ప్రియుడి కోసం భర్తను అంతమొందించిన భార్య

  తన భర్త నిద్రలో చనిపోయాడంటూ ఓ భార్య 100 డయల్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్య చేకితులయ్యారు.  అనుమానాస్పద మృతి కేసునమోదు చేసుకొని విచారించగా పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలడంతో.. పోలీసులు ఎంక్వ యిరీ చేయడం మొదలుపెట్టారు. వారి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి... దీంతో పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... జెల్లెల్ల శేఖర్ (40), చిట్టి (33) దంపతులు వీరు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ రోడ్ నెంబర్ సెవెన్‌లో  నివాసం ఉంటున్నాడు. శేఖర్ డ్రైవర్‌గా  పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. డ్రైవింగ్ వృత్తిపై శేఖర్ అప్పుడ ప్పుడు రెండు మూడు రోజులు లేదంటే వారం రోజులు బయటికి వెళ్తూ ఉంటాడు. అయితే డ్రైవింగ్ వృత్తిపై భర్త బయటికి వెళ్లిన సమయంలో చిట్టి కి హరీష్‌తో పరిచ యం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే భార్య ప్రవర్తన పై అనుమానం కలిగి భర్త శేఖర్ పలుమార్లు తన భార్య చిట్టిని హెచ్చరించాడు.  కానీ చిట్టి ప్రవర్తన లో మార్పు రాలేదు ప్రియుడిని విడిచి ఉండలేక పోయింది. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ఫ్లాన్ వేసింది. పథకం ప్రకారమే చిట్టి తన ప్రియుడు హరీష్ తో కలిసి నిద్రపోతున్న భర్త శేఖర్ గొంతు నులిమి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్రలో చనిపో యాడంటూ లబో దిబో మొత్తు కుంటూ 100 కి ఫోన్ చేసింది... తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా చిట్టి ఒప్పుకుంది. దీంతో పోలీసులు వెంటనే చిట్టిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వినాయక నిమజ్జనం ఊరేగింపులో పేలుడు

  నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న వినాయక విగ్రహంతో పాటు టపాసులు ఒక్కసారిగా పేలడంతో పదిమంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. ఈ ఊరేగింపులో ఒక ట్రాక్టర్‌లో వినాయక విగ్రహాన్ని, మరో ట్రాక్టర్‌లో బాణాసంచాను ఉంచి తీసుకువెళ్తున్నారు.  ఊరేగింపులో జరుపుతున్న బాణాసంచా ట్రాక్టర్‌లో ఉన్న టపాసులపై పడటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పదిమంది చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి ఆర్తనాదాలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన చిన్నారులను వింజమూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స జరుగుతోంది. ఈ ఘటనతో గ్రామంలోని బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యా సంస్థల్లో ఫేషియల్ రెకగ్నిషన్ తప్పనిసరి : సీఎం రేవంత్‌

  స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు ,బోధన సిబ్బందికి ఫేషియల్ రెకగ్నిషన్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలని ఆ విషయం నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. ప్ర‌తి విద్యాసంస్థ‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే కాంట్రాక్ట్ పద్దతిలో పీఈడీలను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు.  బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని విద్యా అధికారులకు సూచించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, టాయిలెట్ గదులు, ప్రహరీల నిర్మాణం వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదని మఖ్యమంత్రి తెలిపారు. కంటైన‌ర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు.  అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు .మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి తేవడం ద్వారా నాణ్య‌తా‌ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నం తేలికవుతుందని అధికారులకు సూచించారు.  

డ్రగ్స్ దందాలో కొత్తరకం మాఫియా

  పుష్ప సినిమా ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే... అదే తరహాలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు కూడా సంచలనం సృష్టి స్తున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. ఓ మాఫియా కొత్తరకం డ్రగ్స్ దందాకు తెరలేపారు. ఈ ముఠాలు పుష్ప సినిమాను మించి.. కొత్త కొత్త తరహాలో  డ్రగ్స్ సరఫరా చేస్తు న్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికా రులు పూర్తిస్థాయిలో కృషి చేస్తూ ఉంటే... మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలు రకరకాల వస్తువుల మాటున వివిధ రకాల డ్రగ్స్ లను ఏదేచ్ఛగా సరఫరా చేస్తున్నారు  ప్రముఖ యూనివర్సిటీ లో 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఈగల్ టీమ్ గుర్తించి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో కీలక పాత్ర వహించిన ముగ్గురు విద్యార్థు లను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ యూని వర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలమైన విష యాలు బయట పడ్డాయి. ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతుం దని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా... కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్న ట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 10 కొరియర్ సంస్థల నుంచి 100 కోట్ల రూపాయల డ్రగ్స్ తరలించినట్లుగా అధికారులు గుర్తించారు.  ఈ డ్రగ్స్ ముఠాలు నగర శివారు ప్రాంతాల్లో  ఉన్న మెడికల్ కాలేజీలు మరియు ఇంజ నీరింగ్ కాలేజీల విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ విక్రయాలు జరుపు తున్నారు అయితే ఈ డ్రగ్స్ ముఠాలు పుష్ప సినిమా తరహాలో పుస్తకాలు, గాజులు, మెడిసిన్, ఆయుర్వేద ఉత్పత్తులు ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాలు మొత్తం 36 రకాల వస్తువుల తినుబండారాల మాటున డ్రగ్స్ ని హైదరాబాదు నగరానికి పంపిస్తున్నారు. కొరియర్ సర్వీసులలో డ్రగ్స్ తో కూడిన వస్తువులను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు పుస్తకాల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.  ఈ ముఠాలు ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా యూనివర్సిటీ హాస్టల్ లోపలికి మారుతి కొరియర్స్ ద్వారా ఓజీ డ్రగ్స్ పుస్తకాల మధ్యలో పెట్టి పంపిస్తు న్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థులకు కాస్మెటిక్ డబ్బాలో డ్రాప్స్ పెట్టి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా మల్నాడు డ్రగ్స్ నిందితులకు ఫుడ్ ఆర్టికల్స్ రూపంలో డ్రస్ సరఫరా చేశారు.. అంతేకాకుండా పలువురు వ్యాపారవేత్తలకి ఫుడ్ ఆర్టికల్స్ మధ్యలో డ్రగ్స్ పెట్టి పంపిస్తున్నారు. మరికొందరికి మట్టి గాజుల మాటున ఎఫిడ్రిన్ పొట్లాలను కొరియర్ ద్వారా డ్రగ్స్ తరలిస్తు న్నారు. కొరియర్ సంస్థలు కమిషన్కు కక్కుర్తి పడి డ్రగ్స్ ముఠాలకు సహక రిస్తున్నట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కొరియర్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు..

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నిట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బే అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. ఆయన హతమార్చేందుకు కొందరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు విశాఖ జైలు ఖైదీ శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడని జగదీశ్ అని సమాచారం.  ప్రస్తుతం ఈ వీడియోపై ఎస్పీ శ్రీకాంత్ విచారణ జరుపుతుమన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి చర్చిస్తున్న రౌడీషీర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో అంశం తన దృష్టిలో ఉందని ఎస్పీ.  విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నని ఎస్పీ తెలిపారు

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని సుప్రీంలో పిటిషన్

  లంబాడీలను, బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు పిటిషన్ వేశారు. 1976కు ముందు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.1976కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలలో వీరిని ఎస్టీలుగా పరిగణించలేదని, వేరే రాష్ట్రల నుండి వచ్చి గిరిజనుల హక్కులను కొల్లగొడుతున్నారని  ఎమ్మెల్యే తెల్లం  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఆదేశాలు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. బంజారాలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మిగిలిన ఎస్టీ కులాలతో పోలిస్తే  మెరుగైన స్థానంలో ఉన్నారని ఆ పిటీషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అలాంటి వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అన్ని రకాలుగా వెనుకబడిన కోయ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి విచారణ జరిపే అవకాశం ఉంది.

డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  ఏపీ టూరిజం ఆధ్వర్యంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భారత్‌కు టెక్నాలజీ హబ్‌గా వైజాగ్ నగరం ఎదుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటకులు విశాఖను పర్యావరణరహితంగా మార్చాలి తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం కోరారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.  వైజాగ్‌లో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తామని.. ఈ కేబుల్ ద్వారా ఈ నగరంతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని తెలిపారు. అలాగే మహిళలకు సురక్షితమైన నగరంగా వైజాగ్ ఎంపికైందని గుర్తు చేశారు. ఈ విశాఖ నగరం.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందని వివరించారు. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని.. ఇది మనమంతా గర్వపడే అంశమని సీఎం తెలిపారు. హాప్ ఆన్ హాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు 16 కి.మీ మేర పరుగులు పెట్టనున్నాయి. రూ. 250తో రోజాంతా ప్రయాణించవచ్చు.

మూసీ వరద.. జంటనగరాల్లో పలు చోట్ల రాకపోకలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు పైకెత్తి 4100 క్యూసెక్కుల నీటినీ, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 23వందలక్యూసెక్కుల నీటిని మూసిలోకి వదలడంతో మూసీనది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో  బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద ధాికి  బ్రిడ్జ్ పిల్లర్లు  డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జిని మూసివేయడంతో అంబర్ పేట, దిల్ షుక్ నగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.  

తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు.. మరో ఆరు రోజులు వానలే వానలు

ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వదలడం లేదు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మరో ఆరు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలు, ఉత్తర తెలంగాణలకు వర్షం ముప్పు అధికంగా ఉందని పేర్కొంది.  ఏపీలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇలా ఉండగా ఏపీలోని ఆరు ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ  కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

కొనసాగుతున్న లేడీ డాన్ అరుణ విచారణ

  లేడీ డాన్ నిడిగుంట అరుణను ఒంగోలు జైలు వద్ద కోర్ట్ అనుమతులతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఒంగోలు జైలు నుండి  కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అరుణను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు  విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం సాయంత్రం అరుణను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తారు.  ఈ విచారణ లోనే అరుణ నుండి మరిన్ని విషయాలు రాబట్టడం తో పాటు ఆమె ఫోన్ లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీంతో అరుణ ఫోన్‌లో  ఎలాంటి సమాచారం ఉంది. ఆ సమాచారం బయట వస్తె ఎలాంటి  రహస్యాలు బయటకు వస్తాయి. అనేది తీవ్ర ఉత్కంఠ  నెలకొంది. ఇదే సమయంలో లేడీ డాన్ అరుణ తో సన్నిహితంగా వున్న అనేక మంది పెద్దలు గుండెల్లో గుబులు మొదలైంది. రాబోయే మూడు రోజులు కొందరికి అగ్నిపరీక్ష కానుంది

రిషికొండ ప్యాలెస్‌‌లో ఊడిన పెచ్చులు..పరిశీలించిన డిప్యూటీ సీఎం

  విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్యాలెస్‌‌లో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. కాన్ఫరెన్స్ హాల్, మరో రెండు గదుల్లో ఫాల్స్ సీలింగ్ షీట్లు విరిగిపడినాయి. పైకప్పు లోపాలతో లోపలికి వర్షం నీరు వచ్చింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  విశాఖపట్నం పర్యటనలో ఉన్నడిప్యూటీ సీఎం ... మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పవన్ కల్యాణ్‌కు వివరించారు.  గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ నూతన భవనాల నిర్వహణకే దాదాపు కోటి రూపాయల బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని అధికారులు పవన్‌కు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది" అని వ్యాఖ్యానించారు.  రుషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను  పవన్ ఆదేశించారు.

ఏపీకి బుల్లెట్ ట్రైన్ : సీఎం చంద్రబాబు

  అమరావతి మీదగా ఆంధ్రప్రదేశ్‌‌కి బుల్లెట్ రైలు రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఏపీ నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి గంటకు ఫ్లైట్ ఉండేలా ఎయిర్ ఫోర్టులు తీర్చిదిద్దబోతున్నామని పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాదిని కలిపే మార్గాలన్నీ  ఏపీ నుంచే వెళ్తుంటాయి. అమరావతి- చెన్త్నె- బెంగళూరు నగరాల మధ్య బుల్లె రైళ్లు రానున్నాయి సీఎం తెలిపారు.ఇందుకోసం హైదరాబాద్ – చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి  మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్‌డీఏ గుండా వెళ్తుంది.

అనుమానాస్పదస్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మరణించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగింది. కాటారం జాతీయ రహదారి పక్కన కమలాపూర్ క్రాస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతి చెందిన యువతిని ఒడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. ఆమె మృతదేహం పక్కనే ఆధార్ కార్డు, నిమ్మకాయలు, కుంకుమ ఉన్నాయి.    వర్షిణి తండ్రి చనిపోయిన బాధతో ఈ నెల 3 న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కోసం తల్లి వెతికి జాడ తెలియకపోవడంతో చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో  గురువారం కమలాపూర్ క్రాస్ అటవీ ప్రాంతంలో యువతి మృత దేహం ఉందన్న సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆధార్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా యువతి చిట్యాల మండలానికి చెందిన వర్షిణిగా గుర్తించారు.  

టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష

టీవీ నటుడు లోబోకు ఏడాది  జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2018 టీవీ నటుడు లోబో,  అతని టీమ్  2018 లో వీడియో చిత్రీకరణలో భాగంగా వరంగల్ కు వెళ్లారు. అక్కడ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు ప్రాంతాల్లో పర్య టించి వీడియోలు చిత్రీకరించారు. చిత్రీకరణ పూర్త యిన అనంతరం అదే సంవత్సరం మే 21వ తేదీన లోబో టీమ్ మొత్తం కారులో అత్యంత వేగంగా వరంగల్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా యాక్సిడెంట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారు  రఘు నాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద  ఆటోని ఢీ కొంది. ఈ ప్రమా దంలో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన  రఘునాథపల్లి పోలీసులు ఈ కేసు విచారించిన జనగామ జిల్లా కోర్టుకు సక్ష్యాలు సమర్పించారు. కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్నతరువాత  లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

హైడ్రాపై హైకోర్టు ప్రశంసల వర్షం!

కోర్టుల నుంచి చీవాట్లు తినడమే పరిపాటి అన్నట్లుగా మారిన హైడ్రాకు తొలి సారిగా ప్రశంసలు లభించాయి. ఔను నిజమే తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంత కాలం కోర్టులంటే లెక్కలేదా? మా ఆదేశాలను ఖాతరు చేయరా?  కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ హెచ్చరికలు, మొట్టికాయలతో తలబొప్పి కట్టేలా చీవాట్లు పెట్టిన హైకోర్టు తొలి సారిగా గురువారం (ఆగస్టు 28) హైడ్రాను ప్రశంసించింది.   హైదరాబాద్ నగరంలో రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంలో  హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందంటూ పొగడ్తల వర్షం కురిపించింది. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చేస్తున్న కృషిని అభినం దించింది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో హైడ్రా సేవలు  భేష్ అంటూ జస్టిస్ బి. విజయ్‌ సేన్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసం పేర్కొంది.  విషయమేంటంటే.. రాంనగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య భవనాన్ని  స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్  ఫిర్యాదు మేరకు హైడ్రా తొలగించింది.  దీంతో తన భవనాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయ నిర్మాణదారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం (ఆగస్టు 28) విచారించిన హైకోర్టు  పై వ్యాఖ్యలు చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

ఆధార్ తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్ లో  కుటుంబాలన్నిటికీ ఫ్యమిలీ బెనిఫిట్ కార్డు అందించే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డ్ తరహాలో ఈ కార్డు రాష్ట్ర పథకాల ప్రయోజనాలన్నిటికీ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇడింటిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి అందుతున్న పథకాలు సహా  సమస్త వివరాలూ ఫ్యామిలీ కార్డులోనే నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసేందుకు కట్టుబడి ఉందనీ, అందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును తీసుకురానున్నట్లు చంద్రబాబు చెప్పారు.  ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై గురువారం (ఆగస్టు 28) సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఆ సందర్భంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు  నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ తరహాలోనే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్త సమాచారం అందు బాటులో ఉంటుందన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలను  ఫ్యామిలీ కార్డులో పొందుపరిచి, వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కుటుం బాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు, అందుకు అనుగుణంగా అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైన్‌ చేసే విషయాన్ని పరిశీలించలని చంద్ర బాబు పేర్కొన్నారు.   

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఆరిఫ్ హుస్సేన్ అరెస్టు

బీహార్ కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడైన ఆరిఫ్ హుస్సేన్  దేశం విడిచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎన్ఐఏ అడ్డుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతడిని అదుపులోనికి తీసుకుంది. ఆరిఫ్ వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూరుస్తాడనీ, దేశంలో  జిహాదీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ అభియోగాలు ఉన్నాయి.  సిరాజ్ ,సమీర్ ల అరెస్టుల తర్వాత   అప్రమత్తమైన ఆరిఫ్ హుస్సేన్ విదేశాలకు పరారయ్యేందకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఎన్ఐఏ ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టులో గురువారం (ఆగస్టు 28) అదుపులోనికి తీసుకుంది. ఆరిఫ్ ను శుక్రవారం (ఆగస్టు 29) విశాఖ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ  ఆలయంలో శుక్రవారం (ఆగస్టు 29) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాల్సి ఉంటుంది. భక్తులు మాత్రమే కాకుండా ఆలయ ఉద్యోగులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆలయ ఉద్యోగులు కొలువులకు సంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ ల వినియోగంపై నిషేధం అమలులోనికి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఎవరూ కూడా సెల్ ఫోన్ లు వినియోగించకూడదు. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు అమ్మవారి దర్శనానికి రావాలని దుర్గగుడి ఈవో తెలిపారు.   

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 29) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగేందుకు 3 గంటలకు పైగా సమయం పడుతోందిఇక గురువారం (ఆగస్టు 28) శ్రీవారిని మొత్తం 63 వేల 843 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.