Brahmamudi : కావ్య, అప్పుల శ్రీమంతం.. రుద్రాణిని గెంటేసిన దుగ్గిరాల కుటుంబం!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -923 లో... కావ్య దగ్గరికి కనకం వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. మీ వల్లే నా కూతురు ఈ రోజు ఇంత సంతోషంగా ఉందని ఇందిరాదేవితో కనకం అంటుంది. అదంతా దూరం నుండి రేఖ, రుద్రాణి చూస్తూ వీళ్ళందరు.. ఇక్కడే ఉన్నారు. ఈ మందు ఇప్పుడు కలపలేమని రేఖతో రుద్రాణి అంటుంది. అప్పు, కావ్య శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇద్దరు శ్రీమంతం కుర్చీలో కూర్చుంటారు.
ముందుగా పుట్టింటి సారె పెట్టాలని కనకం అంటుంది. అలా కాదమ్మా ముందు తమ భర్తలు ఒడి నింపాలని పంతులు చెప్తాడు. దాంతో రాజ్, కళ్యాణ్ ఇద్దరు వెళ్లి అప్పు, కావ్యలని ఆశీరదిస్తారు. మరొకవైపు అందరు శ్రీమంతం హడావిడిలో ఉంటే కావ్య గదిలోకి రుద్రాణి వెళ్లి అక్కడ తను తాగే కశాయంలో పసరు మందు కలపబోతుంటే అప్పుడే కనకం వచ్చి ఆపుతుంది. ఏం చేస్తున్నావని కనకం అనగానే.. కావ్య ఇది మర్చిపోయింది అందుకేనని భయపడుతుంది. కనకం కోపంగా మాట్లాడేసరికి కనకాన్నే దబాయిస్తుంది రుద్రాణి.
ఆ తర్వాత అందరు అప్పు, కావ్యలని ఆశీర్వదిస్తారు. అమ్మ ఎక్కడ అని కావ్య, అప్పు అనుకుంటారు. రుద్రాణి ఇద్దరిని ఆశీర్వదిస్తుంటే వద్దని కనకం అంటుంది. రుద్రాణికి పసరు మందు ఇచ్చిన అతన్ని తీసుకొని కనకం ఎంట్రీ ఇస్తుంది. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ రుద్రాణి, కావ్య కడుపులో బిడ్డని చంపాలని అనుకుంది. కశాయంలో పసరు మందు కలపబోతుంటే నేను ఆపాను.. పైగా నన్నే దబాయించింది డౌట్ వచ్చి వీడిని పట్టుకొని తీసుకొని వచ్చాను. ఆ పసరు మందు ఇచ్చింది వీడేనని కనకం అన్ని చెప్పేస్తుంది. అందరు షాక్ అవుతారు. ఇంకా తప్పుని కప్పిపుచ్చుకోవాలని రుద్రాణి ట్రై చేస్తుంటే.. ఇంత సాక్ష్యం కన్పిస్తుంది నువ్వు తప్పించుకోలేవని కనకం అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణిని ఇంట్లో నుండి గెంటేస్తారు. రాహుల్, రేఖ ఇద్దరికి దుగ్గిరాల కుటుంబం నాశనం చెయ్యమని చెప్తుంది. మరొకవైపు నేను డెలివరీ అయ్యే టైమ్ కి మీరు నాతో పక్కన ఉండాలని రాజ్ దగ్గర కావ్య మాట తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.