వైకాపా సమైక్య శంఖారావానికి కోర్ట్ అనుమతి

 

Jagan meeting hyderabad, Jagan, Samaikyandhra, Jagan plans Samaikya meet

 

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కోర్ట్ పలు షరతులు విధించింది. ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సభ నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని పోలీసులకు దృవీకరణ పత్రం రాసి ఇవ్వాలని సూచించింది. దీంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వస్తుంది. జగన్ జైలు నుండి విడుదలయ్యాక జరుగుతున్న మొదటి సభ కావడంతో భారీ ఎత్తున జనసమీకరణ చేసి ఈ సభ ద్వారా తన సత్తా చాటాలని భావిస్తోంది.