రాజాసింగ్ పై పీడీ యాక్ట్..ఇప్పట్లో జైలు నుంచి విముక్తి లేదా?

రాజాసింగ్.. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇప్పుడో సెన్సేషనల్ లీడర్. ధర్మం కంటే పార్టీ ఎక్కవేం కాదని కుండబద్దలు కొట్టేసిన వ్యక్తి. ఆయనే బీజేపీ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజా సింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి అరెరస్టు చేశారు. ఆ యాక్ట్ ప్రకారం అరెస్టయిన తొలి ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. ఇక పీడీ యాక్ట్ కింద రాజా సింగ్ ను అరెస్టు చేయడంతో ఆయన ఇక ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేనట్టేనని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరు పరిచే అవసరం ఉండదు. కనిష్టంగా మూడు నెలలు, గరిష్టంగా ఏడాది వరకూ ఆయనను జైల్లో ఉంచొచ్చు.   ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  2014 నుంచి ఇంత వరకూ ఆయనపై 101 కేసులు నమోదయ్యాయి. అదనంగా 18 మత కల్లోలాల కేసులు ఉన్నాయి. పైగా రౌడీషీట్ కూడా ఉంది. ఈ కారణంగానే ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపైనే పీడీయాక్ట్ నమోదు చేస్తూంటారు. కానీ రాజకీయ నేతలపై మాత్రం ఎప్పుడూ అమలు చేయలేదు. అయితే రాజాసింగ్‌పై మాత్రం అమలు చేశారు. అంతే కాకుండా ఒక వర్గం వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింద. దీంతో ఆయనకు పార్టీ పరంగా మద్దతు లభించే అవకాశం లేదని తేలిపోయింది. సున్నితమైన అంశం కనుక ఆయనకు ఎటువైపు నుంచీ కూడా మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో ఆయన ఇప్పటిలో బయటకు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

పోటీల‌లో  ఇదో  పోటీ!

పోటీలు అన‌గానే క్రీడారంగంలో పోటీలు, రాజ‌కీయ‌రంగంలో పోటీప‌డ‌టాలు గురించే అంద‌రికీ తెలు స్తుంది. కానీ చిత్రంగా అస్స‌లు ఎవ్వ‌రూ ఊహంచ‌ని స‌రికొత్త పోటీ ఒక‌టి ఈమ‌ధ్య నిర్వ‌హించారు. అపాన‌వాయు పోటీ!  ఆమ‌ధ్య ఏదో సినిమాలో ముగ్గురు క‌మెడియ‌న్లు యూ.ఎస్‌లో ఒక న‌గ‌రం వీధిలో నిల‌బడి అపాన‌వాయు వ‌ద‌లుతారు, దాని ధాటికి చాలామంది పారిపోతారు! ఇదో  సినిమాలో కామెడీ సీన్ ! అది ప్రేక్ష‌కుల‌కు స‌ర‌దా కోసం సినిమావారు క‌ల్పించిన ఒక సీన్‌. త‌ల‌చు కుంటే న‌వ్వొస్తుంది. కానీ అలా నిజంగానే అవుతుందా అంటే ! ఏమో అనే సందేహాస్ప‌ద స‌మాధానాలూ విన‌వ‌ల‌సివ‌స్తుంది. మావూళ్లో ఒక పెళ్లి భోజ‌నం చేసిన ఓ పెద్దాయ‌న‌... అంటూ ఎవ‌రికి తోచిన విధంగా వారు ఏదో ఒక విచిత్ర వివ‌ర‌ణ‌ల‌తో ఇలాంటి సంఘ‌ట‌న‌లు గుర్తుచేసుకున్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ ర్లేదు.  ఇలాంటి పోటీ ఏమిట‌న్న‌దే ఇపుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ది. ఇది ఎక్క‌డో విదేశాల్లో కాదు.. చ‌క్క‌గా మ‌న దేశంలోనే నిర్వ‌హించారు.  ఈపోటీలో పాల్గొన‌డానికి ఏకంగా ముంబై, జైపూర్‌, దుబాయ్ వంటి న‌గ‌ రాల నుంచి కూడా పేర్లు న‌మోద‌య్యాయి!  ఒక పెద్ద గ‌ది.. ఎంతో చ‌క్క‌టి సుగంధ‌ద్ర‌వ్యాల‌తో సువాస‌న‌ల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఎంతో శుభ్రంగా అలంక‌రించి ఉంటుంది. ఆ గ‌దిలోకి ఒక వ్య‌క్తిని పంపిస్తారు. అత‌ను అపాన‌వాయు వదులుతాడు.. అది ఎంత‌గా దారుణంగా వాతావ‌ర‌ణాన్ని కంపుమ‌యం చేస్తుందో అంచ‌నా వేస్తారుట‌! ఎలా చేస్తార‌న్న‌ది వ‌దిలేద్దాం. అలా చేసిన త‌ర్వాత‌. మ‌రో వ్య‌క్తిని మ‌రో గ‌దిలోకి పంపుతారు. ఇలా ఉన్న రెండు గ‌దుల్లోకి లెక్ ప్ర‌కారం, స‌మ‌యాన్న‌నుస‌రించి శుభ్ర‌త జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మ‌రీ పంపుతార‌ట‌! ఫైన‌ల్‌గా ఎవ‌రు ఎంత‌గా ఇబ్బందిపెడితే వారే విజేత‌!  ప‌రామ‌ర్ అనే మ‌హిళ ఈ పోటీల‌కి  జ‌డ్జి. ఊహంచ‌ని ఈ పోటీల‌కు త‌న‌ను జ‌డ్జిగా నియ‌మించ‌డం గురించి చెబుతూ న‌వ్వు ఆపుకోలేక‌పోయిందామె.  ఇదే కాంపిటీష‌నండీ! అని చిరాకుప‌డొచ్చు. అనేకానేక వెర్రి ఆట‌లు, కాంపిటీష‌న్ల‌లో ఇదోటి! విదేశాల్లో గిన్నిస్బుక్ రికార్డుల కోసం చిన్న చిన్న విష‌యాల్లోనూ పెద్ద పెద్ధ పోటీలు జ‌రుగుతుంటాయిట‌. తిన‌డం, ర‌న్నింగ్‌, బ‌స్కీలు తీయ‌డం.. ఇలాంటివి. మ‌రి మ‌న‌వాళ్లు క‌నుగొన్న ఈ పోటీ కూడా ఆ స్థాయికి అను మ‌తి ల‌భిస్తుందేమో చూడాలి!  చిత్రంగా ఉంది గ‌దా. ఈమ‌ధ్య‌నే సూర‌త్‌లో ఈ పోటీ జ‌రిగితే పెద్ద సంఖ్య‌ లో ఎవ్వ‌రూ పాల్గొన‌లేదు. కానీ విన్న‌వారు ప‌డి ప‌డి న‌వ్వుకుంటూనే ఉన్నారు! ఇలాంటి పోటీలూ ఉంటా యా అని!  ఇదే కాదు త్రేణుపుల పోటీ కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుం ది. త్రేణుపులు అంత సుల‌భంగా రావు క‌దా!  

చంద్రబాబుకుభద్రత పెంపు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ భద్రత పెంచింది. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. నేటి నుంచి అదనంగా నలుగుర్ని నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 12మంది చంద్రబాబుకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. అంతే కాదు గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షించనున్నారు. అంతేకాదు గురువారం ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇక కుప్పంలో చంద్రబాబుకు  మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.గురువారం ఆగస్టు 25) కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ప్రారంభించనున్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, ఫ్లెక్సీలను చించివేయడమే కాకుండా చంద్రబాబు సమీపానికి చేరుకోవడానికి ప్రయత్నించడం  తో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యలో చంద్రబాబు భద్రతకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎన్ఎస్జీ అభిప్రాయపడింది. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎన్ఎస్జీ డీఐజీ భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఈ మేరకు ఆయన నివేదికను పరిశీలించిన ఎన్ఎస్జీ అందుకు ఆమోదం తెలిపింది. దీంతో శుక్రవారం(ఆగస్టు 24) నుంచి చంద్రబాబుకు భద్రతను పెంచారు. 12 ప్లస్ 12 ఎన్ఎస్జీ బృందం ఆయనకు రక్షణ కవచంగ నిలవనుంది.

పిజ్జా  డాగ్‌!

మ‌నిషికి మొద‌ట ప‌రిచ‌యం అయిన జంతువు కుక్క అని అంటారు చ‌రిత్ర‌కారులు. కుక్క‌ల పెంప‌కం ప‌ట్ల మోజు పెరుగుతూ వ‌చ్చింది. బుజ్జి కుక్క‌పిల్ల‌ను పెంచుకోవ‌డంలో అదో ఆనందం, స‌ర‌దా. కేవ‌లం కాప‌లాకే కాదు, అది చిన్నాచిత‌కా ఇంటిప‌నుల్లో సాయం చేస్తూండ‌డం గ‌మ‌నిస్తుంటాం. ఇటీవ‌లి కాలం లో కుక్క‌ల పెంప‌కం పెద్ద వ్యాపకంగానూ మారింది. పిల్ల‌ల‌తో ఆడ‌టం, పెద్ద‌వాళ్ల‌కి వాకింగ్‌లో తోడుగా వెళ్ల‌ డం, ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోతే గేటు ద‌గ్గ‌రే కాప‌లా కాయ‌డం అన్నింటా వాటికి  ప్ర‌త్యేకించి శిక్ష‌ణ నిస్తు న్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ స‌భ్యునిగానే కుక్క‌ను ప్రేమ‌గా చూసుకోవ‌డం గ‌మ‌ని స్తుంటాం.  ఇటీవ‌ల శివాంగ్ అనే నెటిజ‌న్ ఒక వీడియో పెట్టాడు. పిజ్జా బాయ్‌కి ఎంతో స‌హ‌క‌రిస్తోంద‌న్నది దాని కాప్ఫ న్‌. ఇది ఎక్క‌డిది అనే ప్ర‌శ్న వ‌దిలేస్తే ఆ కుక్క అత‌నికి ఏపాటి సాయం చేస్తోంద‌న్న‌ది తెలుసు కోవాలి. ఎందుకంటే, వాటికి ఫ‌లానా ఇంటికి లేదా ఫ్లాట్‌కి వెళ్లి ఇవ్వ‌మ‌న‌గానే సెక్యూరిటి వాడి ద‌గ్గ‌రికి వెళ్లి నిల బ‌డుతుందిట‌. అత‌ను దాన్ని తీసుకుని కుక్క‌తో పాటు ఆ ఫ్లాట్‌కి వెళ్లి సెక్యూరిటీవాడు ఇవ్వ‌గానే  ప‌రు గున వ‌చ్చి త‌న య‌జ‌మానికి ఇచ్చేసిన సంగ‌తి తోక‌తో కొట్టి మ‌రీ చెబుతోంది! ఇలాంటి స‌హాయం చేసే కుక్క‌ల్ని పెంచుకుంటే ప‌ని భారం మ‌రీ త‌గ్గుతుంద‌ని పిజ్జా అమ్మే కంపెనీలూ భావిస్తున్నాయి. నిజంగానే ఇది మంచి సూచ‌న‌. ఆ కుక్క పిజ్జాబాయ్‌తో పాటు బండి మీద తిరుగుతుంది. ఎక్క‌డ ఆపితే అక్క‌డ దిగి ఆ అడ్ర‌స్ ఉన్న ఇంటి ద‌గ్గ‌ర ఎవ‌రు ఉంటే వారిని తానే ముందుగా పిలుస్తోంది. ఆ త‌ర్వాత పిజ్జా బాక్స్ తెమ్మ‌ని తోక ఊపుతుంది. ఇత‌గాడు పిజ్జా ప‌ట్టుకుని వెళ‌తాడు. అదే అపార్ట్‌మెంట్ల‌కి అయితే బండి అక్క‌డ గేటు ద‌గ్గ‌ర ఆగ‌గానే ప‌రుగున ఫ్లాట్స్ కాప‌లావాడి ద‌గ్గ‌రికి వెళ్లి  బ‌య‌టికి ర‌మ్మ‌ని గోల చేస్తుంది! రాగానే అత‌నికి దాని సంగ‌తి తెలుస్తుంది.  ఇది  రోజూవారీ ఆ కుక్క కార్య‌క్ర‌మం. పిజ్జా అమ్మే వాడికి, తీసుకునేవారికి అదో స‌ర‌దాగానూ మారింద‌ట‌! 

టీడీపీలోకి ఆనం రామనారాయణరెడ్డి?

ఏపీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ తీర్థం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లోనే కాకుండా, ఆయన మరణానంతరం ఏర్పాటైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా కీలక మంత్రి పదవులు నిర్వహించారు. అలాంటి రామనారాయణరెడ్డికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్సార్ నుంచీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న తనను వైసీపీ అధినేత, సీఎం జగన్ పూర్గిగా పక్కన పెట్టేయడం రామనారాయణరెడ్డికి తీవ్ర అవమానంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి  ఏపీలో వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి.  2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీలో ప్రత్యేకత గల కుటుంబాల్లో ఆ కుటుంబం కూడా ఒకటి. గతంలో ఆనం కుటుంబం నుంచి రామనారాయణరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా 2004, 2009లలో వైఎస్ రాజశేఖరరెడ్డి  , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల కేబినెట్ లలో  కీలకమైన మంత్రింగా ఉన్నారు. ఒకానొక దశలో  సీఎం పదవికి రామనారాయణరెడ్డి పేరు కూడా చర్చకు వచ్చింది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డిని  జగన్ తన పార్టీలో చేర్చుకుని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, అంతకు మించి ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన ఒకింత ఆగ్రహంతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.   . కాంగ్రెస్ పార్టీకి జగన్ గుడ్ బై చెప్పి సొంతంగా వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయనపై ఘాటుగా విమర్శలు చేసిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి ఒకరు. ఆ కారణం చేతనే జగన్ ఆనంకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు.  అలాగే  2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ రాజకీయాల్లో, కేబినెట్ లో కీలకంగా ఉన్న రామనారాయణరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్ పక్కన పెట్టేయడానికీ ఇదే కారణం అయి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే తనక ప్రాధాన్యత లేదన్న అసంతృప్తి రామనారాయణరెడ్డిలో ఉందంటారు. రామనారాయణరెడ్డి సీనియారిటీని జగన్ గుర్తించలేదని, సరైన పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఆనం అనుచరుల్లో కూడా ఉంది.  ఎంతో సీనియారిటీ, అనుభవం ఉన్న తనకు జగన్ తన తొలి కేబినెట్ లో స్థానం కల్పించలేదు. సరికదా మంత్రివర్గ పునర్మాణంలో కూడా పట్టించుకోకపోవడంతో రామనారాయణరెడ్డి ఇక పర్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు అంటున్నారు. తొలి కేబినెట్ లోకి నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్న జగన్ మలి కేబినెట్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని తీసుకోవడమే కాకుండా తనను అస్సలు పట్టించుకోకపోవడంపై ఆనం రామనారాయణ రెడ్డి రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఇటీవలి టీడీపీ మహానాడు సందర్భంగా రామనారాయణరెడ్డి కుమార్తె  కైవల్యారెడ్డి తన భర్తతో సహా వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సమావేశం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కైవల్యారెడ్డి టీడీపీలో చేరతారని, ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా జరిగింది. ఇలా లోకేష్ తో కైవల్యారెడ్డి భేటీ అవడం వెనుక ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ మంత్రాంగం ఉందని, ముందు కుమార్తెను టీడీపీలోకి పంపించి, ఆనక ఆయన కూడా తెలుగుదేశానికే  జై కొడతారనే ఊహాగానాలు జోరుగా ప్రచారంలోనికి వచ్చాయి. ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ పై రామనారాయణరెడ్డి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, అధికారుల తీరుపై ఫైరయ్యారని కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరిగింది. టీడీపీలోకి వెళ్లాలనే యోచన చేస్తున్న వల్లే రామనారాయణరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామనారాయణరెడ్డి టీడీపీలో చేరాలనే ఆలోచన చేస్తున్నారంటూ తాజాగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. రామనారాయణరెడ్డి మాత్రం దీనిపై ఎక్కడా స్వయంగా బయటపడకపోవడం గమనార్హం.

ఇంటికి కిలో బంగారం ఇచ్చినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదు.. కోమటిరెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ పతనానికి నాంది అని బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. శుక్రవారం (ఆగస్టు26) విలేకరులతో మాట్లాడిన ఆయన కేసీఆర్ మునుగోడులో ఇంటికి కిలో బంగారం పంచినా టీఆర్ఎస్ ను గెలిపించలేరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వెనకేసిన అవినీతి సొమ్ముతో మునుగోడు ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారనీ, అయితే మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరనీ వారు చైతన్యం కలిగిన వారనీ పేర్కొన్నారు. కేసీఆర్ గిమ్మిక్కులకు పడిపోయి మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు ఓట్లేస్తారనుకోవడం భ్రమేనని అన్నారు. కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందని, అందుకు మునుగోడు సభలో కేసీఆర్ మాటలే తార్కానమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టేందుకు మునుగోడు ఉప ఎన్నిక శ్రీకారం చుట్టిందన్నారు. మునుగోడు తీర్పుపైనే తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. మునుగోడు సభలో కేసీఆర్ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. రైతులకు వ్యవసాయ మీట్లర్లు పెడతారని కేసీఆర్ భయపెడుతున్నారనీ, అసలు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ చేసిందేమిటని విమర్శించారు. గజ్వేల్, సిరిసిల్లకే కేసీఆర్ పాలన పరిమితమైందని, అసెంబ్లీ సాక్షిగా తాను మునుగోడుకు నిధులు మంజూరు చేయాలని అడిగినా కేసీఆర్ స్పందించలేదని దుయ్యబట్టారు.  ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ప్రజల కోసం పని చేయలేకపోతున్నాననే బాధతోనే రాజీనామా చేశానని అన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దింపడం టీఆర్ఎస్ తోనే సాధ్యమౌతుందని, అందుకే తాను బీజేపీలో చేరానని వివరణ ఇచ్చారు. 

వైసీపీకి ప‌సుపు భీతి!

ప్ర‌తి మ‌నిషికీ ఒక రంగు ప‌ట్ల ఇష్టం ఉంటుంది. దారికి కార‌ణం ఫ‌లానా అని చెప్ప‌లేక‌పోవ‌చ్చు. అలాగే వేరే రంగు ప‌ట్ల అయిష్ట‌తా ఉంటుంది. కొంద‌రికి కేవ‌లం తెలుపే యిష్టం, కొందరికి గులాబీ యిష్టం ఉంటే ఇంకొంద‌రికి ప‌సుపు, నీలం బాగా యిష్టం. సాధార‌ణంగా ప‌సుపు శుభ‌కార్యాల్లో ఎక్కువ‌గా క‌నిపించే రంగు. దానికి ఆ ప్రాధాన్య‌త ఉంది. కానీ వైసీపీవారికి మాత్రం ప‌సుపు బొత్తిగా ప‌డ‌టం లేదు. ఆ రంగులో ఏది క‌న ప‌డినా విసుక్కుంటున్నారు. దీనికి కార‌ణం అంద‌రికీ తెలిసిందే. ప‌సుపు తెలుగుదేశం పార్టీవారిది. అందు వ‌ల్ల ప‌సుపు దుస్తుల్లో ఎవ‌రు క‌నిపించినా ఫ్యాన్‌వారికి ఉండ‌డం కాస్తంత ఇబ్బందిక‌రంగా ఉంటుంది.  ప‌సుపు స‌ర్వ‌మంగ‌ళ‌ప్ర‌దాయ‌ని అనే అభిప్రాయంతోనే తెలుగుదేశం ఆవిర్భావంలో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆ రంగుకి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చారు. అందువ‌ల్ల అలా ఆ రంగు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుం టూంది. అయితే ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ‌ప‌రంగానూ రంగుల్ని చూస్తున్నారు గ‌నుక వైసీపీవారికి ప‌సుపు బొత్తిగా గిట్ట‌డం లేదు. ప‌సుపు బ్యాక్‌గ్ర‌గౌండ్‌లో సైకిల్ గుర్తు టీడీపీవారి గుర్తు. దీన్ని క‌ల‌లో కూడా చూడ‌ద‌ల‌చు కో లేదు వైసీపీ వారు.  కానీ  ఏపీలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీ కొత్త రెండింత‌ల ఉత్సాహంతో ఉర‌క‌లు వేస్తోంది. ఏపీలో వైసీపీ స‌ర్కార్‌కు అభిమానం, ప్ర‌తిష్ట కొంత త‌గ్గింద‌న్న అభిప్రాయాలే ఎక్కువ‌గా విన ప‌డుతున్నాయి. దీనికి తోడు మంతులు, ఎమ్మెల్యేలు ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు గ‌తంలో వ‌లె బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్ట‌డం లేదు. ఎందుకు వ‌చ్చార‌న్నట్టు చూపులు, ప్ర‌శ్న‌లు సంధించ‌డంతో అవ‌మాన‌ప‌రుస్తున్నారు. పాలనా కాలం మూడేళ్లు ముగిసినా ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌న‌సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేక‌పో వ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్యానికి అద్దంప‌డుతుంది. ఇచ్చిన హామీలు, ప‌థ‌కాలు  అన్నీ నీరుగారాయి.   ఈ  ప‌రిస్థితుల్లో ఆగ‌ష్టు 25న కృష్ణాజిల్లా పెడ‌న‌లో నేత‌న్న నేస్తం పేర ఒక కార్య‌క్ర‌మం జ‌రిగింది. అక్క‌డి వారు స‌భాప్రాంగ‌ణాన్ని వైసీపీ ప‌తాకాల‌తో నింపేశారు. ఎక్క‌డా ప‌సుపు, న‌లుపు రంగులు క‌న‌ప‌డ‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇది వైసీపీ సంబంధించిన కార్య‌క్ర‌మం గ‌నుక టీడీపీ రంగు, ప‌తాకా లూ ఎక్క‌డా క‌న‌ప‌డ‌కుండా ఉండ‌ట‌మే మంచిద‌ని వారి అభిప్రాయం కావ‌చ్చు, లేదా విప‌క్షాల‌వారు వ‌చ్చి గొడ‌వ‌లు, ర‌భ‌సా సృష్టిస్తారేమోన‌న్న అనుమానమూ కావ‌చ్చు. ఏమ‌యిన‌ప్ప‌టికీ ప‌సుపు రంగు క‌న‌ప‌డ‌కుం డా ఉండ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు.  పెడనలో ‘నేతన్న నేస్తం’ నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సభకు ఒక వృద్ధుడు పసుపు రంగు చొక్కా వేసుకుని వచ్చారు. అది చూడగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక మహిళా ఎస్సై ఆయనను ఆపారు.  అతడి తలకున్న టవల్‌ తీయించి, చొక్కాపై కప్పించారు.  పైగా ఎట్టి పరిస్థితి లోనూ పైన కప్పుకున్న టవల్‌ తీయవద్దు. పసుపు చొక్కా కనిపించవద్దు’ అని హెచ్చరించారు. పసుపు రంగు చీర ధరించిన ఓ మహిళ వేదిక సమీపానికి వెళ్లకుండా అడ్డుకన్నారు. నలుపు రంగు చున్నీలు, మాస్కులు ధరించిన వారిని కూడా పోలీసులు అటకాయించారు. చున్నీలు, మాస్కులు తొలగించిన తర్వాతే లోనికి అనుమతించారు.  ఇదిలా ఉండ‌గా,  అస‌లు పెడనలో సీఎం సభ ప్రారంభం కాకుండానే జనం వెనుతిరిగి వెళ్లడం కనిపిం చింది. సీఎం సభ ప్రకటించిన సమయానికంటే కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.  ఓవైపు  వ్యాన్లు, బస్సు ల్లో జనాన్ని లోపలికి పంపిస్తుండగా, మరోవైపు నుంచి కొందరు బయటకు వెళ్లడం కనిపించింది.  సీఎం వచ్చాక కూడా ఆయన ప్రసంగం వినకుండానే కొందరు వెళ్లిపోయారు. సీఎం ప్రసంగం రుచించక మరి కొందరు వెళ్లిపోవడం గమనార్హం.  కాగా, ఈ సభలో సీఎం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనన్న ఆశతో ఎదురు చూసిన చేనేత కార్మికులకు నిరాశే ఎదురయింది. చేనేత సమస్యలన్నింటికీ నేతన్న నేస్తమే పరిష్కారమన్నట్లుగా ఆయన ప్రసంగం సాగడం, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల ప్రస్తావన లేకపోవడంపై నేత న్నలు పెదవి విరిచారు. సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత సంఘాలను బయటపడేస్తానన్న హామీ కూడా  సీఎం నోట రాలేదు.  తమకూ నేతన్న నేస్తం వర్తింపజేస్తామని సీఎం ప్రకటిస్తారేమోనని ఆశతో ఎదురుచూసిన అనుబంధ వృ త్తుల కార్మికులకు నిరాశ మిగిలింది. సభ నుంచి వెళ్లిపోతున్న ప్రేక్షకులను వైసీపీ కార్యకర్తలు లోప లకు పంపేందుకు ప్రయత్నాలు చేసినా.. సీఎం ప్రసంగం చప్పగా సాగడం, ఎండ తీవ్రత కారణంగా జనం చివరి వరకు ఉండకుండా వెనుదిరిగారు.

బిల్కిస్ బానో కేసు.. దోషులకు రెమిషన్ కు నిరసనగా గ్రామం ఖాళీ

దేశ మంతా బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని నిరసిస్తుంటే.. గుజరాత్ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టైనా అనిపించడం లేదు. నిరసనలను, వ్యతిరేకతను ఇసుమంతైనా లెక్క చేయడం లేదు పైపెచ్చు దోషులకు సన్మానాలు సత్కారాలు జరుగుతున్నా కూడా కిమ్మనడం లేదు.  బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ కింద విడుదల చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా దోషుల విడుదలకు నిరసనగా రంధిక్ పూర్ గ్రామాన్ని ముస్లింలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన దోషులను తిరిగి జైలుకు పంపే వరకూ తిరిగి గ్రామంలోకి అడుగుపెట్టేది లేదని వారు ప్రతిజ్ణ పూనారు.  గ్రామాన్ని విడిచిన ముస్లింలంతా దేవగఢ్ బరియాకు వలస వెళ్లారు.  దోషులను తిరిగి జైలుకు పంపడం  తాము గ్రామంలోకి తిరిగి వచ్చేందుకు పోలీసు రక్షణ కల్పించాలని వారు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు దేవగఢ్ బరియా గ్రామంలోనే నివసిస్తున్నారు. రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన వాహన వ్యాపారి సమీర్ గచ్చి కూడా తన 12 మంది కుటుంబ సభ్యులతో గ్రామాన్ని విడిచిపెట్టి దేవగఢ్ బరియాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. సమీర్ మాట్లాడుతూ.. తమకు తొలుత ఆ 11 మంది రేపిస్టులు, హంతకులు జైలు నుంచి విడుదలయ్యారన్న విషయం తెలియదన్నారు. వారు గ్రామానికి చేరుకున్నాక బాణాసంచా కాల్చి, సంగీత్‌తో సంబరాలు చేసుకున్నారనీ అప్పుడే ప్రభుత్వం వారిని విడుదల చేసందన్న సంగతి తెలిసిందన్నారు.  ఆ వెంటనే తాము గ్రామం విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాము కలెక్టర్ కు లేఖ కూడా రాసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన 55 మంది సంతకాలతో కూడిన ఆ లేఖలో బిల్కిస్ బానోకు న్యాయం చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన 11 మందినీ తిరిగి జైలుకు పంపాలనీ కోరినట్లు తెలిపారు. ఆ 11 మందినీ తిరిగి జైలుకు పంపే వరకూ తాము గ్రామంలో అడుగుపెట్టేది లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.  

ఆ ఓటమి ఓ పీడకల.. కపిల్ దేవ్

దేశంలో క్రికెట్ ఒక మతం.. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు ఉన్న పాపులారిటీ కంటే.. మ్యాచ్ లో ఓ సెంచరీ చేసిన ఆటగాడికి రాత్రికి  రాత్రి వచ్చేసే పాపులారిటీ అంత కంటే ఎక్కువ.1983లో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ ఫైనల్ లో అంతకు ముందు వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ను మట్టి కరిపించిన కపిల్ డెవిల్స్(భారత జట్టు) దేశంలో క్రికెట్ కు ఆదరణ  పెంచేసింది. ఒక్క  సారిగా దేశంలో క్రికెట్ మానియా పెరిగిపోయింది. ఆ తరువాత నుంచి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఇండియానే గెలవాలి అని అభిమానులు ఆశించారు. అందుకు విరుద్ధంగా జరిగితే ఆగ్రహంతో రగిలిపోయేవారు. ఆటగాళ్ల  ఇళ్లపై దాడులకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. అయితే  ఇవ్వన్నీ ఒకెత్తు.. దాయాది దేశం పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ఒకెత్తులా మారిపోయింది. భారత్ - పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ లా కాకుండా రెండు దేశాల మధ్య యుద్ధం అంత టెన్షన్ ఇరు దేశాల్లోనూ నెలకొని ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఒక విధమైన తెలియని ఉద్వేగం నిండి ఉంటుంది. ఇరు దేశాల మధ్యా సంబంధాల కారణంగా గత కొన్నేళ్ల నుంచీ ఇరు దేశాల మధ్యా సిరీస్ లు జరగడంలేదు. కానీ ఆసియాకప్, వరల్డ్ కప్ టోర్నమెంట్లలో మాత్రం ఇరు జట్లూ తలపడే అవకాశం మాత్రం లభిస్తోంది. ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా తిలకిస్తారు. ఆ సిరీస్ ఏదో ఇరు దేశాల ప్రతిష్టకూ సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. అలాగే  ఇరు జట్లూ కూడా యాషెస్ గెలవడం కోసం సర్వశక్తులూ ఒడ్డి ఆడతాయి. అయితే  భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే యాషస్ ను మించిన ఉత్కంఠ ఉంటుంది. యాషస్ సీరీస్ ను మించిన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ కప్ ముంగిట 1986 ఆసియాకప్ ఫైనల్ లో భారత్- పాకిస్థాన్ తలపడిన మ్యాచ్ గురించి గుర్తు చేసుకోవడం అప్రస్తుతం ఎంతమాత్రం కాదు. చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ గురించి అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ అదో పీడకల అన్నాడు. అసలింతకీ 1986లో ఆషియా కప్ ఫైనల్ మ్యాచ్ గురించి అప్పటి ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. గెలిచేశామనుకున్న మ్యాచ్ లో చివరి బంతికి పరాజయం పాలయ్యాం. అది నిజంగా నమ్మలేని సంఘటన. ఆ మ్యాచ్ గురించి తలుచుకుంటే నిద్ర పట్టదు. ఇప్పటి దాకా అలాంటి నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను అంటాడు. ఇంతకీ ఆ మ్యాచ్ లో ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు చేయాలి. క్రిజ్ లో మియాందాద్ ఉన్నాడు. బౌలర్ చేతన్ శర్మ. చివరి బంతికి నాలుగు పరుగులు అంటే ఒక్క బౌండరీ చాలు. ఆ బౌండరీ ఇవ్వకూడదన్న పట్లుదలతో భారత జట్టు ఫీల్డింగ్ ను మోహరించింది. అయితే చివరి బంతికి సిక్సర్ కొట్టి మియాందాద్ భారత్ చేతుల్లోంచి మ్యాచ్ ను ఎగరేసుకు వెళ్లిపోయాడు. భారత జట్టులో నిరాశ, బాధ.. పాక్ శిబిరంలో సంబరాలు. చివరి బంతికి ఓటమిని కెప్టెన్ కపిల్ దేవ్, జట్టు సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కపిల్ అయితే చాలా ఏళ్ల వరకూ ఆ ఓటమి ఓ పీడకలలా వెంటాడిందని చెబుతాడు.  

బాబు భద్రతకు ముప్పు?.. సెక్యూరిటీ పెంచాలని ఎన్ఎస్జీ నిర్ణయం!

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) డీఐసీ భద్రతా ఏర్పాట్లు సమీక్షించం, పర్యవేక్షించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మందిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒకరు. అటువంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం, ఆయన నివాసంలో ఎన్ఎస్జీ డీఐజీ సమర్దీప్ సింగ్ స్వయంగా పరిశీలించడం. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించి తగు సూచనలు చేయడంతో ఏం జరిగిందన్న ఆందోళన తెలుగుదేశం శ్రేణుల్లోనే కాకుండా సామాన్యులలో కూడా నెలకొంది. ఈ హఠాత్ తనిఖీలు, సమీక్షల వెనుక చంద్రబాబుకు ముప్పు ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ లే కారణమని భావిస్తున్నారు. ఏపీలో ఆయన భద్రతకు సంబంధించిన పలు అనుమానాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నం వంటి సంఘటనల నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ పుట్స్ రావడంతో ఆయన భద్రత  విషయంలో ఎన్ఎస్జా అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రతపై రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగాద ఎన్ఎస్జీ భద్రత ఉన్నది కేవలం నలభై మందికి మాత్రమే. వారిలో చంద్రబాబు కూడా ఒకరు. ఈ మేరకు ఎన్ఎస్జీ డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తేలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పరిశీలించారు. భద్రతా పరంగా కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆయనకు భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున చంద్రబాబుకు లభిస్తున్న భద్రతా ఏర్పాట్ల పట్ల ఎన్ఎస్జీ బృందం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి చంద్రబాబు పర్యటనలలో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీసు విభాగం భద్రతా4 ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, భద్రతా చర్యలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఏపీ పోలీసులు అటువంటి ప్రత్యేక ఏర్పాట్ల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. ఆయన పర్యటనలలో ఉన్న సమయంలో అధికార పక్ష కార్యకర్తలు ఆయనపై దాడులకు సైతం సిద్ధపడుతున్నా భద్రతా ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్ఎస్జీకి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన సంఘటనలు ఏపీ పోలీసుల తీరు ఎంత దారుణంగా ఉన్నదో తేటతెల్లం చేశాయి. చంద్రబాబు ప్రారంభోత్సవం చేయాల్సిన అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, ఆయన పర్యటనను అడ్డుకోవడానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఆయన సమీపంలోనికి దూసుకు వెళ్లడం వంటి ఘటనలు ఆందోళన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్జీ ప్రత్యేక బృందం చంద్రబాబు సెక్యూరిటీపై సమీక్ష చేసింది. స్వయంగా పరిశీలించి భద్రతను పెంచాలని నిర్ణయించింది. 

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హై కోర్టు ఓకే

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎటువంటి షరతులూ లేకుండా యాత్రను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ఆపాలంటూ పోలీసులు బండిసంజయ్ కు ఇచ్చిన నోటీసులను హైకోర్టు స్పస్పెండ్ చేసింది. యాత్రను నిలిపివేయాలంటూ  పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టిన హై కోర్టు  పాదయాత్రకు బేషరతు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని విఘ్నం కలిగేలా బండి సంజయ్ వ్యాఖ్యానించారంటూ యాత్ర నిలిపివేయాలని నోటీసులు ఇచ్చిన దానిపై ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను చూపాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం పెన్ డ్రైవ్ లో ఆధారాలను సమర్పించింది. అయితే పెన్ డ్రైవ్ ఆధారాలు చెల్లవన్న కోర్టు సరైన పద్ధతిలో ఆధారాలను సమర్పించకపోవడంపై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. అనంతరం యాత్రకు అనుమతి తీసుకున్నారా అని బండి సంజయ్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. అందుకు తీసుకున్నామంటూ వారు సమాధానమిచ్చారు.  దీంతో బండి సంజయ్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బండి సంజయ్ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై తెరాస శ్రేణులలోనే ఒకింత అసహనం వ్యక్తమైంది. ఎవరికీ పట్టని యాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేయడం వెనుక ప్రభుత్వ వ్యూహమేమి టో అర్దం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నది సామెత. టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ సామెతనే గుర్తు చేస్తున్నది. బండి ప్రజా సంగ్రామ యాత్ర..  ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదు. విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు. ముగింపు సభ పేర పార్టీ అగ్రనాయకులను తీసుకువచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలలో కొత్తదనమేమీ ఉండటం లేదు.  కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న ఊకదంపుడు విమర్శలను జనం పట్టించుకోవడం లేదు  ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఈ సమయంలో ఆ యాత్రను నిలిపేయాలంటూ నోటీసులు ఇవ్వడం వల్ల యాత్ర గురించి చర్చ జరుగుతుందనీ, అది బీజేపీకే ప్రయోజనకరమని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ యాత్రకు అనుమతి ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని అంటున్నారు. 

రిషీ.కొత్త త‌రం ప్ర‌తినిధి

రిష్వాంజస్ రిషి రాఘవన్ బెంగ ళూరు నవనిర్మాణ పార్టీ (బీఎన్‌ పీ)లో యూత్ వింగ్ లీడర్. అతను సెప్టెంబరు 2021లో బీఎన్‌ పీకి చిన్న వ‌య‌సులోనే గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్ని కయ్యా డు. పార్లమెంటరీ బిల్లులు, యూని యన్ పార్లమెంట్‌లో ఆమో దిం చిన విధానాలపై ఇన్‌పుట్‌లను అం దించడానికి 22 ఏళ్ల యువకుడు కన్నడ న్యూస్ ఛానెల్‌లలో ప్యానె లిస్ట్‌గా కూడా ఆహ్వానం అందు కున్నాడు.  ప్రజాస్వామ్యం కేవలం ఎన్నుకున్న‌ ప్రభుత్వాన్ని కలిగి ఉండటానికే పరి మితం కాకుండా సమాజంలోని అన్ని రంగాలు , స్థాయిల నుండి, ముఖ్యంగా యువకులను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, మేము 40 ఏళ్లలోపు జనాభాలో మెజారిటీని కలిగి ఉన్నాం, 60 ఏళ్లు పైబడిన మెజారిటీ వ్యక్తులను అధికారానికి ఎన్ను కుంటాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశం పురో గమించింది, అయితే మనకు దారి చూపడానికి కొంతమంది యువ జ్యోతులు కలిగి ఉంటే అభివృద్ధి చాలా వేగంగా ముందుకు సాగుతుంది. భారతదేశానికి అన్ని స్థాయిలలో యువ నాయకులు అవసరం, వారు తమ ఉత్సాహాన్ని శక్తిని సమాజ అభివృద్ధికి ఉపయోగించగలరన్న‌ది రిషి అభిప్రాయం. రిషి బెంగళూరుకు చెందిన ఒక యువ రాజకీయ ఔత్సాహికుడు.  నేటి, రేపటి రాజకీయాలను రూపొందించడానికి తన స్థాయిలో దృష్టాంతాన్ని మారుస్తున్నారు. రిషి రాఘవన్ యువతరానికి ఓటుహక్కును కోల్పోకుండా లేదా రాజకీయ ప్రక్రియల నుండి వైదొలగకుండా చూసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్రజా సమస్యలను వినిపించడం ముఖ్యమైనది. అతను బెంగుళూరు నవనిర్మాణ పార్టీ (బీఎన్‌పీ)లో యూత్వింగ్ లీడర్, స్కూల్ కెప్టెన్‌గా పోటీ చేస్తున్నప్పుడు పద్నాలుగేళ్ల వయసు లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన డైనమిక్ నాయకుడు. బీఎన్‌పి అనేది  ప్రపంచంలోనే  ఏకైక  నగర పార్టీ. 22 ఏళ్ల అతను అశోక విశ్వవిద్యాలయం నుండి తన బీఎస్సీ (ఆనర్స్) ఎకనామిక్స్, ఫైనాన్స్ పూర్తి చేసాడు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ అభ్యసిస్తున్నాడు. రిషి తన విద్యార్థి నాయకత్వ ప్రయాణంతో కళాశాల వరకు ముందుకు సాగాడు, రికార్డ్ బ్రేకింగ్ ఓట్లతో విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలలో విజయం సాధించాడు.  యువ ఔత్సా హికులు జూలై 2019లో కేంద్ర బడ్జెట్‌కు సహకరించారు. 19 సంవత్సరాల వయస్సులో, రిషి లోక్‌సభ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడానికి ఎంపికయ్యారు.  రిషి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు. ప్రాతినిధ్యం, దేశంలో ఏమి జరుగుతుందో దానికి బాధ్యత వహించాలనే ఆలోచనపై అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. అతను ది లాజికల్ ఇండియన్‌తో మాట్లాడాడు మరియు న్యూ ఏజ్ లీడర్‌షిప్, వార్డు స్థాయి ఎన్నికల ప్రాముఖ్యతపై తన ఆలోచనలను పంచుకున్నాడు. వార్డు ఎన్నికలపై తన ఆసక్తి గురించి అడిగినప్పుడు, రిషి మాట్లాడుతూ, మూడు అంచెల రాజకీయాలలో అత్యధిక ప్రభావం చూపే ప్రాంతం అయినప్పటికీ ఇది అత్యంత విస్మరించబడిన ప్రాంతం. మ‌న‌కు రోజువారీ జీవితంలో ఏమి కావాలి,  సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా మాకు మంచి నాణ్యమైన జీవితం అవసరం. అందులో భద్రత, వీధి దీపాలు, వ్యర్థాల సేకరణలు, రోడ్లు ఉన్నాయి. రేపు, నాకు నీటి సరఫరా లేదా విద్యుత్ లేకుంటే, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని పిలవలేనన్నాడు. అందువల్ల, దీనికి చాలా సంభావ్యత ఉంది" అని రిషి చెప్పారు. బీబీఎంపి వర్కర్స్ గురించి వాయించే బీబీఎంపి, ఎన్నుకోబడిన కౌన్సిల్ లేకుండా నగర వార్షిక బడ్జెట్‌ను ఖరారు చేసే ముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను సంప్రదించాలని బీబీఎంపి నిర్ణయించింది. ఇది మాజీ కౌన్సిలర్‌లచే పెద్దగా పట్టించుకోలేదు. , మేయర్లు మరియు స్టాండింగ్ కమిటీల సభ్యులను అటువంటి కీలక సమావేశాల నుండి ఎలా తప్పించారు. నివేదిక ప్రకారం, పౌర సంఘం కూడా ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించ డానికి బడ్జెట్ పరిమాణాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ఈ సమస్యను రిషి ఫ్లాగ్ చేశారు, అతను బీబీఎంపిని కోరాడు. పనుల నాణ్యత దెబ్బతినకుండా కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లించడంపై దృష్టి సారించారు.కార్పొరేషన్ కార్మికులకు రూ.3,200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, వారి బకాయిలను ఎలా చెల్లిస్తారో మాట్లాడలేదని, దాని ఖాతాలు వేయాలని ఆయన పౌరసరఫరాల సంస్థను కోరారు. గత సంవత్సరాల నుండి పబ్లిక్ ఆడిట్‌లు తద్వారా డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్న‌దీ పౌరులకు తెలుస్తుంది. కార్పొరేషన్ పనితీరును విశ్లేషించడానికి కూడా నివేదికలు ప్రజలకు సహాయపడతాయి. రిషి కౌన్సిల్‌లో ఉండటం  ప్రాముఖ్యత గురించి , స్టాండింగ్ కమిటీల ద్వారా నగర వ్యవహారాలలో ఎలా పాల్గొన వచ్చు అనే దాని గురించి మాట్లాడారు. విద్య, యువజన వ్యవహారాలపై బీబీఎంపీలో ఓ కమిటీ ఉంది. నగరంలో దాదాపు 157 బిబిఎంపి నడిచే పాఠశాలలు ఉన్నాయి, అవి మంచి స్థితిలో లేవు. బెంగళూరులో మాకు ఉన్న ప్రైవేట్ సంస్థల కారణంగా ఈ పాఠశాలలు గుర్తించబడలేదు. నేను దానిపై మక్కువ కలిగి ఉన్నాను. నేను రాష్ట్ర విద్యను విప్లవాత్మకంగా మార్చా లని చూడ టం లేదు. కానీ గణనీయమైన మార్పు తీసుకురావడానికి" అని రిషి చెప్పాడు. నీడ్ ఆఫ్ న్యూ ఏజ్ లీడర్ షిప్ కొత్త యుగం నాయకులను కలిగి ఉండటం  ప్రాముఖ్యతపై మాట్లాడుతూ, పౌరుల అంచనాలకు అనుగుణంగా మార్పును తప్పని సరిగా మార్చుకోవాలని బీఎన్‌పి హెడ్ అన్నారు. నేడు, మనకు స్మార్ట్, సాంకేతికతతో నడిచే పాలన అవసర మైతే, మీరు సాంకేతికతను అర్థం చేసుకునే వ్యక్తులను ఎన్నుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావడానికి ఇదే ప్రధాన కారణం.

నేనెలా అన‌ర్హుణ్ణి అవుతాను?.. హేమంత్ సొరేన్‌ మండిపాటు

ఒక‌రి మీద బుర‌ద‌జ‌ల్లి, త‌ర్వాత వివాదాస్ప‌దుడ‌ని ప్ర‌చారం చేసి భ్ర‌ష్టు ప‌ట్టించ‌డం బీజేపీవారికి అలవాటైన విద్య అని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అన్నారు. త‌నపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాదించిందంటూ వెలువ‌డిన క‌థ‌నాల‌పై   హేమంత్ సోరేన్ స్పందించారు. తనపై అనర్హత వేటుకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు.   అంతకు ముందు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను సీఎం కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని హేమంత్ సొరేన్ పై అనర్హత వేటు వేయాలంటూ   ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్‌లో ఝార్ఖండ్ గవర్నర్ కు పంపిందనీ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.   ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లాభదాయక పదవిని నిర్వహిస్తున్నందువల్ల ఆయన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించా లని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న  గవర్నర్ కు కలిసి ఫిర్యాదు చేశారు.  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం హేమంత్  సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్య మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. దీనిపై గవర్నర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు. దీనిపై ఎన్నికల సంఘం  తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు పంపించిందని, ఈ నివేదిక రాజ్ భవన్‌కు చేరిందంటూ వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ ఢిల్లీ పర్య టనలో ఉన్నారు. 

హేమంత్ సొరేన్ కు ఈసీ షాక్

 కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ జార్ఖండ్ సీఎంకు హేమంత్ సొరేన్ కుషాక్ ఇచ్చింది.  ఆయనపై అనర్హత వేటు వేయాలని సూచిస్తూ   ఝార్ఖండ్ గవర్నర్‌ రమేశ్ బియాస్‌ కు లేఖ రాసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను సీఎం కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. తన అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్‌లో ఝార్ఖండ్ రాజ్‌భవన్‌కు  పంపింది.   ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని  సెక్షన్ 9-ఏను హేమంత్ సోరెన్  ఉల్లంఘించారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం ఒక శాసన సభ్యుడు ఏదైనా అనర్హతలకు లోబడి ఉన్నారా? లేదా? అనే ప్రశ్న తలెత్తితే ఈ అంశాన్ని గవర్నర్‌కు పంపుతారు. ఆయన నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని గవర్నర్ కోరతారు.    దీని నేపథ్యం అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్ హస్తం ఉందని అనుమానించి ఈడీ.. కొన్నాళ్ల కిందట అతడి నివాసంలో సోదాలు నిర్వహించిన సందర్భంగా  ఏకే 47 రైఫల్స్   బయటపడ్డాయి. ఇక, మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీలో పలు చోట్ల తనిఖీలు చేపట్టిన ఈడీ  సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయ సన్నిహితుడు పంకజ్ మిశ్రా,  బచ్చు యాదవ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సోదాల్లో  కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు,  బ్యాంకు ఖాతాల్లో రూ.13.32 కోట్ల నగదును జప్తు చేసిన సంగతి విదితమే. అయితే హూమంత్ సొరేన్ కు ఈసీ ఇచ్చిన షాక్   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకింత ఇబ్బందికరమైన అంశమే నని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలకు మద్దతు ఇచ్చిన బీజేపీయేతర నేతలలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ముఖ్యులు. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్ 28న హేమంత్ సొరేన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు అంటే మార్చి నెలలో సీఎం కేసీఆర్ రాంచీ వెళ్లి హేమంత్ సొరేన్ తో భేటీ అయ్యారు.   మళ్లీ  నెల రోజుల వ్యవధిలోనే ఇరువురు సీఎంలూ రెండో సారి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సందర్బాలలోనూ జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని చెబుతున్నారు.  అంతే కాకుండా ‘మేఘా’సహా మరో రెండు కంపెనీలకు జార్ఖండ్ లో కాంట్రాక్టుల విషయంపై సీఎం కేసీఆర్  జార్ఖండ్ సీఎంకు సిఫారసు చేశారనీ, వీరిరువురి మధ్యా ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చిదనీ కూడా అప్పట్లో వార్తలు వినవచ్చాయి.  త్వరలోనే జార్ఖండ్ లో మేఘా కంపెనీ, మరో రెండు కంపెనీలకు కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో రాజకీయ వర్గాలలో బాగా ప్రచారమైంది. అలాగే హేమంత్ సొరేన్ తన తల్లి వైద్యం కోసమే గత ఏప్రిల్ లో హైదరాబాద్ వచ్చారనీ, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్  డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆయన తల్లికి వైద్యం చేశారనీ, డాక్టర్ నాగేశ్వరరెడ్డితో కేసీఆర్ స్వయంగా మాట్లాడి మరీ హేమంత్ సొరేన్ తల్లికి వైద్యం నిమిత్తం అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేశారనీ అంటున్నారు.   మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనీ రాజకీయవర్గాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ వ్యవహారంలో హేమంత్ సొరేన్ పై ఈసీ అనర్హత వేటు వేయడం కేసీఆర్ రాజకీయ ఆకాంక్షల విషయంలో పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. అన్నిటికీ మించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగిన వారికి ఏదో విధంగా రాజకీయంగా నష్టం వాటిల్లడం మామూలైపోయిందనీ, ఆ కారణంగానే కేసీఆర్ తో రాజకీయంగా చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్ధితి ఏర్పడిందని రాజకీయ వర్గాలలో ఓ చర్చ అయితే ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ చిక్కుల్లో పడి పదవి కోల్పోయి పరిస్థితికి వచ్చారు.  

ఆసియా క‌ప్ ... భార‌త్‌దే పై చేయి 

1984లో ఆసియా కప్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌, పాకిస్థాన్‌లు 14 సార్లు తలపడ్డాయి. ఆ 14 మ్యాచ్‌ల్లో భారత్ ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌. పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్న ఎన్‌కౌంటర్లు. చాలా ఎక్కువ ఆవేశ‌భ‌రితంగా జ‌రిగే పోటీలు ఈ ఇరు దేశాల‌వే. టోర్నీ ఏద‌యినా, వేదిక ఏద‌యినా భార‌త్ పాక్ మ్యాచ్‌లు అంటే క్రికెట్ వీరాభిమానుల్లో ఎక్క‌డా లేని ఉత్సాహం, ఉద్రేకాల‌కూ ఆస్కారం ఉం టోంది. అంతే కాదు, ఘర్షణలూ చరిత్రలో చోటు చేసుకున్నాయి. భార‌త్ పాక్ మ్యాచ్‌ల‌ను ప్ర‌పంచ క్రికెట్ పండితులు ఇంగ్లండ్‌, ఆసీస్ మ‌ధ్య పోటీల‌తోనే పోలుస్తారు. వాటికి ఇవేమాత్రం తీసిపోవ‌ని వారి మాట‌. చాలా రోజుల త‌ర్వాత ఇపుడు ఆ ఉత్సాహ‌, ఉల్లాస‌భ‌రిత‌, ఉద్వేగ‌భ‌రిత మ్యాచ్‌లు చూడ‌బోతున్నాం.  ఈ ఏడాది ఆసియా కప్ ఎడిషన్‌లో ఆగస్టు 28న ఢీకొనేందుకు సిద్ధమైన బద్ధ శత్రువులు ప్రస్తుతం పరస్పరం దూసుకుపోతు న్నా రు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో మెన్ ఇన్ గ్రీన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు భావి స్తున్నారు. 1984లో ఆసియా కప్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌, పాకిస్థాన్‌లు 14 సార్లు తలపడ్డాయి. ఆ 14 మ్యాచ్‌ల్లో భారత్ ఎని మిదిసార్లు విజేతగా నిలిచింది. మరోవైపు మెన్ ఇన్ బ్లూ ఇచ్చిన సవాల్‌ను పాకిస్థాన్ ఐదుసార్లు మాత్రమే అధిగమించ గలిగింది. వారి ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. టోర్నమెంట్‌లో టీ20లో పాకిస్తాన్‌పై అజేయమైన రికార్డును భారత్ సొంతం చేసుకుంది, నిర్దిష్ట ఫార్మాట్‌లో రెండు దేశాల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే టోర్నీలో పాకిస్థాన్ వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై ఐదు విజయాలను నమోదు చేసుకోగలిగింది. 1984లో యుఏఇ లోని షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ యొక్క మొదటి ఎడిషన్‌లో రెండు దేశాలు మొదటిసారిగా ఒకరిపై ఒకరు పోటీ పడ్డాయి, భారత్‌ విజేతగా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వినోదభరితమైన ఘర్షణలను ప్రదర్శించినప్పటి నుండి టోర్నమెంట్ ప్రతి ఎడిషన్‌లో జట్లు ఒక దానితో ఒకటి పోటీపడ్డాయి. ఆసియా కప్‌లో వారి ఇటీవలి పోరు 2018లో దుబాయ్, యుఏఇలోని దుబాయ్ ఇంటర్నే షనల్ స్టేడియంలో జరిగింది, ఇక్కడ భారత్‌ 9 వికెట్లతో పాకిస్తాన్‌పై బెస్ట్‌గా నిలిచింది. నిస్సందేహంగా, దుబాయ్‌లోని ఐకానిక్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 28న తమ సంబంధిత టోర్న మెంట్-ఓపెనర్‌లలో రెండు ఆసియా దిగ్గజాలు భారత్, పాకిస్థాన్‌లు ఒకరితో ఒకరు తలపడబోతున్నందున రాబోయే టోర్నమెంట్ గురించి హైప్ చాలా ఎక్కువగా ఉంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో వారి చివరి ముఖాముఖి తర్వాత రెండు సీనియర్ జట్ల మధ్య పోటీ మరోసారి ప్రారంభమవుతుంది. ఆసక్తికరంగా, ఇరు పక్షాల మధ్య చివరి ఘర్షణ కూడా దుబాయ్‌లో అదే వేదికపై జరిగింది, అక్కడ బాబర్ అజామ్ జ‌ట్టు. తమ పొరుగు దేశంతో జరిగిన ప్రపంచ కప్ జిన్క్స్‌ను బద్దలు కొట్టేందుకు భారత్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 2022 టీ20 ప్రపంచ కప్ కోసం దుస్తుల రిహార్సల్‌గా ఆసియా కప్‌ను అక్టోబరు-నవంబర్ నుండి ఆస్ట్రేలియాలో జరగనున్న దృష్ట్యా, రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ గ్రీన్‌లు ఎటువంటి రాయిని వదిలివేయవు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అగ్ర స్థానంలో నిలిచింది. భారత్‌,  పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్ (పూల్ ఏ)లో ఉండగా, ఆగస్టు 28న తలపడనున్నాయి. 2022 ఎడిషన్‌లో ఇద్దరు హేమా హేమీలు ఒకరినొకరు మొత్తం మూడుసార్లు కలుసుకునే అవకాశం ఉన్నందున ఉత్కంఠ‌భ‌రిత పోటీ కోసం, క్రికెట్ అభిమానులు ట్రీట్‌లో ఉన్నారు. భారత్‌,  పాకిస్థాన్‌లు ఇతర క్వాలిఫైయింగ్ జట్టును -- పూల్ ఏలో వారితో చేరి -- సూపర్ 4లోకి ప్రవేశించాలని భావిస్తున్నం దున, వారు సెప్టెంబర్ 4 (ఆదివారం)న ఒకరితో ఒకరు పోటీపడే అవకాశం ఉంది. రోహిత్ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ , పాకిస్తాన్ రెండు బలమైన జట్లు కాబట్టి, వారు సూపర్ 4లో అగ్రస్థానంలో ఉంటారని, టోర్నమెంట్ ఫైనల్‌లో కూడా అంటే సెప్టెం బర్ 11న ముఖాముఖి తలపడాలని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్,  దసున్ షనక  శ్రీలంక వంటి పోటీతత్వ,  ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న జట్లను ఎవరూ రాయలేరు. చాలా అప్‌సెట్‌లు జరిగితే, ఫైనలిస్ట్‌లు ఈ సమయంలో చాలా మంది ఆశించిన వాటి కంటే భిన్నంగా కనిపించవచ్చు. ఆసియాకప్‌ ఫైనల్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు ఇప్పటివరకు ఆడలేదు. ఈసారి స్క్రిప్ట్ మారుతుం దా?  చూడాలి. 

ఆసియా క‌ప్‌... కోచ్‌గా ద్రావిడ్ స్థానంలో ల‌క్ష్మ‌ణ్‌  

 ఏద‌యినా స‌మ‌స్య త‌లెత్తిన‌పుడు ప‌రిష్కార‌మార్గం ఆలోచిస్తే నెమ్మదిమీద తెలుస్తుంది. క్రికెట్ ప‌రంగా చూస్తే భార‌త జ‌ట్టుకు అలాంటి అనేక సంద‌ర్భాల్లో గొప్ప ప్ర‌శాంత‌త‌ను, విజ‌యాన్ని ఇచ్చిన‌వాడు వి.వి.ఎస్. ల‌క్ష్మ‌ణ్‌. ఇది యావ‌త్ క్రికెట్ లోకం అంగీక‌రిస్తుంది. గ‌వాస్క‌ర్‌, క‌పిల్‌, అజ‌రుద్దీన్ వంటి సీనియ‌ర్లు కూడా ల‌క్ష్మ‌ణ్ గురించి ఇలానే చెప్ప‌డం ల‌క్ష్మ‌ణ్ ప్ర‌త్యేక‌త‌. కానీ వివిఎస్ మాత్రం మ‌హా సింపుల్‌గా ఉంటాడు. అదంతా వారి అభిమానం త‌ప్ప మ‌రోటి కాదంటాడు. అత‌నికి వాస్త‌వానికి భార‌త్ జ‌ట్టులో ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డ‌మ‌నే అన్యాయం జ‌రిగింది. కానీ అత‌ను మాత్రం దాన్ని అంత సీరియ‌స్‌గా తీసుకోలేదు. కార‌ణం తాను భార‌త్ జ‌ట్టులో ఉండాల‌నుకుంటున్నాడేగాని టోర్నీ ప్రాధాన్యం కాద‌న్నాడు.  ఇలాంటి వాడు ఆ త‌ర్వాత కోచ్ అవ‌తారం ఎత్త‌డం జ‌ట్టుకు ఎంతో మేలే జ‌రిగింది. ఎందుకంటే ఆట‌లో ద్రావిడ్‌తో స‌మానుడు, ప్ర‌వ‌ర్త‌న‌లో, ఇత‌రు ల‌ను, ప‌రిస్థితుల‌ను ద్రావిడ్‌లా కూల్‌గా అర్ధంచేసుకుని ముంద‌డుగు వేయ‌గ‌ల స‌మ‌ర్ధుడు. అందుకే మిస్ట‌ర్ కూల్ ధోనీ కూడా వివిఎస్ మీద గౌర‌వాన్నే వ్య‌క్తం చేశాడు  అనేక ప‌ర్యాయాలు. చిత్ర‌మేమంటే, ఇపుడు మ‌ళ్లీ అత‌ని అవ‌స‌రం జ‌ట్టుకు ఎంతో కావ ల‌సి వ‌చ్చింది.  కోవిడ్ పాజిటివ్ పరీక్ష తర్వాత రాహుల్ ద్రవిడ్ కోలుకోలేకపోయినందున రాబోయే ఆసియా కప్ 2022 కోసం వివిఎస్‌ లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించామని, అతని టెస్ట్ ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన తర్వాతే ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని బిసిసిఐ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. యూఏఇ లో జరగబోయే ఆసియా కప్ 2022 కోసం భారత క్రికెట్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ప్రస్తుత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఏ) హెడ్, మాజీ బ్యాట్స్‌మెన్  లక్ష్మణ్ ను తీసుకున్నారు.  ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 కోసం లక్ష్మణ్ భారత ప్రధాన కోచ్‌గా అడుగు పెట్టాడు. అతని నేతృత్వంలోని మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించడంతో పాటు పలువురు యువ ఆటగాళ్లు తమ దైన ముద్ర వేయగలిగారు. భారత ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ ఆకట్టుకోవడానికి గల 3 కారణాలను ఇక్కడ చూద్దాం. లక్ష్మణ్ ఆటగాళ్ల కు నిర్దిష్ట పాత్రను, మైదానంలో తమను తాము వ్యక్తీకరించే స్వేచ్ఛను ఇచ్చినట్లు అనిపించింది. యువ ఆట గాళ్ళు తమకు తాము గా మంచి ఖాతాని అందించగలిగారు, ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జ‌ట్టుకీ  ఇది మంచి సూచన. ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో కుర్రాళ్లు మ‌రింత ప‌దునుగా త‌యార‌వుతార‌నే న‌మ్మ‌కం ఉంది. వాళ్ల‌కు వారి లోపాలు తెలియ‌జేయ‌డం, వాటిని అధిగ‌మించేందుకు వెన్నుద‌న్నుగా నిల‌వ‌డంలో మంచి సూచ‌న‌ల‌తో కుర్రాళ్ల‌ను ఉర‌క‌లు వేయించ‌డంలో దిట్ట‌గా లక్ష్మ‌ణ్‌ను  ప్లేయ‌ర్లు పేర్కొంటారు. టీమ్ ను ల‌క్ష్మ‌ణ్  నిర్వహించగలిగిన విధానం పట్ల బీసీసీఐ సంతోషి స్తుంది. అతను ఐర్లాండ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి  ప‌ని చేశాడు, ఇంగ్లాండ్‌పై రోహిత్ శర్మతో జతకట్టాడు. విదేశీ పరిస్థితుల్లో ఆ జట్టు ఆడే విధానంలో నిలకడ ఉంది. లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, అతను హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఐర్లాండ్‌కు వెళ్లే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు, ఇక్కడ జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా, రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్ జట్టు ఆడినందున అతను జట్టు తో పాటు ఉన్నాడు. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ గెలిచిన మొదటి టీ20 తర్వాత లక్ష్మణ్ ఇంగ్లాండ్‌ను విడిచి పెట్టాడు. ల‌క్ష్మ‌ణ్‌కు టీమ్ ప‌టిష్టంగా, ఎలాంటి విభేదాల‌కు అవ‌కాశం లేని విధంగా ముందుకు న‌డిపించ‌డంలో కెప్టెన్ అభిప్రాయానికీ అంతే గౌర‌వం ఇస్తూ, టీమ్‌లో చిన్న ప్లేయ‌ర్‌తో స‌హా అంద‌రి మాటా వింటూ త‌గిన స‌ల‌హాలిస్తూ వారిని స‌మ‌ష్టిగా విజ‌యం సాధించే దిశ‌గా ముంద‌డుగు వేయించ‌డం ల‌క్ష్మ‌ణ్‌కి బాగా ఎరుకే. అందుకే భార‌త్ క్రికెట్ అధికారులు జ‌ట్టుకు ద్రావిడ్ స్థానం భ‌ర్తీ చేయ‌గ‌లి గినవాడిగా ల‌క్ష్మ‌ణ్‌కు అవ‌కాశం ఇచ్చారు. 

ఆ అకాడమీలోంచి అందుకే వచ్చేసా..సింధు కామెంట్స్ వైరల్

బ్యాడ్మింటన్‌ చరిత్రలో పీవీ సింధు కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒలింపిక్స్‌ లో పతకాలు,  కామన్వెల్త్‌ లో గోల్డ్‌ సాధించి భేష్ అనిపించుకుంది. ప్రస్తుతానికి లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎన్నో కబుర్లు చెప్పింది సింధు. కొన్నిటికి క్లియర్ గా జవాబులు ఇచ్చింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటికి వచ్చేయడంపై ఒక క్లారిటీ ఇచ్చింది. గోపి సర్ అకాడమీలో చాలా ఏళ్ళు ఆడాను. ఐతే ఆ అకాడమీలో జరిగిన కొన్ని విషయాలు నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు..నాకు సెట్ కావనిపించి వచ్చేసాను. ఒలింపిక్స్ లో ఆడాలంటే కాన్సంట్రేషన్ చాలా అవసరం. ఇలాంటి విషయాలు ఆలోచిస్తే గేమ్ సరిగా ఆడలేను అనిపించింది. ఈ అకాడమీలో నేను ఎంతో మంది కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా" అని చెప్పింది సింధు. అలాగే తన లైఫ్ లో జరిగిన ఒక బాడ్ ఇన్సిడెంట్ కూడా చెప్పింది సింధు. “2015 లో కాలి నొప్పితోనే ఆరు నెలల పాటు గేమ్ ఆడాను. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేను ఒలింపిక్స్ లోకి వెళ్ళాలి . వెళ్లాలంటే నేను టాప్ - 16 లో ఉండాలి. కానీ అప్పటికి నేను టాప్ - 13  లో ఉన్నా. ఒలింపిక్స్ నా లక్ష్యం కాబట్టి నొప్పిని భరించి ముందుకెళ్లా. ఆడిన తొలి ఒలింపిక్స్ లోనే పతకం నెగ్గడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.” కష్టడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అప్పుడు అర్ధమయ్యింది అని చెప్పింది సింధు. అలాగే ఓనమాలు నేర్పింది ఎవరు అనే ప్రశ్నకు.. “మహబూబ్ అలీ నాకు బ్యాడ్మింటన్ లో ఓనమాలు నేర్పించారు. తర్వాత ఆరిఫ్, గోవర్థన్, గోపీగారి దగ్గర ట్రైన్ అయ్యాను. ప్రతి ఒక్క కోచ్ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుని నా గేమ్ ని ఇంకా మెరుగుపరుచుకున్నాను . ఇండోనేషియా, కొరియాకు చెందిన కోచ్ ల దగ్గర  కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఆపొనెంట్ కి నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తాను. మెడల్ గెలిచినప్పుడు  పోడియంపై నిల్చుని జాతీయ జెండాను చూస్తూ.. జాతీయ గీతం వింటున్నప్పుడు నాలో కలిగే ఆనందం  మాటల్లో చెప్పలేను. వేరే దేశంలో మన దేశపు జెండా ఎగరడం చాలా గొప్ప విషయం కదా" అంటూ ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పింది సింధు.

ఇకపై దాడులు చేస్తే.. వాళ్లింటి కెళ్లి కొడతాం.. చంద్రబాబు

దాడులకు ప్రతి దాడులు తప్పవని వైసీపీకి చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక చేశారు. పోలీసుల అండతో దాడులు చేస్తుంటూ చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ కు ఇంకే పని లేదని విమర్శించారు. పరిపాలన అంటే విపక్షాలపై దాడులు చేయడమేననుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్వరంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గతానికి భిన్నంగా ఆయన పరుష పదజాలంతో వైసీపీపై విరుచుకు పడ్డారు. ఆయన స్వరం పెంచారు. విమర్శల్లో వాడి పెంచారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల ఆరాచకత్వంపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేస్తారా అంటూ రెచ్చిపోయారు. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్వాంటిన్ వరకూ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో వైసీపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అన్న క్యాంటిన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఈ రోజు కుప్పం చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ హయాంలో వీధికో రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. పోలీసులు తిన్నగా వారి విధులు నిర్వర్తిస్తే ఈ రోజు కుప్పంలో అన్న క్యాంటిన్ ధ్వంసమయ్యేదా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ పక్కనే ఉన్నా నిర్భయంగా దాడి చేసి క్యాంటిన్ ను ధ్వంసం చేశారంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా అన్న అనుమానం వస్తోందని అన్నారు. కుప్పం నడిబొడ్డున ఇంత  జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. మా వాళ్లూ దాడులకు దిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ 60 వేల మంది పోలీసుల అండతో  రెచ్చిపోతోందనీ, అదే మాకు (తెలుగుదేశం)కు 60 లక్షల కార్యకర్తల సైన్యం ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు. అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేసిన వారిని పోలీసు స్టేషన్ కు కాకుండా వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లి దిగబెట్టి వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇకపై మాపై దాడులు చేస్తే వారి ఇళ్ల కెళ్లి కొట్టి వస్తామని హెచ్చరించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో పలు చోట్ల తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం ఏం చేసింది లేదని విమర్శించారు. దాడులు చేసి భయపెట్టి గెలవాలనుకుంటున్న వైసీపీ పన్నాగాలు పారవని హెచ్చరించారు. దాడులకు బయపడేది లేదన్నారు. వైసీపీపై, పోలీసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అలాగే వైసీపీ అరాచకాలపూ రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. వైసీపీ ఆగడాలపై జనం గళమెత్తాలని పిలుపునిచ్చారు. జనం మౌనంగా ఉంటే వైసీపీ రౌడీలు వారి ఇళ్లపైకి వస్తారని అన్నారు. తన తీరు ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇకపై ఒక లెక్కగా ఉండబోతోందని చంద్రబాబు అన్నారు. తన శైలికి భిన్నంగా ఇకపై కఠినంగా ఉండక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. తాను సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తే సిగ్గులేని ప్రభుత్వం బస్సులను నిలిపివేసింది. పాఠశాలలకు సెలవు ఇచ్చేసింది. ఏమిటి.. ఈ సర్కార్ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. వైసీపీ దాడులు, అరాచకాలపై ఇంకా తెలుగుదేశం కార్యకర్తలను కట్టడి చేయడం సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. వైసీపీ వాళ్లు కూల్చిసిన దగ్గరే అన్న క్యాంటిన్ లో బోజనం పెడుతున్నానని అన్నారు. అన్న క్యాంటిన్ ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు.  వైసీపీ శ్రేణులు కూల్చివేసిన అన్న క్యాంటిన్ ను అక్కడే ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన చంద్రబాబు అక్కడ నుంచి వెళ్లిన కొద్దివ్యవధిలోనే ఆ క్యాంటిన్ వద్దకే భోజనాలు చేయడానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు. పుంగనూరు నుంచి తమను బస్సుల్లో తీసుకు వచ్చి కనీస ఏర్పాట్లూ కూడా చేయలేదని కుప్పం వైసీపీ నేతలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్న వైసీపీ కార్యకర్తల బాధను చూసి తెలుగుదేశం శ్రేణులు వారికి అన్న క్యాంటిన్ లో భోజనాలు పెట్టారు. తాము కూల్చేసిన అన్న క్యాంటిన్ లోనే వైసీపీ కార్యకర్తలు భోజనాలు చేశారు.  

పాఠ‌శాల‌లు మూసేయాల్సిందేనా?  

టీచ‌ర్ కొడుతున్నాడ‌ని బ‌డి మానేయ‌డం,  ట్యూష‌న్లే మేల‌ని టీచ‌ర్ మానేయ‌డం.. ఈ కార‌ణా ల‌తోనే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఇప్ప‌టికే చాలా పాఠశా ల‌లు మూసివేత స్థితికి వ‌చ్చా య‌ని విద్యారంగ నిపుణులు విమ‌ ర్శిస్తున్నారు. అస‌లీ ప‌రిస్తితి ఎందుకు వ‌చ్చింది అనేది ఆలోచించి మంచి నిర్ణ‌యాలు తీసుకుని పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి చేసే వ్యూహాలు ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డం అన్న‌ది పోయింద‌నేదీ అనేక‌మంది విమ‌ర్శ‌కుల మాట‌. ఇది ఎంతో నిజ‌మ‌ని పిల్ల‌ల త‌ల్లిదండ్రులూ అంటున్నారు.  అస్సాంలో ఇటీ వ‌లి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఏకంగా 34 పాఠ‌శాల‌ల్లో ఏ ఒక్క విద్యార్ధీ ప్యాస్ కాలేదు. ఇది ఇక్క‌డి విద్యాబోధ‌న‌, పాఠ‌శాల‌ల ప‌రిస్థి తుల‌కు అద్దం ప‌డుతుంది. ఇలాంటి స్థితి ఎన్నాళ్లుగానో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేయ‌డం ఇపుడు వాటి మూసివేత‌కు ప్ర‌భుత్వాలే ఆదేశాలు జారీ చేయ‌డం విచార‌క‌రం.  త‌ర‌గ‌తి గ‌దులు స‌రిగా లేక‌పోవ‌డం, విద్యాబోధ‌న‌కు స‌ర‌యిన వాతావ‌ర‌ణం లేకపోవ‌డం, విద్యార్ధుల‌ను బ‌డికి తీసుకువ‌చ్చేట్టు చేయ‌డంలో అధికారులు, త‌ల్లిదండ్రులు విఫ‌లం కావ‌డం వంటి అనేకం  ఇప్ప‌టి ప‌లితాల‌కు కార‌ణాలు కావ‌చ్చు. ఉపాధ్యాయులు బ‌డికి దూరంగా ఉండ‌డం, రాక‌పోక‌లు, సాద‌క‌బాధ‌కాల్లో విద్యార్ధులు న‌ష్ట‌పోతున్నార‌నే అనాలి. దీనికి స‌ర‌యిన ప‌రిష్కారాలు ఆలోచించి అమ‌లు చేయాలి. అంతేగాని పాఠ‌శాల‌లు మూసివేయ‌డం స‌ర‌యిన నిర్ణ‌యం కాద‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. పాఠ‌శాల‌ల‌ను మెరుగుప‌ర్చ‌డం ఒక్క‌టే మ‌ళ్లీ విద్యార్ధుల‌కు చ‌దువు ప‌ట్ల‌, ఫ‌లితాల‌ప‌ట్ల దృష్టి మ‌ళ్లించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు. పాఠ‌శాల‌లు మూసివేయ‌డం విద్యార్ధుల‌ను, పిల్ల‌ల‌ను బ‌డికి మ‌రింత దూరం చేస్తుంద‌న్న‌ది ప్ర‌భుత్వాలు గ్ర‌హించాలన్నారు కేజ్రీవాల్‌.  విద్యార్ధుల సంఖ్య‌ను, ఉపాధ్యాయుల సంఖ్య‌ను పెంచ‌డానికి త‌గిన నిర్ణ‌యాలు తీసుకోవాలి. వారికి మెరుగైన అవ‌కాశాలు, ప‌రిస్థి తులు క‌ల్పించాలన్న‌ది విద్యాధికుల మాట‌.  ఏ ప్రాంతంలోన‌యినా విద్యార్ధుల‌కు, ఉపాధ్యాయుల‌కు మ‌ధ్య విభేదాలు, దూర భారాలు పెర‌గ‌కుండా ఉండాలి. చ‌దువు ప‌ట్ల ఆస‌క్తి విద్యార్ధుల్లో మ‌రింత పెంచేలా బోధ‌నా విధానం ఉండాల‌న్న‌ది విద్యా వేత్త‌లు అనాదిగా చెబుతున్నది.