చంద్రబాబు బుజ్జగించారా?క్లాస్ తీసుకున్నారా?


 

ఏపీ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమంది నేతల పేర్లుతో శిలాఫలకం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ శిలాఫలకంపై ఉన్న పేర్లతోనే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శిలాఫలకంపై ప్రధాన మంత్రి మోడీ, ఇతర ప్రముఖుల పేర్లు ఆఖరికి పక్క రాష్ట్రమైన కేసీఆర్ పేరును కూడా ఉండేట్టు చూసుకున్నారు.. కానీ పార్టీ నేతల పేర్లు ఉన్నాయే లేదో అంతగా పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏపీ శంకుస్థాపనకు సంబంధించిన వ్యవహారాలలో గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. కానీ వారిపేర్లు మాత్రం శిలాఫలకంపై లేకపోవడాన్ని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు వారిద్దరిని పిలిచి బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొంత మంది వారిని బుజ్జగించారు అని అనుకుంటుంటే.. కొంతమంది మాత్రం క్లాస్ తీసుకున్నారు అని అనుకుంటున్నారు. అంతేకాదు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరిగిన సందర్బంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో వీరిద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu