అమరావతిలో సినీ ప్రముఖుల సందడి

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ దంపతులతోపాటు హీరో వెంకటేష్‌, కృష్ణంరాజు, సినీనటులు సాయికుమార్‌, సుమన్‌లు తరలివచ్చారు. సినీనటుల రాకతో అమరావతి ప్రాంగణం కోలాహలంగా మారింది. మరోవైపు తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు క్యూకట్టడంతో అమరావతి పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి, ముఖ్యంగా రాయలసీమ నుంచి జనం బారులు తీరారు, అమరావతి శంకుస్థాపనకు తరలివస్తున్న అశేష జనవాహినికి, అతిథులకు స్వాగతం పలుకుతున్న మంత్రి నారాయణ... సభాప్రాంగణం దగ్గర ఉంటూ పర్యవేక్షిస్తున్నారు,

Online Jyotish
Tone Academy
KidsOne Telugu