతుందో..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu