సూపర్ ఓవర్లో బోల్తా పడిన ఢిల్లీ డేర్ డెవిల్స్

  ఐపిఎల్-6 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు వరుసగా ఐదో పరాజయం పొందింది. ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సూపర్ ఓవర్లో చతికిలపడింది. ఈ సీజన్ లో మొదటిసారిగా విజయం అంచులకు చేరిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు అర్జున్ రామ్ పాల్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఖంగు తినిపించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒపెన్నర్లు డేవిడ్ వార్నర్13 బంతుల్లో 15 పరుగులు (3బౌండరీలు), వీరేంద్ర సెహవాగ్ 23 బంతుల్లో 25 పరుగులు (4బౌండరీలు) చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఢిల్లీ కెప్టెన్ జయవర్థనే 31 బంతుల్లో 28 పరుగులు (2బౌండరీలు), జునేరా 17. రోహెర్ 14 భారీ స్కోర్లు చేయలేకపోయారు. చివరి రెండు ఓవర్లలో ఇర్ఫాన్ పఠాన్ 8 బంతుల్లో 19 పరుగులు నాటౌట్ (2 బౌండరీలు 1 సిక్సర్) జాదవ్ 16 బంతుల్లో 29 పరుగులు నాటౌట్ (2 బౌండరీలు 1 సిక్సర్) సాధించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు గిల్ క్రిస్ట్ 9, రాహుల్ 12 మరోసారి శుభారంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 65 పరుగులు (7 బౌండరీలు 1 సిక్సర్), డివిలియర్స్ 32 బంతుల్లో 39 పరుగులు (3 బౌండరీలు 1 సిక్సర్) మూడో వికెట్ కు 103 పరుగులు జోడించడంతో గెలుపు ఇక లాంఛనమే అనుకున్నారు అందరూ అయితే వీరిద్దరూ కొద్ది బౌల్స్ తేడాతో అవుట్ అయ్యారు. మెక్ డోనాల్డ్ 0, అరుణ్ కార్తీక్ 5 రనౌట్, సయ్యద్ మొహమ్మద్ 1, వినయ్ కుమార్ 1 నాటౌట్, అర్జున్ రామ్ పాల్ 12 నాటౌట్ గా నిలిచారు. విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉండగా రామ్ పాల్, వినయ్ కుమార్ కలిసి 11 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్ ను ప్రారంభించిన బెంగళూరు ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో 15 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 2సింగిల్స్ తీయగా డివిలియర్స్ 3 సిక్సర్లు ఒక సింగిల్ తీశాడు. రెండో సూపర్ ఓవర్ లో ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 11పరుగులు చేసింది. అర్జున్ రామ్ పాల్ వేసిన మొదటి బంతికి వార్నర్ అవుట్ అయ్యాడు. రెండో బంతిని ఇర్ఫాన్ పఠాన్ బౌదరీకి తరలించాడు. మూడో బంతికి పరుగులు రాలేదు. నాలుగో బంతికి ఇర్ఫాన్ సిక్సర్ సాధించాడు. ఐదో బంతిని ఇర్ఫాన్ సింగిల్ తీశాడు. విజయానికి సిక్సర్ కావాల్సి ఉండగా రోహెర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

హ్యాట్రిక్ సాధించినా ఓడిన కోల్ కత్తా

  వెస్ట్ ఇండీస్ బౌలర్ సునీల్ నరైన్ ఐపిఎల్-6లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించినా కోల్ కత్తా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ గెలిచి కోల్ కత్తా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన గిల్ క్రిస్ట్, మన్ దీప్ సింగ్ కుదురుగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. గిల్ క్రిస్ట్ (7)ను శ్రీలంక బౌలర్ సేననాయకే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. మన్ దీప్ సింగ్ 30 బంతుల్లో 41 పరుగులు (6   బౌండరీలు) చేసి కల్లీస్ బౌలింగ్ లో బిస్లా క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. తరువాత పంజాబ్ బ్యాట్స్ ఎవరూ క్రీజ్ లో నిలవలేకపోయారు. వొహ్రా ను17 పరుగులకు బాలాజీ క్యాచ్ అండ్ బౌల్ చేశాడు. నరైన్ బౌలింగ్ లో డేవిడ్ హస్సీ 17 బిస్లా క్యాచ్ ద్వారా, అజహర్ మహమూద్ 0 క్యాచ్ అండ్ బౌల్,  గురుకిరీత్ 0 ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఐపిఎల్-6 లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించాడు. చివరి ఓవర్లలో సీజన్ లో మొదటిసారిగా ఆడుతున్న గోని బ్యాంటింగ్ కు దిగి 18 బంతుల్లోనే 42 పరుగులు (4 బౌండరీలు, 3 సిక్సర్లు)తో చెలరేగి ఆడడంతో పంజాబ్ కింగ్స్ కు గౌరవప్రదమైన స్కోరు 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రవీణ్ కుమార్ 1, పియూష్ చావ్లా 11 నాటౌట్, ఆవానా 0 నాటౌట్ గా నిలిచారు. కలీస్ 3, నరైన్ 3, సేననాయకే 2, లక్ష్మీపతి బాలాజీ 1 వికెట్లు తీశారు. తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కు తోలిబంతికే ఎదురుదెబ్బ తగిలింది. ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో బిస్లా 0పరుగులకే గిల్ క్రిస్ట్ క్యాచ్ పట్టండంతో పెవిలియన్ చేరాడు. తరువాత అజహర్ మహమద్ బౌలింగ్ లో కల్లీస్ 1ను మన్ దీప్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. గంబీర్ ఒక్కడే నిలకడగా ఆడుతూ 60 పరుగుల వద్ద గోని బౌలింగ్ లో గిల్ క్రిస్ట్ అద్భుత క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. గంభీర్, మోర్గాన్ 38 బంతుల్లో 47 పరుగులు మూడో వికెట్ కు 71 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తివారీ 1, యూసఫ్ పఠాన్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివర్లో రజత్ భాటియాను 6 బంతుల్లో 16 పరుగులు (2సిక్సర్లు) ఆవానా క్లీన్ బౌల్డ్ చేశాడు. సురేష్ నరైన్ 1నాటౌట్, లక్ష్మీపతి బాలాజీ 0 నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత కోల్ కత్తా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 153 పరుగలు చేసి 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మన్ ప్రీత గోనీ 4-0-18-1 పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 18 బంతుల్లో 42 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. 

Golden era for middle class sections

  In the ever soaring market prices of essential commodities, petroleum products, shocking electric bills etc, it is a pleasant surprise to the people of the country to see the precious yellow metal rates is rapidly falling down. The fall has begun from Telugu New Year day Ugadi and it is still continuing to fall further. It was Rs.3240 per gram during November last year and it has come down to as low as Rs.2760 per gram today.   During the last five days the 22 carat gold price has comes down by Rs.2000 per gram, which is an unimaginable phenomenon for the gold lovers of the country. It is expected to further come down to by Rs.1000-1800 in the next few days, say market experts.   Even the Silver price also falls down heavily during the last few days. It is Rs.48,000 per kg now, which was once crossed Rs.59,000 mark in the last year. Hence, jewelry shops across the country witness a mad rush from all sections ranging from millionaires to labor class. However, many people are still waiting hoping further fall in the prices.   The reason for sudden fall of these precious metals is rumors over huge sale of these metals by Cyprus and in some European countries. According to Gold Council analytics there was 10% fall in demand for the Gold during the last year, which is also a reason for the present fall. It was 4405 tons in the year 2012, where as it was 4582 tons demand in year 2011. In India it was 986 tons in year 2011 and it was 864 tons in the last year.   More over the fall in crude oil prices, which affects the Dollar rate in the international market is also a reason for the present fall. According to Thompsons Reiter’s research center’s reports the gold price may pick up very shortly and may stabilize at Rs.3155 per gram by end of this year.

చెన్నైకి చెక్ చెప్పిన పూణే

  ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా సోమవారం ఎం.ఎ. చిదంబరం స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ X పూణే వారియర్స్ మధ్య జరిగింది. చెన్నైలో శ్రీలంక ఆటగాళ్లకు అనుమతి లేకపోవడంతో పూణే వారియర్స్ కెప్టెన్ శ్రీలంక ఆటగాడు  ఏంజిలో మాథ్యూస్ కు ఈ మ్యాచ్ లో ఆడలేదు. రాస్ టైలర్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. టాస్ గెలిసి బ్యాంటింగ్ ఎంచుకున్న పూణే వారియర్స్ కు ఓపెనర్లు ఫించ్, ఊతప్ప చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 96 జోడించారు. ఫించ్ 45 బంతుల్లో 67 పరుగులు (10 ఫోర్లు, 2సిక్సర్లు) చేసి జడేజా బౌలింగ్ లో ధోని స్టంప్ అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఊతప్ప నిదానంగా ఆడాడు 33 బంతుల్లో 26 పరుగులు (2 ఫోర్లు) చేసి మోరిస్ బౌలింగ్ లో జడేజా క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. రాస్ టైలర్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు అతను కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 16 బంతుల్లో 39 పరుగులు నాటౌట్ (3ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మిగతా బ్యాట్స్ మెన్ అంతగా రాణించలేదు. మిషెల్ మార్ష్ 2 మనీష్ పాండే 9 అభిషేక నాయర్ 0 నాటౌట్ గా నిలిచాడు. క్రిస్ మోరిస్ 2, బ్రావో 2, జడేజా 1 వికెట్లు పడగొట్టారు. పూనే వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్ అనిరుద్ధ ను భువనేశ్వర్ 0 పరుగులకే పెవిలియన్ కు పంపాడు. మరొక ఓపెనర్ మురళీ విజయ్ 22 బంతుల్లో 24 పరుగులు (2ఫోర్లు, 1సిక్సర్), బద్రీనాథ్ 26 బంతుల్లో 34 పరుగులు (4ఫోర్లు), రవీంద్ర జడేజా 22 బంతుల్లో 27 పరుగులు (1ఫోర్ 1 సిక్సర్) ఆదుకునే ప్రయత్నం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ సురేష్ రైనా 8, కెప్టెన్ ధోని 10, మోర్కెల్ 13, మోరిస్ 5 నాటౌట్, అశ్విన్ 11 నాటౌట్ చెన్నైను విజయతీరాలకు చేర్చలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్లు నష్టానికి 135 పరుగులు చేసింది. భువనేశ్వర్ 2, అశోక దిండా 2, మిషెల్ మార్ష్ 2, రాహుల్ శర్మ 1 వికెట్లు తీశారు. పూణే వారియర్స్ 24 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. రాహుల్ శర్మ 4-0-24-1 ఈ మ్యాచ్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. చివర్లో రెచ్చిపోయి ఆడిన స్టీవ్ స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది అవార్డ్ దక్కింది.

పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు

  ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడైన బ్యాంటింగ్ తో తక్కువ స్కోరును ఛేదించి గెలుపు సొంతం చేసుకుంది. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 10 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్ శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్లో పంజాబ్ కెప్టెన్ ఆడమ్ గ్రిల్ క్రిస్ట్ (0), మన్ దీప్ (2) పరుగుల చేసి ఔటయ్యారు. మరుసటి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించిన వోహ్రా (3) రనౌట్ అయ్యాడు. మైఖేల్ హస్సీ, గురుకీరత్ లు నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 31 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ ఇన్నింగ్స్ లో హస్సీ (41) ఒక్కడే అత్యధిక స్కోరు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో ప్రవీణ్ కుమార్ 7 బంతుల్లో 15 పరుగులు (2ఫోర్లు,  1 సిక్స్) చెలరేగి ఆడడంతో పంజాబ్ 124 పరుగులైనా చేయగలిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో గురుకీరత్ 10, సతీష్ 11,  అజార్ మెహమూద్ 23, చావ్లా 7, పర్మిందర్ ఆవానా 0, హారీస్ 2 నాటౌట్ గా నిలిచాడు. శ్రీశాంత్ 2, కెవోన్ కూపర్ 2, ఫాల్కనర్ 2, తివేది 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ వాట్సన్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. వాట్సన్ 19 బంతుల్లో 32 పరుగులు (7 బౌండరీలు) చేసిన తరువాత ఆవానా బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ద్రావిడ్ 9,  బిన్నీ 0 లను ప్రవీణ్ కుమార్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. ఒక పక్క వికెట్లు పడిపోతున్నా ఓపెనర్ రహానే నిలకడగా ఆడుతూ రాజస్థాన్ రాయల్స్ ను నాలుగు బంగులు మిగిలి వుండగానే 126 పరుగల విజయలక్ష్యాన్ని ఛేదించాడు. హాడ్జ్ 15, శ్యామ్ సన్ 23 బంతుల్లో 27 పరుగులు (3 బౌండరీలు)తో అజేయంగా నిలిచాడు. రహానే 42 బంతులలో 34 పరుగులు (3బౌండరీలు) లతో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ప్రవీణ్ 2, ఆవానా 1, పియూష్ చావ్లా 1 వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫాల్కనర్ నిలిచాడు.

ఛేజింగ్ లో చతికిలపడ్డ సన్ రైజర్స్

  ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నిర్దేశించిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక సన్ రైజర్స్ చతికిలబడింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ కు దిగిన కోల్ కత్తా ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 59 పరుగులు జోడించారు. గంభీర్ తన 39 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన తరువాత 53 పరుగుల వద్ద ఆశిష్ రెడ్డి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన జాక్విస్ కల్లీస్ బిస్లాతో జతకలిసి వీరవిహారం చేశాడు. బిస్లా 28 పరుగుల వద్ద కరణ్ శర్మ బౌలింగ్ లో విహారీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. మోర్గాన్ క్రీజ్ లోకి రావడంతోనే సన్ రైజర్స్ బౌలర్లను చితకబాదాడు. మోర్గాన్ 21 బంతుల్లో 47 పరుగులు (5ఫోర్లు, 3 సిక్సర్లు) రనౌట్ గా వెనుదిరిగాడు. యూసుఫ్ పఠాన్ క్రీజ్ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కల్లీస్ 27 బంతుల్లో 41 పరుగులు (6 బౌండరీలు)చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. కోల్ కత్తా ఇన్నింగ్స్ 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. కరణ్ శర్మ 1, ఆశిష్ రెడ్డి 1 వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు పార్థివ్ పటేల్ 31 బంతుల్లో 27 పరుగులు (2 ఫోర్లు, 1సిక్సర్), కామెరూన్ వైట్ 31 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్సర్) తో 9 ఓవర్లలో 57 పరుగుల భాగస్వామ్యం జతచేశారు. కల్లీస్ బౌలింగ్ లో కెమరూన్ వైట్ కొట్టిన భారీ షాట్ ను బౌండరీలైన్ లో యూసుఫ్ పఠాన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టడంతో సన్ రైజర్స్ వికెట్ల పతనం ప్రారంభమైంది. చివర్లో పెరీరా 25 బంతుల్లో 36 పరుగులు (2ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించకపోవడంతో నిర్దేశిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సంగక్కర 2 పరుగులు, రవితేజ 10, ఆశిష్ రెడ్డి 4, విహారీ 1, కరణ్ శర్మ 5 నాటౌట్, అమిత్ మిశ్రా 1 నాటౌట్ గా నిలిచారు.కలీస్ 3 వికెట్లు, రజత్ భాటియా 2 వికెట్లు, సునీల్ నరైన్ 1 వికెట్ పడగొట్టారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.