ఏపీ రాజధాని పేదలకు పదేళ్ల ఉచిత విద్య..


ఏపీ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇచ్చిన మరో హామీ నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకుంది. రాజధానిలో అమరావతి పరిధిలోని పేదలకు ఉచిత విద్య అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌లు, వృత్తివిద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పదేళ్ల పాటు ఈ ఉచిత విద్యను అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu