ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించింది. అంతేకాదు రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి పేరెంట్స్ కమీటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఉత్తర్వులు ముఖ్యంగా విద్యార్థులను రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచి, వారి చదువుపై దృష్టి పెట్టడానికి, మరియు పాఠశాల ప్రాంగణంలో రాజకీయ వాతావరణాన్ని నివారించడానికి ఉద్దేశించబడ్డాయిని తెలుస్తోంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu