గన్నవరంలో మోడీకి ఘనస్వాగతం

 

అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఘనస్వాగతం పలికారు, పుష్పగుచ్చాలు, పట్టు శాలువాలతో మోడీని చంద్రబాబు సత్కరించారు, ఉదయం పదకొండున్నర సమయంలో భారత వాయుసేన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చిన మోడీ... సెక్యూరిటీ చెకింగ్స్ అనంతరం కిందికి దిగారు, తెల్లని వస్త్రాలు, బూడిద రంగు కోటు ధరించిన మోడీ... చాలా హుందాగా, శోభాయమానంగా కనిపించారు, అనంతరం మోడీ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతి ప్రాంతానికి వచ్చారు, మోడీ ప్రయాణించిన హెలికాప్టర్ ను మరో మూడు హెలికాప్టర్లు అనుసరించాయి, అత్యాధునికమైన ఈ హెలికాప్టర్లు రాడార్ సిస్టమ్ ద్వారా మోడీ భద్రతను పర్యవేక్షిస్తాయి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu