రేవంత్ కేబినెట్ విస్తరణకు వేళాయె.. చాన్స్ దక్కేదెవరికి?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడి ముగిసీముగియగానే పాలనపై దృష్టి పెట్టారు. శనివారం ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా  రుణమాఫీకి నిధుల సమీకరణ విషయంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. తొలి నుంచీ కూడా లోక్ సభ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ చేపడతానని రేవంత్ చెబుతున్న సంగతి తెలిసిందే.  రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుని వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లలకు ప్రాతినిథ్యం లేదు.  ఈ నేపథ్యంలోనే  కేబినెట్ విస్తరణలో రేవంత్ ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.   కేబినెట్ విస్తరణపై కూడా  మంత్రవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.    బీసీ, ముదిరాజ్‌‌, మైనార్టీ వర్గాలకు  ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో  నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి ఇద్దరు  మంత్రులుండగా ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురు  ఉన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి అయితే  సీఎంతో పాటు మరొక మంత్రి ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి ఒక మినిస్టర్ ఉన్నారు.  ఒక సామాజికవర్గాల వారీగా చూస్తే రేవంత్ కేబినెట్ లో   ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉన్నారు.   మొత్తంగా కేబినెట్ భేటీలో మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రధానంగా వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా  ఇరు రాష్ట్రాల మధ్యా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న  అంశాలపైనా,   ఆగస్టు 15 లోగా చేయాల్సిన రుణమాఫీకి నిధుల సమీకరణపైనా కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.  అలాగే అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంపైనా,   ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపైనా కూడా కేబినెట్ చర్చిస్తుందని అంటున్నారు.   

ఓటుకు 5 వందలు పంచారు.. డిస్‌క్వాలిఫై చేయాలి!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతోపాటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఆంధ్రాలో హడావిడి అదిరిపోయే లెవల్లో జరిగింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా గొడవలు లేవు. రిగ్గింగులు లేవు. ఆంధ్రావాళ్ళు ఇంత ప్రశాంతంగా జరిగిన పోలింగ్‌ని చూసి కుళ్ళుకుంటున్నారు. ఆంధ్రాలో అయితే పోలింగ్‌ జరిగేటప్పుడు గొడవలు.. పోలింగ్ ముగిశాక గొడవలు.. చివరికి ఫలితాలు వచ్చాక కూడా గొడవలు జరిగే అవకాశం వుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెబుతున్నారు. ఆంధ్రా పరిస్థితి అలా వుంటే, అదేంటో తెలంగాణలో ఎప్పుడూ తిట్టుకునే కేసీఆర్, రేవంత్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా చప్పుడు లేకుండా వున్నారు. ఇదిలా వుంటే, మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు రఘునందనరావు పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఓటుకు 5 వందల రూపాయలు పంచారని, అయిదేసి వందల చొప్పున ఎన్వలప్ కవర్లలో పెట్టి గ్రామాలకు పంపిణీ చేశారని రఘునందనరావు ఆరోపించారు. ఓటుకు ఐదు వందలు పంచిన నేరం మీద ఎన్నికల కమిషన్ ఆయన్ని వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.  అవును, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓటుకు 5 వందలు పంచిన నేరం మీద వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలి. అరెస్టు కూడా చేయాలి. వీలైతే, ఎన్ని సెక్షన్లు కుదిరితే అన్ని సెక్షన్లతో కేసులు పెట్టి, జీవితాంతం జైల్లో వుండేలా చేయాలి. లేకపోతే ఏమిటండీ? ఓటుకు ముష్టి ఐదు వందలు ఇస్తారా? ఎంత దారుణం? ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు ఒక్కో ఓటుకు మూడు వేల దగ్గర మొదలుపెట్టి ఐదు వేల వరకు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే, తమకు రావు అనుకున్న ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి ఓటుకు పదివేలు కూడా ఇచ్చారని సమాచారం. వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఛార్జీలు కూడా ఇచ్చారు. ఇంత పవిత్రమైన, ఘనమైన, విలువైన ఓటుకు ముష్టి 5 వందలు ఇచ్చారంటే, ఇంతకంటే పెద్ద నేరం వుంటుందా? అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన పవిత్రమైన భారతదేశంలో ఓటును ఇంత అవమానిస్తారా? ఇంత తక్కువ చేస్తారా? రఘునందనరావు గారు ఎలాగూ లాయర్ కాబట్టి, ఈ నేరానికి బహిరంగ ఉరి వేసే అవకాశం ఏమైనా వుందా అనే విషయాన్ని పరిశీలించాలి.

బాబు లేఖతో ఆగిన ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు.  వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు. కానీ ఇంత కాలం ఆయన మాటలను పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. అధికారంలో ఉన్న జగన్ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ప్రజా తీర్పు ఏమిటన్నది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. అయితే అంత వరకూ ఆగక్కర్లేకుండానే ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిపోయింది. అలా తెలిసిపోవడానికి రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి పోలీసులు, ఎన్నికల సంఘం  పై చేస్తున్న ఆరోపణలే కారణం. అది కాకుండా.. ఆపద్ధర్మ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న తీరుపై చంద్రబాబు రాసిన ఒక్క లేఖ ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ కు బ్రేక్ వేయడం కూడా జగన్ అధికారానికి చెల్లుచీటీ పడిపోయిందనీ, ఎన్నికల ఫలితం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం ఖాయమని తేలిపోయిందనీ జనం అంటున్నారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ పేరుతో తన అక్రమ జీవోలు, విధానాలకు సంబంధించి సాక్ష్యాలను చెరిపివేయడానికి సమాయత్తమైంది. ఇందుకోసం శుక్రవారం నుంచి ఈ ఆఫీస్ ను మూసివేయాలని కూడా నిర్ణయించింది. అయితే చంద్రబాబు ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను నిలిపివేయాలని, కొద్ది వారాలలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో ఇప్పటికిప్పడు అంత అర్జంట్ గా అప్ గ్రడేష్ అవసరం ఏముందంటూ గవర్నర్ కు లేఖ రాశారు. ఈసీ జోక్యం చేసుకుని ఈ ఆఫీస్ అప్ గ్రడేషన్ ను తక్షణం నిలిపివేయాలని కోరారు. కీలక ఉత్తర్వులను మాయం చేయడం కోసమే ఈ అప్ గ్రడేష్ తంతు అని ఆరోపించారు. చంద్రబాబు ఫిర్యాదుపై ఈసీ తక్షణం స్పందించింది. ఈ అప్ గ్రడేష్ పేర ఈ ఆఫీస్ ను క్లోజ్ చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న పద్ధతిలోనే ఈ ఆఫీస్ నడవాలని ఆదేశించింది..  ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు ఎవరూ ఈ అప్ గ్రడేష్ వంటి  నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఏపీలో  గత ఐదేళ్లుగా రహస్య పాలన జరిగింది. ఏ జీవోల్లో ఏముందో ఎవరికీ తెలియదు. జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసినా పట్టించుకోలేదు.  జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి  ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీస్‌లో ఉంటాయి. ఇప్పుడు జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాదన్న భయంతో  ఈ ఆఫీస్ ను సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో మూసేసి తమ తప్పులు, అక్రమాలను చెరిపేద్దామన్న ప్రయత్నానికి చంద్రబాబు ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది. 

వైసీపీ నేతలు సైలెంట్ గా సర్దేసుకుంటున్నారా?

విషయాన్ని డైవర్ట్ చేసి తాము అనుకున్నది సైలెంట్ గా చేసుకుని పబ్బం గడిపేయడంలో వైసీపీ నేతలు డాక్టరేట్ సాధించారని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ వారు ఒకటి చేయాలనుకుంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. అదే సమయంలో తాము చక్కబెట్టదలచుకున్న కార్యాన్ని సెలెంట్ గా చక్కబెట్టేస్తారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఇదే జరిగింది. ఆ ట్రాప్ లో విపక్షం కూడా పడిపోయింది.  ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా వైసీపీ అలాగే చేస్తోంది. అధికారం కోల్పోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు నెమ్మదిగా రాష్ట్రం వదిలి వెళ్లిపోవడానికి ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే ఆ విషయం ఎవరూ గమనించకుండా ఉండేందుకు విజయంపై ధీమా ఒలకబోస్తూ, రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తూ విపక్ష కూటమి నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే  సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి నేతలు మీడియా ముందుకు వచ్చి ముఖంలో ఇసుమంతైనా ధీమా లేకపోయినా గెలుపు తధ్యమని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వారిలా మీడియా ముందుకు వచ్చి విజయంపై ప్రకటనలు గుప్పించడం వెనుక అసలు కారణం మరోటి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జూన్ 4న కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడేనాటికి పార్టీలోని కీలక నేతలంతా మూటాముల్లె సర్దుకుని రాష్ట్రం దాటేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అది జనం దృష్టికి, ముఖ్యంగా విపక్ష కూటమి నేతల దృష్టికీ వెళ్లకుండా రాష్ట్రంలో హింసాకాండను ప్రేరేపించడం, తెలుగుదేశం కూటమిపై విమర్శలు, అల్లర్లకు వారే కారణమంటూ నిందలు, చివరాఖరుగా ఎన్నికల సంఘంపై ఆరోపణలు. దీంతో విపక్ష నేతలంతా వైసీపీ ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఇవ్వడంపై పెడుతున్న శ్రద్ధ తెరవేనుక వైసీపీ నేతలు ఏం చేస్తున్నారన్నది గమనించడంపై పెట్టడం లేదు. దీంతో సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ కీలక నేతలంతా మూటాముల్లె సర్దేసుకుంటున్నారు.  అలా సర్దేసుకుంటున్నవారిలో ప్రథముడు సజ్జల అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే సజ్జల కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ఎవరికీ కనిపించడం లేదు. ఎక్కడా వినిపించడం లేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసేశారు. ఎవరూ కార్యాలయానికి రానవసరం లేదని చెప్పేశారు. నెల రోజుల పాటు సెలవులు ఇచ్చామని, పూర్తిగా తీసేశామని చెబుతూ వైసీపీ సోషల్ మీడాయా వర్కర్లలో కన్ష్యూజన్ క్రికేట్ చేశారు.  నిజంగా సజ్జల మీడియా ముందుకు వచ్చి చెబుతున్నట్లుగా విజయంపై అంత నమ్మకం ఉంటే వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం పడదు.  ఆ సోషల్ మీడియా వింగ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లరు.  ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా, సజ్జల భార్గవ్‌పై ఈసీ ఆదేశాల మేరకు కేసు కూడా బుక్కౌంది.   ఒక్క సజ్జల అనే కాదు.. ఆ పార్టీ కీలక నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పిన్నెల్లి సోదరులైతే.. హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని, గన్ మెన్ లను సైతం వదిలేసి పరారైపోయారు.  ఇప్పుడు వైసీపీ కీలక నేతల దృష్టంతా తమ ఆస్తులు, వ్యాపారాలు సేఫ్ జోన్‌కు ఎలా పంపించుకోవాలన్నదానిపైనే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల అధికారంలో ఉండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కూడబెట్టిన అక్రమాస్తుల రక్షణపైనే వైసీపీ నేతల దృష్టి ఉందని అంటున్నారు.  పెద్దిరెడ్డి వైసీపీలో క్యాష్ కింగ్‌గా పేరున్న పెద్దిరెడ్డి సైలెంట్ అయిపోయారు. అందుకు ఉదాహరణగా పెద్ది రెడ్డి అనుచరులు, అనుయాయులు అయిన పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను రాబట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఉదాహరణగా చూపుతున్నారు.   మొత్తంగా ఓట్ల లెక్కింపు వరకూ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారకుండా ఉండేలా కార్యకర్తలను, క్యాడర్ ను రెచ్చగొడుతున్నారనీ, తద్వారా  విపక్ష కూటమి నేతల దృష్టిని డైవర్ట్ చేసి, పోలీసుల దృష్టి మొత్తం హింసను అరికట్టడంపై కేంద్రీకృతమయ్యేలా చేసి.. తాము రాష్ట్రం దాటేసే యత్నాలలో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఆంధ్రాలో అల్లర్లపై ‘సిట్’ - వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం!!

ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు. ‘సిట్’ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి (శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు (ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి (తిరుపతి), వి.భూషణం (గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్), వెంకటరావు (విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్), రామకృష్ణ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్), జి.ఎల్.శ్రీనివాస్ (ఏసీబీ ఇన్‌స్పెక్టర్), మోయిన్ (ఒంగోలు పీటీసీ), ప్రభాకర్ (అనంతపురం ఏసీబీ), శివప్రసాద్(ఏసీబీ ఇన్‌స్పెక్టర్) వున్నారు. ఈ ‘సిట్’ రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనుంది. 

అట్లుంటది రేవంత్‌రెడ్డితోని!!

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. కవిత జైలు నుంచి విడుదల అవ్వకపోయినా పర్లేదుగానీ, ఏపీలో చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాకూడదని తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిపోవడంతో, ఈ బ్యాచ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీలో  చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. చంద్రబాబు గురువు, రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి, గురువుకు అనుకూలంగా శిష్యుడు వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నాడని అరచి గోలచేసి, తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.  ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడంటే తనకు ఎంతో గౌరవం వుందే తప్ప, రాజకీయంగా ఆయనకీ తనకి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చెబుతున్నారు. ఈ మధ్య రేవంత్ మీడియా వాళ్ళని కలసినప్పుడు ఓ నోటి తుత్తరగాడు ఇలా అడిగాడు.. తెలంగాణలో పోటీ పెట్టకుండా గురువు సహకరించారు.. ఇప్పుడు అక్కడ గురువు పోటీ చేస్తున్నారు. శిష్యుడు సహకరిస్తారా? అని అడిగాడు. దాంతో రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం లాగా సీరియస్సయిపోయి వార్నింగ్ ఇస్తూ, ‘‘ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేవాడు.. శిష్యుడెవరు, గురువెవరు? నేను సహచరుడిని అని చెప్తున్నాను. ఎవడైనా బుద్ధిలేని గాడిద కొడుకు శిష్యుడు, గురువు అని మాట్లాడితే బుడ్డిమీద పెట్టి తంతా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన సహచరుడిని నేను. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళాను. నేను ఆయనకు సహచరుణ్ణి.  వారంటే అపారమైన గౌరవం వుంది ఇప్పటికి కూడా చెప్తున్నా.. అంతే తప్ప గురువు, శిష్యుడు అంటే ఊరుకునేది లేదు. నేను తెలంగాణ వాణ్ణి, కాంగ్రెస్ పార్టీ వాడిని. తెలంగాణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను’’ అని స్పష్టంగా చెప్పారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ఏపీకి, తెలంగాణకి ఉమ్మడి రాజధాని కాదు కాబట్టి, ప్రస్తుతం హైదరాబాద్‌లో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో వున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కుదరాల్సిన పంపకాల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు మీద గౌరవం గౌరవమే, తెలంగాణ ప్రయోజనాలు ప్రయోజనాలే అన్నట్టుగా వ్యవహరించి, కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా కంట్రోల్ చేయాలన్న వ్యూహంలో రేవంత్ వున్నారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు సుప్రీంలో ఊరట 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.  తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పిటిషన్ విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022లో విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. దీనిపై రాజేశ్వర్ రెడ్డి అప్పుడే హైకోర్టుకు వెళ్లారు. తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, కాబట్టి విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో విఠల్‌కు ఊరట లభించింది.  

వైసీపీ ఓట్లకు కాంగ్రెస్ గండి... శ్రీకాకుళం ఎంపీగా కింజారపు విజయం నల్లేరు మీద బండి నడకే!

శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది.  దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి వీచిన సమయంలో కూడా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్ సభ స్థానంతో పాటు.. టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. ఇదే నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న విశ్వాసాన్ని కింజారపు వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ సారి ఎలాగైనా కింజారపును ఓడించాలన్న లక్ష్యంతో జగన్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కలింగ సమాజిక వర్గానికి చెందిన పెరడ తిలక్ ను శ్రీకాకుళం నుంచి వైపీపీ అభ్యర్థిగా పోటీలో దించారు. ఈ పేరాడ తిలక్ గత ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి జగన్ ఆయనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే  ఇక్కడ నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గానికే చెందిన పేరాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సమాజికవర్గ ఓట్లు భారీగా చీలిపోచే అవకాశాలున్నాయి. అలాగే వైసీపీ నుంచి  శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి   కిల్లి కృపారాణి సీటు దక్కక పోవడంతో  సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  దీంతో ఆమె టెక్కలిలో వైసీపీ ఓట్లకు బారీగా గండి కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలాగే ఇంత కాలం వైసీపీకి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా వైసీపీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోందనీ, దీంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజవర్గంలో వార్ వన్ సైడ్ గా కింజారపు రామ్మోహన్ నాయడికి సానుకూలంగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.   అంతే కాకుండా పలువురు వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  మొత్తం మీద వైసీపీ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  

పిన్నెల్లి బ్రదర్స్ అదృశ్యం 

మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.  ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది.తాజాగా, అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మన్లను కూడా వదిలేసిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్ మన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 

ఆంధ్రా నీరో జగన్!!

రోమ్ నగరం తగలబడి పోతుంటే అప్పటి రోమన్ కింగ్ నీరో (nero) ఏం చేశాడో ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. రోమ్ తగలబడిపోతే తగలబడిపోనీ నాకేంటి అనుకుంటూ, చక్కగా తన రాజమందిరంలో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ వింత చర్య గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకు నీరో రేంజ్‌లో మన సమాజానికి దక్కిన మరో పాలకుడు వై.ఎస్.జగన్! పోలింగ్‌ సందర్భంగా, పోలింగ్ తర్వాత వైసీపీ గూండా మూకలు భారీ స్థాయిలో దాడులు చేసి వందల మందిని గాయపరిచాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని హత్య చేయడానికి ప్రయత్నించాయి. తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం సానుభూతిపరుల మీద, తెలుగుదేశానికి ఓటు వేశామని చెప్పినవాళ్ళ మీద దాడులు చేసి రక్తాన్ని పారించారు. ఎన్నికల ఫలితాలు వెలువడేలోపు, ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలో రక్తపాతం ఇంకా జరిగే ప్రమాదం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా జగన్ ఎంతమాత్రం స్పందించలేదు. దారుణాలు ఆపే ప్రయత్నాలు చేయలేదు. తీవ్రంగా గాయపడిన అనేకమందిని పరామర్శించే సంగతి అటుంచి, కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. ఇలాంటి అల్లర్లను ఆపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయలేదు.. ఎంచక్కా తనంతట తాను విహారయాత్రలు చేయడానికి విదేశాలకు చెక్కేస్తున్నారు. ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.

భారత ఆసియా దేశాల వారధిగా బౌద్ద పర్యాటకం

ఎబిటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు  మల్లేపల్లి లక్ష్మయ్య పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు  ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని  మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం (మే 17) భూటాన్ లోని థింపూలో జరిగిన బంగ్లాదేశ్ భూటాన్ లోనిథింపూలో జరిగిన బంగ్లాదేశ్, భూటాన్ , ఇండియా, నేపాల్ , మయన్మార్(బిబిఐఎన్ఎమ్) దేశాల పర్యాటక సమాఖ్య, అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్ట్ టూర్ ఆపరేటర్స్ (ఏబీటీవో) సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియా రహదారిపై బౌద్ద పర్యాటకం’ అన్న సదస్సుకు ఆయన ఏబీటీవో అంతర్జాతీయ ఉపాధ్యక్ష హోదాలో  ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.  తెలంగాణలోని ప్రముఖ బౌద్ద పర్యాటక స్థలాలతో పాటు  బుద్ద వనాన్ని  ఆసియాదేశాలకు పరిచయం  చేసి, అధిక సంఖ్యలో బౌద్ద పర్యాటకులను తెలంగాణకు రప్పించటానికి ఏబీటీవో ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసిందని సంబంధిత దేశ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించిందని అన్నారు.  ఏబీటీవో ప్రదానకార్యదర్శి డాక్టర్ కాలేష్ కుమార్ సదస్సు ఉద్దేశాలను  వివరిస్తూ  ఆసియా హైవే 2025 చివరకు అందుబాటులోకి వస్తుందన్నారు.  స్థానిక ఏబీటీవో అధికార ప్రతినిధులు పరశురాం, మణి, ట్రావెల్ ఏజెంట్లు , టూర్ ఆపరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో మల్లే పల్లి లక్మయ్య, త్వరలో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి  భూటాన్ వరకు అంతర్జాతీయ హపీనెస్ యాత్ర( ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ మార్చ్ )  నిర్వహించటానికి భూటాన్ బౌద్ద సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. 

హైదరాబాద్‌లో కాసేపట్లో మళ్లీ వర్షం

నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది.  హైదరాబాద్‌లో సాయంత్రం ఆరు గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు. . గత కొన్ని గంటలుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు గడిచిన గంట సేపట్లో 70కి పైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు

వివేకా హత్యపై కడప కోర్టు ఆర్డర్ పై సుప్రీం స్టే

వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కడప కోర్టు ప్రస్తావించిన విపక్షాల నేతలలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి,  జనసేన అధినేత పవన్ కల్యాణ్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి తదితరులు ఉన్నారు. వీరెవరూ కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వివేకా హత్య కేసు గురించి మాట్లాడకూడదంటూ కడప కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే కడప కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కడప కోర్టు ఉత్తర్వ్యులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.   సుప్రీం కోర్టు కడప కోర్టు ఉత్తర్వ్యులపై స్టే విధించింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ షర్మిల పిటిషన్ ను విచారించి కడప కోర్టు ఉత్తర్వ్యులపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కడప కోర్టు న్యాయమూర్తి కనీసం డిఫెండెంట్ల వాదనను కూడా వినకుండా తీర్పు వెలువరించిందని పేర్కొంది. కడప కోర్టు మేజిస్ట్రేట్ తీర్పు భావప్రకటనా స్వేచ్ఛను హరించేదిగా ఉందని వ్యాఖ్యానించింది. డిఫెండెంట్ల వాదన వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం,  కేసు విచారణను వాయిదా వేయడాన్ని తప్పుపట్టింది.  

సీపీఆర్‌తో నడిరోడ్డుపై ప్రాణాలు కాపాడిన లేడీ డాక్టర్!

మీ ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ వుంటారు. ఇంతలో ఒక ఫ్యామిలీ మెంబర్ అచేతనంగా పడిపోతారు. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు.. అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఆఫీసులో వుంటారు.. మీ కొలీగ్ ఒకరు ఉన్నట్టుండి స్పృహ కోల్పోతారు అప్పుడు మీరేం చేస్తారు? వేరే ఎవరో కాదు.. మీరే అనుకోండి.. ఉన్నట్టుండి దబ్బుమని కింద పడిపోతారు.. అప్పుడు మీ ఇంట్లోవారు గానీ, ఆఫీసులో వాళ్ళు గానీ ఏం చేయాలి? మీ ప్రాణాలు పోకుండా ఎలా కాపాడాలి? ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు పోసే సంజీవని సీపీఆర్ (Cardio pulmonary resuscitation - CPR). కార్డియో పల్మోనరీ రీససిటేషన్‌ని షార్ట్ కట్‌లో సీపీఆర్ అని పిలుస్తారు. ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినా, కార్డియాక్ అరెస్టు అయినా, ఏదైనా గొంతుకు అడ్డం పడినా, కరెంట్ షాక్‌కి గురై అచేతనంగా పడిపోయినా, నీటిలో మునిగిపోయినా, ఊపిరి అందకపోయినా, డ్రగ్స్ ఓవర్ డోస్ అయినా... ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ చేయడం వల్ల అచేతనంగా పడిపోయిన వ్యక్తులు మళ్ళీ ప్రాణాలతో బతికి బయటపడతారు. శ్వాస ఆడేలా చేయడం, ఆగిపోయిన గుండెను మళ్ళీ కొట్టుకునేలా చేయడం సీపీఆర్ ద్వారా జరిగి జీవితాలు నిలబడతాయి. సీపీఆర్ వల్ల ప్రాణాలు నిలబడతాయని తెలిసినా చాలామంది సీపీఆర్ చేయడం నేర్చుకోరు. జనానికి సీపీఆర్ మీద అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ఏటా ఎంతోమంది చనిపోతున్నారు. ఎవరైనా అచేతనంగా పడిపోతే చుట్టూ వున్నవారు హడావిడి పడిపోవడమో, అంబులెన్స్.ని పిలవటమో, ఆస్పత్రికి తరలించడమే చేస్తారు తప్ప సీపీఆర్ చేయాలన్న ఆలోచన చాలామందికి రావడం లేదు. దాని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి. విజయవాడలోని అయ్యప్ప నగర్ ప్రాంతంలో సాయి అనే ఆరేళ్ళ బాలుడికి కరెంట్ షాక్ కొట్టింది. దాంతో ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు సాయిని తీసుకుని డాక్టర్ దగ్గరకి వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్న వీళ్ళని డాక్టర్ రవళి చూశారు. వాళ్ళని ఆపారు. ఆ బాలుడికి అక్కడే సీపీఆర్ చేశారు. దాంతో సాయి ప్రాణాలు దక్కించుకున్నారు. సమయానికి అక్కడకి వచ్చి, సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ రవళికి అందరూ ధన్యవాదాలు తెలిపారు. అందుకే అందరూ సీపీఆర్ నేర్చుకోవాలి. ఆపదలో వున్నవారినిని కాపాడాలి.

ఎన్నికలవ్వగానే వీసారెడ్డి మాయం.. విషయమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు  జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది. అయితే  అధికార వైసీపీకి చెందిన కీలక నేతలు పోలింగ్ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, రోజా వంటి వారైతే ఒక వైపు పోలింగ్ జరుగుతుండగానే.. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ మీడియా ముందుకు రావడం వంటివి చూస్తుంటే ఆ పార్టీ ఫలితాలకు ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, అనీల్ కుమార్ యాదవ్, ఆళ్లనాని వంటి కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్యాడర్ కు చేసిన సూచనలను బట్టి వైసీపీ సీన్ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ఐప్యాక్ కు వీడ్కోలు పలుకుతూ చేసిన ప్రసంగంలో విజయంపై వ్యక్తం చేసిన ధీమా అతి విశ్వాసాన్ని మించి ఉండి ఓటమినే ధ్వనించింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నేత ఇలా పోలింగ్ అయ్యిందో లేదో అలా అజ్ణానంలోకి వెళ్లిపోయిన విషయంపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయిన దానికీ కాని దానికీ మీడియాముందుకు వచ్చో, లేదా సామాజిక మాధ్యమ వేదికల ద్వారానో ఆత్మస్థుతి, పరనిందలలో చెలరేగిపోయే ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి మే 13 తరువాత నుంచీ బయట ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఈ నాలుగు రోజులలో ఆయన సోషల్ మీడియాలో నెల్లూరులో తనకు ప్రచారంలో సహకరించిన  క్యాడర్ కు నేతలకు కృతజ్ణతలు తెలపడం మినహా.. పోలింగ్ సరళి గురించి కానీ, రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై కానీ స్పందించిన దాఖలాలు లేవు. విజయసాయిరెడ్డి ఈ సారి తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడ్డారు. ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ అధినేత మాత్రం ఆయనను విశాఖ నుంచి కాకుండా నెల్లూరు నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దింపారు. మూడేళ్ల పాటు విశాఖలో అన్నీ తానై వ్యవహరించిన విజయసాయిని అత్యంత అవమానకరంగా విశాఖ నుంచి పక్కకు తప్పించి అక్కడి బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించిన సంగతి తెలసిందే. నెల్లూరు ఎంపీ టికెట్ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే విజయసాయికి ఇచ్చారు జగన్ నెల్లూరులో వైసీపీ కీలక నేత వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరి, ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో జగన్ కు వేరే దారి లేక విజయసాయిని నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దింపారు. వాస్తవానికి విజయసాయిరెడ్డికి నెల్లూరు నుంచి పోటీ చేయడం సుతరామూ ఇష్టం లేదు. నెల్లూరు ఆయన స్వస్థలమే అయినా అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలు, నియోజకవర్గం కోసం ఆయన చేసిన పనీ రెండూ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఎదురీదిన విజయసాయికి ప్రచారం సమయంలోనే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తన ప్రచారం కోసం సమీకరించిన జనాలు వచ్చిన వారు వచ్చినట్లే వెనక్కు పోతుండటంతో మైకుల్లోనే వారిని వెళ్లిపోవద్దంటూ బతిమలాడుకుంటున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అది పక్కన పెడితే పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా విజయసాయిరెడ్డి మౌనముద్ర దాల్చడమే కాదు, ఎవరికీ అందుబాటులోకి కూడా రాలేదు. ఓ వైపు వైసీపీ కీలక నేతలు విజయంపై  ధీమా వ్యక్తం చేస్తూనో, పోలింగ్ తీరు పట్ల అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూనో మీడియా ముందుకు వస్తుంటే.. పార్టీకి మౌత్ పీస్ అన్నట్లుగా ఇంత కాలం వెలిగిపోయిన విజయసాయి రెడ్డి మౌనం, బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక నెల్లూరులో ఆయన ప్రచారం అంతా దాదాపు చేతులెత్తేసినట్లుగానే సాగింది. ముఖ్యంగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం గూటికి చేరిన తరువాత నియోజకవర్గంలో పోరు ఏకపక్షమైపోయింది. సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గంలో వైసీపీ బాగా బలహీనపడింది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని విజయసాయి రెడ్డి అజ్ణాతవాసానికి ఫలితం వెలువడడానికి ముందే ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తీహార్ జైల్లో కవితను పరామర్శించిన ఆర్ఎస్ , బాల్క

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు. కవిత అన్న కెటీఆర్, బావ హరీష్ రావు తప్పితే బిఆర్ఎస్ అగ్రనేతలు కూడా కలవడం లేదు. కన్న కూతురు జైల్లో ఉన్నప్పటికీ తండ్రి కెసీఆర్ ఇంత వరకు పరామర్శించకపోవడం గమనార్హం. అయితే ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నాగర్‌ కర్నూలు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆమెను పరామర్శించారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెతో ములాఖత్‌ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీ తయారీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఈడీ మార్చి 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ లోనే ఉన్నారు. ఇదే కేసులో సీబీఐ సైతం ఆమెను సాంకేతికంగా అరెస్టు చేసినట్లు చూపింది. మరోవైపు బెయిల్‌ కోసం కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ ట్రయల్ కోర్టు కొట్టేసింది. బెయిల్ పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ, సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది.

వైసీపీ అభ్యర్థి మహా మంచి పొరపాటు!

ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అంటూ వుంటారు. ఈ తరహాలోనే ఒక్కోసారి ‘పొరపాటు కూడా మంచిదే’ అనొచ్చు. అలాంటి మంచి పొరపాట్లు అరుదుగా జరుగుతాయి. లేటెస్టుగా అలాంటి మంచి పొరపాటు చేసే అవకాశం కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డికి వచ్చింది. ఎన్నికల సందర్భంగా హోరాహోరీగా ప్రచారం చేసిన ఆయన, పోలింగ్ రోజున తన ఓటు వేయడానికి వెళ్ళారు. ఓటు వేయడానికి వెళ్ళిన ఆయన చక్కగా ఓటేసి రావచ్చు కదా.. ఈయన అలా చేయకుండా పోలింగ్ బూత్‌ దగ్గర వున్న పోలింగ్ సిబ్బందికి బిల్డప్‌గా అభివాదం చేశారు. ఆ అభివాదాల గోలలో పడి,  ఈవీఎం మీద వున్న ఫ్యాన్ గుర్తు ముందువున్న బటన్ నొక్కకుండా, సైకిల్ గుర్తు ముందు వున్న బటన్ నొక్కేశారు. దాంతో ఈయన గారి ఓటు వైసీపీ ఎంపీ అభ్యర్థికి పడకుండా నెల్లూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి పడింది. బటన్ నొక్కిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన వెంటనే పోలింగ్ సిబ్బందికి ఏం జరిగిందో చెప్పారు. అప్పుడు పోలింగ్ సిబ్బంది ఇక చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టి, ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిని బబ్బోమని చెప్పారు. ఇలాంటి పొరపాటు చేశానేంట్రా దేవుడా అనుకుంటూ ప్రతాప్ రెడ్డి పోలింగ్ స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, ప్రతాప్ రెడ్డి పొరపాటు చేసినప్పటికీ, టీడీపీకి ఓటు వేయడం మంచి పనేగా?