మట్టి తెచ్చిన మోడీపై "మట్టి సత్యాగ్రహం"


 

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఢీల్లీలోని పార్లమెంట్ ఆవరణం నుండి మట్టిని, యమునా నది నుండి నీటిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోడీ తీసుకొచ్చిన మట్టిపై పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయకుండా అక్కడినుండి మట్టి తీసుకొచ్చి ఇక్కడి ప్రజల నోట్లో కొట్టారని విమర్సిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి మోడీ ఎటువంటి ప్రకటన చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని.. ఏపీ ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాడతామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన మట్టి రాజకీయానికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని.. ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం 'మట్టి సత్యాగ్రహం' పేరుతో వినూత్న నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. తన సొంత నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మహిళా సర్పంచ్‌లు సేకరించిన మట్టిన ప్రధాని మోడీకి పంపిస్తున్నామని.. ఈరకంగా తెలుగు ప్రజల ఘోష మోడీకి తెలుస్తుందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu