ఢిల్లీ హింసపై నోరు మెదపరేం?
posted on Mar 6, 2020 9:40AM

బిజెపి మిత్రపక్షాలపై ఎంపీ అసదుద్దీన్ విమర్శలు
తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏకు వ్యతిరేక తీర్మానం మాదిరిగా ఎన్పీఆర్పై స్టే విధించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ను విజ్ఞప్తి చేశారు. కేరళ మాదిరిగా ఎన్పీఆర్పై నిర్ణయం తీసుకుంటేనే భవిష్యత్లో దాని ప్రక్రియ ఆగుతుందని తేల్చిచెప్పారు.
ఢిల్లీ ‘మారణహోమం’పై ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా భారతీయులేనని, ఇప్పటికైనా బాధిత కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చేసిన ప్రకటన వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఢిల్లీ హింసాకాండపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మౌనం వహిస్తున్నాయని.. నితీశ్కుమార్, రామ్విలాస్ పాశ్వాన్, అకాలీదళ్ హింసపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.