బొత్సతో జగన్ నేతల మంతనాలు
posted on May 29, 2015 6:57PM
.jpg)
పీసీసీ మాజీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణతో జగన్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు చర్చలు జరపడం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. వైకాపా పార్టీకి చెందిన ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, పార్టీ ప్రముఖ నాయకులు విజయసాయి రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు బొత్స ఇంటికి ఆయనతో చర్చలు జరపడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా బొత్స కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరుతారనే జరుగుతున్న ప్రచారానికి ఈ చర్చలు బలాన్ని చేకురుస్తున్నాయి. ఉత్తరాంద్ర జిల్లాలలో మంచి పట్టున్న నేతైన బొత్స ను పార్టీలోచేర్చుకుంటే తనకి ఎంతో లాభం కలుగుతుందని జగన్ భావిస్తున్నారట. దీని కోసం విశాఖ జిల్లా బాద్యతలు మొత్తం ఆయనకే అప్పగిస్తానని చెబుతున్నాడట. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కని సమయంలో ఆ పార్టీ తరపున విజయనగరంలో పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకున్న ఘనత బొత్స ఫ్యామిలిదే.