‘ఆటోనగర్ సూర్య’ విడుదలకు సమస్య!

 

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మనం’ సినిమా ఈమధ్య విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో వీరిద్దరు కలసి నటించిన మరో చిత్రం ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాని ఈనెల 27న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఒక ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. తాను ఈ సినిమా కోసం రెండు కోట్లు రుణం ఇచ్చారని, తన రుణం తీర్చకుండానే సినిమాని విడుదల చేస్తున్నారంటూ గుంటూరుకు చెందిన ఒక ఫైనాన్షియర్ కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు ఈ సినిమాని జులై 10వ తేదీ వరకు విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో మరోసారి ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం విడుదలకు అవరోధాలు ఏర్పడ్డాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu