ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు డిస్మిస్

 

ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ కస్టడీకి తీసుకుని వీరిని మరింతగా విచారించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 

తమకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం డిస్మిస్ చేసింది.  బెయిల్ పిటిషన్లపై ఇటీవల న్యాయస్థానం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. మద్యం కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.