40 ఎకరాలు భూమి విరాళం ఇచ్చిన అశ్వినీ దత్త్

 

ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్త్ గన్నవరం మండలంలో కేసరపల్లి గ్రామంలో తన 40ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో సుమారు 550ఎకరాల భూములను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాని కోసమే అశ్వినీ దత్త్ తన 40ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేరు. ఆయన ఈరోజు జిల్లా ఆర్.డి.ఓ.ని కలిసి ఆ భూమి తాలూకు యాజమాన్య పత్రాలను అందజేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో రాజకీయ నేతలు అందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu