మీకు హైబీపీ ఉందా? ఈ తప్పులు చేయండి. లేదంటే..?

ప్రస్తుత కాలంలో, చాలా మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.  దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మన బిజీ లైఫ్ స్టైల్,  అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అధిక బీపీకి కారణమవుతున్నాయి.  అదే సమయంలో, మీకు అధిక బీపీ సమస్య ఉంటే, మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ఈ తప్పులు ప్రాణాంతకం కావచ్చు. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసినప్పుడు రక్తపోటు సమస్య పెరుగుతుంది. కాబట్టి బీపీ పేషెంట్లు ఈ తప్పులకు దూరంగా ఉండాలి. బీపీని చెక్ చేసుకోవాలి : మీకు రక్తపోటు సమస్య ఉంటే, మీరు ప్రతిరోజూ మీ రక్తపోటును తనిఖీ చేయాలి. ఉదయం నిద్రలేచిన అరగంట తర్వాత బీపీని చెక్ చేసుకోవడానికి ఉత్తమ సమయం. మధ్యాహ్నం పూట రక్తపోటు పెరుగుతుంది కాబట్టి, సాయంత్రం కూడా బీపీని చెక్ చేసుకోవాలి. బీపీ మాత్రలను విస్మరించకూడదు: చాలా సార్లు బీపీ రోగులు రక్తపోటు పెరిగినప్పుడు మందులు తీసుకుంటారు. కానీ, మామూలుగా మారగానే లేదా బద్ధకం వల్ల మందులు తీసుకోవడం మానేస్తారు. బీపీకి చికిత్స జీవితాంతం కొనసాగుతుంది. చికిత్స తీసుకోవాలి: సాధారణ BP 120/80. కానీ, రక్తపోటు 130/90 కంటే ఎక్కువ ఉంటే అది మీకు ప్రమాదకరం. అందువల్ల, మీకు రక్తపోటు సమస్య ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స పొందండి. ఈ పదార్థాలకు దూరంగా: బీపీ రోగులకు ప్రాసెస్ చేసిన ఆహారం విషం.  కాబట్టి మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు ప్రాసెస్ చేసిన.. స్తంభింపచేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ సమస్య లేని వారు కూడా అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.  ఎప్పటికప్పుడు చెక్  చేసుకోవాలి: రక్తపోటు సమస్యలు ఉన్నవారు, వారి బిపి ఎక్కువ లేదా తక్కువ ఉంటే మందులు తీసుకోండి.  బీపీ పేషెంట్లు తమ శరీరాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.    

సిగరెట్ తాగేవారికి పిల్లలు పుట్టరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

ప్రతి మనిషి జీవితంలోనూ పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ బోలెడు దశలు మారతాయి.  పుట్టిన వాడు పెరగక మానడు, పెరిగిన వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనక మానడు. కానీ ఇప్పటి కాలంలో చాలామంది మగవారు పిల్లలను కనడంలో ఫెయిల్ అవుతున్నారు. నిజానికి ఈ సమాజంలో ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే ఎన్నెన్నో మాటలు అంటారు. అదే లోపం మగవాడిలో ఉంటే  అతన్ని కూడా పనికిరాడు అనే మాటను నిర్దాక్షిణ్యంగా అనేస్తుంటారు.  మగవారిలో పిల్లలు కలగడానికి తగిన సామర్థ్యం లేదంటే అది వీర్యకణాల లోపంగా పరిణిస్తారు.  చాలామంది సరదా కోసం, ఫ్యాషన్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి చేసే ధూమపానం  పిల్లలు కలగకపోవడానికి ఒక ప్రధానకారణం అవుతుందనే విషయం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.  అసలు ధూమపానం మగవారిలో సంతానం కలగకుండా ఉండటానికి ఎలా కారణం అవుతుంది? దీని ప్రభావం ఎంత? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పరిశోధనలు ఏం చెప్పాయంటే.. మగవారిలో ఆరోగ్యకరమైన వీర్యం, వీర్యంలో శుక్రకణాల  సంఖ్య, ఆ శుక్రకణాల కదలిక, వీర్యం చిక్కదనం మొదలైన విషయాలపై మగవారిలో పిల్లలను కనే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.  సంతానోత్పత్తిపై ధూమపానం కలిగించే ప్రభావం గురించి 2016లో జరిగిన ఒక పరిశోధనలో పొగాకు స్పెర్మ్ కౌంట్ ను దారుణంగా దెబ్బతీస్తుందని తెలిసింది. ధూమపానం చేసేవారి  వీర్యంలోని  శుక్రకణాలు అండాలను చేరుకుని ఫలదీకరణం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ధూమపానం ఎక్కువగా చేసేవారు తమ భాగస్వామితో సంభోగం చేసే సమయంలో అంగస్థంభన విషయంలో చాలా పేలవంగా ఉంటారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  ధూమపానం వల్ల శరీరంలో కలిగే ఆక్సీకణ ఒత్తిడి, తద్వారా ధమనుల పనితీరు మందగించడం వంటి ఇతర కారణాలు కూడా  సంభోగ సమయంలో అంగస్థంభన వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ధూమపానం అలవాటున్నవారు సంభోగం విషయంలో అసంతృప్తిని ఎదుర్కొంటుంటారు.   ఇద్దరికీ నష్టమే.. ధూమపానం చేసేవారు కేవలం వారు మాత్రమే నష్టపోరు. వారి జీవిత భాగస్వాములు కూడా నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ధూమపానం చేయడమే కాదు, ఇతరులు ధూమపానం చేసినప్పుడు ఆ పొగను పీల్చడం కూడా దాదాపు అలాంటి నష్టాన్నే కలిగిస్తుంది. అంటే మగవారు ధూమపానం చేస్తే దానికారణంగా ఆడవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇలా పిల్లలను కనలేకపోవడమే కాదు, పిల్లలు కలగడానికి తీసుకునే వివిధ రకాల చికిత్సలు కూడా ధూమపానం చేసేవారికి సమర్థవంతమైన ఫలితాలు ఇవ్వవు.  అందుకే ధూమపానం చేసే అలవాటు ఉంటే అది పిల్లలు  కలగడంలో దాని ప్రభావాన్ని చూపించకముందే దాన్నిమానేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నించేవారు తప్పనిసరిగా ధూమపానం మానేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య కూడా పొంచి ఉంది.. ధూమపానం చేసేవారిలో COPD అనే సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తుల నుండి వాయు ప్రసరణకు ఆటంకం కలిగించే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, శ్లేష్మం  ఉత్పత్తి,  ఊపిరితీసుకునేటప్పుడు  గురక వంటి లక్షణాలు ఇందులో  ఉంటాయి.  COPD ఉన్న వ్యక్తులలో  గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్  తో పాటు అనేక ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.                                                    *నిశ్శబ్ద.

ఇది బ్లాక్ టీ కాదు, మధుమేహాన్ని తగ్గించే డార్క్ టీ..!!

నేటికాలంలో మారుతున్న జీవనశైలి, రోజువారీ ఆహారపు అలవాట్లు..ఇవన్నీ కూడా రకరకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది వ్యాధి కానప్పటికీ...ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అసలైన చికిత్స. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలమీదకే వస్తుంది. ముఖ్యంగా సిటీ లైఫ్‌లో ఈ వ్యాధి చాలా త్వరగా వస్తోందని.. ఒక చాప్టర్ రిపోర్టు ప్రకారం ప్రతి పదిమందికి పరీక్షలు చేస్తే కనీసం ఐదారుగురికి మధుమేహం నిర్దారణ అవుతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారాన్ని తీసుకుంటే.. ఈ వ్యాధిని నయం చేయవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంతో డార్క్ ప్రయోజనాలేంటో చూద్దాం. డార్క్ టీ గురించి: డార్క్ టీ అనేది..ఇది సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ప్రక్రియకు గురైనప్పుడు.. పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ టీ ఆకులు ఆక్సీకరణ ప్రక్రియకు గురై రంగు మారుతాయి.ఇది చైనాలో ఒక సాధారణ టీ. అక్కడి ప్రజలు దీన్ని నిత్యం తాగుతుంటారు. బ్లాక్ టీతో పోలిస్తే డార్క్ టీ భిన్నంగా ఉంటుంది. బ్లాక్ టీ అధిక ఆక్సీకరణ ప్రక్రియకు లోనవుతుంది. అదే గ్రీన్ టీలో ఆక్సీకరణ ప్రక్రియ జరగదు. డార్క్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: టీ తాగని వారితో పోలిస్తే డార్క్ టీ తాగేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 53% తక్కువగా ఉంటుందని.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 47% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ సందర్భంలో వారి వయస్సు, లింగం, వారి శరీర నిర్మాణం,  వారు నివసించే ప్రాంతం పరిగణనలోకి తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ టీని తయారుచేసేటప్పుడు ఇందులో చక్కెరను ఉపయోగించకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో సుమారు 2,000 మందిని ఉపయోగించారు. వారిలో 400 మందికి డయాబెటిస్ ఉంది. 350 మందికి మధుమేహం వచ్చే అవకాశం ఉంది.మిగిలిన వారిలో సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నాయి. వారిలో చాలా మంది టీ తాగలేదు. మరికొందరు ప్రతిరోజూ ఒకే రకమైన టీ తాగారు. పరిశోధకులు వారు ఎంత టీ తాగారు..వారి మూత్రంలో ఎంత గ్లూకోజ్ విసర్జించారో పరీక్షించడానికి వాటిని ఉపయోగించారు. రెండు కారణాల వల్ల డార్క్ టీ తీసుకోవడం వల్ల మధుమేహం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొదటిది, ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడంతోపాటు..రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నిర్వహించడంలో సహాయపడుతుంది. రెండవది, పెద్ద మొత్తంలో గ్లూకోజ్ మూత్రంలో విసర్జించబడుతుంది. దీని వల్ల శరీరంలో నియంత్రణలో ఉండాల్సిన గ్లూకోజ్ తగ్గిస్తుంది. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తినడం వల్ల మధుమేహం మరింత ఉధృతం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే అధిక కొవ్వు పదార్ధాలు, చక్కెర, ఉప్పు పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. దీని వలన శరీరం మంటగా మారుతుంది. అందువల్ల కూరగాయలు, పండ్లతో కూడిన సహజమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని అధ్యయనం నివేదించింది.  

డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గితే, ఈ 5 ఆహారాలను తినండి..!!

దేశంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరం ముప్పు విస్తరిస్తోంది. డెంగ్యూలో, రక్తంలో ప్లేట్‌లెట్స్ లోపం ఉంటుంది. దీని కారణంగా బలహీనత ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ చాలా తగ్గితే, అది రోగి మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ రోజుల్లో డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో, రోగి యొక్క ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గకుండా, దానిని పెంచడానికి ఆహారంలో కొన్ని అంశాలను చేర్చాలి. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను వేగంగా పెంచే ఆహారం (Foods that Increase Platelet Count) వంటి గురించి తెలుసుకుందాం. కివి: విటమిన్ సి తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది. ప్లేట్‌లెట్లను పెంచుకోవడానికి కివి మంచి ఆహారం అని ఆరోగ్య నిపుణులు కూడా నమ్ముతున్నారు. దీనితో పాటు, మీరు నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తినవచ్చు. ఇది వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. మేక పాలు: ప్లేట్‌లెట్లను పెంచడానికి మేక పాలు ఔషధంలా పనిచేస్తాయి. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లయితే...మీరు మేక పాలు తాగవచ్చు. పచ్చి, తాజా పాలు తాగడం మంచిది. వీటితో పాటు పాల ఉత్పత్తులు కూడా మేలు చేస్తాయి. కొబ్బరి నీరు: కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ప్లేట్‌లెట్లను పెంచడంలో కూడా మేలు చేస్తుంది. డెంగ్యూలో వాంతులు కావడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని..దీనిని కొబ్బరి నీళ్లతో నివారించవచ్చు. ఇది రక్త కణాలకు,  హిమోగ్లోబిన్‌కు కూడా మంచిది. బొప్పాయి ఆకు రసం: తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు బొప్పాయి తినాలని సూచించారు. దీనితో పాటు బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని ఉడికించి రసం తీసి తాగితే ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. గిలోయ్: గిలోయ్ జ్యూస్ రక్తంలో తగ్గిన ప్లేట్‌లెట్ కౌంట్‌ను కూడా వేగంగా పెంచుతుంది. వీటన్నింటితో పాటు క్యారెట్, బీట్‌రూట్, గుమ్మడికాయ రసం కూడా డెంగ్యూ రోగులకు మేలు చేస్తాయి.  

ఈ ఆహారాలు రక్తహీనతను దూరం చేస్తాయి..!!

ఆహారం నుండి లభించే పోషకాలు మాత్రమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలవు. ఇది ఎముకల నొప్పి నుండి రక్తహీనత వరకు అన్నింటిని నయం చేస్తుంది. దీనికి కారణం ఈ ఆహారాలలో లభించే పోషకాలు. మీరు రక్తహీనత వంటి వ్యాధితో కూడా బాధపడుతుంటే, మీరు ఈ ఐరన్‌తో కూడిన ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. శరీరాన్ని ఐరన్ తో నింపడంతో పాటు రక్తహీనతను కూడా దూరం చేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు, గోళ్ల సమస్యలు, అధిక జ్వరం, కామెర్లు వంటి సమస్యలు దూరమవుతాయి. మీరు ఐరన్  లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, మీరు మీ ఆహారంలో ఈ కూరగాయలు, గింజలను చేర్చుకోవచ్చు. ఇవి మీ శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగిస్తాయి. ఈ ఫుడ్స్ నొప్పి,  రక్తస్రావం సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. వాటి ప్రయోజనాలు, వాటిని ఎలా తినాలో తెలుసుకుందాం. క్యారెట్, బీట్‌రూట్‌లను ఆహారంలో చేర్చుకోండి: బీట్‌రూట్, క్యారెట్ రెండింటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, మీరు వాటిని కూరగాయలతో పాటు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీని కోసం ఒక కప్పు బీట్‌రూట్, క్యారెట్ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.  దీన్ని ఫిల్టర్ చేసి రుచికి తగినట్లుగా ఉప్పు, నిమ్మకాయ జోడించండి. ఉదయం ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా త్రాగాలి. ఇది విటమిన్ సిని పెంచుతుంది. అలాగే శరీరంలోని ఐరన్‌ను గ్రహిస్తుంది. వీటిని సలాడ్ రూపంలో కూడా తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మేలు చేస్తాయి: మీరు ప్రతిరోజూ అత్తి పండ్లను, ఎండుద్రాక్ష,  ఖర్జూరాలను తినవచ్చు. వీటిలో విటమిన్ ఎ, సి, ఐరన్,  మెగ్నీషియం లభిస్తాయి. ఈ మూడు వస్తువులను రాత్రంతా నానబెట్టి ఉంచండి. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే, 2 నుండి 3 ఖర్జూరాలు, అంజిర్,  ఒక చెంచా ఎండుద్రాక్షను తినండి. దీంతో శరీరంలో శక్తి పెరుగుతుంది. ఐరన్ సమం అవుతుంది. వీట్ గ్రాస్: వీట్ గ్రాస్ అనేక పోషకాలు అధికంగా ఉండే గడ్డిలో ఒకటి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ బి, సి, కె, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ 3 నుంచి 5 గ్రాముల గోధుమ గడ్డి రసాన్ని తాగడం వల్ల శరీరంలోని రక్తహీనత సమస్య తొలగిపోతుంది. మీ హెచ్‌బిని మెరుగుపరచడంతో పాటు, మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నల్ల నువ్వులు కూడా దివ్యౌషధం: తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు ఎక్కువ ప్రయోజనకరమైనవి. పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి6, ఇ, ఫోలేట్ యాసిడ్, జింక్, ఐరన్, కాపర్,  సెలీనియం నల్ల నువ్వులలో లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అలసట, నొప్పి, రక్తహీనత దూరమవుతాయి. దీన్ని తీసుకోవడానికి, ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేయించుకోండి. దీని తరువాత, ఒక చెంచా తేనె లేదా నెయ్యితో కలపండి. ఐరన్ స్థాయిని పెంచడంతో పాటు శరీరానికి బలం చేకూరుతుంది.   

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

ఇప్పట్లో ఉద్యోగాలన్నీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసేవే ఎక్కువ. డెస్క్ జాబ్ లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉద్యోగం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.  ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాల కారణంగా  లైఫ్ స్టైల్ తటస్థంగా మారుతుంది. ఈ  నిశ్చల జీవనశైలి శారీరక,  మానసిక ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది.  ప్రతిరోజూ 8-10 గంటలసేపు  కూర్చొని పని చేస్తుంటే మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  డెస్క్ ఉద్యోగాలు ఉన్న వ్యక్తులలో  కాలక్రమేణా తీవ్రమైన నరాల సంబంధిత రుగ్మతలు  ఏర్పడే  ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  ఇది అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. చిత్తవైకల్యానికి ప్రధాన కారణాలలో ఒకటైన అల్జీమర్స్ వ్యాధి ఇంతకు ముందు వరకు 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ   ఈ వ్యాధి ముప్పు  ఇప్పుడు ఎక్కువ సేపు డెస్క్ ముందు కూర్చుని పనిచేసేవారిలో  పెరుగుతోంది. నిశ్చల జీవనశైలి,  చిత్తవైకల్యం ప్రమాదం.. కొన్ని దశాబ్దాల క్రితం వరకు పెద్దవారిలో చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం చాలా తక్కువగా పరిగణించబడింది.  కానీ కాలక్రమేణా కేవలం పెద్ద వయసులోనే కాకుండా  అన్ని వయసుల వారిలో ఈ ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతం 55 మిలియన్ల మంది అల్జీమర్స్-డిమెన్షియాతో బాధపడుతున్నారు. జీవనశైలి సమస్యల కారణంగా ఈ ప్రమాదం మరింత పెరిగింది. కొన్ని అధ్యయనాల ప్రకారం  ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేస్తే  డిమెన్షియా సమస్య  అభివృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిశ్చలంగా పనిచేయడం ప్రమాదం ఎందుకంటే.. అమెరికన్లలో చేసిన ఒక పరిశోధనలో సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు రోజుకు తొమ్మిదిన్నర గంటల కంటే ఎక్కువ సమయం కూర్చొని గడుపుతారు ఈ అలవాటు మెదడు వృద్ధాప్యం,  అభిజ్ఞా  పనితీరు మందగించడం వంటి  వాటితో  ముడిపడి ఉంటుంది. ఒకే చోట ఎక్కువసేపు ఆఫీసులో కూర్చోవడమే కాకుండా, ఎక్కువసేపు కూర్చొని టీవీ  చూడడం, కంప్యూటర్లలో పని చేయడం,  డ్రైవింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. డిమెన్షియా ప్రమాదాల గురించి అధ్యయనం నిపుణుల ప్రకారం  స్థూలకాయం, అధిక రక్తపోటు,  మధుమేహం వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు నిశ్చల జీవనశైలి ఇప్పటికే కారణమవుతోందని  తెలిపారు. దీని కారణంగా ఇప్పుడు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది.  ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో రక్తప్రవాహం మందగిస్తుంది.   ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గించడం ద్వారా సెరెబ్రోవాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.                                                             *నిశ్శబ్ద. 

వామును ఎలా తీసుకుంటే ఆరోగ్యం.. ఎవరు తీసుకోకూడదు తెలుసా

వాము వంటింట్లో ఉండే ఒక గొప్ప ఔషదం. కొన్నిరకాల వంటలలో చిటికెడు వామును జోడించడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.  ఇది ఆకలిని పెంచుతుంది,  జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలతో  అసౌకర్యంగా  ఉన్నప్పుడు వాటిని పరిష్కరిస్తుంది.  ప్రాచీన కాలం నుండే వామును జ్వరం, కడుపు నొప్పి నుండి  నెలసరి ఇబ్బందుల వరకు అనేక సమస్యలు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. వాము గింజలను స్నాక్స్, పిండి వంటలు,  వివిధ రకాల  మసాలాలోనూ ఉపయోగిస్తారు. కడుపుకు సంబంధించిన సమస్యలు,  ప్రేగులు వదులుగా మారడం, దగ్గు మొదలైన  సమస్యలకు వాము గింజల కషాయాన్ని ఆయుర్వేదంలో మొదటి  చికిత్సగా ఉపయోగిస్తారు. వాము గింజలు   యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్,  క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. వామును దేంతో కలిపి తీసుకుంటే ఏ సమస్యలు నయమవుతాయంటే.. నల్ల ఉప్పుతో పాటు వాము పొడి  కలిపి తీసుకుంటే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నెయ్యి,  పంచదారతో కలిపి వాము గింజల పొడిని తీసుకుంటే   నెలసరి సమయంలో తక్కువగా అయ్యే రక్తస్రావాన్ని సమం చేస్తుంది.  గర్భాశయాన్ని క్లియర్ చేస్తుంది. పెర్షియన్ సాంప్రదాయ వైద్యులు చెవికి సంబంధించిన సమస్యలను  చికిత్స చేయడానికి వాము గింజల నుండి తీసిన నూనెను  కళ్లు, చెవి చుక్కల మందుగా  ఉపయోగించారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని తెగలలో వాము గింజలను  బెల్లం లేదా గుడ్డు,  గోరువెచ్చని నెయ్యితో కలుపుతారు.   గర్భధారణ తర్వాత మహిళలకు శక్తిని అందించడానికి తినిపిస్తారు. ఎన్నో ఏళ్ళ నుండి  బరువు తగ్గడానికి సహజ ఔషధంగా వాము గింజలను  ఉపయోగిస్తున్నారు. వాములో  థైమోల్‌తో సహా  అనేక  సమ్మేళనాలు జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా కొవ్వు కణాల విచ్ఛిన్నానికి కూడా సహాయపడతాయి. వాము గింజలతో మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు  ఉన్నాయి..  బ్యాక్టీరియా,  శిలీంధ్రాలతో పోరాడుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుపరుస్తుంది,  రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.  పెప్టిక్ అల్సర్లను నయం చేయడంలో,  అజీర్ణం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇందులో  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వామును ఎలా తీసుకోవచ్చంటే.. 1 గ్లాసు గోరువెచ్చని వాము నీరు ఉదయాన్నే డిటాక్స్ వాటర్‌గా తీసుకోవడం ఉత్తమ మార్గం. జీర్ణక్రియ సమస్య పరిష్కారం కోసం వాము నూనెను బొడ్డు బటన్‌పై అప్లై చేయవచ్చు. ఇది చేయడం చాలా సులభం.  ఒక కప్పు వేడినీటిలో ఒక టీస్పూన్ వాము గింజలను వేసి ఉడికించాలి. ఇలా వాము టీ తయారుచేసుకోవాలి.  దీన్ని తేనెతో తీసుకోవచ్చు లేదా అదనపు రుచి కోసం కొంచెం నిమ్మకాయను జోడించవచ్చు. వాము ఎవరు తీసుకోకూడదంటే? గర్భిణీ స్త్రీలు వాము తీసుకుంటే తీవ్రమైన వాంతులు, వికారం,  మైకము కలిగించవచ్చు. చిన్న పిల్లలు, అలెర్జీలు ఉన్న వ్యక్తులు, రక్తపోటు మందులు తీసుకునే వ్యక్తులు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వామును తీసుకోకూడదు.                                                       *నిశ్శబ్ద.  

ఖాళీ కడుపుతో టీ-కాఫీ బదులు బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో..!!

చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ, టీ తాగనిదే రోజూ ప్రారంభం కాదు. వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీటిని ఖాళీ కడుపుతో తాగినట్లయితే ఎసిడిటి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రతిరోజూ అల్పాహారానికి ముందు ఒక కప్పు బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. గుండెకు చాలా మంచిది: బీట్‌రూట్‌లో చాలా నైట్రేట్‌లు ఉంటాయి. కాబట్టి ఇది రక్త నాళాలకు మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మీ శరీరం యొక్క నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడంతోపాటు మీ రక్తపోటు తక్కువగా ఉండటం వలన గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది: బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల పెద్ద మొత్తంలో బీటాసైనిన్ లభిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. మీ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి మీ శరీరంలోని ఏ భాగానైనా మంటను నివారిస్తాయి. కాలేయ ఆరోగ్యానికి మంచిది: రోజూ ఉదయాన్నే కాఫీ టీకి బదులు బీట్‌రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే సహజంగానే కాలేయాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే బీట్‌రూట్ జ్యూస్‌లో బీటైన్ ఉంటుంది, ఇది కాలేయ సంబంధిత ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారిస్తుంది. మీకు ఇప్పటికే ఈ సమస్య ఉంటే, దాన్ని నయం చేసే ఉపాయం బీట్‌రూట్‌లో ఉంది. అందువల్ల, మీ కాలేయంలో కొవ్వు పదార్ధం పేరుకుపోయే అవకాశం లేదు, మీ శరీరంలో విషపూరిత అంశాలు ఉంటాయి. స్కిన్ గ్లో పెరుగుతుంది: బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యం కూడా ఎక్కువగా, చర్మానికి సంబంధించిన సమస్యలు ఉండవు. ఇది కాకుండా, బీట్‌రూట్ నుండి మీకు ఎక్కువగా లభించే ఐరన్ కంటెంట్ మీ చర్మంలోని కణాల పెరుగుదలను పెంచుతుంది. రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. ఇది మీ చర్మం, జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రధానంగా హైపర్పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది. బీట్‌రూట్‌లో ఫైటోన్యూట్రియెంట్‌లు ఎక్కువగా ఉన్నందున, మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ అరకప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే, తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మధుమేహంతో బాధపడే వారికి చాలా మేలు చేస్తాయి.  

ఇంట్లో పెద్దవారికి బట్టతల ఉన్నప్పుడు చిన్నవారికి ఆ సమస్య రాకుడదంటే ఇలా చేయాలి!!

ఇప్పటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య  జుట్టు రాలడం. ఈ సమస్య అన్ని రకాల వయసుల వారిలో ఉంది. చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఫాలో అవుతున్నా కాలం గడిచేకొద్ది జుట్టు రాలడం జరుగుతూనే ఉంటుంది. మగవారిలో బట్టతల, ఆడవారిలో జుట్టు పలుచబడటం, తలమీది చర్మం బయటకు  కనిపించడం(దీన్ని మహిళలలో బట్టతలగా వర్ణిస్తారు). ఇది జన్యుసమస్యల కారణంగా ఎదురయ్యే సమస్య. బట్టతల పరిష్కారానికి ఎలాంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో లేకపోయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వడం ద్వారా బట్టతలను సమర్థవంతంగా అధిగమించవచ్చు. జుట్టు ఆరోగ్యం  ఆహారంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ప్రోటీన్, ఐరన్, బయోటిన్,  విటమిన్ A,D చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. ఆహారంలో లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, ఆకు కూరలు, పప్పుధాన్యాలు మరియు గింజలు వంటి ఆహారాలను చేర్చుకోవాలి. ఆహారం ద్వారా సరిపడినంత  పోషకాలు తీసుకోలేకపోతే  సప్లిమెంట్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి, అయితే ఏదైనా సప్లిమెంట్లను తీసుకునేముందు వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు సప్లిమెంట్లు వాడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు వైద్యులు సూచించే మందులు కూడా తీసుకోవాలి. ఇవి జన్యుపరంగా సంభవించే బట్టతలకు అడ్డుకట్ట వేస్తాయి. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా ఉన్నవారిలో జుట్టు రాలడానికి కీలకమైన హార్మోన్లను నిరోధించడంలో  మందులు ప్రభావవంతంగా ఉంటాయి.అయితే వీటిని వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటాయి.  జుట్టు రాలడానికి చాలామందిలో కారణమయ్యే అంశం ఒత్తిడి. అధిక డిప్రెషన్ జుట్టురాలడాన్ని మరింత వేగవంతం చేస్తుంది. దీన్ని అధిగమించడానికి ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి చాలా బాగా పనిచేస్తాయి. ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లు ఉంటే మానేయడం. జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోవడం. రసాయనాలు లేని  ఉత్పత్తులను వాడటం. వీలైనంత వరకు సహజమైన ఉత్పత్తులను జుట్టుకు వినియోగించడం. ఎప్పటికప్పుడు వైద్యలను కలుస్తూ జాగ్రత్తలు పాటించడం వల్ల  వంశపార్యపరంగా జుట్టురాలిపోయి బట్టతల వచ్చేవారి సమస్యను పరిష్కరించవచ్చు.                                                         *నిశ్శబ్ద.

డెంగ్యూ జ్వరానికి డాక్టర్లు సూచించే ఇంటివైద్యం ఏంటో తెలుసా..

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈకాలంలో అనేక వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్లు వంటివి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ సీజన్ లో డెంగ్యూ జ్వరం ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు డెంగ్యూ జ్వరానికి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. డెంగ్యూ వైరస్ వల్ల ఈ జ్వరం వస్తుంది. డెంగ్యూకి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేనందున సరైన సంరక్షణ చాలా ముఖ్యం. కాబట్టి ఇంటి నివారణలు లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో.. రికవరీ ప్రక్రియలో సహాయపడతాయి. మీరు వైద్యం చేయించుకున్నప్పటికీ.. ఇంటి నివారణలు కూడా ఎంతో సహాయపడతాయి. అన్నింటికంటే, డెంగ్యూ జ్వరానికి ఇంటి నివారణలు ఏమిటి? వైద్యులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలసుకుందాం. నీరు పుష్కలంగా త్రాగాలి: డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, చెమటలు. ఇవన్నీ కూడా  నిర్జలీకరణానికి దారితీస్తాయి. డీహైడ్రేషన్ వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. కాబట్టి డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి, లక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి వీలైనంత వరకు కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి ద్రవాలను పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. విశ్రాంతి: డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవడానికి విశ్రాంతి చాలా ముఖ్యం. విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. కఠినమైన శారీరక శ్రమలను నివారించడం, తగినంత నిద్ర పొందడం ద్వారా, శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. సమయానికి మందులు: ఇప్పటికే చెప్పినట్లుగా డెంగ్యూ జ్వరానికి నిర్దిష్ట చికిత్స లేదు. కానీ జ్వరం, నొప్పి వంటి లక్షణాలను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎసిటమైనోఫెన్ (పారాసెటమాల్) తరచుగా జ్వరాన్ని నియంత్రించడానికి, నొప్పిని తగ్గించడానికి సూచించబడుతుంది.  అయినప్పటికీ, ఆస్పిరిన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను నివారించాలి, ఎందుకంటే అవి రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి. ప్లేట్‌లెట్ స్థాయిలను చెక్ చేయడం: డెంగ్యూ జ్వరం సమయంలో ప్లేట్‌లెట్ స్థాయిలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు. నిజానికి డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఇది రక్తస్రావం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇంకా, ఈ ప్లేట్‌లెట్ కౌంట్ రక్త పరీక్షల ద్వారా పరీక్షిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి: ఏదైనా అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. డెంగ్యూ రోగులకు పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో సహా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి: డెంగ్యూ లక్షణాలలో నిరంతర వాంతులు, జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి, అంతర్గత రక్తస్రావం సంకేతాలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.  

ఏ వయసులో ఏం తినాలో తెలుసా?

ఆహారమే మనిషి జీవితానికి ముఖ్యమైన వనరు. ప్రాణ శక్తిని అందించేది ఆహారమే. సరైన ఆహారం తీసుకోవడం వల్ల  ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘాయుష్షు సాధ్యమవుతుంది. అయితే వయసుతో పాటు శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే వయసుకు తగిన ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. పిల్లలు, పెద్దలు అందరికీ పోషకాలు అవసరమే. అయితే పెరిగే కొద్ది కండరాలు, ఎముకలకు తగినంత బలం కూడా కావాలి. టీనేజ్  దాటగానే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలే భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. 20, 30, 40, 50 అలా ఏ వయసు దాటిన తరువాత ఏ ఆహారం తీసుకోవాలో తెలిసినవారు చాలా తక్కువ. దీని గురించి తెలుసుకుని వయసుకు తగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. 20 ఏళ్ల వయసులో ఏం తినాలి? 20ఏళ్ళ వయసున్నవారు అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. వీటిలో  ప్రోటీన్లు,  తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అలాగే చేపలు, అవిశె గింజలు, వాల్ నట్ లలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తీసుకోవాలి. ఇవి శరీరం దృఢంగా ఉండటంలో సహాయపడుతుంది. 30ఏళ్ళ తరువాత ఏం తినాలి? 30ఏళ్ళు దాటగానే శరీరంలో జీర్ణక్రియలు కొద్దిగా నెమ్మదిస్తాయి. ఈ సమయంలో బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం. క్వినోవా, బ్రౌన్ రైస్, చిలగడ దుంపలు వంటి వాటిలో ఉండే కార్భోహైడ్రేట్లు శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. అలాగే కండరాల సామర్థ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చురుకైన జీవనశైలి ఉన్నవారికి తగినంత ప్రోటీన్లు అవసరం.  విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం, రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బాగాతీసుకోవాలి. 40ఏళ్ళ తరువాత ఏం తినాలంటే? 40ఏళ్ళ తరువాత గుండె, ఎముకల ఆరోగ్యం  గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో హార్మోన్లలో మార్పులు, కండరాల సామర్థ్యం తగ్గడం,  మొదలైనవి కూడా జరుగుతాయి. వీటి ఆరోగ్యం కోసం  చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, చికెన్, బీన్స్, చిక్కుళ్ళు, వంటి లీన్ ప్రోటీన్ గల ఆహారాలు తీసుకోవాలి. అవకాడో, నట్స్, గింజలు, ఆలివ్ నూనె, వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తాయి.  అదే విధంగా పైబర్ అధికంగా ఉన్న ఆహారం  తీసుకోవాలి. 40ఏళ్ళ తరువాత బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి   కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. 50 ఏళ్ళ తరువాత  ఏం తినాలి? 50ఏళ్ళ తరువాత శరీరంలో ఉన్న శక్తిని కాపాడుకోవాలి.  వయసుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కండరాలు చాలా బలహీనంగా మారే వయసు ఇది. కండరాలు, ఎముకలు, మెదడు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రోటీన్, కాల్షియం, ఒమెగా-3 బాగా తీసుకోవాలి. 50 ఏళ్ల తరువాత దాహం బాగా తగ్గుతుంది. నీరు తాగడం తగ్గిస్తారు. ఇది కిడ్నీ సమస్యలకు, శరీరం డీ హైడ్రేషన్ కావడానికి కారణం అవుతుంది. అందుకే 50ఏళ్ళ తరువాత నీరు, ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి.                                             *నిశ్శబ్ద.

ఈ ఐదు అలవాట్లు ఉన్నవారికి వందేళ్ళ ఆయుష్షు గ్యారెంటీ!

తొందరగా చనిపోవాలని ఎవరికీ ఉండదు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఎలాంటి శారీరక సమస్యలు లేకుండా హాయిగా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా వందేళ్ల ఆయుష్షు గడవకముందే మరణిస్తుంటారు. గత కొన్నేళ్ళను గమనిస్తే మనిషి ఆయుష్షు క్రమంగా తగ్గుతూ వస్తోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కాలం ఎలా మారినా వందేళ్ళు హాయిగా బ్రతికేయచ్చు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు చాలా సులువుగా వందేళ్ళు బ్రతుకుతున్నారు. దీనికి కారణం వారు తింటున్న ఆహారం, వారి అలవాట్లు.  అలాగని వారేదో నాన్ వెజ్ తిని పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే పొరపాటే. అసలు వారి అలవాట్లేమిటో, అవి వందేళ్ళ ఆయుష్షుకు ఎలా కారణమవుతాయో తెలుసుకుంటే.. వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నవారిలో 95శాతం ఆహారం  మొక్కల ఆధారిత ఆహారమే. వీటిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, గింజలు మొదలైనవి ఉన్నాయి.  ఆహారం విషయంలో కొన్ని పరిశోధనలలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మాంసాహారాన్ని మానేసి మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఇతర ప్రమాదకర వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది.  కాబట్టి మొక్కల ఆధారిత ఆహారం మనిషి ఆయుష్షును పెంచుతుంది. ప్రతి మతంలోనూ ఉపవాసం అనేది ప్రధానంగా ఉంటుంది.  ఉపవాసం శరీరంలో రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. అనేక వ్యాధులకు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కారణం అవుతుంది. అందుకే అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం  వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆకలి అనిపించినప్పుడు కడుపు నిండా తినడం చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఆహారాన్ని కేవలం 80శాతం మాత్రమే తినాలి.  ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మధ్యపానం చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు. అయితే ధీర్ఘాయుష్షు కావాలంటే మధ్యపానం తీసుకోవాలి కానీ అది చాలా మితంగా ఉండాలట. ఆల్కహాల్ కూడా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ దీని మోతాదు ఎక్కువ  కావడం, ఆల్కహాల్ సేవించడం ఒక వ్యసనంగా మాత్రం మారకూడదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారి శరీరం పర్ఫెక్ట్ గా పనిచేస్తున్న యంత్రంలాంటిది.  శరీరంలో వివిధ అవయవాలు, వాటి పనితీరు వ్యాయామం వల్ల మెరుగవుతుంది. అంతేకాదు వ్యాయామం శరీరంలో కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు. ప్రతిరోజు కనీసం ఆరు నుండి 8 గంటలసేపు నిద్రపోవడం వల్ల రోజుమొత్తం పనిచేసిన శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. మంచి నిద్ర వల్ల గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయి.

ఈ ఆహారాలు తింటే చాలు.. గుండె ఆరోగ్యం పదిలం..

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కాలక్రమేణా పెరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ వ్యాధి వృద్ధాప్య సమస్యగా పిలువబడింది. కానీ  ఇప్పుడు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. 10 ఏళ్లలోపు పిల్లల్లో కూడా గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు నిర్ధారణ అవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల దృష్ట్యా, అందరూ అప్రమత్తంగా ఉండాలని  గుండె జబ్బులు నివారించడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన ప్రమాద కారకాల్లో గుండె జబ్బు ఒకటి, ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణాలకు ఇది  కారణమవుతుంది. ప్రతి సంవత్సరం హృదయ సంబంధ వ్యాధుల  ప్రమాదాల గురించి ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయడం,  నివారణ పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పించడం కోసం వరల్డ్ హార్ట్ డే ను  సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం బాగా పెరిగిందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అయితే  రోజువారీ కింద చెప్పుకునే ఆహారాలు తీసుకోవడం వల్ల  గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు.   అవోకాడో .. అవకాడో గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పండ్లలో ఒకటి. ఇందులో  మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.  ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి వారం కనీసం రెండు  అవోకాడోలు  తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16%,  కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 21% తగ్గుతుంది. అవకాడోలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆకు పచ్చని కూరగాయలు..  ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి  శరీరానికి రోజూ అవసరం. ఆకుపచ్చ ఆకుకూరలు,  బీన్స్ వంటి కూరగాయలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆకుపచ్చ కూరగాయలు విటమిన్ల మూలం, ఇది  ధమనులను రక్షించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నట్స్‌..  రోజువారీ ఆహారంలో అనేక రకాల గింజలను చేర్చుకునే వ్యక్తులలో  గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంటుందని  పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా వాల్ నట్స్  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాల మూలం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో  సహాయపడుతుంది. వాల్‌నట్‌లు గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం అయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా  వినే ఉంటారు. ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా మేలు చేస్తాయి. మితంగా చాక్లెట్ తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో డార్క్ చాక్లెట్ తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.                                          *నిశ్శబ్ద.

షుగర్ వ్యాధిగ్రస్తులకు గుమ్మడి గింజల మేలు తెలుసా...

గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?  పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చాలా పెద్దవి. సాధారణంగా మనమందరం గుమ్మడికాయను సాంబారుకు వాడేటపుడు గింజలను పక్కన పెట్టి చెత్తబుట్టలో వేస్తాం! కానీ గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్లు, ప్రొటిన్లు, మినరల్స్ గురించి తెలుస్తే...గింజలను తప్పకుండా డైట్ లో చేర్చుకుంటారు. ముఖ్యంగా మధుమేహవ్యాధిగ్రస్తులు, అధిక బీపీతో బాధపడేవారికి గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి.  గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం... అధిక బీపీ:   ఈ రోజుల్లో, రక్తపోటు వ్యాధి సాధారణంగా 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా శరీరంలోని ప్రధాన అవయవాలు ప్రభావితమవుతాయి. అన్నింటికీ మించి, గుండె కొట్టుకునే పని సామర్థ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. కాలేయం ప్రభావం చూపుతుంది. రక్తపోటు వల్ల మన శరీరంలోని కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు డాక్టర్ సూచించిన మాత్రలు వేసుకోవడంతో పాటు గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రక్తపోటు అదుపులో ఉంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. మధుమేహం ఉన్నవారికి: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి! డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మందికి భోజనం లేదా అల్పాహారం తర్వాత అకస్మాత్తుగా చక్కెర స్థాయి పెరగడం సమస్యగా మారుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుమ్మడి గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు మనం తినే ఆహారంలో చక్కెర కంటెంట్, అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేస్తాయి. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండెకు మంచిది: ఈ చిన్న గింజల్లో వెజిటబుల్ ప్రొటీన్, మెగ్నీషియం, జింక్,  ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా శరీర రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ కారకాలన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా, గుమ్మడికాయ గింజల్లో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉన్నందున, ఇది హృదయ స్పందన పనితీరుతో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారిస్తుంది. గుమ్మడికాయ గింజలను ఎలా తినాలి? వేయించిన గుమ్మడి గింజలను తినడం నిజంగా ఆరోగ్యకరమైనది. అయితే దీనికి ఉప్పును కలపకూడదు. ఎందుకంటే ఉప్పు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు సాయంత్రం స్నాక్స్ సమయంలో కొన్ని వేయించిన గుమ్మడి గింజలను తినడం అలవాటు చేసుకుంటే, అది చాలా మంచిది

బరువు తగ్గాలంటే బ్రేక్‎ఫాస్ట్‎లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి..!!

బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చేస్తారు.  అంతే కాకుండా  ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గించుకునేందుకు బ్రేక్ ఫాస్ట్ చేయరు. కానీ అల్పాహారం మానేస్తే అనేక సమస్యలకు దారి తీస్తుందని మీకు తెలుసా? అలాంటి పరిస్థితిలో బరువు తగ్గించేందుకు రుచికరమైన చీలాను మీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి.   మూంగ్ దాల్ చిల్లా: మూంగ్ దాల్ చిల్లా తయారు చేయడం చాలా సులభం. మీరు దీన్ని మీ బరువు తగ్గించుకునేందుకు మీ డైట్లో  చేర్చుకోవచ్చు. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  ఈ చీలా చేయడానికి, పెసరపప్పును 5-6 గంటలు నానబెట్టి, ఆపై మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కలిపి పిండిలా సిద్ధం చేసుకోవాలి. పాన్ వేడి చేయండి, చిన్న మొత్తంలో నూనె జోడించండి. పాన్ మీద పిండిని పోసి బాగా విస్తరించండి. రెండు వైపులా కాల్చండి. మూంగ్ దాల్ చీలా రెడీ. సెమోలినా చీలా: సెమోలినాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది తింటే కడుపు నిండినట్లుగా ఉంటుంది. చాలా సమయం ఆకలి అనిపించదు.  ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు అల్పాహారం కోసం సెమోలినా చీలా తినవచ్చు. ఈ చీలా చేయడానికి, ఒక గిన్నెలో సెమోలినా, పెరుగు కలపాలి. ఈ మిశ్రమానికి కొంచెం నీరు వేసి బాగా చిలకొట్టండి. దానికి నల్ల మిరియాల పొడి, ఉప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ జోడించండి. పాన్ వేడి చేసి, ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసి, ఆపై సెమోలినా పిండిని వేసి కొద్దిగా విస్తరించండి. చీలాను రెండు వైపుల నుండి ఉడికించాలి. రాగి చిల్లా: ఫైబర్ అధికంగా ఉండే రాగులు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, రాగులను మీ ఆహారంలో భాగం చేసుకోండి. మీరు దాని నుండి రుచికరమైన చీలా తయారు చేసుకోవచ్చు. ఈ చీలా చేయడానికి, ఒక గిన్నెలో రాగుల పిండిని తీసుకుని, అందులో నీరు కలపండి. పిండిని సిద్ధం చేయండి. ఈ మిశ్రమంలో ఉప్పు,  సన్నగా తరిగిన ఇష్టమైన కూరగాయలను కలపండి. ఇప్పుడు పాన్ వేడి చేసి, ఒక చెంచా నూనె వేసి, రాగుల పిండిని పాన్ మీద పోసి బాగా స్ప్రెడ్ చేయాలి. తరువాత రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

నోటిపూత ఇబ్బంది పెడుతుందా? ఈ హోం రెమెడీస్ తో చెక్ పెట్టండి..!!

నోటిలో చిన్న పుండు ఉంటే నొప్పి మాత్రమే కాదు. తినడం, తాగడం కష్టంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పిని ఎదుర్కొవల్సి వస్తుంది. నాలుక కూడా పదేపదే పొక్కుతుంది.  మీరు కూడా ఇటువంటి అల్సర్ల వల్ల ఇబ్బంది పడుతుంటే..వాటిని త్వరగా వదిలించుకోవాలనుకుంటే, మీరు ఈ ఇంటి నివారణలను అనుసరించవచ్చు. ఈ 5 రెమెడీస్ పాటిస్తే ఒక్క రాత్రిలో నోటిపూత మాయమవుతుంది. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు గృహవైద్యాలను తెలుసుకుందాం... కొబ్బరి నూనె: నోటి లోపల నాలుక, చిగుళ్ళు, పెదవులు లేదా బుగ్గల లోపలి భాగంలో బొబ్బలు ఏర్పడతాయి. నొప్పి కారణంగా తినడం, త్రాగడం కష్టంగా మారినట్లయితే, కొబ్బరి నూనె వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం, కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేయండి. ఇప్పుడు ఈ నూనెను కాటన్ లేదా వేలి సహాయంతో పొక్కులపై రాయండి. ఉదయం లేవగానే పొక్కుల నుంచి చాలా వరకు ఉపశమనం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల పొక్కులు త్వరగా మాయమవుతాయి. లిక్కోరైస్: ఆయుర్వేదంలోని అత్యుత్తమ, ప్రభావవంతమైన మందులలో లిక్కోరైస్ ఒకటి. నోటిపూతలకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. దీని కోసం, లైకోరైస్‌లో తేనె కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దీని తరువాత, వేలు సహాయంతో పూతల మీద రాయండి. పగలు, రాత్రి పూట పూయడం వల్ల నోటిపూత నుండి ఉపశమనం లభిస్తుంది.   పటిక, గ్లిజరిన్: పటిక, గ్లిజరిన్  నోటి అల్సర్లకు కూడా దివ్యౌషధం. దీని కోసం 3 టీస్పూన్ల పటిక పొడిని తీసుకోండి. ఇందులో 3 చుక్కల గ్లిజరిన్ వేయాలి. ఇప్పుడు దాని పేస్ట్‌ను సిద్ధం చేసి, కాటన్ సహాయంతో అల్సర్‌లపై అప్లై చేయండి. ఇలా చేయగానే నోటి నుంచి లాలాజలం రావడం ప్రారంభమవుతుంది. కొంత సమయం తరువాత, ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల నోటిపూత నయమవుతుంది. అలోవెరా ఆమ్లా:  ఆమ్లా,కలబంద రెండూ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యంతో పాటు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కలబంద, ఉసిరికాయలను పేస్ట్‌గా చేసి అల్సర్‌లపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. రాత్రిపూట నోటిపూతపై దాని పేస్ట్‌ను పూసిన తర్వాత ఏమీ తినవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే కడిగేయండి. దీంతో పొక్కులు నయమవుతాయి. ఒక చిన్న లవంగం నోటి అల్సర్లను తొలగించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం, వేడి పాన్లో 5 లవంగాలను వేయించాలి. ఇప్పుడు ఈ లవంగాలను కాటన్ క్లాత్‌లో కట్టి సున్నితంగా అల్సర్‌లపై అప్లై చేయండి. దీని తర్వాత లవంగం నూనెను అల్సర్ల మీద రాసి రాత్రి నిద్రించాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. మీరు ఉదయం నిద్ర లేవగానే పొక్కులు మాయమైనట్లు కనిపిస్తాయి.   

ఈ ఆహారాలు పొరపాటున కూడా పచ్చిగా తినకూడదట.. ఇంతకీ ఇవేంటంటే..

ఆహారమే ఆరోగ్యం అన్నారు పెద్దలు. కానీ ఆహారం విషం కూడా అవుతుంది కొన్నిసార్లు.  దీన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటూ ఉంటాం. తిన్న ఆహారం శరీరానికి మంచి చేయకపోగా చెడు చేసే అవకాశం ఎక్కువగా ఉంటే మాత్రం అది చాలా ప్రమాదం.  అలాంటి ఆహారాలను పచ్చిగా తీసుకోకపోవడం మంచిది. విచిత్రం ఏమిటంటే రోజువారీ తీసుకునే ఆహారంలో చాలా మంచిది అనే కారణంతో చాలామంది తీసుకునే ఆహారాలే చెడు చేస్తాయని తేలింది. అలాంటి ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. పాలు.. పాలు చాలా గొప్ప పోషక పదార్థం. చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ పాలు తీసుకోవాలని, తద్వారా శరీరానికి తగిన కాల్షియం అందుతుందని చెబుతారు.  అయితే పాలను కాచకుండా పచ్చివి తాగడం చాలా ప్రమాదం.  పాలలో ప్రమాకరమైన జెర్మ్స్ ఉండే అవకాశం ఉంది. ఇది చాలా అనారోగ్యానికి గురిచేస్తుంది.  అందుకే పాలను ఎల్లప్పుడూ బాగా మరిగించిన తరువాతే తాగాలి. మొలకలు.. మొలకలు చాలా గొప్ప ఆహారం. ఇందులో ఉన్నన్ని పోషకాలు మాంసాహారంలో కూడా లభించని అంటారు. కానీ మొలకలను సరైన విధంగా మొలకెత్తించడం, జాగ్రత్త చేయడం చేయకపోతే అవి మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాయి. మొలకల్లో ఇ-కోలి, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజన్, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది. గుడ్లు..   పచ్చి గుడ్లను అప్పటికప్పుడు పగలకొట్టి గుటాగుటా తాగడం కొందరికి అలవాటు. అయితే గుడ్లను తినడానికి ముందు ఉడికించాలి.  పచ్చిగుడ్లలో కూడా ప్రమాదకరమైన బ్యాక్టిరీయా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అన్నం.. అన్నాన్ని మళ్లీ ఉడికించడం ఏంటనే డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ ఇక్కడ విషయం అది కాదు. సరిగ్గా ఉడికీ ఉడకని అన్నాన్ని తీసుకుంటే అది ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతుంది.  సరిగ్గా ఉడకని అన్నంలో బాసిల్లన్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ది చెందుతుంది. ఇది శరీరంలో చాలా వేగంగా టాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. గుల్లలు.. సముద్రపు ఆహారాలైన గుల్లలు చాలా మంది తింటారు.  అయితే వీటిని పచ్చిగా తినడం వల్ల హానికరమైన వైరస్ల బారిన పడే అవకాశం ఉంది.  అందుకే వీటిని పూర్తీగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి. చేపలు.. చేపలు, పీతలు వంటి సముద్రపు ఆహారాలు కూడా పచ్చిగా తినడం ఎంతమాత్రం మంచిది కాదు. వీటిని సరిగ్గా ఉడికించకుండా తింటే ప్రమాదకమైన ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. కాబట్టి వీటిని బాగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి. మాంసం.. ప్రస్తుతం చాలామంది మాంసాహారులుగా రూపాంతరం చెందారు. సరిగా ఉడకని మాంసం తినడం వల్ల సాల్మోనెల్లా, ఇ కోలి, క్యాంపిలోబాక్టర్ వంటి సూక్ష్మక్రిములు  శరీరంలో చేరతాయి. ఇవి తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతాయి.                                                                *నిశ్శబ్ద

కరోనా కంటే నిఫా వైరస్ డేంజరా? అసలు ఈ వైరస్ ఎలా వస్తుందంటే..

అంటువ్యాధులు ఎప్పుడూ ప్రాణ నష్టాన్ని అధికంగా కలిగిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ విజృంభిస్తోంది.  విషాదకర విషయం ఏమిటంటే కరోనాతో పోలిస్తే నిఫా వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.  ప్రమాదాలను కూడా అదే స్థాయిలో పెంచుతుంది. ఇది కేవలం కేరళ రాష్ట్రంలోనే విజృంబిస్తున్నా పలు నగరాలలో ఈ వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇది అంటువ్యాధి కావడంతో    దేశం మొత్తం మీద ఈ వైరస్ కారణంగా ప్రజలు ప్రభావితం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.  ఈ వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. నిఫా వైరస్ లక్షణాలు.. నిఫా వైరస్ విషయంలో దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వైరస్ సోకిన వారిలో  ఫ్లూ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడుపై దాడి చేస్తుంది. దగ్గు, గొంతునొప్పి, శ్వాస చాలా వేగంగా తీసుకోవడం, జ్వరం ఉంటాయి.  వికారం, వాంతులు వంటి జీర్ణాశయ సమస్యలు కూడా  ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రరూపం దాలిస్తే అది మెదడువాపు వ్యాధికి దారి తీయవచ్చు. ఈ సందర్భంలో కోమా లేదా మరణం సంభవించే అవకాశం ఉంటుంది. నిఫా వైరస్ ద్వారా ప్రమాదం పిల్లల నుండి వృద్దుల వరకు ఎవరికైనా పొంచి ఉంది. వ్యాధి సోకినవారి నుండి లేదా జంతువుల నుండి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో నిఫా వైరస్ చాలా ప్రభావం చూపిస్తుంది. సాధారణ  వ్యక్తుల కంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ప్రాణాపాయం పొంచి ఉంది.  వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంరక్షణా చర్యలు.. నిఫా వైరస్ విషయంలో అందరినీ ఆందోళన పరుస్తున్న విషయం ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్ ను నివారించడానికి  ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైరస్ సోకిన తరువాత వ్యక్తులకు చికిత్స చేయడానికి నిర్థిష్ట ఔషదం కూడా లేదు. అందుకే నిపుణులు ప్రజలను సురక్షితంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. నివారణ చర్యలను పాటించడం, చేతుల పరిశుభ్రత, వీధులలో విహరించే జంతువులకు దూరంగా ఉండటం,  బయటి ఆహారాలను అవాయిడ్ చేయడం. ఆరోగ్యకరమైన, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవడం వంటివి పాటించాలి.  ఇక ఈ వైరస్ ఉన్న ప్రాంతాలలో నివసించే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలి.                                                  *నిశ్శబ్ద.

బాదం పప్పు తింటే గుండెకు ఎంతో మేలట!

ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఇదిలావుండగా, బాదం వినియోగం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కార్డియో మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఒబేసిటీ జర్నల్‌లో ప్రచురించబడింది. ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధ్యయనం ఏం చెబుతోంది? ఆస్ట్రేలియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. ప్రతిరోజూ బాదం తింటే బరువు తగ్గుతారని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుండి ఇటీవలి పరిశోధన పేర్కొంది. వెయిట్ కంట్రోల్,  కార్డియోమెటబాలిక్ హెల్త్ రెండింటిలోనూ నట్స్ ఎలా ప్రభావవంతంగా ఉంటాయో ఈ అధ్యయనంలో తేలిందని సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు డాక్టర్ షరయా కార్టర్ తెలిపారు. బాదంపప్పులో అధిక మొత్తంలో ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులో అధిక మొత్తంలో కొవ్వు ఉన్నందున, ప్రజలు వాటిని బరువు పెరుగుతారని భావిస్తారు. అయితే ఇందులో ఉండే కొవ్వు ఆరోగ్యకరం కాదు. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పరిశోధనా సమయంలో బాదం పప్పుతో  తక్కువ కొవ్వు ఆహారాలను పోల్చి చూసినప్పుడు, ఈ రెండూ శరీర బరువును దాదాపు 9.3 శాతం తగ్గించడంలో సహాయపడ్డాయని పరిశోధనా బృందం తెలిపింది. అయితే బాదంపప్పు గుండెకు మేలు చేస్తుందని తేలింది. బాదం యొక్క ఇతర ప్రయోజనాలు- -పొడి చర్మాన్ని మృదువుగా చేయడంలో బాదం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. -ప్రొటీన్లు అధికంగా ఉండే బాదం మెదడు కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. -బాదంలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. -రోజూ బాదంపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. -బాదం మీ కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది.