జగన్ అవిశ్వాసంపై సభలో రచ్చ..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన నేపథ్యంలో ఈయన ఈ 8మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించి, ఉప ఎన్నికలకు జరిగేలా చూడడానికి తాము చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా  అధికార పక్ష నేతలు.. ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతోంది. జగన్ ఆరోపణలు చేస్తుండగా.. వాటికి ధీటుగా అధికార పక్ష నేతలు కౌంటర్లు.. సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu