ఏపీ ప్రత్యేక హోదా పై త్వరలోనే నిర్ణయం.. రాజ్నాథ్ సింగ్
posted on May 29, 2015 5:43PM

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విధానంలో రోజుకో నేత రోజుకో విధంగా ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా జరుగుతున్న తంతు ఇదే. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తెలంగాణ, ఏపీ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటికి సంబంధించి ఇరు రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలతో మాట్లాడుతున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి సంబంధించిన కొన్ని సమస్యలు గుర్తించామని, మరికొన్ని గుర్తించాల్సి ఉంటుందని అనంతరం కేంద్రహోంశాఖ కార్యదర్శితో మాట్లాడి అప్పుడు ఏపీ హోదాపై నిర్ణయం తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.