ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా..

పేదవాడి యాపిల్ గా పిలుకునే జామపండులో చాలా పోషకాలు ఉంటాయి. కేవలం పేదవాడి యాపిల్ అని పిలుపులోనే కాదు, యాపిల్ తో సరితూగే పోషకాలు కూడా జామపండులో ఉంటాయి. బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క జామ పండు తింటే చాలాసేపు ఆకలి అనే పదం మరచిపోతారు. అయితే ఎప్పుడూ జామ పండ్ల గురించేనా జామ ఆకుల గురించి తెలుసుకోవద్దా.. కాయలు లేకపోయినా సరే చెట్టుకు ఆకులైతే ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున జామ ఆకులను తింటే అద్బుతమైన ప్రయోజనాలుంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను తింటే జీర్ణసంబంధ సమస్యలు అన్నీ చిటికె వేసినట్టు మాయం అవుతాయి. జీర్ణాశయాన్ని శుద్ది చేయడంల, జీర్ణక్రియ పనితీరు మెరుగుపరచడంలో జామ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. జామ ఆకులలో ఫైబర్ చాలా ఉంటుంది. వీటిని ఉదయాన్నే నమిలి తింటే అద్బుతం జరుగుతుంది.  కాంప్లెక్స్ స్టార్స్ను చక్కెరగా మార్చడాన్ని జామఆకులు నిరోధిస్తాయి. ఈ కారణంగా ఇవి శరీరంలో అదనపు చక్కెరలు, అదనపు కొవ్వుల నిల్వను అరికడుతుంది. దీని ఫలితంగా అధికబరువు ఉన్నవారు బరువు తగ్గడానికి జామ ఆకులు తోడ్పడతాయి. ఉదయాన్నే జామ ఆకులు నమిలి తినడం లేదా జామ ఆకులతో టీ తయారుచేసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజుల పాటు చేస్తే శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలలో అతిసారం ఒకటి. అతిసారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.  ఒక గ్లాసు నీటిలో ఒక గుప్పెడు జామ ఆకులు వేసి బాగా మరిగించాలి.  ఈ ద్రావణాన్ని రోజులో రెండుసార్లు కొద్దికొద్దిగా తాగాలి.  ఇలా చేస్తే లూజ్ మోషన్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మధుమేహం ఉన్నవారికి జామకాయలు చాలామంచివి అనే మాట వినే ఉంటాం.  అయితే జామఆకులు కూడా చాలామంచివి. జామఆకులు శరీరంలోని సుక్రోజ, మాల్టోస్ శోషణను నిరోధిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 10నుండి 12వారాలపాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ ఇత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే ఇమ్యునిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా  రోగనిరోధకశక్తి పెంచుతుంది. జామఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులను బాగా కడిగి, మిక్సీ పట్టి పేస్ట్ చెయ్యాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఉదయాన్నే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకులు నమలడం వల్ల కొద్దిరోజులలోనే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోవడానికి కూడా జామ ఆకులను ఉపయోగించవచ్చు. జామ ఆకులను పేస్ట్ చేసి ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉన్నచోట రాయాలి. దీనివల్ల మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.                                                              *నిశ్శబ్ద.

రోజూ కామన్ గా తీసుకునే ఈ 6 ఆహారాలతో ఎంత డేంజరో తెలుసా..

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన,  అందమైన చర్మం కావాలని కోరుకుంటాడు.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి తినే,  త్రాగే  ఆహారాలు, పానీయాలపై  శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.  రోజూ తినే కొన్ని ఆహారాలు చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చడంలో సహాయపడతాయి.  వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే కొన్ని ఆహారాలు  ముఖంపై అకాల ముడతలు,  గీతలను కలిగిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలను సృష్టిస్తాయి.  అందరూ ఆరోగ్యకరం అనుకుంటూ తీసుకునే ఎన్నో ఆహారాలు, పానీయాలు నిజానికి ఆరోగ్యం చేకూర్చకపోగా నష్టం కలిగించడంలో ముఖ్యంగా చిన్నవయసులోనే వృద్దులుగా కనిపించేలా చేస్తున్నాయి.   ఈ ఆహారాలు  గ్లైకేషన్‌ను పెంచి  కొల్లాజెన్‌ ను దెబ్బతీస్తున్నాయి. ఇది చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తుంది.  ఇంతకూ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. శుద్ధి చేసిన విత్తనాల నూనె.. సోయాబీన్, మొక్కజొన్న,  పొద్దుతిరుగుడు వంటి అనేక విత్తన నూనెలలో మంచి మొత్తంలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  కానీ శుద్ది చేసిన నూనెలలో ఒమేగా-3 ఉండదు. పెద్ద ఎత్తున శుద్ది చేయడం వల్ల  ఒమేగా -6 కొవ్వు  ఏర్పడుతుంది. ఇది  అధికంగా  వినియోగించడం వల్ల  శరీరంలో వాపు,  మంట,  చర్మంలో ఎరుపు, చికాకు,  మొటిమలు,  సోరియాసిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. శుద్ధి చేసిన చక్కెర,  కార్బోహైడ్రేట్లు.. శుద్ధి చేసిన చక్కెర,  వైట్ బ్రెడ్ , స్వీట్లు వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఇవి  హార్మోన్లు,  నాడీ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. గ్లూటెన్.. గ్లూటెన్ అసహనం ప్రధానంగా జీర్ణక్రియ,  స్వయం ప్రతిరక్షక సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఇది కొందరిలో  చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఉదరకుహర వ్యాధి, చర్మశోథ హెర్పెటిఫార్మిస్, దురద, పొక్కులు,  దద్దుర్లు మొదలైనవి గ్లూటెన్ అధికంగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు. పాల ఉత్పత్తులు.. కొన్ని పాల ఉత్పత్తులు అలెర్జీలు కలిగి ఉంటాయి. ఇవి  ఆహార సున్నితత్వాన్ని ప్రేరేపిస్తాయి. ఈ కారణంగా  చర్మ సమస్యలను కలిగిస్తాయి. పాలలో కేసైన్,  లాక్టోస్ అసహనం కారణంగా ఇది జరుగుతుంది. సోయా.. సోయాలో ఫైటోఈస్ట్రోజెన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ ప్రభావాలను అనుకరిస్తాయి. సోయా వినియోగం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  హైపర్పిగ్మెంటేషన్ వంటి సమస్యలను పెంచుతుంది. మంచి ప్రోటీన్ అని సోయాను అధికంగా తినే వారు, ఇతర హార్మోన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు సోయాకు దూరంగా ఉండాలి. మొక్కజొన్న.. మొక్కజొన్నను అనేక రకాలుగా తింటారు. మొక్కజొన్న నేరుగా తింటే మంచిదే కానీ దీన్ని అనేక ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా చేస్తున్నప్పుడు అది పెద్ద స్థాయిలో ప్రాసెస్ చేయబడుతుంది.  కార్న్ ఫ్లేక్స్, కార్న్ బాల్స్, కార్మ్ ప్లోర్ వంటి వాటిలోనూ ఇంకా ఇతర ఆహారాలలో దీన్ని వినియోగిస్తారు. ఇలాంటి ఆహారాల ద్వారా దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి.                                    *నిశ్శబ్ద.

ఈ పండ్లు కొలెస్ట్రాల్‎ను తగ్గిస్తాయి..!!

  కొన్ని పండ్లు ఏడాది పొడవునా మార్కెట్‌లో లభిస్తాయి, మరికొన్ని కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి. అయితే పండ్లు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  పండ్లు మన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పని చేస్తాయి. పండ్లలో అలాంటి ఔషధ గుణాలున్నాయి. సహజంగా తినడానికి తియ్యగా ఉండే పండ్లలో ఇలాంటి లక్షణాలు కనిపించడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ పండ్లు తరచుగా తిన్నట్లయితే ఊబకాయం,  కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. యాపిల్: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటారు.  ఎందుకంటే యాపిల్ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.దీనికి కారణం యాపిల్ పండులో కరిగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే. ఇది మీ శరీరం నుండి LDL లేదా చెడు కొవ్వును తొలగిస్తుంది. అవోకాడో బటర్‌నట్ స్క్వాష్: బటర్ ఫ్రూట్ దీనికి మరో పేరు. ఇంతకుముందు ఇది చాలా అరుదుగా లభ్యమైయ్యేది. కానీ ఈ రోజుల్లో ఇది మార్కెట్‌లో సమృద్ధిగా దొరుకుతోంది. అవకాడో తినడం వల్ల మన చెడు కొవ్వు స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బటర్ ఫ్రూట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అరటిపండు: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అరటిపండులో పొటాషియం కూడా ఉంటుంది. సోడియం తీసుకోవడం తగ్గించడంలో రక్తపోటును నిర్వహించడంలో అరటిపండ్లు చాలా మంచివి. కరిగే ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ద్రాక్ష పండు: మీ శరీరంలో కొవ్వు మొత్తం ఎక్కడ దాగి ఉంటే, ద్రాక్షపండు రసం రక్త ప్రసరణ ద్వారా కాలేయానికి తీసుకువెళుతుంది. అక్కడ ఇది ప్రాసెస్ చేయబడుతుంది. శరీరం నుండి చెడు కొవ్వును తొలగించడానికి వీలు కల్పిస్తుంది. బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ: బెర్రీస్ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో,  గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. బెర్రీల రసాన్ని తాగడం ద్వారా, మీరు వీటి యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. పైనాపిల్: శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు పైనాపిల్ సహాయపడుతుంది. చెడు కొవ్వు పదార్థాలను నియంత్రించే గుణం ఇందులో ఉంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. కొలెస్ట్రాల్ నుండి బయటపడటానికి సీజన్లో పైనాపిల్ పండ్ల రసాన్ని త్రాగండి  

షుగర్ పేషంట్లు ఈ కూరగాలయను డైట్లో చేర్చుకోవాలి.!!

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి పెరగడానికి అతి పెద్ద కారణం తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే, మీరు ఈ వ్యాధిని నివారించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచే అనేక ఆహారాలు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయల గురించి మనం తెలుసుకుందాం. కాకరకాయ: కాకరకాయ రుచి ఎంత చేదుగా ఉంటుందో మనందరికీ తెలుసు, కానీ ఈ కూరగాయ మధుమేహ రోగులకు వరం లాంటిది.  పాలీపెప్టైడ్-పి అనే సమ్మేళనం ఇందులో ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీ: మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో విటమిన్ కె, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముల్లంగి: ముల్లంగి, పోషకాలు సమృద్ధిగా, మధుమేహ రోగులకు చాలా ప్రభావవంతంగా నిరూపించవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఈ రూట్ వెజిటబుల్ చాలా సహాయపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుంది. ఆకుకూరలు: ఆకు కూరలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో బచ్చలికూర మధుమేహ రోగులకు ఉత్తమ ఎంపిక. విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, అనేక విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పొట్లకాయ: పొట్లకాయ ఆరోగ్యానికి నిధి. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, మీ ఆహారంలో పొట్లకాయను ఖచ్చితంగా చేర్చుకోండి.    

రాత్రి పడుకునేముందు ఈ పొరపాట్లు చేస్తే జోంబీలుగా మారిపోతారట!

జాంబీ అనే పదం సినిమాలలో వినే ఉంటారు. కేవలం సినిమాలలో వినడమే కాదు, జాంబీలు  ఎలా ఉంటారో కూడా చూసి ఉంటారు.  కళ్లు బాగా ఉబ్బిపోయి, కళ్లకింద నల్లటి వలయాలు, మచ్చలు ఉంటాయి. వారి నడక నుండి ప్రవర్తన వరకు అంతా భయంకరంగా ఉంటుంది. నిజానికి రాత్రి పడుకునే ముందు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల సాధారణ మనుషులు కూడా ఇలా జోంబీలుగా మారిపోతారట. అసలు రాత్రి పడుకునే ముందు చాలామంది చేస్తున్న తప్పేంటి?  దీనివల్ల అంత పెద్ద ప్రమాదం ఎందుకు కలుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. చాలామంది రాత్రి సమయంలో ఆహారం తీసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు భోజనం చేస్తే.. మరికొందరు అలా తినగానే ఇలా నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా అధిక బరువుకు కారణం అవుతుంది. మరికొంతమంది ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్న కారణంగా రాత్రి సమయంలో పడుకోవడానికి ముందు ఆహారం ఆలస్యమైతే ఇక రాత్రి భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకమరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి సమయంలో తినగానే నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో.. అస్సలు తినకుండా ఖాళీ కడుపుతో నిద్రపోవడం కూడా అంతే ప్రమాదం. పైపెచ్చు రాత్రి సమయంలో ఆహారం ఎగ్గొట్టడం వల్ల శరీరంలో విటమిన్-బి12, విటమిన్-డి, కాల్షియం, ప్రోటీన్ మొదలైనవి లోపిస్తాయి.  వీటి లోపం కారణంగా శరీరం చాలా  నష్టపోతుంది. కొన్ని అనుకోని పరిస్థితులలో ఖాళీ కడుపుతో నిద్రపోవడం ఎప్పుడో ఒకసారి జరిగితే అదేమీ అంత  ప్రమాదం చూపించదు. కానీ ఇది ప్రతిరోజూ అలవాటు అయితే  మాత్రం క్రమంగా శరీరం జోంబీలాగా మార్పు చెందుతుందట. కడుపుకు సరైన ఆహారం లేకపోతే రాత్రి సమయంలో నిద్రపట్టడం కూడా కష్టమే. మరొక విషయం ఏమిటంటే రాత్రి సమయంలో ఆహారం తీసుకోకపోతే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుప్రమాదం ఉంటుందట. అందుకే ప్రతి ఒక్కరూ రాత్రి పడుకోవడానికి కనీసం రెండు నుండి 3 గంటలలోపు ఆహారం తీసుకోవడం ముగించాలని చెబుతున్నారు. దీనివల్ల పడుకునే సమయానికి ఆహారం దాదాపుగా జీర్ణమై జీర్ణాశయం కూడా విశ్రాంతి దశలోకి వెళుతుంది.  ఇవన్నీ జరగటం వల్ల జోంబీలుగా మారటం ఏంటి పిచ్చికాకపోతే అని చాలామందికి అనుమానం వస్తుంది. కానీ ఇవన్నీ ధీర్ఘకాలం కొనసాగితే ఎదురయ్యే పరిస్థితి మాత్రం అదే అని పరిశోధకులు చెబుతున్నారు.                                                            *నిశ్శబ్ద.   

పసుపు నీళ్లు ...ఆరోగ్యానికి ఎంతో మేలు..!!

వంటగదిలో ఉంచిన మసాలా దినుసులు ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వంటగదిలో ఉండే పసుపు కూడా ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇందులో ఖనిజాలు, విటమిన్ ఎ, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పసుపును ఉపయోగించడం అనేక వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు నీరు  ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీరు త్రాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పసుపు నీళ్లు దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పసుపునీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: పసుపు నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. పసుపులోని ఈ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. ప్రతిరోజూ ఉదయం పసుపు నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . పసుపును చర్మంపై అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. చర్మ సమస్యలను దూరం చేయడంలో పసుపు నీరు కూడా మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల చర్మంపై వాపు,  చికాకు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు: రోజూ పసుపు నీరు తాగడం వల్ల చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్ రోగులకు పసుపు నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.అంతేకాదు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం నుండి రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణ: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పసుపు నీరు కూడా మేలు చేస్తుంది. దీని కోసం, గోరువెచ్చని నీటిలో రెండు చిటికెల పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడానికి: రెండు కప్పుల నీటిలో ఒక ముద్ద పసుపు వేసి, నీరు సగానికి తగ్గే వరకు ఉడికించాలి. కొంచెం నీరు మిగిలి ఉన్నప్పుడు, దానిని ఫిల్టర్ చేయండి. ఆ తర్వాత అందులో కాస్త తేనె మిక్స్ చేసి తాగితే బరువు తగ్గుతారు.

గోళ్ళ మీద కనిపించే ఇలాంటి లక్షణాలు ఎంత డేంజరో తెలుసా?

చాలామంది వేలి గోళ్ళు, కళ్ళు, పెదవులు, దంతాలు మొదలైనవి చూసి ఆయా వ్యక్తుల శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయనేది చెప్పేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు  డాక్టర్లు కూడా మొదట నాలుక, కళ్లు, చేతివేలి గోళ్లు చూస్తుంటారు.ఆ తరువాతే స్టెతస్కోప్ తో గుండె  వేగాన్ని చెక్ చేస్తుంటారు. అయితే చేతివేలి గోళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు చాలా ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుంది. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్.  ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది.  క్యాన్సర్ లలో పలురకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి చాలా  ప్రమాదకరమైనది అయినప్పటికీ అత్యంత  సాధారణ కేసులు రొమ్ము, పెద్దప్రేగు, పురీషనాళం, ప్రోస్టేట్,  ఊపిరితిత్తుల మొదలైన క్యాన్సర్ లుగా నమోదు అవుతున్నాయి. వీటన్ని వెనుక   ఉన్న అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, దీనికారణంగా ఎంతో మంది వివిధ రకాల జబ్బులతో పోరాడుతున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గణాంకాలు ఎలా ఉన్నాయి? ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా 18లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. వీరిలో అధికశాతం మంది పేలవమైన జీవనశైలి కలిగి ఉన్నవారే కావడం గమనార్హం. ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులలో వివిధ లక్షణాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ దగ్గుతూ ఉంటారు. దీనికి తోడు ఊపిరి తీసుకోవడంలో సమస్య, ఛాతీ నొప్పి, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతులో మార్పు, ఊహించని విధంగా బరువు తగ్గడం, ఎప్పుడూ అలసటగా ఉంటడం,  భుజంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. గోర్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను పైన చెప్పుకున్న అన్ని లక్షణాల ఆధారంగానే కాదు, గోళ్ల కండీషన్ ను బట్టి కూడా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి  చేసిన  కొన్ని పరిశోధనల ప్రకారం   నెయిల్ క్లబ్ లు ఉన్నవారిలో 80శాతం మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. అసలు నెయిల్ క్లబ్బింగ్ అంటే.. నెయిల్ కర్లింగ్ ను నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. కర్లింగ్ అంటే వంపులు తిరిగి ఉండటం. గోర్లు వంకరగా, వెడల్పుగా వాపు కలిది ఉండటం, పై నుండి కిందకు వంగి ఉండటాన్ని నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. ఈ నెయిల్ క్లబ్బింగ్ లో మొదట  గోర్లు పట్టుత్వం కోల్పోతాయి. ఆ తరువాత గోరు వేలు లోపలినుండి కూడా కదలడం, అది కేవలం వేలి మాంస కండ మీద అలా అతుక్కున్న విధంగా అనుభూతిని ఇస్తుంది. జస్ట్ అలా లాగితే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కేవలం ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు.. ఇలా గోర్లు వేలి మూలాల నుండి కదిలినట్టు, పట్టు లేనట్టు ఉంటే అది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యే అవకాశం 80శాతం ఉంది. మిగిలిన  ఛాన్సెస్ లో కుటుంబ చరిత్ర ఆధారంగా ఉదరకుహుర వ్యాధి, లివర్ సిర్రోసిస్, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు అవకాశం ఉంది. కాబట్టి గోర్లు ఎప్పుడైనా దారుణమైన కండీషన్ కు లోనైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవడం ప్రమాదాన్ని  ముందే గుర్తించి జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.                                                       *నిశ్శబ్ద.

యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకునేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.!!

మనలో చాలామంది యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటారు. కొన్ని రకాల జబ్బులకు యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. యాంటీబయాటిక్ మందులు తీసుకునే వారు ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం  జీర్ణక్రియకు మరియు పేగు ఆరోగ్యానికి మంచిది.  బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిర్మూలించడానికి వైద్యులు తరచుగా యాంటీబయాటిక్స్ను సూచిస్తారు. మీరు యాంటీబయాటిక్ మందులు తీసుకుంటే మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి: యాంటీబయాటిక్స్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు. ఇది బ్యాక్టీరియాను చంపడానికి లేదా వాటి పెరుగుదలను ఆపడానికి పనిచేస్తుంది. ఇది దగ్గు, గొంతు నొప్పి,  UTI వంటి కొన్ని ప్రాణాంతక అంటువ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అయితే ఈ మందులు వేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం: ఆయుర్వేద వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చినా వాటి నుంచి బయటపడేందుకు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. కానీ అది మీ పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల, మీ జీర్ణక్రియ,  ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడే ఈ మందులతో పాటు అటువంటి ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి ఆహారాన్ని తినండి: అనారోగ్య సమయంలో మీ కడుపులో మంట వస్తుంది.  కాబట్టి బాగా ఉడికించిన ఆహారం తినడం వల్ల జీర్ణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు మీరు సాదా ఖిచ్డీని చిటికెడు పొడి అల్లం పొడితో తినవచ్చు. మజ్జిగ తాగండి: భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది మీ ప్రేగు ఆరోగ్యానికి అవసరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. మజ్జిగలో 1 చిటికెడు ఉప్పు, అర చెంచా జీలకర్ర పొడి, చిటికెడు గరంమసాలా కలపండి. దీని కారణంగా, యాంటీబయాటిక్స్ కడుపుపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపదు. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి: యాంటీబయాటిక్స్ మీ ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి, మీకు ఆకలిగా అనిపించే వరకు తినవద్దు. ఆకలి పెరగాలంటే గోరువెచ్చని నీరు తాగి నెమ్మదిగా నడవాలి. ఇది మీ ఆకలిని పెంచడానికి సహాయపడుతుంది. సూప్ తాగండి: ద్రవాలు త్వరగా జీర్ణమవుతాయి. మృదువుగా ఉంటాయి. శరీరం వాటిని సులభంగా గ్రహిస్తుంది. మీరు వెజిటబుల్ సూప్, అన్నం గంజి, మూంగ్ పప్పు తినవచ్చు.. ఇది సులభంగా జీర్ణమవుతుంది. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, రూట్ వెజిటేబుల్స్ తినవద్దు: భూగర్భంలో పండే కూరగాయలు జీర్ణం కావడం కష్టం. అవి జీర్ణం అయినప్పుడు ఆమ్లాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ జీర్ణం కావడం కష్టం. గ్యాస్ట్రిక్‌కు కారణం అయ్యే ఛాన్స్ ఉంటుంది.

పాలతోపాటు ఈ పదార్థాలు తినకూడదని తెలుసా...

పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులోని పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  పోషకమైన పాలు మన కండరాలకు, ఎముకలకు, మెదడుకు మేలు చేస్తాయి. ఇది అన్ని వయసుల వారికి మంచిది. పరిమిత పరిమాణంలో దీనిని తాగడం వల్ల వృద్ధిని వేగవంతం చేయవచ్చు. పాలు, పెరుగు, మజ్జిగ, పెరుగు,  దేశీ నెయ్యితో తయారు చేసినందున అవి కూడా సమానంగా ఆరోగ్యంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: హార్వర్డ్ ప్రకారం, ప్రతిరోజూ పాలు తాగడం ద్వారా, మీరు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ B2, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D ను పొందవచ్చు. ఇది మీ ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. కాబట్టి పాలను పిల్లలకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు తాగిన తర్వాత పుల్లటి పండ్లు తినడం: ప్రజలు అల్పాహారం కోసం పాలతో అనేక పండ్లను తింటారు. కానీ ముఖ్యంగా పుల్లని పండ్లను నిమ్మ, నారింజ వంటి వాటిని ఎప్పుడూ పాలతో తినకూడదు. దీని వల్ల కడుపులో ఆమ్లం పెరిగి జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంటకు కారణమవుతుంది. పాలతో పుల్లని పండ్లను తీసుకోవడం వల్ల కడుపులో అదే ప్రక్రియ జరుగుతుంది. పాలతో అరటిపండు తినడం: పాలతో అరటిపండు తినడం చాలా ప్రసిద్ధి. ఇది శరీరానికి ప్రాణం పోసేలా పనిచేస్తుంది. కానీ ఆయుర్వేదం ఈ కలయికను అందరికీ ఆరోగ్యకరమైనదిగా పరిగణించదు. ఇది శరీరంలో కఫాన్ని పెంచుతుంది కాబట్టి, ఇది ఎగువ శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అధిక ఫైబర్ ఆహారాలు: మీరు పాలతో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అధిక ఫైబర్ తీసుకోవడం దానితో కాల్షియంను బంధిస్తుంది. దీని కారణంగా శరీరం దానిని ఉపయోగించుకోలేకపోతుంది. అది పూర్తిగా విసర్జించబడుతుంది. ఇది శరీరంలో తీవ్రమైన కాల్షియం లోపానికి కారణమవుతుంది. టొమాటో: టొమాటో ఆహారం రుచిని పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తితో పాటు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టొమాటోలు లేదా వాటితో చేసిన పాస్తా, పిజ్జా వంటి ఆహారాలను పాలతో కలిపి తినకూడదు. ఈ ఆహారం ఆమ్లంగా ఉంటుంది, ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది. కొన్ని రకాల మందులు: ప్రతి ఔషధం తీసుకోవడానికి సరైన మార్గం ఉంది. కొన్ని మందులు పాలతోనూ, మరికొన్ని నీళ్లతోనూ తీసుకుంటారు. కాబట్టి కొన్ని మందులను పాలతో కలిపి తీసుకోకూడదు. ఈ కారణంగా, మందులు ప్రభావవంతంగా లేవు. వ్యాధి అలాగే ఉంటుంది. అధిక ప్రోటీన్ ఆహారాలు: ఫైబర్ మాదిరిగా, చాలా ప్రోటీన్ పాలతో తీసుకోకూడదు. ఇటువంటి ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పాలు జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది. దీనివల్ల కడుపులో భారం, విరేచనాలు, కడుపునొప్పి, కొంతమందికి చాలా ఇబ్బంది కలుగుతుంది.  

ప్రతిరోజూ రెండు చిన్న లవంగాలు నమిలి గ్లాసుడు గోరువెచ్చని నీరు తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..

లవంగాలు వంటగదిలో ఉండే మసాలా దినుసు.  ఇది వంటల్లోకే కాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలున్నప్పుడు కషాయం తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో లవంగాలకు ఔషద స్థానం ఇచ్చారు. లవంగాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే  విటమిన్-సి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నూనెను ఉపయోగించడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది.  ఇంత శక్తివంతమైన లవంగాలను ప్రతిరోజూ రెండు నమిలి తిని గోరువెచ్చని నీరు తాగితే అద్బుతాలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. లవంగాలు తినడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది , ఎందుకంటే ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల పరిమాణాన్ని పెంచుతుంది.  ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి లవంగాలలో లభిస్తుంది, ఇది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన విటమన్.  లవంగాలలోని యాంటీ-వైరల్ గుణం రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది  రక్తంలోని టాక్సిన్లను తగ్గిస్తుంది.   తెల్ల రక్త కణాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ రెండు లవంగాలు తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే  జరిగే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.   మలబద్దకం  నుండి ఉపశమనం కలిగిస్తుంది.. లవంగం జీర్ణ సమస్యలకు చికిత్సగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది,  వికారం కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదని,  మలబద్ధకం సమస్యను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పంటినొప్పిని దూరం చేస్తుంది.. లవంగాలలో  మత్తు లక్షణాలు ఉంటాయి.  పంటి నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందాలంటే లవంగాన్ని గ్రైండ్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని  దంతాలు,  వాపు ఉన్న చిగుళ్లపై రాయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా లవంగాల నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతిరోజూ 2 చిన్న లవంగాలు నమిలి తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే అస్సలు పంటి నొప్పి, చిగుళ్ళ వాపు వంటి సమస్యలే ఎదురుకావు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. మన శరీరాన్ని శుద్ది చేయడానికి,  మనం తీసుకునే మందులను జీవక్రియ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజినాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నొప్పి,  వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు తాగితే కాలేయానికి సంబంధించిన సమస్యలే రావు. నొప్పి, వాపు తగ్గిస్తుంది.. లవంగాలలో యూజీనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తినడం అలవాటు చేసుకుంటే ఈ నొప్పులు, వాపులు ఆమడ దూరం ఉంటాయి. ఎముకలు, కీళ్లకు మంచి మెడిసిన్.. లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్,  యూజినాల్ వంటి కొన్ని మూలకాలు ఉంటాయి, ఇవి ఎముకలు,  కీళ్ల ఆరోగ్యానికి మంచివి.  ఇవి  ఎముకల మందాన్ని పెంచుతాయి,  ఎముక కణజాలం ఏర్పడటానికి సహాయపడతాయి. అంతే కాదు  ఎముకలకు ఆరోగ్యకరమైన ఖనిజాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.. ఇంట్లో ఎవరికైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, లవంగాలు శరీరంలో ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ఇది  రక్తం నుండి అదనపు చక్కెరను  కణాలలోకి ఎగుమతి చేస్తుంది,  మిగిలిన చక్కెరను సమతుల్యం చేస్తుంది. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు , చక్కెర వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు రోజూ రెండు లవంగాలు తిని, గోరువెచ్చని నీరు తాగడం మంచిది.                                                             *నిశ్శబ్ద.  

అధిక యూరిక్ యాసిడ్‎తో కీళ్ల నొప్పులే కాదు..ఈ వ్యాధులు తప్పవు..!!

ఈ రోజుల్లో అధిక యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణంగా మారింది. దీనికి అతి పెద్ద కారణం చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ కేలరీలు తీసుకోవడం. నిజానికి, యూరిక్ యాసిడ్ శరీరంలో మురికి వలె పేరుకుపోతుంది.  ఇది అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో సహా అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి, చాలా సార్లు యూరిక్ యాసిడ్ శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో, అది విడుదల కానప్పుడు, అదనపు యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగడం ప్రారంభమవుతుంది. యూరిక్ యాసిడ్ పెంచడంలో ప్యూరిన్ అనే ప్రోటీన్ పెద్ద పాత్ర పోషిస్తుంది. దీని వల్ల వచ్చే 5 తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకుందాం.. ఆర్థరైటిస్ కీళ్ల నొప్పి: యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు. అధిక యూరిక్ యాసిడ్ ఉన్న రోగుల శరీరంలో, ఈ యాసిడ్ చేతులు, కాళ్ళ కీళ్ళలో చిన్న స్ఫటికాల రూపంలో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా, ఆర్థరైటిస్‌తో బాధపడే ప్రమాదం ప్రజలలో పెరుగుతుంది. ఇది కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది, ఈ నొప్పి కొన్నిసార్లు భరించలేనిదిగా మారుతుంది. అందువల్ల, మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతుంటే, ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకొని మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరచండి. అధిక రక్త పోటు: అధిక BP లేదా రక్తపోటు అనేది పెద్దవారిలో గుండె జబ్బు యొక్క అత్యంత సాధారణ రూపం. పెరుగుతున్న వయస్సుతో, ఈ వ్యాధి గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్‌కు కూడా కారణమవుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యొక్క మ్యాగజైన్‌లో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం, వారి రక్తంలో యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉన్న వ్యక్తులకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. కాబట్టి అలాంటి వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మధుమేహం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి సక్రమంగా లేనప్పుడు, ఈ ఇన్సులిన్ కారణంగా కూడా దాని సమతుల్యత దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో, యూరిక్ యాసిడ్ రోగులలో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. గుండె వ్యాధి:  రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు కూడా గుండెపోటుకు గురవుతారు, అందువల్ల యూరిక్ యాసిడ్ సమస్యను తేలికగా తీసుకోకూడదు. కిడ్నీల్లో రాళ్లు: యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల, మూత్రపిండాలు సాఫీగా ఫిల్టర్ చేయలేవు.  దాని స్ఫటికాలు యూరిన్ ట్యూబ్‌లో నిక్షిప్తమవుతాయి. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది. వీటన్నింటితో పాటు, యూరిక్ యాసిడ్ రోగులు చేతులు, కాళ్ళలో మంట, వేళ్లలో భరించలేని నొప్పి, దృఢత్వం, మూత్రవిసర్జనలో ఇబ్బంది, మూత్ర నాళంలో మంట వంటి వాటితో కూడా బాధపడతారు.  

పండ్లు ఎలా తీసుకుంటే ఎక్కువ లాభాలుంటాయి? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..

రోజూ పండ్లు తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం శరీరం  మెరుగైన పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలను పండ్లు కలిగి ఉంటాయి. పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు,  మినరల్స్ ఉంటాయి. పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బులు,  పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది, మధుమేహం నియంత్రణలోనూ, స్థూలకాయాన్ని తగ్గించడంలోనూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. కంటి సమస్యలు,  జీర్ణ సమస్యలను నివారించడానికి,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను నివారించడానికి పండ్లు మంచి ఔషదం. ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి నియమాలు, కాలానుగుణ నియమాలు ఇలా  మరెన్నో జాగ్రత్తలు ఉంటాయి. పండ్లను సరైన పద్ధతిలో తినడానికి కూడా ఆయుర్వేదం నియమాలను సూచించింది. తద్వారా  పండ్ల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు.   వాటిని సరైన మార్గంలో  తీసుకుంటే ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనం ఉంటుంది. తప్పుడు మార్గంలో,  తప్పు సమయంలో పండ్లు తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. పండ్లు ఎలా తీసుకోకూడదో ఆయుర్వేదం చెప్పిన నియమాలు ఏంటో తెలుసుకుంటే.. ఆహారంతో పాటు పండ్లు తినకూడదు.. చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల పేగుల్లో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఆయుర్వేదంలో కొన్ని విషయాలను 'ఆమ' అంటే విషపదార్థాలు అంటారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కాకుండా అనేక చర్మ సమస్యలు,  వాపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పండ్లను జ్యూస్ చేస్తే  ప్రాణానికే ముప్పు.. చాలా సులువుగా ఉంటుందని ఎక్కువ మంది పండ్లు తినడం కంటే పండ్ల రసాన్ని తీసుకోవడానికి ఇస్టపడతారు. అయితే పండ్ల రసం తీసుకున్నంత  మాత్రాన ప్రయోజనం ఉండదు.  పండ్ల నుండి ఎక్కువ పోషకాలను పొందడానికి  మొత్తం పండు తినాలి.  రసం తాగడం ద్వారా  ఫైబర్ తో పాటు  అనేక ఇతర మూలకాలను కోల్పోతారు. డిన్నర్‌లో లేదా సాయంత్రం తర్వాత పండ్లు తినవద్దు.. ఆయుర్వేదం ప్రకారం  పండ్లను సాయంత్రం లేదా రాత్రి భోజనం చేసినప్పుడు తీసుకోకూడదు.  ఈ సమయాన్ని కఫా కాలం అని, ఈ కాలంలో పండ్లు జీర్ణం కావడానికి చాలా బరువుగా ఉంటాయని,  ఇది దోష అసమతుల్యతకు దారితీస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలలో పండ్లను కలపవద్దు.. పాలతో పండ్లను తినడం విరుద్ధ ఆహారం అని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది పాలను పండ్లను మిక్సీ పట్టి మిల్క్ షేక్ చేసుకుని ఇష్టంగా తాగుతుంటారు.   అరటిపండు తియ్యగా ఉన్నప్పటికీ పేగులకు భారంగా ఉంటుంది. అందుకే అరటిపండ్లు పాలు కలిపి తినకూడదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎల్లప్పుడూ సీజనల్ పండ్లను మాత్రమే తినాలి.. సీజన్‌లో లభించే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇతర పండ్లు రసాయనాల ద్వారా ఎక్కువ కాలం భద్రపరచబడతాయి. సీజనల్ లేని పండ్లను తినడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. పైపెచ్చు సీజన్ కాని పండ్లు సహజంగానే ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కాబట్టి సీజన్ లో లభించే పండ్లను తాజాగా ఉన్నట్టే తినాలి.                                                        *నిశ్శబ్ద.

పురుషుల్లో థైరాయిడ్ సమస్యను ఎలా గుర్తించాలి? దాని ప్రభావం ఎలా ఉంటుంది..

సాధారణంగా థైరాయిడ్ సమస్యతో మహిళలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అయితే పురుషులకు కూడా ఈ సమస్య ఉంటుందని మీకు తెలుసా? పురుషులలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం అనేది మీ థైరాయిడ్ గ్రంథి మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిని "హైపర్ థైరాయిడిజం" అని కూడా అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది మీ గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం సాధారణంగా నియంత్రణలో ఉంచుకోవడానికి మందులు అవసరం. కాబట్టి పురుషులలో థైరాయిడ్‌కు ఎలాంటి చికిత్సలు అందించవచ్చో చూద్దాం. పురుషులలో హైపర్ థైరాయిడిజం యొక్క కారణాలు:  గ్రేవ్స్ వ్యాధి పురుషులలో హైపర్ థైరాయిడిజంకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  గ్రేవ్స్ వ్యాధి  ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధిపై  దాడి చేయడం వల్ల వస్తుంది. దీని వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువమొత్తంలో అయోడిన్, దుష్ప్రభావాలను కలిగించే మందులను తీసుకోకుండా ఉండాలని సలహా ఇస్తారు. కాబట్టి పురుషులలో థైరాయిడ్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు? -బరువు తగ్గడం లేదా పెరగడం. -క్రమరహిత హృదయ స్పందన -భయం -చిరాకు -అలసట -వేళ్లు, చేతులు వణకడం -చెమటలు -కండరాల బలహీనత -జుట్టు ఊడుట పురుషులు, మహిళలు సాధారణంగా ఈ హైపర్ థైరాయిడిజానికి సంబంధించి  ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, పురుషులను మాత్రమే ప్రభావితం చేసే కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి, -అంగస్తంభన లోపం -తక్కువ స్పెర్మ్ కౌంట్ -అకాల బట్టతల -లైంగిక ఆరోగ్యంపై ప్రభావం ఈ థైరాయిడ్ హార్మోన్లు పురుషుల వృషణాలలోని కొన్ని కణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. హైపర్ థైరాయిడిజం స్పెర్మ్ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది స్పెర్మ్ సాంద్రత, చలనశీలతను తగ్గించడమే కాకుండా, స్పెర్మ్ యొక్క అసలు ఆకారం లేదా రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంగస్తంభన పనితీరును ప్రభావితం చేయవచ్చు.వంధ్యత్వానికి కారణం కావచ్చు.తక్కువ స్పెర్మ్ కౌంట్ దారితీస్తుంది. థైరాయిడ్‌కు మందులు, శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. స్త్రీలు లేదా పురుషులు సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అదనంగా, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం శరీరానికి చాలా ముఖ్యమైనవి.

మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆకులు ఆహారంలో భాగం చేసుకుంటే సరి..

ఈ రోజుల్లో, ప్రజల జీవన విధానం వేగంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం,బిజీ షెడ్యుల్ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై  ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా  చుట్టూ ఉన్న చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇలాంటి  పరిస్థితిలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం.  అలవాట్లు  జీవనశైలితో పాటు,  ఆహారం కూడా మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆహారంలో సరైన మార్పులు చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా  మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.  కొన్ని సహజ మూలికలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అశ్వగంధ అశ్వగంధలో చాలా  అద్భుత లక్షణాలు ఉంటాయి. ఇది అనేక సమస్యలకు  దివ్యౌషధంగా పనిచేస్తుంది.  దీనిని సాధారణంగా ఇండియన్ జిన్సెంగ్ అంటారు. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది, ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడికి లోనయ్యేవారు అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. బ్రహ్మి లేదా సరస్వతి..  బ్రహ్మి  మానసిక ఆరోగ్యానికి  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యాలకు చికిత్స చేయడంతోపాటు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి శక్తివంతమైన మూలిక.  బ్రాహ్మీ టీ తీసుకోవచ్చు. పసుపు.. అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు , ఎన్నో ఏళ్ళ నుండి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తున్నారు.  జలుబు, దగ్గు లేదా ఏదైనా గాయం ఇలా ఏదైనా సరే  పసుపు అన్నింటికీ దివ్యౌషధం. వీటన్నింటితో పాటు ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ నివారణ. పసుపు పాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. తిప్పతీగ.. దీనినే గుడుచి అని కూడా అంటారు. తిప్పతీగ చాలా కాలంగా అనేక సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నప్పటికీ, కరోనా కాలం నుండి  ప్రజాదరణ మరింత పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ మూలిక డిప్రెషన్ చికిత్సలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఒత్తిడిని తగ్గించడంలో,  జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. తులసి.. హిందూ మతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు తులసి  ఆరోగ్య ప్రయోజనాల వల్ల  కూడా ప్రసిద్ధి చెందింది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది చాలా ప్రభావవంతమైన మూలికలలో ఒకటి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.                                                           *నిశ్శబ్ద.  

ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. రెండు నిమిషాలలో కడుపు ఉబ్బరం అంతా తగ్గిపోతుంది..

 తరచుగా అపానవాయువు, బరువు పెరగడం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించానికి చాలామంది జీర్ణశక్తిని పెంచే టాబ్లెట్స్, సిరప్ వంటి వాటిపై ఆధారపడుతుంటారు. కానీ ఇవన్నీ సహజమైన జీర్ణవ్యవస్థను దెబ్బతీసేవే. వీటి వాడకం వల్ల సహజంగా ఆహారం జీర్ణం కాదు.కానీ ఆయుర్వేదం ఈ సమస్యలకు అన్నింటికి మంచి పరిష్కారాలు సూచించింది. అది కూడా ఇంటిపట్టున తక్కువ ఖర్చుతో ఈ సమస్యలు అధిగమించవచ్చు. కడుపు సమస్యలను అన్ని పరిష్కరించడంలో  సొంపు లేదా సోపు చక్కగా సహాయపడుతుంది. అసలు సోపులో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి? సోపును ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి పూర్తీగా తెలుసుకుంటే.. సోపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. సోపు తినడం వల్ల బలం చేకూరుతుంది.  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పిత్త దోషం సాధారణంగా  వేడి ఎక్కువ కావడం వల్ల కలుగుతుంది.  అధికవేడి  వల్ల కలిగే రక్తస్రావ రుగ్మతలలో కూడా సోపు ఔషదంగా  ఉపయోగపడుతుంది జీర్ణ శక్తిని పెంచుతుంది.  గుండెకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.  బహిష్టు సమయంలో నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. సోపు నీరు శరీరంలోని ధాతువులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది, ఇది పాలిచ్చే స్త్రీలలో తల్లి పాలను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సోపులోని సాత్విక లక్షణాలు మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా  మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కళ్ళకు రిఫ్రెష్‌గా కూడా సహాయపడుతుంది. శ్వాసకోశ,  ఊపిరితిత్తులలో పేరుకుపోయిన పెరిగిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది.  సోపును ఎవరు ఎలా ఉపయోగించాలంటే.. జీర్ణ సమస్యలకు - అసిడిటీ,  పిత్త సమస్యలకు, అర టీస్పూన్ పంచదారతో 1 టీస్పూన్ సోపు విత్తనాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని నమిలి తినాలి. బరువు తగ్గడం, దగ్గు, జలుబు, నెలసరి తిమ్మిర్లు, వికారం, కడుపులో నులిపురుగులు వంటి సమస్యల కోసం సోపుతో హెర్బల్ టీని తయారు చేసుకుని తాగాలి.  సోపు టీ  కోసం..  1 టీస్పూన్ సోపును 1 గ్లాసు నీటిలో 3-5 నిమిషాలు ఉడకబెట్టి, ఫిల్టర్ చేసి, సిప్ బై సిప్ త్రాగాలి. మెరుగైన జీర్ణక్రియ కోసం భోజనానికి ఒక గంట ముందు లేదా తర్వాత సోపు టీని త్రాగాలి. 1 గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర, కొత్తిమీర,  సోపు వేసి 5 నిమిషాలు ఉడికించి వడపోసి, సిప్ బై సిప్ త్రాగాలి. ఇలా చేస్తే కేవలం రెండే రెండు నిమిషాలలో కడుపు శుభ్రమవుతుంది.                                                           *నిశ్శబ్ద

బాదం పప్పు తింటే ఎన్ని లాభాలో అనుకున్నాం కానీ ఈ నిజాలు తెలిస్తే..

బాదం పప్పు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ  బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటె  గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది, మెదడును చురుగ్గా మార్చుతుంది.  బరువు తగ్గడానికి, బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  క్యాన్సర్ రాకుండా చేయడంలోనూ, జుట్టు పెరుగుదలలోనూ చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, బాదం  హానికరం. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. దీనివల్ల  ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలుసుకుంటే.. తరచుగా కడుపులో మంట లేదా యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం  గురించి ఫిర్యాదు చేసేవారు,  బాదం తీసుకోవడం తగ్గించాలి, ఇది  సమస్యను మరింత కడుపులో యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది. బాదంపప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులను ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే మూత్రపిండాల సమస్య ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బాదం పప్పుకు దూరంగా ఉండాలి. బాదంపప్పులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాదం పప్పును ఎక్కువగా తీసుకోవడం లేదా నానబెట్టకుండా   తీసుకోవడం వల్ల కడుపులో భారం అంటే ఉబ్బరం, విరేచనాలు,  పొత్తికడుపు నొప్పి వంటివి కూడా కలుగుతాయి. బాదంపప్పులను ఎక్కువగా తీసుకోవడం వల్ల, ముఖ్యంగా పచ్చి బాదంపప్పులు తీసుకోవడం వల్ల నోటి అలర్జీలు, గొంతు నొప్పి,  పెదవుల వాపు వంటివి ఏర్పడతాయి. అందుకే బాదం పప్పు లిమిట్ గా తీసుకోవాలి. బాదంపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ  అధిక  పైబర్   శరీరానికి ఇతర ఆహారాల  వల్ల లభించే ఐరన్, జింక్  కాల్షియం వంటి పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఐరన్ తక్కువైతే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చాలా రకాల అనారోగ్యాలకు మూలమవుతుంది.                                                           *నిశ్శబ్ద.  

పచ్చి పాలు తాగితే ప్రమాదమా?

పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు. పచ్చిపాలు తాగ వచ్చా? ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు. పాల వల్ల లాభాలు... కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి? పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు  తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు. పచ్చి పాలు తాగితే ఏమౌతుంది? పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా...

  ఎసెన్షియల్ ఆయిల్స్ గత కొంతకాలంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ఒక్కరూ ఈ  నూనెల  సువాసనను ఇష్టపడతారు.  ఇది కేవలం సువాసనే కాదు ఎన్నో సమస్యల్లో ఉపశమనం కూడా ఇస్తుంది. ఇది కాకుండా,  ఈ నూనెలను ఏదైనా ఇతర నూనెతో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయవచ్చు, డిఫ్యూజర్‌లో ఉపయోగించవచ్చు లేదా వాసన చూడవచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ లో   లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. దీని అద్భుతమైన ప్రయోజనాల గురించి  తెలుసుకుంటే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.. చర్మం నుండి బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. గోళ్ళలో ఫంగస్ లేదా చుండ్రు ఉన్నట్లయితే  టీ ట్రీ ఆయిల్‌కు బదులుగా లెమన్ ఆయిల్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.  దీన్ని చర్మంపై అప్లై చేయడమే కాకుండా, ఎయిర్ డిఫ్యూజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని సువాసన గదిలో ఉండే ఫంగస్ మరియు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి  ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి. నిమ్మకాయతో తయారు చేయబడిన ఎసెన్షియల్ ఆయిల్  స్టెఫిలోకాకస్ ఆరియస్,  ఇ.కోలి వంటి బ్యాక్టీరియా నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటుందని 2019లో చేసిన పరిశోధనలో కనుగొనబడింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ను  ఏదైనా ఇతర క్యారియర్ ఆయిల్ తో  కలిపిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.  అప్లై చేసే ముందు ప్యాచ్  టెస్ట్ చేయాలి.  ఈ జాగ్రత్త వల్ల  అలెర్జీలను నివారించవచ్చు. గాయాలను త్వరగా నయం చేస్తుంది.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు  గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో గాయాన్ని శుభ్రం చేయవచ్చు. అయితే ఇతర క్యారియర్ ఆయిల్ తో కలిపే వాడాలి. ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది.  గాయాలను త్వరగా నయం చేస్తుంది. చలికాలానికి ది బెస్ట్.. చలికాలంలో తలనొప్పి, జలుబు కారణంగా తలంతా బరువుగా ఉన్నా, గొంతులో నొప్పి,  వాపు వంటి సమస్య ఉన్నా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా  ఉపయోగపడుతుంది. ఈ నూనెను  డిఫ్యూజర్‌లో ఉపయోగించడం వల్ల దాని సువాసన శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఓ రకంగా అరోమా థెరపీ అనుకోవచ్చు.  ఇది  గొంతులో వాపు,  నొప్పిని తొలగిస్తుంది. అదే సమయంలో, ఇందులో ఉండే విటమిన్-సి జలుబ,  ఫ్లూ నుండి ఉపశమనం ఇస్తుంది. వికారం వదిలించుకోవడానికి.. వికారం  బాధపెడుతుంటే, నిమ్మ నూనె  సహాయం చేస్తుంది. గర్భిణీ స్త్రీలలో కూడా కలిగే వేవిళ్ళు, ఇతర సందర్భాలలో సాదారణ ప్రజలకు ఎదురయ్యే వికారానికి   ఈ నూనె చక్కగా సహాయపడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.. నిమ్మ నూనె సువాసన  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సువాసన ఆందోళన,  టెన్షన్‌ని దూరం చేస్తుంది.  దీనివల్ల  రిలాక్స్‌గా ఉండచ్చు.   సాధారణంగా లావెండర్ లేదా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఆందోళన, డిప్రెషన్  లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు, అయితే నిమ్మ నూనె ఈ రెండు నూనెల కంటే మెరుగైనది. చర్మానికి మేలు చేస్తుంది.. చర్మంపై మొటిమలు,  చీము తగ్గించడానికి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్  ఉపయోగించవచ్చు.  ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది సహజంగానే  రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది.  చర్మం మీది మృత కణాలను శుభ్రపరచడం, మూసుకుపోయిన  రంధ్రాలను తెరవడం ద్వారా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేసి  ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. అయితే నిమ్మకాయ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి.                                                               *నిశ్శబ్ద.

విటమిన్ బి12 లోపం..ఈ వ్యాధులకు కారణం..!!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అత్యంత అవసరమైన విటమిన్లలో  విటమిన్ బి-12 కూడా ఒకటి . విటమిన్ B12 శరీరంలో సహజంగా ఉత్పత్తి అవ్వదు. ఇది ఆహారం, పానీయాల నుండి మాత్రమే లభిస్తుంది. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడటానికి అవసరం. మెదడు, నరాల కణాల అభివృద్ధిలో విటమిన్ B-12 చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఈ విటమిన్ చాలా అవసరం. వృద్ధాప్యంలో దాని లోపం కారణంగా, డిమెన్షియా సమస్య ఉండవచ్చు. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా దాని లోపానికి గురవుతారు. అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం మెదడుకు సంబంధించిన సమస్యలు. 60 సంవత్సరాల వయస్సులో, ఈ రెండు వ్యాధుల ప్రమాదం పురుషుల నుండి స్త్రీలకు పెరుగుతుంది. ఈ వ్యాధిలో ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి విటమిన్ బి-12. విటమిన్ బి12 లోపం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం: డిమెన్షియా అనేది ఒక వ్యాధి, దీనిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మరచిపోయే సమస్యలను కలిగి ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ బి12 లోపం. ఇది మన మనస్సును నేరుగా ప్రభావితం చేస్తుంది. డిమెన్షియాలో, ఒక వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. విటమిన్ B-12 వల్ల కలిగే ఇతర సమస్యలు: కీళ్లు,ఎముకల నొప్పి: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్య కూడా రావచ్చు. దీని కారణంగా, నడుము, వెన్నులో నిరంతర నొప్పి ఉండవచ్చు. గర్భంలో సమస్య: విటమిన్ B-12 లోపం యొక్క ప్రభావం గర్భిణీ స్త్రీలలో కూడా కనిపిస్తుంది. ఈ కారణంగా, పిల్లల అభివృద్ధి సమయంలో, గర్భధారణ సమయంలో సమస్యలు పెరుగుతాయి. దాని లోపం కారణంగా, గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మ వ్యాధి: శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వేధిస్తాయి. దాని లోపం వల్ల జుట్టు కూడా చాలా వేగంగా రాలిపోతుంది. రక్తహీనత: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. విటమిన్ బి-12 లోపం వల్ల ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు. అటువంటి పరిస్థితిలో, హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. రక్తహీనత పూర్తి అవకాశాలు ఉన్నాయి. విటమిన్ B-12 లోపానికి చికిత్స చేసే ఆహారాలు: విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి, మీ ఆహారంలో పాలు, చీజ్, ఇతర పాల ఉత్పత్తుల మొత్తాన్ని పెంచండి. మీరు మాంసాహారులైతే, ముఖ్యంగా మీ ఆహారంలో గుడ్లు, మాంసాన్ని చేర్చుకోండి. మీరు డాక్టర్ సలహాపై ఈ విటమిన్ యొక్క సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.