రేవంత్ ను వ్యూహాత్మకంగా విచారిస్తున్న ఎసిబి

ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు వ్యూహాత్మకంగా విచారిస్తున్నట్లు సమాచారం. రేవంత్ ను ఎసిబి ఆఫీస్ లో విచారిస్తున్నారని అందరూ అనుకున్నారు కానీ ఆయనను చర్లపల్లి జైలులోనే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ లను మాత్రమే ఎసిబి ఆఫీస్ కి తీసుకెళ్ళిన అధికారులు, రేవంత్ ని మాత్రం జైలులోనే విచారించడం ముందస్తూ వ్యూహంగా తెలుస్తోంది. రేవంత్ తరపు న్యాయవాదులు తమకు సమాచారం ఇవ్వకుండా ఎసిబి అదికారులు విచారణ చేస్తున్నారంటూ ఎసిబి ఆఫీస్ ఎదుట ఆందోళనక దిగారు. రేవంత్ ఎసిబి ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెబుతారన్నది ఉత్కంఠగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu