సి.రాజగోపాలాచారి సృష్టి.. టెరిటోరియల్ ఆర్మీ

గ్రౌండ్‌లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన సచిన్, ధోని.. బార్డర్‌లో రైఫిల్ పట్టుకుని పాక్‌ను రఫ్పాడిస్తారా..? సూపర్ యాక్షన్‌తో ప్రేక్షకుల చేత సీటిలు కొట్టించుకున్న మోహన్ లాల్‌, నానా పటేకర్.. సరిహద్దుల్లోనూ శత్రుదేశంపై బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. దేశాభిమానాన్ని దక్కించుకుంటారా? బ్యాట్లతో పాకిస్థాన్‌ ను ఉతికారేసిన సచిన్, ధోని.. త్వరలో అదే పాకిస్థాన్‌ను ఏకే 47తో చిత్తు చేయడానికి సిద్దం అంటున్నారు. ఇన్నాళ్లు షూటింగ్‌లతో బిజీగా ఉన్న మోహన్ లాల్, నానా పటేకర్‌లు.. పాక్‌ సైన్యంపై గన్నులతో షూటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది..  త్వరలో బార్డర్‌లో ఈ సెలబ్రిటీలను.. ఆర్మీ డ్రెస్సులో  చూడబోతున్నామంటున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి కీలక అనుమతినిచ్చింది.  పాకిస్థాన్, భారత్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పటిస్తున్న భారత ఆర్మీ.. శత్రుదేశం కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అయితే ఈ క్రమంలో దాయాదిపై దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు  కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దింపాలని అనుకుంటోంది. రెగ్యూలర్ ఆర్మీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని టెరిటోరియల్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది.  అయితే టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి రిజర్వ్ ఫోర్స్.  ఇది భారత సైన్యానికి సేవలందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన ఒక వ్యవస్థ. ఇందులో సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే స్వచ్చందంగా ఆర్మీతో పని చేస్తుంటారు. టెరిటోరియల్ ఆర్మీలో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, భారత సైన్యంలో ఉన్నవారికి సమానమైన ర్యాంకులను కలిగి ఉన్న ఇతర సిబ్బంది ఉంటారు. ఈ ఆర్మీ ప్రధానంగా సాధారణ సైన్యాన్ని స్థిర విధుల నుండి ఉపశమనం కలిగించడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌర పరిపాలనలో సహాయం చేయడానికి ఉపయోగించబడుతుంది. దేశ ప్రజలు ప్రభావితమైనప్పుడు..దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు అవసరమైన సేవలను నిర్వహిస్తుంది. అలాగే అవసరమైనప్పుడల్లా రెగ్యులర్ ఆర్మీతో కలిసి పని చేస్తుంది.   1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు. మొదటి భారత గవర్నర్ జనరల్ సి.రాజ గోపాలాచారి అక్టోబర్ 9, 1949న టెరిటోరియల్ ఆర్మీని అధికారికంగా ప్రారంభించారు. టెరిటోరియల్ ఆర్మీ యూనిట్లు 1962లో ఇండియా-చైనా యుద్ధం, 1965లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం, 1971లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో చురుకుగా పాల్గొన్నాయి. శ్రీలంకలో ఆపరేషన్ పవన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో ఆపరేషన్ రక్షక్, ఈశాన్య భారతదేశంలో ఆపరేషన్ రైనో, ఆపరేషన్ బజరాంగ్‌లలో సైన్యం పాల్గొంది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో దాదాపు 50 వేల మంది సిబ్బంది ఉన్నారు.  టెరిటోరియల్ ఆర్మీలో అనేక మంది క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, షూటర్ అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, యాక్టర్లు  మోహన్ లాల్, నానా పటేకర్ వంటి ప్రముఖులు దేశం కోసం పోరాటానికి సిద్దంగా ఉన్నారు. భారత్‌-పాక్ యుద్ధం నేపథ్యంలో ధోని, సచిన్ వంటి క్రికెటర్లు, మోహన్‌లాల్, నానా పటేకర్‌లను యుద్దరంగంలో దిగితే సైనికులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందంటున్నారు.

పాలు పోసిన చేతినే కాటేసిన విషనాగు .. టర్కీ!

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది, అది సర్ప జాతి లక్షణం. కానీ.. మనిషన్నవాడు, మానవత్వం ఉన్న వాడు ఎవరైనా  చేసిన మేలును మరిచి పోడు. మరిచికూడదు. మరిచి పోతే వాడు మనిషి కాదు. విశ్వాస ఘాతుక విష సర్పం కంటే ప్రమాదకరమైన మానవ  మృగం అనవచ్చును.  ఈ  ధర్మం వ్యక్తులకే కాదు  దేశాలకూ వర్తిస్తుంది. కష్ట కాలంలో ఆదుకున్న దేశాన్నిఅవసర సమయంలో ఆదుకోకపోకా వెన్ను పోటు పొడవడం దుర్మార్గాలలో కెల్లా మహా దుర్మారం. అమానుషం. అవును..  సాయమ చేసిన వారికి తిరిగి సాయం చేయక పోయినా  ఫర్వాలేదు కానీ సాయం చేసిన దేశంపై కత్తులు దూస్తే, దుశ్చర్యకు, దుర్మార్గానికి పాల్పడితే  అలాంటి దేశాలను, అలాంటి పాలకులను విశ్వాస ఘాతుకులు, విష నాగులు, అంతకు మించిన దుర్మార్గ దురంధరులు అనవచ్చును.     ఇప్పడు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కాని అప్రకటిత యుద్ధం జరుగతున్న సమయంలో టర్కీ, అలాంటి దుర్మార్గానికి పాల్పడింది. విష సర్పమై  పాలు పోసిన భారత దేశాన్నే కాటు వేసింది. రెండేళ్ళ క్రితం  2023లో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా టర్కీ లో భూకంప ప్రభావం చాలా ఎక్కువగా వుంది. ప్రాణ, ఆస్తి నష్టంకూడా టర్కీలోనే ఎక్కువగా జరిగింది.  భూకంప ప్రభావానికి  దేశంలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంచు మించుగా 50 వేల మందికి పైగా   చనిపోయారు.     అలాంటి సమయంలో.. అంతటి విపత్కర పరిస్థితిలో టర్కీకి నేనున్నానంటూ స్నేహ హస్తం అందించిన తొలి దేశం   భారత దేశం. ప్రపంచ దేశాలన్నీ మీన మేషాలు లెక్కిస్తున్న సమయంలోనే భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆపరేషన్‌ దోస్త్‌  పేరిట స్నేహ హస్తాన్ని అందించింది.  భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్‌ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది.  అంతటి  కష్ట కాలంలో  భారత దేశం, మోదీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం అందిస్తే ఇప్పుడు టర్కీ భారత దేశం చేసిన సహాయాన్ని మరిచి భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు  అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తోంది.  పాకిస్థాన్‌ గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో భారత్‌ పై డ్రోన్‌ దాడులు చేసింది. వందల సంఖ్యలో  డ్రోన్లను ప్రయోగించింది. అయితే మన సేనలు పాకిస్థాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్‌ ను గాలిలోనే  పేల్చి వేశాయి.  నేల కుల్చాయి.  పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీ సరఫరా చేసినవే కావడం  ఆ దేశ నిజరూపాన్ని ప్రపంచం ముందుంచింది.అవును. ఆ శకలాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీకి  చెందిన  అసిస్‌ గార్డ్‌ సోనగర్‌  డ్రోన్లుగా ధ్రువీకరించారు.  అయితే..  ఒక విధంగా ఇది అనూహ్య పరిణామంమ కాదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు తొలి నుంచీ భారత దేశం పట్ల  విపరీతమైన ద్వేషం వుంది. అదేమీ రహస్యం కాదు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను ఎర్దొగాన్‌ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. అంతే కాదు..  ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి అయినా వ్యక్తం చేయలేదు.  పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్థాన్‌పై భారత దేశం దాడి చేస్తుందని టర్కీ ముందుగానే   ఊహించింది. ప్రపంచమంతా భారత్ దేశం పట్ల  సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను ఎర్డోగాన్‌ ప్రభుత్వం పంపింది. టర్కీ సి-130ఈ హెర్క్యూలస్‌ విమానం గత నెల 28న పాకిస్థాన్‌లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకొనేందుకు తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి  ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది.  తర్వాత ఓ యుద్ధనౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్‌పై పాకిస్థాన్‌ ప్రయోగిస్తోంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ , అజర్‌ బైజాన్‌ మాత్రమే పాక్‌కు మద్దతిస్తున్నాయి. కాశ్మీర్‌ అంశంలో గతంలో ఎర్డోగాన్‌ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా  భారత దేశం పై విమర్శలు చేశారు. ఇప్పడు పాముకు పలు పోసినా విషమే చిమ్ముతుందని, టర్కీ మరో మారు రుజువు చేసింది.

జడ్ ప్లస్ భద్రత కోసం హైకోర్టుకు జగన్.. పిటిషన్ విచారణ వాయిదా

కిందపడ్డా నాదే పై చేయి అంటూ బుకాయించడంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ దిట్ట.  సానుభూతి కోసం తనపై తానే దాడులు చేయించుకున్న చరిత్ర ఆయనది. గులకరాయి దాడి ఆ కోవలోకే వస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు సైతం అప్పట్లో అంతర్గత సంభాషణల్లో అంగీకరించారు. అన్నిటికీ మించి అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జగన్ వ్యవహార శైలి ఉంటుందన్నది ఇప్పటికే పలుమార్లు రుజువైంది.   ఇక 2019 ఎణ్నికలలో విజయం కోసం బాబాయ్ హత్య, కోడికత్తి వంటి జగన్ డ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇలా రకరకాల విన్యాసాలతో పాటు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ఐదేళ్లు ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. జగన్ హ‌యాంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌నుల‌కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి ఏర్పడింది.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటూ వేధింపులు, ప్రతీకారమే పాలన అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను వేధించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేదు. జగన్ అరాచక పాలనకు విసిగిపోయిన ఏపీ జనం,   2024 ఎన్నిక‌ల్లో ఏ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు.  కేవ‌లం 11 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అంటే.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఏపీ ప్ర‌జ‌లు ఇవ్వ‌లేదు. అయినా జగన్ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు.   ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వ‌స్తాన‌ని భీష్మించుకు కూర్చున్నారు. తీరా అసెంబ్లీ సభ్యత్వం పోతుందన్న భయంతో మొక్కుబడిగా ఒక సారి అసెంబ్లీకి హాజరై మమ అనిపించారు. ఇప్పుడు తాను సీఎంగా ఉండగా ఏ విధంగా అయితే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా తనకు అటువంటి భద్రతే కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించాలంటూ ఆయన గురువారం (మే 8)న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, అందుకే సీఎంగా గతంలో తనకు ఏ విధంగా జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. అలాగే ఇప్పుడు కూడా దానిని కల్పించాలనీ, అలా జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ జగన్ ఆ పిటిషన్ లో కోరారు. జగన్ పిటిషన్ శుక్రవారం ( మే 9) విచారణకు వచ్చింది.  కోర్టు ఆ పిటిషన్ పై తక్షణ నిర్ణయం వెలువరిస్తుందని జగన్ ఆశించారు. అయితే కోర్టు మాత్రం పిటిషన్ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది.  దీంతో జగన్ కు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. 

పెద్దన్నకు ఝలక్.. ట్రంప్ మధ్యవర్తిత్తం అక్కర్లేదని తేల్చి చెప్పిన ఇండియా!

నేను చేసేదేముంది? అది మీ గొడవ మీరే తేల్చుకోండి అంటూ చెబుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు.. పాక్  భారత్ లక్ష్యంగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం అణిచివేతకు కఠిన నిర్ణయం తీసుకుంటున్న వేళ.. తగుదునమ్మా అంటూ మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పెద్ద మనిషిని నేనున్నాను కదా? మధ్యవర్తిత్వం చేస్తాను.. నా మాట వినండి అంటూ భారత్ కు ప్రతిపాదన పంపారు. అయితే అందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పింది. అగ్రదేశాధినేతను అన్న దర్పాన్ని ప్రదర్శించిన ఆయనకు భారత్ తన సమాధానంతో దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. మోడీ నాకు మంచి మిత్రుడు అంటూ పదేపదే చెప్పే ట్రంప్ కు అదే మోడీ స్నేహం స్నేహమే.. కానీ అంతర్గత విషయాల్లో జోక్యాన్ని భారత్ ఇసుమంతైనా అంగీకరించదని కుండబద్దలు కొట్టేశారు. అసలింతకీ ఏం జరిగిందంటే.. ఇండియా, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఇక తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. దాదాపు 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేసింది. ఈ క్రమంలో వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అలా హతమైన ఉగ్రవాదులలో పాక్ తన ఇంటల్లుడికి చేసినట్లు రాచమర్యాదలు చేస్తూ అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తున్న ఉగ్రవాది మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్, బంధువులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో నిషేధత ఉగ్ర సంస్థ జై షే అహ్మద్ దాదాపు నామరూపాల్లేకుండా పోయింది.  దీంతో పాకిస్థాన్ భారత్ లక్ష్యంగా దాడులకు దిగింది. ప్రతిగా ఇండియా ఎదురుదాడులు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకా చెప్పాలంటే అప్రకటిత యుద్ధం  జరుగుతోంది.   సరిగ్గా ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దరికం అంటూ రంగ ప్రవేశం చేశారు.  ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకు వచ్చారు.    ఉగ్రవాదంపై పోరుకు నాయకత్వం వహిస్తానంటూ చెప్పుకునే అగ్రరాజ్యం.. ఇంత కాలం భారత్ లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులపై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని ట్రంప్.. ఇప్పుడు పాక్ అన్ని విధాలుగా నష్టపోయి.. చేతులెత్తేస్తున్న వేళ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత్ ఉగ్రవాదంపై తుది పోరు సాగిస్తున్న సమయంలో దాడులు ఆపండి.. మధ్యవర్తిత్వం చేస్తానంటూ ముందుకు వచ్చారు. ఇందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పేసింది. మీ పెద్దరికం మీ వద్దే ఉంచుకోండంటూ సున్నితంగా కాదు.. ఒకింత నిష్కర్షగానే చెప్పింది. పాకిస్థాన్ తో తమ సమస్యలు పూర్తిగా ద్వైపాక్షికమని తేల్చేసింది. ఏది ఉన్నా పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని స్ఫష్టం చేసి ట్రంప్ నోరు మూయించింది. ఉగ్రవాదం మరియు సరిహద్దు సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలంటే ఫస్ట్ పాకిస్థాన్  ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపా లని అల్టిమేటమ్ ఇచ్చేసింది.  

తన కోసం మొక్కుకున్న వృద్ధురాలి కోసం పవన్ ఏం చేశారో తెలుసా?

పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత.. సినీ హీరో.. ఆయనది రాజకీయాలలోనైనా, సినిమాలలోనైనా ఒక ప్రత్యేక స్టైల్. సినిమాలలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పినా, డ్యాన్సులకు స్టెప్పులేసినా, రాజకీయాలలో ఉన్నదున్నట్లు మాట్లాడినా, ఆ మాటలు కొన్ని సార్లు సొంత పార్టీ, సొంత కూటమి నేతలకే ఇబ్బంది కలిగించినా డోన్ట్ కేర్.. తనకు ఏదనిపిస్తే అది చేస్తారు. ఎ చెప్పాలనుకుంటే అది చెప్పేస్తారు అంతే. ఈ ప్రత్యేకతే ఆయనను రాజకీయాలలోనైనా, సినిమాలలో అయినా మిగిలిన వారి కంటే ఒకింత స్పెషల్ గా నిలుపుతోంది. తాజాగా ఆయన   పిఠాపురం  నియోజకవర్గానికి చెందిన ఒక వృద్ధు రాలిని మంగళగిరిలోని తన నివాసానికి విందుకు ఆహ్వానించారు.   96 ఏళ్ల ఆ వృద్ధురాలి పేరు  పోతుల పేరంటాలు. ఇంతకూ ఆమెను పవన్ కల్యాణ్ ఎందుకు ఆహ్వానించి అతిథిమర్యాదలతో విందు ఇచ్చారంటే..   గత ఏడాది జరిగిన ఎన్నికలలో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.  విషయం అది కాదు..పిఠాపురం నుంచి పవన్ గెలవాలని ఈ పోతుల పేరంటాలు మొక్కుకున్నారు. ఈమెది పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలానికి చెందిన ఇసుకపల్లి. ఇంతకీ పోతుల పేరంటాలు మొక్కు ఏమిటంటే.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. తన కులదైవం వేగులమ్మకి గరగ చేయిస్తాననీ, పొర్లు దండాలు పెడతానన్నది ఆమె మొక్కు. సరే పవన్ కల్యాణ్ విజయం సాధించారు. అలా ఇలా కాదు.. అద్భుత మెజారిటీతో. దాంతో పేరంటాలు తన మొక్కు తీర్చుకున్నారు. పేదరాలు కావడంతో వేగులమ్మ తల్లికి గరగ చేయించడం ఆమెకు అంత సులువు కాదు. అందు కోసం ఆమె చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. తనకు వచ్చే పెన్షన్ సొమ్ములలో పొదుపు చేసి మొత్తం మీద 27 వేల రూపాయలు కూడగట్టి గరగ చేయించి అమ్మవారికి సమర్పించి, పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకుంది. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమెను అభినందించో, ఆర్థిక సహాయం చేసే ఊరుకుంటే సరిపోదని భావించారు. ఆమెను తన నివాసానికి ఆహ్వానించి, పక్కన కూర్చుని కొసరి కొసరిభోజనం వడ్డించారు. ఆమెకు చీర పెట్టి, లక్ష రూపాయలు నగదు ఇచ్చారు. అంతేనా ఆమెకు బయటవరకూ వెళ్లి మరీ వీడ్కోలు పలికారు.   ఇది తెలిసిన వారంతా దటీజ్ పవన్ అంటూ అభినందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరంటాలుకు స్వయంగా భోజనం వడ్డించి ఆప్యాయంగా అతిథి మర్యాదలు చేస్తున్నఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

భార‌త్ కి ప‌ట్టిన ఉగ్ర పీడ తొలిగిన‌ట్టేనా?

పాకిస్థాన్ ఆర్మీ అంతా క‌ల‌సి జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ ఆప‌రేష‌న్స్ క‌మాండ‌ర్.. ర‌వూఫ్ అజ‌ర్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొని, పాకిస్థాన్ జెండా  అత‌డి శ‌వ‌పేటిక‌కు క‌ప్పి నానా బీభ‌త్సం చేసింది.  దీన్నిబ‌ట్టీ చూస్తే పాకిస్థాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి,  ఉగ్ర‌వాదానికి మధ్య ఎంత గట్టి బంధం ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత్ లో ఉగ్రభూతాన్ని పెంచి పోషించడంలో ఈ మూడూ ఉగ్రవాదం, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఫెవికాల్ బంధంతో పని చేస్తున్నాయి.  ఇంతకీ పాక్ ఆర్మీ ఆ దేశ జెండా కప్పి మరీ అంత్యక్రియలలో పాల్గొన్న ర‌వూఫ్ ఎవ‌రో కాదు.. 1999 హైజాక్ ద్వారా భార‌త్ నుంచి విడుద‌లైన మ‌సూద్ అజ‌ర్ సోద‌రుడు. మ‌సూద్ అజ‌ర్ ను భార‌త్ నుంచి విడిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది ర‌వూఫే. అలాంటి ర‌వూఫ్ అండ చూసుకున్న మ‌సూద్ అజ‌ర్ త‌ర్వాతి  కాలంలో జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ అనే ఉగ్ర‌వాద సంస్థ‌ను స్థాపించాడు. 2000 సంవ‌త్స‌రంలో క‌శ్మీర్ అసెంబ్లీ అటాక్, 2001లో భార‌త‌  పార్ల‌మెంటు పై దాడి, 2008లో ముంబై దాడులు, 2016లో మ‌రో దాడి.. ఇక‌ 2019 పుల్వామా దాడి సంగ‌తి స‌రే స‌రి. ఈ దాడిలో ఏకంగా 46 మంది భార‌త  జ‌వాన్లు చ‌నిపోయారు. నాటి  నుంచి నేటి వ‌ర‌కూ వ‌ర‌కూ మ‌సూద్.. భార‌త్ పై చేసిన ఉగ్ర‌దాడుల‌దొక ర‌క్తసిక్త అధ్యాయం. ఒక ర‌కంగా  చెబితే ధ్వంస రచన.  విధ్వంస ర‌చ‌న.  అలాంటి మ‌సూద్ అజ‌ర్ కు ఆప‌రేష‌న‌ల్ క‌మాండ‌ర్ గా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ర‌వూఫ్ ఆపరేషన్ సందూర్ అంటూ ఇండియన్ ఆర్మీ ఉగ్రస్థావరాలు టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ లో మరణించాడు. రవూఫ్ తో పాటు  మ‌సూద్ బంధువులు కూడా  చ‌నిపోయారు. వీరితో పాటు మ‌రో న‌లుగురు అజ‌ర్ స‌న్నిహితులు సైతం  బహా వ‌ల్పూర్ దాడుల్లో హ‌త‌మ‌య్యారు. దీన్నిబ‌ట్టీ చూస్తే మ‌సూద్ అజ‌ర్ ప‌ని ఖ‌త‌మై న‌ట్టే లెక్క‌. అందుకే అత‌డు ఈ దాడుల్లో తాను కూడా పోయి ఉంటే బావుండేద‌ని అంటున్నాడు. మోడీ త‌న కుటుంబంలోని చిన్నారులు, మ‌హిళ‌లు, వృద్ధుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా హ‌త‌మార్చాడాని వాపోతున్నాడు. త‌న‌కు ఈ మ‌ర‌ణాల ప‌ట్ల ప‌శ్చాతాపం  కానీ, నిరాశ‌గానీ లేవ‌ని అంటున్నాడు. కానీ అత‌డిలో ఈ దాడులు, వాటి ద్వారా ఏర్ప‌డ్డ మ‌ర‌ణాలతో రావ‌ల్సిన బ‌ల‌హీన‌త‌ల‌న్నీ వ‌చ్చేసిన‌ట్టే. మ‌రీ ముఖ్యంగా త‌న కుడి భుజంగా  ప‌ని చేసిన సోద‌రుడు ర‌వూఫ్ మ‌ర‌ణంతో జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ క‌థ ముగిసిన‌ట్టే. మ‌సూద్ 18 ఎక‌రాల విస్తీర్ణంలో గ‌ల సుభాన్ అల్లా మ‌సీదులో కూర్చుని, తీవ్రంగా ఆలోచించి.. లేని  పోని మ‌త విద్వేషాల‌తో కూడిన ప్ర‌సంగాలు చేసి,  కొత్త వారిని వాటి  ద్వారా ఆక‌ట్టుకుని, త‌ద్వారా నిధులు సేక‌రించి.. ఉగ్ర వాదాన్ని వెర్రి త‌ల‌లు వేయించేవాడు. ఇప్పుడు వీట‌న్నిటికీ చెక్ ప‌డ్డ‌ట్టే లేక్క‌. మ‌సూద్ మ‌సీదులో కూర్చుని చేసే ఉగ్రాలోచ‌న అమ‌లు చేసేది ర‌వూఫ్. అలాంటి ర‌వూఫ్ లేక పోతే మ‌సూద్ రెక్క‌లు తెగిన ప‌క్షితో స‌మానం. పంజా కోల్పోయిన పులితో ఈక్వ‌ల్. ఇక త‌న‌కు తాను స్వ‌తంత్రంగా ఏమీ చేయ‌లేడు. ఒక వేళ చేసినా అదంతా త‌లా తోకా లేకుండా పోతుంది. ఒక ద‌శ దిశా క‌నుమ‌రుగు అవుతుంది.  మ‌సూద్ తాను మాత్రం ఇక ఎందుకు చేయాలి? త‌మ్ముడితో పాటు అక్క ఆమె కుటుంబంతా చేజారి  పోయింది? చివ‌రికి మిగిలేది ఏమిటో పూర్తిగా బోధ ప‌డ్డాక, త‌న ఉగ్ర బోధ‌న‌లు, ఆలోచ‌న‌లు మానుకోక ఏం చేస్తాడ‌న్న‌ది ఇప్పుడు అంద‌రి అభిప్రాయం. ఈ దాడుల్లో అస‌లు తానుంటాడో ఉండ‌డో కూడా తెలీదు. అలాంటి నైరాశ్యం మ‌న‌సు నిండా పేరుకుని క‌నిపిస్తున్నాడు జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ ఉగ్ర అగ్ర‌నేత మ‌సూద్ అజ‌ర్. ఒక స‌మ‌యంలో భార‌త్ అంటే ఊగిపోయి ఉగ్ర ప‌థ‌క ర‌చ‌న‌లు చేసి ఈ ర‌క్తపిపాసి.. ప్ర‌స్తుతం ఒంట‌రి. స‌ర్వం కోల్పోయిన వైరాగి.    ల‌ష్క‌ర్- ఏ- తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్ ప‌రిస్థితేంట‌ని చూస్తే..  ప్ర‌స్తుతం 75 ఏళ్ల వ‌య‌సుగ‌ల హ‌ఫీజ్ లాహోర్ లోని జ‌న‌స‌మ‌ర్ధ ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు. ఇటు పాక్ ఆర్మీ అటు సొంత సైన్యం మ‌ధ్య క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ద‌ళాలు కాప‌లా కాస్తుండ‌గా అత‌డి కుటుంబం ఒకింత సేఫ్ గానే ఉంది.  అయితే ముజ‌ఫ‌రాబాద్ దాడుల్లో ఇత‌డి ల‌ష్క‌రే అలియాస్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ శిబిరం దాదాపు కుప్ప‌కూలింది. ఈ శిబిరాన్ని ద‌గ్గ‌రుండి న‌డిపిస్తోంది మ‌రెవ‌రో కాదు హ‌ఫీజ్ స‌యీద్ కొడుకు.. త‌ల్హా స‌యీద్. ఇత‌డు ప్ర‌స్తుతం ల‌ష్క‌రే ఆర్ధిక విభాగ‌పు క‌మాండ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఇత‌డు ఒక ఐదు మంది క‌మాండ‌ర్ల తో క‌ల‌సి ఇక్క‌డి నుంచే టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ల‌ను నిర్వ‌హిస్తుంటాడు. ఇత‌డి క‌మాండ‌ర్ల‌లో ఒక‌డైన రెహ‌మానే ప‌హెల్గాం దాడి సూత్ర‌ధారి.  ఈ విష‌యం గ్ర‌హించిన భార‌త బ‌ల‌గాలు.. ఇత‌డి స్థావ‌రంపై దాడి చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో త‌ల్హా అత‌డి ఉగ్ర క‌మాండ‌ర్లు సైతం హ‌త‌మైన‌ట్టు ఒక పేరు చెప్ప‌ని అధికారి వెల్లడించారు. ఒక వేళ అదే నిజమైతే.. ల‌ష్క‌ర్- ఏ- తోయిబా ఖేల్ కూడా ఖ‌త‌మైన‌ట్టే. కార‌ణం హ‌ఫీజ్ ఉగ్ర నిధుల కేసుల త‌ర్వాత పూర్తి అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అప్ప‌టి నుంచి భార‌త్ కి వ్య‌తిరేకంగా మోడిని ఇర‌వైనాలుగ్గంట‌లూ తిడుతూ..   త‌న విశ్వ‌రూపం చూపిస్తున్నాడు.  అంతే  కాదు.. యువ‌కుల‌ను ఉగ్రవాదం వైపు ఆక‌ర్షిస్తున్నాడు  ల‌ష్క‌రే జూనియ‌ర్ చీఫ్ త‌ల్హా. అంతేనా టెర్ర‌ర్ స‌పోర్ట‌ర్ల ద్వారా నిధుల స‌మీక‌ర‌ణ చేసి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాడు. త‌న ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల‌కు అధునాత‌న ఆయుధాల‌తో కూడిన శిక్ష‌ణనిస్తున్నాడు. దీంతో ఇత‌డు తండ్రి త‌ర్వాత అంత‌టి  కిరాత‌కుడిగా మారి.. ప్ర‌పంచాన్ని మ‌రీ ముఖ్యంగా భార‌త్ ని అట్టుడికిస్తున్నాడు.. అలాంటి త‌ల్హా లాంటి  త‌ల‌ను ల‌ష్క‌రే కోల్పోతే.. ఈ ఉగ్ర సంస్థ కూడా దాదాపు క‌నుమ‌రుగై  పోతుంది. దానికంటూ ఒక డైరెక్ష‌న్ లేకుండా  పోతుంది. ఇక ఈ సంస్థ కార్య‌క‌లాపాలు సైతం పూర్తిగా స్తంభించి పోతాయి. ప్ర‌స్తుతం భార‌త్ విశ్వ‌రూపానికి జ‌డిసిన హ‌ఫీజ్ స‌యీద్.. పంజాబ్ ప్రావిన్స్ లో త‌ల‌దాచుకున్న‌ట్టు ఇటీవ‌ల త‌ల్హా మాట‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఏమో ఈ దాడుల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. కొడుకు  త‌ల్హాతో పాటు తండ్రి హ‌ఫీజ్ స‌యీద్ కూడా హ‌తం కావ‌చ్చు. ఇప్ప‌టికి అందుతున్న స‌మాచారాన్ని బ‌ట్టీచూస్తే.. ఇటు జేషే కి కీల‌క‌మైన ర‌వూఫ్ హ‌త‌మ‌య్యాడు. అధికారికంగా ఇంకా తెలీడం లేదు కానీ ల‌ష్క‌రేకి త‌ల‌లా వ్య‌వ‌హ‌రిస్తోన్న త‌ల్హా కూడా ఖ‌త‌మైతే.. ఈ సంస్థ కూడా దాదాపు నిర్వీర్య‌మై పోయినట్లే. వీటికి తోడు మ‌సూద్ హ‌ఫీజ్ సైతం హ‌త‌మారిపోతే.. భార‌త్ కి ప‌ట్టిన ఉగ్ర పీడ  వదిలిపోతుందని   అంటున్నారు పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు .. సీఐడీ విచారణకు సజ్జల

మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం (మే9) సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా సజ్జలకు సీఐడీ నోటీసలు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హజరయ్యారు. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. వైసీపీ మూకల దాడిపై టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి ఫిర్యాదును అప్పటి ప్రభుత్వంలోని పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి తెలుగు తమ్ముళ్లపైనే కేసులు పెట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి అటాక్‌‌పై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించింది. ఈ దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేసిన సీఐడీ పలు కీలక ఆధారాలను సేకరించింది. అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని విచారించారు కూడా. విచారణలో భాగంగా ఈ దాడి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో సజ్జలను ఏ1గా చేర్చారు. అలాగే సజ్జల, అవినాష్‌‌లకు విచారణకు రావాల్సింది సీఐడీ నోటీసులు జారీ చేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లో శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఏ క్షణమైన బాంబుతో పేల్చేస్తామని, ప్రభుత్వానికి చెప్పాలని పాక్ స్లీపర్ సెల్స్ అంటూ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే తనిఖీలు చేపట్టారు.దీంతో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమై, హుటాహుటిన రంగంలోకి దిగారు.  డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ బృందాలను రప్పించి విమానాశ్రయ ప్రాంగణమంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల రాకపోకలు, లగేజీ స్కానింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాలు సహా కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు.

బ్యాంకింగ్ కార్యకలాపాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష

  భారత్-పాకిస్థాన్ యుద్ద వాతావరణ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యక్రమాపాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   ప్రజలు మరియు వ్యాపారాలకు అంతరాయం లేకుండా ఆర్థికసేవలు అందించేలా జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ దాడులతో పాక్  మన దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.  మరోవైపు దేశంలోని ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ, యూపీఐలకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇది వాస్తమేనని ప్రభుత్వ సీనియర్ ఉన్నతాధికారి శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సమగ్రతతోపాటు భద్రత కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. దేశంలో సైబర్ దాడి జరిగే అవకాశముందని.. దీంతో ప్రధాని ఆర్థిక రంగ సంస్థలు చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని ఆర్‌బీఐ ఇప్పటికే ఓ సలహా, సూచన చేసిందని తెలిపారు.

పాక్ చెందిన 400 డ్రోన్లు ధ్వంసం..ప్రతిదాడిలో పాక్‌కు తీవ్ర నష్టం : కల్నల్ ఖురేషి

  భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం ఇచ్చిందని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300-400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది.. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని  కల్నల్ పేర్కొన్నాది. ఎల్‌ఓసీ వెంట పాక్ ఉల్లంఘనలకు పాల్పడిన సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతోందని కల్నల్ సోఫియా తెలిపారు. సరిహద్దుల్లోని 36 ప్రదేశాలను పాక్‌ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని పేర్కొంది. అయితే భారత సైనిక దళాలు సమర్థవంతంగా పాక్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన తాజా వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు. మరోవైపు పాకిస్థాన్‌లోని నాలుగు వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్‌లను భారత్‌  ప్రయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆ డ్రోన్స్‌లో ఒకటి ఏడీ రాడార్‌ను నాశనం చేసిందని చెప్పారు. కాగా, నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలతో పాక్‌ కాల్పులు జరిపిందని, పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంపై దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్ జరిపిన ప్రతీకార కాల్పుల్లో పాకిస్థాన్‌ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప‌లు న‌గ‌రాలు ల‌క్ష్యంగా డ్రోన్ల‌తో దాడికి దిగింది పాకిస్తాన్. దాయాది దేశం దాడుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాం. పూంఛ్‌లోని గురుద్వారాపై దాడి చేయ‌డం దారుణం. ప్రార్థ‌నా మందిరాలే ల‌క్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ప్ర‌పంచాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు పాకిస్తాన్ ప్ర‌య‌త్నిస్తోంది. భార‌త్ ప్ర‌తి దాడుల‌తో పాక్‌కు భారీ న‌ష్టం జ‌రిగింది. పాక్ సైనికుల కాల్పుల్లో ఇద్ద‌రు పాఠ‌శాల విద్యార్థులు మ‌ర‌ణించారు. స‌రిహ‌ద్దుల్లో పాక్ సైన్యం ప్ర‌యోగించిన క్షిప‌ణి శ‌క‌లాలు క‌నిపించాయి. క‌ర్తార్‌పూర్ కారిడార్‌ను తాత్కాలికంగా మూసివేశామ‌ని వారు వెల్లడించారు.  

భారత దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని మోదీకి మాత్రమే ఉంది : సీఎం చంద్రబాబు

  భారత దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీకి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉందన్నారు. టెర్రరిస్టులు దాడులతో దేశం మొత్తం చలించి పోయిందని చెప్పారు. మనదేశం టెర్రరిజానికి ఎల్లప్పుడూ వ్యతిరేకం అన్నారు. పహల్గామ్ లో మన వారిని ఇష్టానుసారంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని ప్రధాని మోడీ ఎప్పుడూ చెబుతుంటారని గుర్తు చేశారు. పాకిస్తాన్ మనపైనే దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు దేశం కోసం ఎంతో మంది యువకులు రక్షణ రంగంలోకి వెళ్తున్నారని తెలిపారు. మన తెలుగు వాడు మురళీ నాయక్ ఉగ్రవాదులతో పోరాటి వీర మరణం పొందడం చాలా బాధ కలిగించిందన్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్టు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.   

తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్

  భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్‌స్టేషన్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఏపీలోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వేస్టేషన్, విజయవాడ బస్‌స్టాండ్, ఎంజీ రోడ్‌లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ జోన్‌లో ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీ స్థాయి అధికారి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలోనే సూచనలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలని పోలీసులు చెబుతున్నారు.హైదరాబాద్‌లోని ఆరు హైఅలర్ట్ జోన్లలో అక్టోపస్, లా అండ్ అండ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. పాక్ దాడుల నేపథ్యంలో టీటీడీ అధికారులను కేంద్ర హోంశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.  తిరుమల్లో తీసుకువాల్సిన భద్రతా చర్యలపై టీటీడీ అధికారులకు కేంద్ర హోం శాఖ అధికారులు పలు సూచనలను చేశారు. కేంద్రం ఆదేశాలు మేరకు తిరుమల్లో భద్రతను టీటీడీ మరింత పటిష్టం చేసింది.మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించాలని ఆదేశించింది. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంచారు. భద్రతను రెండో లెవల్‌కు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  భద్రతా పెంపు ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. పోర్టులు, షిప్పులు, టర్మీనల్స్‌లో కేంద్రం భద్రతను పెంచింది.భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో భద్రత పెంచామని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉద్యోగుల సెలవులను రద్దు చేశామన్నారు. ఆర్పీఎఫ్, ఇంటెలిజెన్సీ పోలీసుల నిఘా పెంచామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రూట్లల్లో రైళ్ళు యధావిధిగా నడుస్తున్నాయని అన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టామని శ్రీధర్ వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా సచివాలయ ఉద్యోగులు ర్యాలీ

  పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిద ధళాల సారధ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు మద్ధత్తుగా శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు,ఉద్యోగులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.సచివాయం మొదటి భవనం నుండి ప్రధాన గేటు వరకూ ఈసంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్ లో గత నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26మంది అమాయక పర్యాటకులను అతికిరాతకంగా కాల్చిచంపిన నేపధ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిద దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది.  ఆతదుపరి భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పాక్ కవ్వింపు చర్యలను మన దేశ త్రివిద దళాలకు చెందిన సైనికులు గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున సమర్ధవంతంగా తిప్పి కొట్టడం జరుగుతోంది.భారతదేశ త్రివిద దళాల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు ‘జయహో ఆపరేషన్ సింధూర్,జై జవాన్,జై భారత్,భారత్ మాతాకి జై’ వంటి నివాదాలతో ర్యాలీ నిర్వహించారు.అంతేగాక పాక్ కాల్పుల్లో అమరుడైన రాష్ట్రానికి చెందిన ‘అగ్నివీర్ మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ ఉద్యోగులు పెద్దఎత్తున నినదించారు.అంతేగాక ఉగ్రవాదులను పూర్తిగా తుదిముట్టించేందుకు భారత త్రివిద సైనిక దళాలు పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అహర్నిశం పాటుపడుతున్న కృషికి దేశం యావత్తు వారి వెంట నిలిచింది.అందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున ఈర్యాలీలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపు

  భారత్-పాకిస్థాన్ మధ్య  యుద్ద పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో అన్ని పోర్టులు, నౌకాశ్రయాలు, టెర్మినళ్లు వద్ద భద్రతను కట్టదిట్టం చేసింది. రెండో లేవల్‌కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని షిప్పంక్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.దేశంలోని కొన్ని ఎయిర్‌పోర్టులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 138 విమానాలను రద్దు చేసినట్టు సమాచారం. రద్దు చేసిన విమానాల్లో 4 ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే ఇంటర్నేషనల్ విమానాలు, 5 ఢిల్లీ నుండి వెళ్లే ఇంటర్నేషనల్ విమానాలు, 63 ఢిల్లీకి వచ్చే డొమెస్టిక్ విమానాలు, 66 ఢిల్లీ నుండి వెళ్లే డొమెస్టిక్ విమానాలు ఉన్నాయి. దీంతో కేవలం కొన్ని విమానాలు మాత్రమే రద్దు చేశామని విమానాశ్రయం తెరిచి ఉంటుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ విభాగం పేర్కొంది. మిగితా విమానాలు యతావిథిగా నడుస్తాయని స్పష్టం చేసింది.   

సీఐడీ విచారణకు సజ్జల

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ నోటీసుల మేరకు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నారు. ఏ ఫోను వినియోగించారు. ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు అంటూ సీఐడీ అధికారులు సజ్జలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 121వ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ కు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ దాడికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే  ఈ కేసులో సజ్జల, దేవినేనికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ తెరవెనుక కీలక పాత్ర పోషించారనడానికి అవసరమైన ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.  తెలుగుదేశం కార్యాలయంపై అక్టోబర్ 10, 2021న దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు సరికదా తెలుగుదేశం కార్యకర్తలపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదు చేశారు.   తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీఐడీ ఈ దాడి వెనుక పకడ్బందీ ప్రణాళిక ఉందనీ, ఈ దాడికి తెరవెనుక సజ్జల కీలకంగా వ్యవహరించారనీ నిర్ధారణకు వచ్చింది.  

ఆర్మీ కి మరిన్ని అధికారాలు..రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

  పాకిస్థాన్‌తో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్‌ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీ ని రంగంలోకి దించాలని నిర్ణయించింది.  భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారులను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని సూచించింది. ప్రత్యర్థులతో తలపడేందుకు భారత్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు ఈ టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది.  రెగ్యులర్ ఆర్మీలో ఇది భాగమే అయినప్పటికీ అవసరమైన సందర్భంలోనే ఈ టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. 1962, 1965, 1971 యుద్ధాల్లోనూ భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేసింది. రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఫోర్స్‌గా ఉండే టెరిటోరియల్ ఆర్మీలోని సిబ్బందికి నేషనల్ ఎమర్జెన్జీ, అంతర్గత భద్రత విధులకు సంబంధించి శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం 32 టెరిటోరియల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ఉన్నాయి.టెరిటోరియల్ ఆర్మీ అధికారులు సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్‌కు కల్పించింది. రెగ్యూలర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది. టెరిటోరియల్ ఆర్మీని క్లుప్తంగా 'సైనిక రిజర్వ్ దళం' అని చెప్పవచ్చు. దేశానికి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు, సాధారణ సైన్యానికి మద్దతుగా నిలిచేందుకు ఈ దళాలు సిద్ధంగా ఉంటాయి. వీరికి కూడా రెగ్యులర్ సైనికులతో సమానంగా కఠినమైన శిక్షణ ఇస్తారు. అయితే, వీరు నిరంతరం సైన్యంతో ఉండరు. తమతమ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే, స్వచ్ఛందంగా దేశసేవలో పాలుపంచుకుంటారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టాన్ని ఆమోదించగా, 1949లో ఇది అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ దళంలో సుమారు 50 వేల మంది క్రియాశీలకంగా ఉన్నట్లు అంచనా.

యుద్ధానికి ముందే పాక్ పరాజయం!

ఇంకా అసలు యుద్ధం మొదలు కాలేదు. ఇంతవరకు జరిగింది,జ రుగుతున్నది  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా  భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్  కొనసాగింపు చర్యలు మాత్రమే. కానీ..  ఇంతలోనే పాకిస్థాన్  పనైపోయిందనే ఏడ్పులు  మొదలయ్యాయి. ఆ దేశ పార్లమెంట్ లోనే రోదనలు వినిపిస్తున్నాయి. నిజానికి..  భారత దేశం యుద్ధం ప్రకటించలేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా,  పాకిస్థాన్, పాక్  ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఏక కాలంలో దాడి చేసింది. వంద మందికి పైగా ఉగ్ర ముష్కర మూకలను మట్టు పెట్టింది. కానీ  ఎక్కడా  పొరపాటున కూడా  పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేయక పోవడం మాత్రమే కాదు  అసలు అటు వైపు కన్నెత్తి అయినా చూడలేదు. అలాగే  పాక్  ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు,ఇ తర ప్రభుత్వ, ప్రభుత్వేతర సదుపాయాల జోలికి వెళ్ళలేదు. నిజానికి, పాక్ భూభాగంలో కాలు అయినా పెట్టలేదు. మన భూభాగం నుంచే పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై స్కాల్ప్ క్రూజ్ క్షిపణులను,స్మార్ట్ బాబులను వేసి లక్ష్యాలను ఛేదించింది. ఉగ్రవాదులను మట్టు పెట్టింది. ప్రజల జోలికి వెళ్ళలేదు.  అయితే..  అక్కడితో ఆపరేషన్ పూర్తి కాలేదు. సినిమా అభీ బాకీ హై ..ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర రక్షణ  శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంటే..  ఆ దేశంలో నక్కిన చిట్టచివరి ఉగ్రవాదిని హతమార్చే వరకు ఆపరేషన్ సిందూర్  కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుద్ధం మాట ఎత్త లేదు. అదే సమయంలో భారత్ దేశం ఉద్రిక్తతలను పెంచదని రాజ్ నాథ్  సింగ్ స్పష్టం చేశారు.అయితే, అటు నుంచి పాక్  కాలుదదువ్వి కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం తగ్గేది ఉండదని   భారత దేశం పాక్ కు మాత్రమే కాదు,  ప్రపంచ దేశాలకు కూడా స్పష్టం చేసింది.  అయితే పోగాలము దాపురించిన వారు అరుంధతిని మిత్ర వాక్యమును..కనరు వినరు మూర్కొనరు  అన్నట్లుగా పాకిస్థాన్ కాలు దువ్వనే దువ్వింది. చింత చచ్చినా పులుపు చావని దాయాది దేశం భారత సరిహద్దులో 15 చోట్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.  చైనా మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోయింది అయితే.. భారత్ సాంకేతిక సామర్ధ్యం ముందు పాక్  ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లు మట్టి పిచ్చుకల్లా తుస్సు మన్నాయి. పాక్ మిస్సైల్స్, డోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది.  ఈ నేపథ్యంలోనే భారత నావికాదళం కరాచీ పోర్టుపై దాడి చేసి  ధ్వంసం చేసింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. దేశ ప్రజలకు ముఖం చూపుకునేందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా దాడులకు పాల్పడింది. మరో వంక భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మన  త్రివిధదళాలు దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉగ్ర స్థావరాలు, సైనిక క్యాంపులే లక్ష్యంగా దాడులు చేస్తూ పాక్  యుద్దోన్మాదాన్ని ఎక్కడి క్కడ తుత్తునియలు చేస్తోంది. పాక్ కూడా ప్రతిదాడులు చేసినా.. అవి హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా నవ్వుల పాలవుతున్నాయి. పాక్  ప్రయోగించిన  డ్రోన్స్, మిసైల్స్‌  దీపావళి తార జువ్వల్లా ఇలా ఎగిరి ఆలా నేల కొరిగిపోతున్నాయి. మన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పాక్  ప్రయోగించిన 50కి పైగా డ్రోన్స్, మిసైల్స్‌ను మార్గమధ్యలోనే నెలకు కూల్చేసింది.  చేర్చింది. అయితే,పాకిస్థాన్  ఇంకా ప్రగాల్భాలకు పోతోంది. అసత్య ప్రచారంతో ఆత్మవంచనకు పాల్పడుతోంది. భారత్‌పై దాడులు చేశామని.. అందులో విజయవంతమయ్యామంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది.  ఇదలా ఉంటే.. భారత్ చేస్తోన్న ప్రతీకార దాడులకు పాకిస్తాన్ ఇప్పటికే పూర్తిగా చితికి పోయింది. అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోని పలు నగరాలు విధ్వంసం అయ్యాయి. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పు అడుక్కునే పరిస్థితికి వచ్చింది.  పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్‌పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందికి దిగజారిపోయింది. వాటినుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థికసాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. అంటే..  పరిస్థితి ఎంత దారుణంగా వుందో వేరే చెప్పనక్కర లేదు.  మరో వంక పాకిస్థాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి, ముఖ్యంగా ఐఎంఎఫ్ నుంచి   ఎలాంటి రుణాలు రాకుండా అడ్డుకొనేందుకు భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత్‌ విధానం ఏమిటో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. పాక్‌  పోస్టులు  ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధ వాతావరణంతో ఇప్పటికే పాకిస్థాన్‌ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నిజానికి దేశ పార్లమెంట్ లో సీనియర్ సభ్యుడు ఒకరు, భారత దేశం కాలు దువ్వి దేశాన్ని నాశనం చేయవద్దని ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకున్నారు. నిజానికి  రోజు రోజుకు దిగజారి పోతున్న పరిస్థితులను గమనిస్తే, అసలు యుద్ధం మొదలయ్యే  సరికే పాక్ చేతులు ఎత్తేయడం ఖాయంగాకనిపిస్తోందని అంటున్నారు.

భారత సైన్యం విజయం కోసం హోమాలు.. గోమాతలకు శ్రీమంతం వేడుక

పాకిస్థాన్ తో  యుద్ధంలో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్డపూడి గ్రామంలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం గోశాలలో హోమాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జ్, మాజీ జడ్పీ చైర్మర్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో ఈ హోమాలు జరిగాయి. అలాగే గోశాలలో గోవులకు సీమంతం వేడుక, గోపారాయణం పూజలు నిర్వహించారు.   ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, గోమాతకి పంచామృతాభిషేకం, శాంతి హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. మూడు గోమాతలకు సీమంతం, దంపతీ పూజ నిర్వహించారు. గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, శ్రీమతి రాధిక దంపతులు ఈ పూజలు జరిపారు. మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మన యాత్రికులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిచర్య ద్వారా ఉగ్రవాదులకు బుద్ధి చెబితే, తిరిగి పాకిస్తాన్ మ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో దాడులకు పాల్పడుతున్నదనీ,  భారత సైన్యానికి కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఉండాలనీ పాతూరి నాగభూషణం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,  ఈ ధర్మ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించాలనీ ఆకాంక్షిస్తూ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.  

ఐపీఎల్ 2025 వాయిదా.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌  2025 వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధవాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ భాగస్వాముందరితో సమగ్రంగా చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తసుకున్నట్లు పేర్కొంది. శుక్రవారం ( మే9) నుంచి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లన్నిటినీ వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.   ప్రస్తుతానికి సస్పెన్షన్ ఒక వారం పాటు ఉంటుందని, తదుపరి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామనీ బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే  గురువారం ( మే 8 )న ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ను భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి వివరాలు మరలా తెలియజేస్తామని బీసీసీఐ తెలిపింది.ఐపీఎల్ లో ఇంకా 12  మ్యాచ్ లు జరగాల్సి ఉంది. వీటిలో రెండు క్వాలిఫయిర్లు, ఒక ఎలిమిటేర్  ఉన్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, మంబైలు టాప్ ఫోర్ లో ఉన్నాయి.