జగన్ కు చంద్రబాబు కౌంటర్



ఓటుకు నోటు విషయంపై చంద్రబాబు భయపడుతున్నారని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ చంద్రబాబును విమర్శించగా, చంద్రబాబు దానికి ధీటుగా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. నేను భయపడేందుకు నా పైన ఉన్న కేసులు ఏమిటో చెప్పాలని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. అక్రమాస్తుల కేసులో ఉన్న జగన్ ఇప్పుడు కేసుల గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

 

అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని.. వారికి కావల్సింది కేవలం పదవి మాత్రమే కావాలి.. తనకు రాష్ట్ర అభివృద్ది కావాలని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రంతో చర్చలు కూడా జరిగాయి.. కేంద్రం కూడా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిందని అన్నారు. భూసేకరణ విషయంలో కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని.. రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారని.. రాజధాని ఆపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరు ఇద్దామనుకుంటే రాజకీయం చేస్తున్నారన్నారని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu