రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు!

అమరావతిని రాజధానిగా కొనసాగించాలా? వ‌ద్దా అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవ‌ద‌ని మ‌రోసారి బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వివ‌ర‌ణ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి సైతం వేసవి రాజధానిని ప్రకటించడం దీనికి నిదర్శనమన్నారు.

రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్రం పార్లమెంటులో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

రాష్ట్ర పార్టీ శాఖ కోరిన అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

రాజధాని విషయంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పిందని  పేర్కొందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోదన్నారు. ఎవరైనా  అమరావతి విషయంలో తప్పుడు హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలని జీవీఎల్ స్పష్టంచేశారు.