కాంగ్రెసోళ్లు డిసైడైపోయారు

  చూడబోతే కాంగ్రెస్ పార్టీ వాళ్లు పూర్తిగా డిసైడైపోయినట్లే కనిపిస్తోంది. ఏమిటంటారా.. అదే సీమాంధ్ర ప్రాంతంలో తమకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా అక్కర్లేదని, కనీసం డిపాజిట్లు కూడా దక్కాల్సిన అవసరం ఏమాత్రం లేదని, అంతేకాదు.. మరో దశాబ్ద కాలం పాటు అక్కడ పార్టీని కిలోమీటర్ల లోతున పాతేసుకోడానికి కూడా తమకు అభ్యంతరం లేదని వాళ్లు డిసైడైపోయినట్లే కనిపిస్తోంది. కేంద్రమంత్రి, తెలంగాణాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జీవోఎంలో కీలక సభ్యుడు, మన రాష్ట్రం కోటా నుంచి రాజ్యసభకు పదేపదే ఎంపికవుతూ వస్తున్న జైరాం రమేష్ మాటలు చూస్తుంటే అచ్చం అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే, సీమాంధ్రులను అత్యంత నీచాతి నీచంగా చిత్రీకరిస్తూ.. అదికూడా సొంత పార్టీ కార్యకర్తల ముందు, నాయకులు, కేంద్రమంత్రుల ముందు కూడా మాట్లాడటానికి సైతం ఆయన వెనకాడటం లేదు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి అడుగడుగునా తనకు ఎదురవుతున్న నిరసనలు చూసి తట్టుకోలేకపోయినట్లున్నారు.   సీమాంధ్రులను ఇలాగే వదిలేస్తే, చార్మినార్ లోని రెండు మీనార్లు కూడా కావాలంటారని ఆయన అన్నారు. రోజూ ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలంటూ అష్టోత్తరం, సహస్రం చదివేవారని ఎద్దేవా చేశారు. మరోవైపు టీఆర్ఎస్ తమలో విలీనం కాకపోయినా పర్వాలేదు.. కనీసం పొత్తయినా ఉంటే చాలు, ఎంతో కొంత మేర తెలంగాణా ప్రాంతంలో బతికి బట్టకడదామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర పెద్దలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

దటీజ్ కేసీఆర్

  మొత్తానికి కేసీఆర్ అనుకున్నంతా చేశారు. జీవితకాల లక్ష్యాన్ని పదిహేనేళ్లలోనే సాధించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పొగిడించుకుని, ఆయన వద్ద నాలుగు కన్నీటి చుక్కలు రాల్చి, పాదాభివందంనం చేసి.. తిరిగొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నానా గడ్డీ కరిపిస్తున్నారు. తెలంగాణ ఇస్తే చాలు, సోనియా గాంధీ కాల్మొక్కుతా, ఆమె ఇంట జాడు (చీపురుకట్ట)తో తుడుస్తా అని ముందు కావల్సినంత కాలం చెప్పి, ఇప్పుడు విలీనం లేదు, గాడిదగుడ్డు లేదు పొమ్మన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏమీ చేయలేక రకరకాల పిల్లిమొగ్గలు వేస్తోంది. దానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ మాటలే నిదర్శనం. తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తానని కేసీఆరే అన్నారని.. ఇప్పుడు విలీనం చేయకపోయినా తాము చేసేది ఏమీ లేదని చెప్పారు. అయితే దింపుడు కల్లం ఆశలాగ, పొత్తుల కోసం కె.కేశవరావు నేతృత్వంలో ఆయనో కమిటీ వేశారని, వాళ్లు తీసుకునే నిర్ణయం యూపీఏకు అనుకూలంగానే ఉండొచ్చని దిగ్విజయ్ చెప్పారు. తాము ఎన్నికల తర్వాత యూపీఏ కూటమిలోనే ఉంటామని కేసీఆర్ మాట ఇచ్చినట్లు కూడా ఇప్పుడు చెప్పుకొంటున్నారు. ఇంతకు ముందు ఇచ్చిన విలీనం మాట ఏమైపోయిందో చెప్పలేడు గానీ, ఎన్నికల తర్వాత పొత్తుల గురించి దిగ్విజయ్ మాట్లాడుతుంటే చూసేవాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు.   రాష్ట్ర స్థాయిలో ఒకసారి కాంగ్రెస్ పార్టీతోను, మరోసారి తెలుగుదేశం పార్టీతోను పొత్తులు పెట్టుకుని.. ఇంకా ఫలితాలు వెలువడక ముందే ఢిల్లీ వెళ్లి కమలనాథులతో కూడా మంతనాలు సాగించిన చరిత్ర కేసీఆర్ సొంతమన్న విషయం బహుశా దిగ్విజయ్ సింగ్ మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే, ఆయనకు పెద్దవయసు వచ్చింది కాబట్టి మతిమరుపు ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే ఇంకా కేసీఆర్ మాటలు పట్టుకుని వేలాడుతున్నారు. దటీజ్ కేసీఆర్..

TRS Gulab Gang ready for April 30th

        It’s now official- the Election Commission has released the poll schedule and the Election Code of Conduct is effective from today! We have the state of Andhra Pradesh going to the polls for the last time in History as a unified Andhra only to be divided after June 2nd when it becomes Telangana and Andhra. Does it matter if it’s Seemandhra or Andhra, anyways it is the rest of Andhra. So on the 30th of April 2014 the region of Telangana  goes to vote and on May 7th 2014  Seemaandhra goes to vote. This has set the ball rolling for a historic battle between all parties who are going to fight it out for a share of this divided state. Potti Sreeramulu’s fast and ultimately his death for Andhra have gone wasted, but we have the new Telangana Gandhi who managed to survive the fast unto death at the Nizam hospital  in Hyderabad in 2009  and unleashed the whole pandemonium which led to the state bifurcation. He now wants the City of Hyderabad to be the next Pink City apparently ! Move over Jaipur. And we saw that happen when the city of Hyderabad turned pink literally with the TRS party flags and flexi banners used for welcoming him after his Delhi sojourn. Now did anyone miss him at the parliament along with his sulking partner TRS MP Vijayasanthi not speaking a word when the bill was tabled, discussed or passed? Maybe we missed all of that in the great black- out and with Ramulamma finally ditching him for the Congress which according to her is the real reason why the T Bill was passed. With Election schedule out we need to see what strategy TRS KCR and his Gulab Gang intend to do to win the 119 Assembly seats and 17 Parliamentary Seats in the T region. Calling off the alliance with Congress  because the UPA government has not acceded to a single point suggested by TRS in the T Bill, they have set up a 5-member committee headed by party Rajya Sabha member K Keshava Rao to decide on forging alliances for the coming elections. The committee also includes Nayani Narasimha Reddy, Etela Rajender, Kadiam Srihari and B Vinod. So we need to wait and see what their next move will be.

తెరాసపై ఇంకా ఆశ చావని కాంగ్రెస్

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ హస్తం పార్టీలో గులాబీ ముళ్ళు గుచ్చి మరీ తెగతెంపులు చేసుకొంతున్నట్లు ప్రకటించినా, ఇంకా కాంగ్రెస్ పార్టీకి తెరాసపై ఆశ చావలేదని దిగ్విజయ్ సింగ్ తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది. “తెరాసను మా పార్టీలో విలీనం చేయడం, చేయకపోవడం వారిష్టం. తెరాస ఎన్నికల పొత్తులకు ప్రత్యేకంగా కమిటీ వేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెరాస పొత్తులకు సిద్దమన్నట్లు సూచింది గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు-సీట్లు సర్దుబాట్ల కోసం మేము ప్రతేకంగా ఒక కమిటీ వేస్తున్నాము,” అని అన్నారు.   ఒకవైపు టీ-కాంగ్రెస్ నేతలందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తూ తెలంగాణాలో అన్ని సీట్లు తామే గెలిచేసుకొంటామని గొప్పలు చెప్పుకొంటుంటే, దిగ్విజయ్ సింగ్, ప్రస్తుతం తెలంగాణాలో పర్యటిస్తున్న జైరాం రమేష్ ఇద్దరూ కూడా తెరాస తమతో కనీసం పొత్తులకయినా అంగీకరించకపోదా? అనే ఆశతో మాట్లాడటం ఆ పార్టీ దైన్య స్థితికి అద్దం పడుతోంది. 125సం.ల ఘన చరిత్ర గల ఒక జాతీయపార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తులకు ప్రాకులాడుతున్న తీరు చూస్తే ఎవరికయినా జాలి కలుగకపోదు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ, తెరాస కనికరిస్తే తప్ప గెలవలేమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు వారి ప్రాకులాట చూస్తే అర్ధమవుతుంది.   తెరాస విలీనానికి అంగీకరించదని తెగేసి చెప్పినా కూడా అందుకే దిగ్విజయ్ సింగ్ ఇంకా చాలా సౌమ్యంగానే మాట్లాడుతున్నారు. ఒకవేళ తెరాస పొత్తులు కూడా ఉండవని మరోమారు కుండ బ్రద్దలు కొడితే, అప్పుడు దిగ్విజయ్ సింగ్ నరేంద్ర మోడీని, బీజేపీని ఏవిధంగా తిట్టి పోస్తున్నాడో అదేవిధంగా కేసీఆర్ మరియు తెరాసలపై విరుచుకు పడటం ఖాయం. కానీ, ఎన్నికల తరువాతయినా తమ యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయనకు ఏ మాత్రమయినా నమ్మకం ఉన్నట్లయితే, తెరాస మద్దతు కోసం నోరుని అదుపు చేసుకొంటూ కాలక్షేపం చేయవచ్చును. ఒకవేళ ఆయన తెరాస మీద నోరు పారేసుకొంటే దానర్ధం...ఇక కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం, యువరాజ పట్టాభిషేకం వగైరాల మీద పూర్తిగా హోప్స్ వదిలేసుకోన్నట్లే భావించవచ్చును. బహుశః కాంగ్రెస్ ఇంత దీన స్థితికి ఎన్నడూ దిగాజారలేదేమో..పాపం కాంగ్రెస్!

కత్తులు దూస్తున్న పొత్తులు

  కాలం కలిసొస్తే .. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఐదేళ్ళకోసారి నిర్వహించే పెజాస్వామ్య కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుద్ది. పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులతో రంగంలోకి దిగుతాయి. చేతిలో చెయ్యేసి కలిసి సాగిన వేర్వేరు పార్టీల నేతలు సై అంటే సై అంటూ ఈవీఎమ్ ఫైట్ కు సిద్ధమవుతారు. గెలుపే పరమావధి.. అధికారమే లక్ష్యంగా పొత్తులు కుదురుతాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక ప్రకటనతో ఓటర్లను ఓడార్చుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కాకపొతే పొత్తులు తతంగం ఇప్పటికే పూర్తయ్యేది. విభజనే ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్ ప్రయోగించేసరికి పొలిటికల్ సీను ఒక్కసారిగా మారిపోయింది.   ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగే లెఫ్ట్ పార్టీలు .. లెఫ్ట్... రైట్ అంటూ చెరో దారి చూసుకుంటున్నాయి. తెలంగాణా ఏర్పాటుకు మద్దతు పలికిన సీపీఐ, సమైక్యాంధ్ర నినాదంతో ఉన్న సీపిఎం చెరో దారి వెతుకుంటున్నాయి. అవినీతిపై అలుపెరగని పోరాటం చేసిన సీపీఎం ..కోట్లలో అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారని కామ్రేడ్స్ గుసగుసలాడు కుంటున్నాయి.   సీపీఐకి సీపిఎం హ్యాండ్ ఇవ్వడంతో కొత్త మిత్రులను వెతికే పనిలో పడింది నారాయణ గ్యాంగ్. తెలుగుదేశంతో వెళ్తే తెలంగాణలో నష్టపోయే పరిస్థితి. ఒంటరినైపోయాను ఇక ఎన్నికలకు ఎలాగు పోను అంటూ పాత పాటను కొత్తగా పాడుకుంటున్నారు కామ్రేడ్లు. తెలంగాణా తెచ్చామని మాంచి జోష్ లో ఉన్న తెరాస దయ తలిస్తే సీపీఐకి కొత్త మిత్రుడు దొరికినట్టే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా గుర్తించి కాంగ్రెస్ స్నేహ హస్తం అందిస్తే తెలంగాణలో పోటీకి కొంత మద్దతు లభించవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.   ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు వారితో కలిసి సాగిన బాబు 2004 ఎన్నికల నుంచి కమలనాధులతో కలహం ప్రారంభమైంది. విభజన బిల్లు పార్లమెంటుకు చేరిన సమయంలో మళ్ళీ మొగ్గ తొడుగుతుందనుకున్న మైత్రి అంతలోనే అంతమైంది. ఉభయ సభల్లో పాలక, ప్రతిపక్షాలు ఒక్కటై బిల్లును గట్టేక్కించాయి. దీంతో భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు ప్రతిపాదన చిత్తయ్యింది.   తెలంగాణలో తమతో గులాబీ పార్టీ కలిసి వస్తుందని ఆశతో ఉన్న కాంగ్రెస్ నేతలకు గుబులు పుట్టించారు కేసీయార్. సీమాన్ధ్రలో పూర్తిగా మునిగిపోయిన కాంగ్రెస్ కారు ఎక్కి తెలంగాణలో షికారు చేద్దామని ఊహల్లో తేలిపోయింది. షికారుకు కారు ఇవ్వనని తెగేసి చెప్పి.. కనీసం లిఫ్ట్ కూడా ఇవ్వనని తేల్చేసారు పెద్ద సారు. కమిటీ చేతిలో పొత్తుల స్టీరింగ్ ఉంది. తమతో కలవాలనుకునేవారు.. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకునేవారు వారిని కలవండి అంటూ డోర్ లాక్ చేశారు దొర గారు.   చేతుల కాలాక పొత్తులు పెట్టుకుని ఏమి లాభం అనుకుని ఒంటరి పోటీకి సిద్ధం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ధైర్యం ఏ పార్టీ చేయదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తెలంగాణా తెచ్చామని ఇక్కడ.. ప్యాకేజి ఇచ్చామని అక్కడ.. నినాదాలతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.   పొత్తులు ఎత్తులు విఫలమవడంతో.. పార్టీలు కత్తులు దూస్తున్నాయ్. నిన్నటి మిత్రులు శత్రువులై పోతున్నారు. విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ మోసం చేసిందని కెసిఆర్ అంటే . కెసిఆర్ పిట్టలదొర అని షబ్బీర్ అలీ విరుచుకుపడుతున్నారు. సిపిఎంపై నారాయణ ఒంటి కాలిపై లేస్తున్నారు. కాంగ్రెస్ తో బీజేపి కుమ్మక్కు అయిందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుంటే ... వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డిలు టీడీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎ   న్నికలు దగ్గర పడేసరికి..పొత్తులు కుదిరితే .. ఈ తిట్లు.. శాపనార్ధాలు..పొగడ్తలు .. ప్రశంసలుగా మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.

Vijayasanthi Talk's

      Actress Vijayasanthi’s political saga started first with her joining the BJP and slowly started her own political party, Talli Telangana, where she has merged her Reel performance in Osey Ramulamma to a real performance and espoused the cause of Telangana and received enough flak from the politicians and public. Her claim to be a true Telanganian was through her parental origins being from Warangal, though she was never born or even lived there. She later merged the Talli Telangana into the Telangana Rashtra Samithi (TRS) due to lack of strength and support. Herr personal life also is remains big mystery and no one actually knows if she is married except that she had mentioned her spouse name to be M. V. Srinivas Prasad a real estate businessman while filing her nomination papers. The only information doing the rounds in the Net.Now this is a known story.   Her winning the Medak MP seat in 2009 and the drama about resigning from the seat for the cause of Telangana along with KCR which was subsequently rejected by the Speaker because of lack of proper format – clearly indicating her levels of literacy or rather her support staffs’ and ploy to gain attention worked well. But this Honeymoon with the TRS did not last too long and the TRS politburo cracked the whip on her when it was heard that she  was planning to switch loyalties to the Congress party. She had been staying away from TRS activities for the last few months because of differences with KCR ever since she was informed that KCR was keen to contest from Medak in the 2014 elections. Vijayashanti, who was advised to contest from Mahabunagar constituency, had stated that nobody could prevent her from seeking re-election from Medak  as she enjoyed the blessings of Medak’s people. Now why she sulked and moved out of TRS is still a mystery as this could not be the only reason for her to join Congress. Whether she will be given a ticket from Medak by the Congress  is something we have to wait and see. Meanwhile the Lady Amitabh after joining the Congress has gone live to ask -why TRS backed out of the merger ? Why is KCR cheating the people of Telangana when he said that a dalit leader was going to be made  the Chief  Minister of Telangana? And if her joining the Congress prevented the alliance – would her leaving the party make KCR merge with the Congress? And so she speaks, is anyone listening?

ఈ యువకార్డుతో చంద్రబాబు చెక్ పెట్టడం సాధ్యమేనా

  ఇంతకాలం రాష్ట్ర విభజన అంశాన్ని భుజానికెత్తుకొని ప్రయాసపడుతూ భారంగా రోజులు దొర్లించిన అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందగానే ఆ బరువు దించుకొన్నట్లు తెలికపడ్డాయి. ఇక ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణ భాద్యతను ఆనందంగా భుజానికెత్తుకొని ‘మేమే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామంటే కాదు మేమే నిర్మిస్తామని’ పోటీలు పడుతున్నాయి. ఆంధ్రలో తెదేపా, తెలంగాణాలో తెరస ఈ ‘పునర్నిర్మాణ పోటీ’లో ముందజలో ఉన్నాయి. వాటికి కాంగ్రెస్, వై కాంగ్రెస్ లు పోటీ ఇస్తున్నాయి. చంద్రబాబు గతంలో తన హయంలో హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ ని అభివృద్ధి చేశానని, అందువల్ల ఇప్పుడు మళ్ళీ తేదేపాకు అధికారం అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని సింగపూర్ లాగా మార్చేస్తానని హామీ ఇస్తున్నారు. అంతే కాకుండా కేవలం తనకీ, తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఆ సామర్ధ్యం, దీక్షదక్షతలు ఉన్నాయని చంద్రబాబుతో సహా తెదేపా నేతలందరూ కోరస్ పాడుతున్నారు.   చంద్రబాబుకి నిజంగానే ఆ సామర్ధ్యం ఉందని అందరికీ తెలుసు. కానీ ఎటువంటి రాజకీయ అనుభవం కానీ, పరిపాలనానుభవం గానీ లేని జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ‘పునర్నిర్మాణ పోటీ’లో ‘యువకార్డులు’ వేసి జాయిన్ అయిపోయారు. నిన్నటి తరం నాయకుడైన చంద్రబాబు వలన రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమయ్యేపని కాదని, తనవంటి ఉత్సాహవంతులయిన యువకులకే ఆ తెలివి తేటలు, సామర్ధ్యం ఉంటాయని, అందువల్ల ప్రజలలు తన పార్టీకే ఓటు వేసి గెలిపిస్తే, అందరూ ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని పునర్నిర్మించి చూపుతానని హామీ ఇచ్చారు.   అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత అకస్మాత్తుగా ‘యువకార్డు’ ఎందుకు బయటకు తీయవలసి వచ్చిందంటే, ప్రజలకు చంద్రబాబు పనితీరు, సామర్ధ్యం, దీక్షా దక్షతల గురించి తెలుసు. కనుక ఇప్పుడు చంద్రబాబు, తెదేపా నేతలు కలిసి ‘రాష్ట్ర పునర్నిర్మాణం’ అంశాన్ని తమ ప్రతీ సభలో గట్టిగా ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకొంటుంటే, సీబీఐ, కోర్టు కేసులు, చార్జ్ షీట్లు, జైలు అనుభవం తప్ప మరెటువంటి అనుభవమూ లేని జగన్, తను రాష్ట్రాన్ని పునర్నిర్మించగలనని ప్రజలకు నచ్చజెప్పడం చాలా కష్టమే. అందుకే అకస్మాత్తుగా ఈ ‘యువ ఆలోచన’ తో బరిలోకి దిగారు.   మరి ఇంతవరకు కిరణ్ కుమార్ రెడ్డితో సమైక్య చాంపియన్ రేసులో పాల్గొని, ఆయన చివరి నిమిషంలో బ్యాటు పడేసి పోటీ నుండి తప్పుకోవడంతో చాంపియన్ గా మిగిలిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ ‘పునర్నిర్మాణ పోటీ’ లో కూడా గెలుస్తారో లేదో తెలియాలంటే మరో మూడు నెలలు వేచి చూడాల్సిందే!

కాంగ్రెస్-తెరాస తలాక్! నమ్మొచ్చా?

  కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ విలీనం కాకపోవడానికి వంద కారణాలున్నాయని కేసీఆర్ నిన్న చెప్పారు. కేసీఆర్ చెప్పిన కారణాలేవీ నిన్న రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కావు. విభజన ప్రక్రియ మొదలయినప్పటి నుండే ఉన్నాయని ఆయనే చెప్పారు. తెలంగాణాకు తానే అడ్డుపడుతున్నానని టీ-కాంగ్రెస్ నేతల ప్రచారం చూసి, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందేవరకు అన్ని అవమానాలు భరిస్తూ ఇంతకాలం వెనక్కి తగ్గానని చెప్పారు. అంటే, కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకూడదని ముందే నిర్ణయించుకొన్నపటికీ బిల్లు ఆమోదం పొందేవరకు చర్చల పేరిట కాలక్షేపం చేసినట్లు ఆయనే స్వయంగా స్పష్టం చేసినట్లయింది. ఇప్పుడు తెలంగాణా ఏర్పడినట్లు అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయింది గనుక, ఇక విలీనం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణాని ఆపలేదని నిశ్చయం చేసుకొన్న తరువాతనే కేసీఆర్ కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ తెగతెంపులు నిజంగా చేసుకోన్నారా? లేక కాంగ్రెస్-తెరాసల వ్యూహంలో భాగంగానే చేసుకొన్నారా? అనే అనుమానాలున్నాయి. ఎందుకంటే, తెగతెంపులకి వంద కారణాలున్నాయని చెప్పిన కేసీఆర్ సరిగ్గా వారం రోజుల క్రితమే కాంగ్రెస్ అధిష్టానంతో విలీనంపై చర్చలు ముగించిన తరువాత, తన కుటుంబ సభ్యులందరినీ వెంటబెట్టుకొని సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగినప్పుడు ఈ కారణాలు గుర్తుకు రాలేదంటే నమ్మశక్యం కాదు. అప్పుడు గుర్తుకు రాని ఈ కారణాలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయి? అని ప్రశ్నించుకొంటే, ఇదంతా కాంగ్రెస్-తెరాసలు కలిసి ఆడుతున్న నాటకమని అనుమానించక తప్పదు. గత మూడునాలుగేళ్ళుగా ఉద్యమాలతో రాష్ట్రం అగ్ని గుండంగా మారి, రాష్ట్రంలో తీవ్ర అరాచక వాతావరణం ఏర్పడి ఉన్నపుడు ఏనాడు రాష్ట్రంలో అడుగుపెట్టని కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దమనిషి-జైరాం రమేష్, కేసీఆర్ వెనకే హైదరాబాద్ వచ్చి తెరాసను తన మాటలతో రెచ్చగొట్టడం చూస్తే ఈ రెండు పార్టీలు ఒట్టొట్టి తెగతెంపుల నాటకం మొదలుపెట్టాయని అనుమానం కలగకమానదు. 

ఉగ్ర నరసింహన్..రెండో వైపు చూడొద్దు

  "నాన్నా.. సింహం.. సింగిల్ గానే వస్తుంది. పందులే గుంపులు గుంపులుగా వస్తాయి" అని రజనీ కాంత్ సినిమాలో బాగా క్లిక్ అయిన డైలాగ్ ఒకటుంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది.  రాష్ట్ర పరిపాలనపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ముద్ర రెండో రోజు నుంచే స్పష్టంగా కనిపించింది.   కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేట్ చేసిన పదవుల్లోని వారిపైనా గవర్నర్ దృష్టి సారించారు. రాజ్యాంగ, చట్టబద్ధత కాని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను పంపాలని గవర్నర్ కార్యాలయం నుంచి అన్ని శాఖలకు నోట్ అందింది. దీంతో అన్ని శాఖలు తమ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను సిద్ధంచేసి పంపే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే రాజీవ్ యువకిరణాల చైర్మన్‌ కె.సి.రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఆర్‌టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, 20 సూత్రాల పథకం అమలు చైర్మన్ తులసిరెడ్డిలతో పాటు ఇటీవల సీఎం పలు దేవాలయాలకు నియమించిన పాలక మండళ్ల చైర్మన్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారినీ రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశించనున్నట్లు సమాచారం. తుడా, వీజీడీఎంఏ చైర్మన్ , పాలకమండళ్లను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించనున్నట్లు చెబుతున్నారు. సీఎంగా కిరణ్ చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై వివరాలను పంపాలని గవర్నర్ కార్యాలయం నుంచి సీఎస్‌కు నోట్ అందింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలో ఆ నోట్‌లో పేర్కొనలేదు. దీంతో.. ఎప్పటినుంచి ఎప్పటివరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను పంపాలో తెలియజేయాలని గవర్నర్ కార్యాలయాన్ని సీఎస్ కోరారు. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంకుల బంద్‌ను గంటల వ్యవధిలో ఆయన ఉపసంహరింపజేశారు. అంతకుముందు సమ్మె సాకుతో లీటరు పెట్రోలు ఏకంగా 220 వరకు అమ్ముడైంది. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంకులు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంకుల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. అంతేకాదు, సర్కారుతో కాళ్లబేరానికి కూడా వచ్చాయి. ఇంతకాలంగా అందరూ గవర్నర్ ని ఒకవైపే చూసారు. రెండో వైపు చూడలేదు. చూస్తే తట్టుకోలేరని ఇప్పుడు ఉగ్ర నరసింహన్ స్పష్టం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలు- రాజకీయ పార్టీలకు సెమీ ఫైనల్స్

  రాష్ట్రం రెండు ముక్కలయ్యి సార్వత్రిక ఎన్నికలకి సిద్దపడుతున్నవేళ మధ్యలో మునిసిపల్ ఎన్నికల వచ్చిపడుతున్నాయి. మునిసిపల్ ఎన్నికలకు షెడ్యుల్ కూడా విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు.   సాధారణంగా అధికార పార్టీ తనకు అనుకూలంగా పరిస్థితులు లేవాణి భావిస్తే ఇటువంటి ఎన్నికలను వాయిదా వేసుకొంటూ పోతుంది. కానీ, కీలకమయిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నుకలు రావడం, అది కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనలో ఉన్నపుడు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సమయంలో ఎన్నికలు రావడం యాద్రుచ్చికమో లేక ముందుగానే నిశ్చయమైందో తెలియకపోయినా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు సెమీ ఫైనల్ వంటివని భావించవచ్చును. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలలో రాజకీయ పార్టీల బలాబలాలకు అద్దం పడతాయి.

కుర్చీ పోయే..పరువు పోయే...

  అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే.. ముఖ్యమంత్రి పదవి ఆశలు ఆవిరాయెనే .. ఇదీ సీమాంధ్ర సీనియర్ కాంగ్రెస్ వీరవిధేయుల తాజా సాంగ్. ఎప్పుడెప్పుడు నల్లారి వారు దారి ఇస్తారా... అని ఎదురు చూస్తూ ఆయన కుర్చీ చుట్టూ తిరుగుతున్న గ్యాంగ్ .. విభజన ప్రక్రియ చివరి దశలో ఉన్నపుడే డిల్లీలో మకాం వేషి లాబీయింగ్ మొదలు పెట్టేసారు. తెలంగాణా బిల్లుకు మద్దతు కూడగట్టే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సీమాంధ్రకు న్యాయం, బిల్లులో సవరణలు చేయిస్తామంటూ మరో బృందం టెన్ జనపథ్ అమ్మ కరుణా కటాక్ష వీక్షణాల కోసం నిరీక్షించారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు స్థాయికి మించి బీజేపీ. టీడీపీ నేతలను తిట్టిపోసేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని ఆరోపణలు గుప్పించారు. అటు బిల్లు ఆమోదం పొందడం.. ఇటు కిరణ్ రాజీనామా చేయడంతో ఆశావహుల జాబితా పెరిగిపోయింది. కనీసం ఐదు రోజులైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొంటే చాలు... అదే ఐదేళ్లని తృప్తిపడి సర్దుకుపోతామని అంటూ కనిపించిన కాంగ్రెస్ పెద్దలందరినీ వేడుకున్నారు. పన్లో పనిగా ‘అధిష్టానం ఆదేశిస్తే ఏ ముఖ్యభాద్యతలు స్వీకరించడానికయినా సిద్ధం’ అంటూ ఎవరినో ఉద్దరించడానికి త్యాగం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ప్రకటించేశారు.   హైకమాండ్ కు మరో బిస్కెట్ కూడా వేశారు. ఎన్నికలు 6 నెలలు పొడిగించి ..తమకు పార్టీ, ప్రభుత్వ భాద్యతలు అప్పగిస్తే అంటా ‘సెట్ రైట్’ చేసేస్తామని నమ్మబలికారు. అదీ వీలుపడేలా కన్పించక పోవడంతో సీఎం ఎవరైనా ఫర్వాలేదు, ప్రభుత్వం ఏర్పాటయితే అదే మాకు పదివేలు... అంటూ ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ కలిసి బృందగానం కూడా చేశారు. అంతా అనుకున్నట్టే జరిగింది. హైకమాండ్ తమలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తుంది అని.. సూట్ కేసంత ఆశతో అందరూ అమ్మగారి గుమ్మం వద్ద అంత చలిలోనూ గజగజా వణుకుతూ పడిగాపులు కాశారు. కానీ అమ్మగారి ఆంతరంగికులు ఆమె చెవిలో ఏదో ఊదేసారికి అమ్మగారి ఆలోచనలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. దానితో సీను పూర్తిగా మారిపోయింది.   రాష్ట్ర విభజనకు ముందే ప్రాంతాలవారీగా నేతలు విడిపోయికొట్టుకొన్న ఈ నేతల మాటల నమ్మి వారిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఆ తరువాత ఆంధ్ర, తెలంగాణా అంటూ కీచులాడుకొంటే ఉన్న పరువు కూడా గంగలో కలిసిపోతుందని, పైగా ఎవరికి పగ్గాలు అప్పగించినా ప్రతిపక్షాలు అందులో ‘లా పాయింటు’ తీసి రెండో ప్రాంతం వారికి అన్యాయం జరిగిపోయిందని ఎన్నికల ముందు కాకి గోల చేస్తే ఇక తమ పార్టీకి ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావని అంతరంగికులు అమ్మగారికి నూరిపోసారుట! ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్ కి మూడిపోయింది. మూడు రోజుల ముచ్చట కోసం మళ్ళీ ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే...ఇక తెలంగాణాలో కూడా మూటాముల్లె సర్దుకోవాల్సి వస్తుందని భయపెట్టేసారుట! వీళ్ళని వేరే పార్టీలో ఎలాగూ చేర్చుకోరని తెలిసినందునే మన కాళ్ళవద్ద పడిఉన్నారని లేకుంటే వీళ్ళు కూడా మిగిలిన వాళ్ళలాగే ఎప్పుడో వేరే పార్టీలోకి జంపయిపోయేవారని అమ్మ చెవిలో ఎవరో ఊదేరుట. రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని ఒకపక్క ‘సర్వేస్వర్లు’ ఘోషిస్తుంటే, పార్టీని బలోపేతం చేసేసి సీమాంధ్రలో విజయడంకా మ్రోగించేస్తామని చెపుతున్న వారి మాటలు నమ్మి కాలిన చేతులను ఇంకా కాల్చుకోవద్దని శ్రేయోభిలాషులు హెచ్చరించారుట! ఆంధ్రా వాళ్ళకంటే అంతరంగికులను నమ్ముకోవడమే బెటర్ అని భావించిన హైకమాండ్ వారు రాష్ట్రపతి పాలనే అన్ని విధాల సేఫ్ అని దానికే కమిట్ అయిపోయారుట!   అమ్మగారు చెప్పుడు మాటలు విని తమను నమ్మకుండా రాష్ట్రపతి పాలన విదించేసారని కుమిలిపోతూ ఆంధ్ర, తెలంగాణా నేతలందరూ ఒకరినొకరు ఓదార్చుకొంటూ హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. అటు అధిష్టానం అనుమానపు చూపులు.. ఇటు ప్రజల నుండి ఛ్చీదరింపులతో తమ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయిందని వాపోతున్నారు. పదవీ పోయే...పరువూ పోయే... పైసలూ ఖర్చై పాయె....అని లబో దిబోమంటున్నారట!

కిరణ్ తప్పటడుగు వేసారా?

  మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని దిక్కరిస్తూ తన సమైక్య వాదనలతో సీమాంధ్ర ప్రజలను చాలా బాగా ఆకట్టుకొన్నారు. అగ్నికి వాయువు తోడయినట్లుగా ఆయనకు ఏపీ యన్జీవో నేత అశోక్ బాబు, ఆయన వెనుక లక్షలాది ఉద్యోగులు కూడా తోడవడంతో ఇక ఆయన చెలరేగిపోయారు. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయనను వేలెత్తి చూపే దైర్యం చేయలేకపోయారు. ఆ ఊపులోనే ఏపీఎన్జీజీవోలు హైదరాబాదులో ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభను విజయవంతంగా నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఉండి ఉంటే, ఆయనకు ఇక సీమాంధ్రలో తిరుగే ఉండేది కాదు. కానీ, ఆయన ఉదృతంగా సాగిన ఏపీయన్జీవోల సమ్మెకు బ్రేకులు వేసి, డిల్లీలో జీ.ఓ.యం. రాష్ట్ర ప్రక్రియను చకచకా పూర్తి చేస్తుంటే, ఆయన శాసనసభకు టీ-బిల్లు వచ్చేవరకు గోళ్ళు గిల్లుకొంటూ కూర్చోవడంతో ఆయనపై ప్రజలలో అనుమానాలు మొదలయ్యాయి. ఆసమయంలో ఆయన దూకుడు కూడా బాగా తగ్గడంతో అయన కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల ప్రకారమే విభజనకు సహకరిస్తున్నారనే అనుమానాలు బలపడ్డాయి.   టీ-బిల్లు శాసనసభకు వచ్చినపుడు ఆయన ఏ ప్రళయం సృష్టించలేదు కానీ, ఆయన బిల్లుని తిరస్కరిస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టి చర్చను మూడు రోజుల ముందే ముగించి భద్రంగా డిల్లీకి చేర్చారు. రాష్ట్ర శాసనసభ బిల్లుని తిరస్కరించినంత మాత్రాన్న వచ్చిన నష్టమేమిఉండబోదని దిగ్విజయ్ సింగ్ పదే పదే చేపుతున్నపటికీ, ఆయన బిల్లుని తిరస్కరించడమే ఓ ఘన కార్యంగా చేసిచూపారు.   ఆ తరువాత డిల్లీలో దీక్షకు కూర్చొని మళ్ళీ ప్రజలలో కొంత పేరు సంపాదించుకొన్నారు. కనీసం అప్పుడయినా రాజినామా చేసి బయటకు వచ్చిఉంటే ఆయనకు ఎంతో కొంత విలువ ఉండేది. కానీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేక, ఆ తరువాత, అధికారికంగా దృవీకరించుకొన్న తరువాత అంటూ పదవి పట్టుకొని వ్రేలాడుతూ ఉన్న పరువుని కూడా పోగొట్టుకొన్నారు. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసి బయటకి వచ్చి వెనక్కి తిరిగి చూసుకొంటే సగం మంది కాంగ్రెస్ లోనే మిగిలిపోగా, మరికొంతమంది ఇతర పార్టీలలోకి వెళ్లిపోవడంతో ఆయన వెనుక అశోక్ బాబు, ఓ గుప్పెడు మంది యం.యల్యేలు, ఒకరిద్దరు యంపీలు తప్ప మారెవరూ కనబడలేదు. ఆయనకు గట్టిగా మద్దతు పలికిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకోగా, గంటా, ఏరాసు, టీజీ వంటి వారు తెదేపాలో తేలారు.   ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం, దానిని ప్రజలలోకి తీసుకువెళ్ళడం ఆయన వెనుక ఉన్న గుప్పెడు నేతల వలన అయ్యే పనికాదు. అందుకే ఆయన మీనమేషాలు లెక్కిస్తున్నారు. చాలా మంది రాజకీయ నేతలు “సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకొంటామని” చెపుతూ ఉంటారు. కిరణ్ సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వలననే ఇప్పుడు ఆయన ఒంటరివారయ్యారు. ఇంతకాలం ఒక వెలుగు వెలిగి పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ ఆడించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు తన భవిష్యత్ ఏమిటో తనకే తెలియని పరిస్థితి ఏర్పడింది.

కర్నూలు తెలుగుదేశం పిలుస్తోంది రా..

  రాజులు.. రాజ్యాలు పోయినా .. ప్రజాస్వామ్యం పుణ్యమా అని నేతల కోటలు .. పార్టీల కంచు కోటలు మిగిలాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అయిన కర్నూలు జిల్లా వైఎస్ హయాంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.   సీనియర్ నేత ఎస్వీ సుబ్బారెడ్డి రాజకీయాలనుంచి విరమించుకున్నారు. భూమా, బైరెడ్డి వంటి నాయకులు పార్టీని వీడారు.ఎస్వీ సుబ్బారెడ్డి తనయుడు ఎస్వీ మోహనరెడ్డి కాంగ్రెస్ లో చేరి అట్నుంచి ఆటే బావ భూమా బాటలో వైసీపీలో చేరారు. అనారోగ్యంతో మాజీ మంత్రి బీవీ మోహనరెడ్డి మృతి చెందారు. తనకు ప్రాధాన్యం దక్కలేదనే అక్కసుతో మాజీ మేయర్ బంగి అనంతయ్య .. టీడీపీ అధినేతకు వ్యతిరేకంగా నిరసనల భంగిమలు ప్రదర్శించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 14 నియోజకవర్గాలలో 4 టీడీపీ చేతిలోనే ఉన్నా కంచుకోటకు శిధిలావస్థకు చేరుకుంది.   రాష్ట్ర విభజనను షురూ చేయడం సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ కావడం ఆరంభమైంది. వైసిపీ, టీడీపీల వైపు కాకలు తిరిగిన కాంగ్రెస్ వాదులు వలస ప్రారంభించారు. కర్నూలు లో జగన్ పార్టీ వైపు కన్నెత్తి చూసేందుకే నేతలు భయపడుతున్నారు. జగన్ పార్టీలో కీకకంగా వ్యవహరిస్తున్న ఆ నేత.. ఒకప్పుడు టీడీపీ గూటి పక్షె.. చిరు చెంతకు చెరి.. అంతలోనే యువనేత వైపు తిరిగిపోయిన ఆ ప్రముఖుడు యువనేతకు బంధువు కూడా. వైసిపీలో చేరితే ఆ నేత కనుసన్నల్లో పని చేయాల్సి వస్తుందని భయపడే టీడీపీ గూటికి చేరుతున్నారని కర్నూలు వాసులు గుసగుసలాదుకున్తున్నారు.   సీనియర్ టీడీపీ నేత, గ్రీన్సిగ్నల్ ఇస్తే చాలు టీడీపీ లోకి రూట్ క్లియర్ అవుతుందని కాంగ్రెస్ అన్నయ్యలు ..తెలుగు తమ్ముల్లుగా మారిపోయేందుకు తెగ ఉబలాట పడిపొతున్నారు. మాజీ మంత్రులైన టీజీ, ఏరాసు తెలుగుదేశంలో గూటికి చెరారు. అన్నీ అనుకూలిస్తే నేడే రేపో మాజీ మంత్రి శిల్పా కూడా బాబు చెంతకు చేరనున్నారు. జగన్ అసలు స్వరూపం ఏంటో తెలిసిందని మీడియాకు ఎక్కినా మాటల మాంత్రికుడు మాజీ మంత్రి మారెప్ప కూడా పసుపు పచ్చ జెండా కోసం నిరీక్షిస్తున్నారని రాజకీయ వర్గాల సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే గంగుల, ఆలూరు తాజా మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి, తిక్కారెడ్డిలు కాంగ్రెస్ ను వీడెందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరిని చేర్చుకుంటారు? ఎవరిని వద్దంటారు? అనేది ఇంకా సస్పెన్సే.. ఇప్పటికే వలసలను ప్రోత్సహించడంపై సీనియర్ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. కర్నూలు కాంగ్రెస్ లీడర్లను హోలేసేల్ గా చేర్చుకుంటే టీడీపీ లోనూ కుమ్ములాటలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు ఎక్కువవుతున్నాయే

41 ఏళ్ల తరువాత ..అదే భస్మాసుర "హస్తం"

  41 ఏళ్ల తరువాత ..అదే భస్మాసుర "హస్తం"   రాష్ట్రగతి..  రాష్ట్రపతిపాలనకు చేరింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో యుపీఏ ప్రభుత్వం రాష్ట్రపతిపాలనకే మొగ్గు చూపుతోంది. కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తరువాత  రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే తరువాయి.. 41 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రెసిడెంట్ రూల్ అమలు కానుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏపీలో అనిశ్చితి పరిస్తితి ఏర్పడింది. కిరణ్ రాజీనామాను అంత సీరియస్ గా తీసుకోని కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. న్యాయ సలహాలు.. పార్టీకి ఒనగూడే ప్రయోజనాలను బేరీజు వేసుకుంది. ఏపీలో ఇరు ప్రాంతాల వారిని వార్ రూంకి పిలిచి బేరాలు సాగించింది. చివరి వరకూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే ప్రయత్నాలు చేసింది. ఏమైందో ఏమో గానీ సడన్ బ్రేక్ వేసి ప్రెసిడెంట్ రూల్ టర్న్ తీసుకుంది. నలబై ఒక్క ఏళ్ళ కింద జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి నుంచి బయటి పడేందుకు 1973 జనవరి 11న రాష్ట్రపతి పాలన విధించారు. విచిత్రంగా నాలుగు దశాబ్దాల తరువాత తెలంగాణా, సమైక్యాంద్ర ఉద్యమాలతో ఏపీలో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. మళ్ళీ అదే విధంగా  రాష్ట్రపతి పాలన విధించనున్నారు. అప్పుడు...ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వమే అధికారంలో ఉండడం విశేషమే కాదు... విచిత్రం కూడా. తమ ప్రభుత్వాలున్న చోటే తప్పనిసరై  ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరా, నేడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ (సోనియాగాంధీ అనుమతితో) ప్రెసిడెంట్ రూల్ కు సిఫారసు చేసారు. జై ఆంధ్ర ఉద్యమానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన  పీవీ నరసింహారావు రాజీనామా చేస్తే .. నేడు తెలంగాణా ఉద్యమ ఉదృతికి సీమాంధ్రకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. నాడు..నేడు  తమ సొంత రాష్ట్ర ప్రభుత్వాలపై భస్మాసుర "హస్తం" మోపి రాష్ట్రపతిపాలనకు విధించిన ఘనత మళ్లీ కాంగ్రెస్సే దక్కించుకుంది.

కొండను త్రవ్వి ఎలుకని పట్టిన సీఐడీ

  నాలుగు నెలల క్రితం పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అప్పటి నుండి భాదితులు ప్రభుత్వానికి విన్నపాలు, న్యాయం కోసం ధర్నాలు చేస్తున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు బస్సు యాజమాన్యం గానీ మానవతా దృక్పదంతో స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. కనీసం భాదితుల మోర ఆలకించేందుకు కూడా వారికి ఓపిక, శ్రద్ధ లేకుండాపోయాయి. ప్రమాదానికి కారణమయిన దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సులతో బాటు పలు ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ అధికారులు నిలిపివేసి కేసులు నమోదు చేసారు. దాని వలన భాదిత కుటుంబాలకి ఒరిగిందేమీ లేకపోయినా, ప్రైవేట్ బస్సులపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక బస్సు ప్రమాదం తరువాత మేల్కొన్న ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తే అది కాస్త కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు బస్సు యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రమాదానికి కారణమయిన కల్వర్టుని నిర్మిస్తున్న కాంట్రాక్టరు, వివిధ ప్రభుత్వ శాఖల బాధ్యతా రాహిత్యం వలననే ఈ ప్రమాదం జరిగిందని, అదీగాక వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని తన నివేదికలో పేర్కొన్నారు.   ప్రమాదం జరిగిన మొదటి మూడు రోజులలలోనే ఈ లోపాలన్నిటినీ మీడియా ఎత్తి చూపింది. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులపై దాడులకు, సిఐడీ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకొంది తప్ప మీడియా ఎత్తిచూపిన లోపాలను సవరించే విధంగా బస్సు యాజమాన్యాలపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. అందువల్ల నేటికీ రాష్ట్రంలో అవే వోల్వో బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటనపై ఇంతవరకు దర్యాప్తు జరిపిన సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ ఆ వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని నిర్దారించడమే గాక వాటిని నిషేదించాలని సిఫారసు చేసారు.   అత్యున్నత నాణ్యతా ప్రమాణాల కారణంగా ప్రపంచంలో అత్యాధారణ పొందుతున్న వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని ఒక సిఐడీ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ ఆయన చెప్పిన ప్రకారం వోల్వో బస్సులోనే లోపాలున్నాయని అనుకొంటే, ఇక నిత్యం ప్రజలు తిరిగే సాధారణ ఆర్టీసీ బస్సుల సంగతేమిటి? అని ఆలోచిస్తే ఇంతకాలంగా ప్రభుత్వము, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకొంటున్నాయో అర్ధమవుతుంది.అదేదో సామెత చెప్పినట్లు మన వ్యవస్థలలో ఇన్ని లోపాలు, అధికారులలో, బస్సు యాజమాన్యంలో ఇంత నిర్లక్ష్యం, ఎవరికీ జవాబుదారీతనం లేకపోవడం, మానవతా దృక్పదం లోపించడం వంటి సవాలక్ష తప్పులను ఉంచుకొని బస్సులో సాంకేతిక లోపాలున్నాయని వాటిని నిషేదించాలనుకోవడం ఇంట్లో ఎలుకలు చేరాయని ఇల్లు తగులబెట్టుకొన్నట్లు ఉంటుంది.

తెలంగాణాలో తెదేపా పరిస్థితి చక్కదిద్దేదెన్నడు?

  రాష్ట్ర విభజన చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేయాలని కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నిందని ఇంతకాలంగా చంద్రబాబు నాయుడు చెపుతున్నమాటలు ఇప్పుడు క్రమంగా వాస్తవ రూపం దాల్చుతున్నాయి. తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా పార్టీని వీడని తెదేపా తెలంగాణా నేతలు, విభజన ప్రకటన వెలువడిన తరువాత నుండి క్రమంగా తెరాసవైపు మళ్ళుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక మరికొంతమంది తెలుగు తమ్ముళ్ళు విజయోత్సాహంతో ఉన్న తెరాస వైపు మళ్ళుతున్నారు. మహేందర్ రెడ్డి (తాండూరు శాసనసభ్యుడు) కే.యాన్. రత్నం(చేవెళ్ళ);నరేంద్ర రెడ్డి (యంయల్సీ)లు ఇటీవల తెరాసలో చేరేందుకు సిద్దం అయ్యారు. వీరు గాక వరంగల్, మెహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్ళను కూడా పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్-తెరాసల విలీనం లేదా పొత్తులు ఖరారవగానే మరికొందరు తెలుగు తమ్ముళ్ళు తెరాస వైపు దూకేయవచ్చును.   చంద్రబాబు నాయుడు తెలంగాణాలో కూడా తమ పార్టీయే విజయం సాధిస్తుందని ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణాలో పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఇటీవల తెలంగాణా తెలుగు తమ్ముళ్ళతో సమావేశమయ్యి వారికి దిశా నిర్దేశం చేసారు. కానీ, తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్-తెరాసలను ఎదుర్కొనేందుకు ఆయన తన సీనియర్ నేతలతో కలిసి చాలా గట్టి ప్రయత్నాలు వెంటనే చేయవలసి ఉంది. లేకుంటే తెదేపాకు ఇప్పుడున్న సీట్లు దక్కడం కూడా కష్టమవుతుంది. పైగా ఈలోగా పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం కూడా ఉంది.   పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత టీ-కాంగ్రెస్, తెరాస, బీజేపీలు తెలంగాణాలో విజయోత్సవాలు నిర్వహిస్తూ దూసుకుపోతూ, తెలంగాణా తెచ్చిన ఖ్యాతిని స్వంతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, తేదేపాకు చెందిన సీనియర్ తెలంగాణా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి వంటివారు అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో పార్టీ కార్యాలయానికే పరిమితమయిపోయారు. తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే స్వయంగా “తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినందునే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని” ప్రకటిస్తున్నపటికీ, తెదేపా తెలంగాణా నేతలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెనక్కి తగ్గినట్లున్నారు. కానీ, వారు ఇంకా ఇదే సంకట స్థితిలో మరికొంత కాలం కొనసాగినట్లయితే, ఈలోగా వారికి, పార్టీకి కూడా కోలుకోలేనంత నష్టం జరిగే అవకాశం ఉంది.   కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ఇప్పుడు సీమాంధ్రపై దృష్టి కేంద్రీకరించి పార్టీని బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తోందో అదేవిధంగా సీమాంధ్రలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికయినా మేల్కొని తెలంగాణాపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంది. లేకుంటే చంద్రబాబు జోస్యం నిజమయ్యే అవకాశం ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీని ‘కాపు’ కాయగలవారెవరు?

  ప్రజల చేతిలో ఎన్నిమొట్టికాయలు తిన్నపటికీ మన రాజకీయ పార్టీల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఎన్నటికీ మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పదేళ్ళ పాలనలో ఎన్ని తప్పులు చేసినపటికీ వాటిని మరిపించేందుకు ఎన్నికల ముందు ప్రజలకు ఏవో కొన్ని తాయిలాలు విసిరేస్తే గలగలా ఓట్లు రాలిపోతాయనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా నాటుకుపోయుంది.ఈ మూడు నెలలోగా సీమాంధ్రలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన నేతలకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులను ఎరగా వేస్తోంది.   ఇంతకాలం పార్టీకి అండగా నిలబడిన రెడ్లు ఇప్పుడు దూరం కావడంతో, కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో కాపు సామాజిక వర్గాన్ని దువ్వుతోందిపుడు. వారు కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటూ తమకే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చినట్లయితే తమ కులస్తుల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేలా చేయగలమని హామీలివ్వడం విశేషం. ప్రజలను మనుషులుగా కాక కేవలం ఓట్లుగానే చూసే అలవాటు కాంగ్రెస్ పార్టీ నేతలకి ఎన్నడూ పో(లే)దని ఇది స్పష్టం చేస్తోంది. రాష్ట్ర విభజన చేసినందుకు సీమాంధ్రలో తెలుగు ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా ఉద్యమించారు. తెలుగు జాతిని రెండుగా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను కులాలవారీగా చీల్చి ప్రలోభపెట్టి తిరిగి అధికారంలోకి రావాలని అర్రులు చాస్తోంది. సదరు కులానికి చెందడమే ప్రధాన అర్హతన్నట్లు భావిస్తున్నముగ్గురు నేతలు ఈ పోటీలో ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరయినా , ఇంతకాలంగా వారి కులస్తులకు ఏమయినా మేలు చేసారా? అని ఆలోచిస్తే లేదనే సమాధానం వస్తుంది. వారు రాష్ట్రంలో కాపు కులస్తులందరికీ తామే అసలు సిసలయిన ప్రతినిధులమని భావించవచ్చును. కానీ సదరు కులానికి చెందిన ప్రజలు కూడా ఆవిధంగా భావిస్తున్నారా? అనేదే ప్రశ్న.   అయినా కుల, మత, రాగ ద్వేషాలకి అతీతంగా ప్రజలకు సేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఈ నేతలకు ఆ సంగతి ఎన్నడూ ఎందుకు గుర్తుకు రాదో తెలియదు. కానీ, ఇప్పుడు కేవలం తమ కులస్థుల మీదే అవ్యాజమయిన ప్రేమ ఎందుకు పొంగి పొరలి పోతోందో మాత్రం అందరికీ తెలుసు. తమకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీని కాపాడుతామని, తమ కులాన్ని బీసీ వర్గంలో చేర్చినట్లయితే తమ వాళ్ళను కూడా పడేయగలమని హామీలీయడం ప్రజలంటే వారికి ఎంత చులకనో తెలియజేస్తోంది. నిజంగా తమ కులస్థుల పట్ల సదరు నేతలకి అభిమానమే ఉండి ఉంటే గత పదేళ్లుగా వారికోసం ఏమి చేసారు? వారిని బీసీలలో ఎందుకు చేర్చలేకపోయారు? అని ప్రశ్నించుకొంటే వారి తపన దేనికో అర్ధమవుతుంది. అధికారం తమ కుటుంబసభ్యుల మధ్య తప్ప తమ కులస్థుల మధ్య ఎన్నడూ పంచుకోవడానికి ఇష్టపడని నేతలు ఏ కులానికి చెందిన వారయితే మాత్రం ప్రజలకు ఒరిగేదేమీ ఉంటుంది? అని ఆలోచిస్తే ప్రజలు ఇటువంటి నేతలకు ఓట్లు వేయరు. అప్పడు వారు కూడా ఇటువంటి ఆలోచనలు చేసేందుకు దైర్యం చేయరు.

హరికృష్ణ ఆవేదనకి అర్ధం ఉందా

  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నందమూరి హరికృష్ణ పార్టీలోనే ఉన్నపటికీ ఇంతవరకు పార్టీతో మమేకం కాలేకపోతున్నారు. కనీసం పార్టీలో ఇమడలేకపోయారు. అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు వచ్చి రభస చేయడం లేదా పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం తప్ప ఆయన పార్టీకి చేసిందేమీ లేదు. తెదేపా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ గనుక తనకు ఎల్లపుడు కూడా తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకొంటూ, అది దక్కకపోవడంతో భంగపడి రచ్చ చేయడం ఆయనకు అలవాటుగా మారింది. సినిమాలలో ఆయన హీరో వేషాలు వేసి తన పాత్రలను గొప్పగా రక్తి కట్టించి ఉండవచ్చును. కానీ, రాజకీయాలలో రక్తి కట్టించాలంటే ఆ నటనతో బాటు లౌక్యం, కలుపుగోరుతనం, సర్దుబాటు గుణం కూడా చాలా అవసరమే. ఆ గుణాలేవీ ఆయనకు లేకపోవడం వలననే ఆయన నేటికీ తెదేపాలో ఇమడలేక, గౌరవం పొందలేక అత్మన్యూనతతో బాధపడుతున్నారు.   ఆయన పార్టీ ద్వారానే రాజ్యసభకు పంపబడినప్పటికీ కనీసం మాటమాత్రంగానయినా చెప్పకుండా సమైక్యాంధ్ర కోసం అంటూ రాజీనామా చేశారు. అనేక ఆటుపోటులను ఎదుర్కొంటూ చంద్రబాబు తన పార్టీని రెండు ప్రాంతాలలో బ్రతికించుకోవాలని తిప్పలు పడుతుంటే, హరికృష్ణ మాత్రం అదేమీ అర్ధంకాకనో లేక పార్టీ సమస్యలతో తనకు సంబంధం లేదనో రాజీనామా చేసి ‘చైతన్య యాత్ర’కి కూడా సిద్దపడి, ఆయన తమ పార్టీ విధానానికి అనుగుణంగా కాక, తన నిర్ణయానికి అనుగుణంగా పార్టీ మారలన్నట్లు వ్యవహరించడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం కలిగించడం సహజమే. అయితే ఆ తరువాత ఆయన తన యాత్రను మళ్ళీ ఎందుకో విరమించుకొన్నారు.   ఆయన పార్టీకి ఏమీ చేయలేకపోయినా కనీసం రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకయినా ఏమీ చేయలేకపోయారు. కానీ తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్ అనుసరించిన తీరుని ఎండగడుతూనే, సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు, వారి వేదనకు తన ప్రసంగంలో అద్దం పట్టారు. అదే సమయంలో తమ పార్టీ విధానాన్ని కూడా గట్టిగా వినిపించి పార్టీకి అండగా నిలబడ్డారు. ఆయన సభలో చేసిన ప్రసంగం సభ్యులందరినీ, సీమాంధ్ర ప్రజలని కూడా ఆకట్టుకొంది. కానీ హరికృష్ణ ఆవేశంలో అనాలోచితంగా తన పదవికి రాజీనామా చేసి పార్టీనీ, ప్రజలనీ కూడా కించపరిచారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసానని చెప్పుకొన్న ఆయనే మళ్ళీ మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో తనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయమని కోరడం ఒక తప్పయితే, భంగపడి మళ్ళీ పార్టీపై నిప్పులు కక్కడం మరో తప్పు.   ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు తనను ఆహ్వానించలేదని, పార్టీ కార్యక్రమాల గురించి టీవీలలో చూసి తెలుసుకోవలసిన దుస్థితి తనకు ఏర్పడిందని, అసలు తాను పార్టీలో ఉన్నానా లేదా? అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీకి చెప్పకుండా రాజ్యసభకు రాజీనామా చేసినందునే తనను పార్టీ దూరం పెడుతున్నట్లు భావిస్తున్నానని అన్నారు. ఆయన ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. కానీ తనని పార్టీ ఎందుకు దూరం పెడుతోందో కూడా ఆయనే స్వయంగా గ్రహించినపుడైనా తన వెనుక పార్టీని నడవాలని కోరుకోకుండా, తన అహాన్నిపక్కన బెట్టి తనే పార్టీతో కలిసి నడిచే ప్రయత్నం చేసినట్లయితే ఆయనకీ ఇటువంటి దుస్థితి, ఆవేదన ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ఆయన ప్రజల కోసం, పార్టీ కోసం తన అహం పక్కన పెట్టలేనని భావిస్తే రాజకీయాల నుండి తప్పుకోవడం మేలు.

జగన్ ఓదార్పు తెలంగాణా ప్రజలకి అవసరమా?

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయబోతున్నట్లు ప్రకటించగానే తెలంగాణాను, అక్కడ పార్టీని కూడా వదులుకొని బయటపడిన వైకాపా, సమైక్యాంధ్ర నినాదం అందుకొని సీమాంధ్రపై పట్టుకోసం గట్టిగా కృషి చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాకపోయినా సీమాంధ్రపై పట్టు కోసం జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షలు, ధర్నాలు, సమైక్య సభలు, శంఖారావాలు వగైరా అంటూ చాలానే చేసారు. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తులు చేసారు. ఆ తరువాత విభజనకు వ్యతిరేఖంగా దేశమంతా పర్యటించి వివిధ పార్టీల నేతలని కలిసారు. కానీ, రాష్ట్ర విభజన జరిగిపోయింది. అయినా తెలంగాణా కాళీ చేసేసి సీమంధ్రకు తరలివచ్చేసిన పార్టీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఇంతగా ఆరాటపడటం విడ్డూరంగా ఉన్నా, సీమాంధ్ర ప్రజల మనోభావనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ అక్కడ గట్టి పట్టు సాధించడానికి చాలానే కష్టపడ్డారు.   వెనకటికి ఓ దేవుడెవరో తన భక్తుడితో “నైవేద్యం పెడితే నా మహిమ చూపిస్తానన్నాడుట.” అలాగే ఒకపక్క రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం చేసుకొంటూ “నాకు ముప్పై యంపీ సీట్లు ఇచ్చి చూడండి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే డిల్లీ కుర్చీలో కూర్చోబెడతానని” చెపుతూ అధికారం కోసమే ఈ తిప్పలన్నీ అనే తన మనసులో మాటను తానే బయటపెట్టుకొన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక ముప్పై కాదు ఆయనకు మూడొందల సీట్లు ఇచ్చినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేరనే సంగతి స్పష్టమయింది.   అన్ని రకాల సానుభూతి పవనాలు క్రమంగా తగ్గిపోతునపుడు, అందరి దృష్టి ఆకర్షించేందుకు ఏదో ఒక అంశం పట్టుకొని ముందుకు సాగవలసి ఉంటుంది గనుక జగన్మోహన్ రెడ్డి ఈ సమైక్యాంధ్ర నినాదంతో ఇన్ని రోజులు నెట్టుకొచ్చేసారు. ఇక రాష్ట్ర విభజన జరిగిపోయి ఎన్నికలను ఎదుర్కొనే సమయం ఆసన్నమవుతోంది గనుక, అటక మీద పడేసిన తెలంగాణా జెండాలని క్రిందకు దింపి, దుమ్ము దులిపి మళ్ళీ తెలంగాణాలో పార్టీ నేతలను వెతుకొంటూ జగన్ త్వరలో అంటే మార్చి15 నుండి నల్గొండలో ఓదార్పు యాత్రలు చెప్పట్టబోతున్నారు. కానీ తెలంగాణా ఏర్పడినందుకు సంభరాలు చేసుకొంటున్న తెలంగాణా ప్రజలు ఇంకా ఆయన ఓదార్పుని కోరుకొంటున్నారో, లేదో వారే నిర్ణయించుకోవలసి ఉంది.