జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఏం తమాషాగా ఉందా.. తోలు తీస్తా..
posted on Mar 14, 2016 6:37PM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఫుల్ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో రూ.7వేల కోట్ల అవినీతి జరిగిందని, ఎన్టీపీసీ, కృష్ణపట్నంలో అవినీతి జరిగింది జగన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు జగన్ నిప్పులు చెరిగారు. మొన్న కూడా జగన్ భూదందాపై ఆరోపణలు చేశారు.. వాటిని నిరూపించాలని సవాల్ చేశాం..ఇప్పుడు మళ్లీ పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణల చేసిన నేపథ్యంలో.. జగన్ ఆరోపణలు నిరూపించాల్సిందేనని.. అప్పుడే సభ జరుగుతుందని అన్నారు. ఇది సభ అనుకున్నారా.. ఇంకేమన్నా అనుకున్నారా.. ఇది పవిత్రమైన దేవాలయం..ఏం తమాషాగా ఉందా హౌస్ అంటే అని విరుచుకుపడ్డారు. దమ్ముంటే పోలవరం, విటిపిఎస్, కృష్ణపట్నంలో అవినీతి జరిగిందని నిరూపించగలరా.. లేకపోతే జగన్ పైన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీయిజం చేస్తే తోలు తీస్తామని, వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు క్షమాపణ మాత్రం చెప్పి ఊరుకుంటే ఊరుకునేది లేదన్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలాగే తప్పుడు ఆరోపణలు చేసి, క్షమాపణ కోరితే ఎలా అన్నారు.