Delhi CM Rekha Gupta

ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులు

  ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని  దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీలోని ఘజియాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్‌ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్‌ చేశాడని ఘజియాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. సంబంధిత సిమ్‌ కార్డు ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  నకిలీ ధ్రువపత్రాలతో ఆ సిమ్‌ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భద్రతా వలయాన్ని పటిష్టం చేయడంతో, ఆమె బహిరంగ కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాలపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ సీఎం తరుచుగా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. 2019లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ ఆటోరిక్షా డ్రైవర్ చెంపదెబ్బ కొట్టారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదనే కోపంతో ఆ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు, 2016లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేజ్రీవాల్‌పై కొందరు నల్ల సిరా చల్లారు.

Chevireddy Bhaskar Reddy

చెవిరెడ్డి కూటమి ప్రభుత్వం ఉందని గుర్తెరిగి మసలుకో..పులివర్తి హెచ్చరిక

  తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత  ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిని చెవిరెడ్డి ఆపలేరు అని సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని  గుర్తెరిగి మసలుకోవాలని చెవిరెడ్డిని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం పరువు తీస్తున్నారని ఇకనైనా తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కాక ముందు మీ ఆస్తి ఏంత శాసన సభ్యుడు అయిన తర్వాత మీ ఆస్తి అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు చేర్చిన అక్రమ కేసు త్వరలో మీకు చుట్టుకుంటుంది అని జోష్యం చెప్పారు.  మీ దగ్గర ఉన్న గన్ మెన్ కు కోట్ల రూపాయల సంపాదన ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. తుడాను అడ్డుపెట్టుకుని కేవీస్ అనే పేరుతో.. మీ కుటుంబ సభ్యుల బినామీ కంపెనీలతో డబ్బులను దోచుకో లేదా అని ప్రశ్నించారు. హెల్త్ క్యాంపు, మొక్కల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకోలేదా అని నిలదీశారు. వాట్సాప్ కాల్స్ తో ప్రభుత్వ అధికారులను చెవిరెడ్డి బెదిరిస్తున్నారు అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో ఏ ఐఏఎస్, ఐపిఎస్ లు అధికారులు మీ వైసీపీ నాయకులకు భయపడరు అని చెప్పారు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదని నువ్వు చెప్పగలవా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మూడు కంటైనర్ లలో మీ డబ్బు ఎనిమిది కోట్లు దొరికింది నిజం కాదా అని నిలదీశారు. తుమ్మలగుంట అభివృద్ధికి మేము ఎంత చేసామో ప్రజలకు తెలుసు అని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నీ వాటా కూడా త్వరలో సీట్ తెలుస్తుంది అని నాని హెచ్చరించారు.   

Chhattisgarh

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కీలక మావోయిస్టు మృతి

  ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  మరో కీలక నేత మైలార‌పు ఆడెల్లు అలియాస్ భాస్కర్‌ మృతి చెందారు. అతని తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని తెలిపాయి. ఘటనాస్థలి నుంచి ఏకే-47, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  బీజాపూర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మీనర్సింహాచలం అలియాస్‌ గౌతమ్‌ అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ బండి ప్రకాశ్‌ మరణించిన విషయం తెలిసిందే.  బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఆడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. భాస్కర్ కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీ స్థాయికి భాస్కర్ ఎదిగారు.ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.   

CM Revanth Reddy

అది బీఆర్‌ఎస్ పార్టీ కాదు.. దెయ్యాల పార్టీ : సీఎం రేవంత్‌

  బీఆర్‌ఎస్ పార్టీలో దెయ్యాలు  ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్  నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి  ఎద్దేవా చేశారు. అది బీఆర్‌ఎస్ కాదని దెయ్యాల రాజ్య సమితి అని రేవంత్ సైటెర్ల వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గంధమల్ల రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి శంకు స్థాపన చేశారు.  అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తామని చెప్పి ఇళ్లు కులగొట్టి. సొంత ఫామ్‌హూస్‌కు వెళ్లేందుకు ఎర్రవళ్లికి రోడ్డు వేసుకున్నారని సీఎం ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 

CM Chandrabababu

8 జిల్లాలతో విశాఖ ఎకనమిక్ రీజియన్..లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు : చంద్రబాబు

  వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.  ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం జిల్లాల్ని రీజియన్‌ను అభివద్ది చేయాలన్నారు. వివిధ ప్రాజేక్టుల కోసం లక్ష ఎకరాలను గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.  వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. సముద్ర తీరం సంపద నిలయమని, దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు.2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి లక్ష్యంతో విశాఖ ఎకనమిక్ రీజియన్'ను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా అదే స్ధాయిలో అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది.    

Gachibowli

మాగంటిని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు..ఆరోగ్యం ఎలా ఉందంటే?

  గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే బెటర్‌గా ఉందని పేర్కొన్నారు. ఆయన తనకు సన్నిహితుడని, త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే  కుటుంబ సభ్యులు  ఏఐజీకి తరలించారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కోట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో... ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటిన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.   కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్‌ చేయించుకున్నరు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌... మాగంటి హెల్త్‌పై ఆరా తీశారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులతో, ఏఐజీ ఆస్పత్రి వైద్య బృందంతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని డాక్టర్లు కేటీఆర్‌కు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకొని   కేటీఆర్‌ హైదరాబాద్‌ బయలుదేరుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ఏఐజీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిశారు. వైద్యులతో మాట్లాడి గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

KTR

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఎందుకంటే?

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పరువు నష్టం కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.  కాగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాల్సిందిగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్‌కు నేడు దేశంలోని అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

court allow former minister kakani to police custody. quartz

పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి.. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా?

క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది. క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ   విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి .. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా? క్వార్జ్ట్ అక్రమాల తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది. క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ పోలీసుల విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారు. ఈ క్రమంలో క్వార్జ్‌ను తీసుకుని వెళ్లడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు. చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో క్వార్జ్‌ను తరలించడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

mudragada padmanabham sufferinf eith cancer

ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్? కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్

కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో  మంచి ప్రాధాన్యత ఉండేది.  కాపులకు రిజర్వేషన్ అంటూ ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాపు సామాజిక వర్గం ఆయనను తమ నాయకుడిగా అంగీకరించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం  2019 ఎన్నికలకు ముందు    కాపు  రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. ఇక  2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్  కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.   2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు.  కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ముద్రగడ నిర్ణయాన్ని ఆమె కుమార్తె క్రాంతి కూడా సమర్ధించలేకపోయారు. బహిరంగంగా ఆమె  పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు.  2024 ఎన్నిలకల తరువాత జనసేన గూటికి చేరారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ముద్రగడ ఆరోగ్యం బాలేదు. ఈ విషయాన్ని ఆయనే రెండు రోజుల కిందట ఓ లేఖ ద్వారా వెల్లడించారు. రెండు రోజుల కిందట వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు చేపట్టింది. అయితే ఆ కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన లేదు. కానీ ఓ లేఖ విడుదల చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను బయటకు రాలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న చర్చ మొదలైంది. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు. దీంతో ఆయన అభిమానుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. ఈ తరుణంలో ఆయన కుమార్తె క్రాంతి తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారని వెల్లడించారు. అంతే కాదు.. తన సొంత సోదరుడు ముద్రగడ గిరి ఆయనకు   వైద్యం అందకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.  తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో  బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు  ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ,  ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్ చేశారు. తన తండ్రిని చూసేందుకు కూడా తనను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ముద్రగడను నిర్బంధించి, చికిత్స కూడా అందకుండా చేస్తున్నారని, కనీసం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇటీవల ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కలిసి తన తండ్రిని చూడడానికి వెడితే.. తన సోదరుడు గిరి, అతడి మావ తనను అనుమతించలేదని ఆరోపించారు. 

Pm modi

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని

  ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు. కశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలకు కలుపుతూ రైల్వే లింక్ పూర్తిచేయడం చరిత్రాత్మకమని ప్రధాని తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తివడం సంతోషకరమని ప్రధాని తెలిపారు. లక్షల మంది కల నెరవేరిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. ఈరోజు చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఇక కశ్మీర్ కూడా భారత్ రైల్వే నెట్‌వర్క్‌లో చేరిందని తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యం అయిందని అన్నారు.  చీనాబ్ వంతెన అత్యద్భుతంగా నిర్మించామని తెలిపారు. రూ.46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని.. కశ్మీర్  నుంచి కన్యాకుమారికి కనెక్టివిటీ ఎట్టకేలకు లభించిందని అన్నారు. చీనాబ్ బ్రిడ్జి పర్యటలకు ఫెవరెట్ స్పాట్ౠగా మారబోతోందని ప్రధాని పేర్కొన్నారు. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్‌ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది.  

weeping scenes in cricket

క్రికెట్.. సమ్ టైమ్స్ క్రై కెట్!

ఇప్ప‌టి  వ‌ర‌కూ అత్య‌ధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర‌ల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంత‌గా మ‌రే దేశం శాసించ‌లేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. త‌ర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజ‌య ప‌రంప‌ర అందిపుచ్చుకుంది. అంత‌గా వారు క్రికెట్ లో గెలుపు రుచి చూశారు.  అత్య‌ధిక వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్పులు కొల్ల‌గొట్టిన వీరు ఎప్పుడూ ఏడ‌వ‌లేదు. పై పెచ్చు.. క‌మిన్స్ నాయ‌క‌త్వంలో గెలిచిన‌ గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్పును త‌మ కాలి కింద వేసుకుని.. వ‌ర‌ల్డ్ క్రికెట్ మా పాదాక్రాంతం అన్న సంకేతాల‌నిచ్చారుగానీ ఎప్పుడూ ఎడ‌వ‌లేదు. అపురూప‌మైన విజ‌యాలు ఎదురైన‌పుడు ఏడ్చిన వారు చాలా చాలా త‌క్కువ‌. గ‌తంలో శ్రీలంక మీద వేగ‌వంత‌మైన శ‌త‌కంతో సెహ్వాగ్ సంతోషం వ్య‌క్తం చేశాడుగానీ ఏడ‌వ‌లేదు.   ఈడెన్ టెస్టులో హ్యాట్రిక్ వికెట్ తీసిన‌పుడు.. హ‌ర్బ‌జ‌న్ ఏడ‌వ‌లేదు ఎంజాయ్ చేశాడు. ఇదే మ్యాచ్ లో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అపూర్వ‌మైన 287 ప‌రుగులు చేసిన‌పుడు కూడా ఏడ‌వ‌లేదు. ఆనందంతో సెలబ్రేష‌న్  చేసుకున్నాడు. వెస్ట్ ఇండీస్ మీద 329 ప‌రుగుల టార్గెట్ చేసిన రాహుల్ ద్రావిడ్ చివ‌రి బంతికి బౌండ‌రీ కొడ‌తార‌ని ఊహించారు కానీ సింగిల్ తీసి కేవ‌లం బ్యాట్ పైకెత్తి గెలుపు ఆనందాన్ని వ్య‌క్తం చేశాడంతే. లార్డ్స్ లో గంగూలీ ష‌ర్ట్ విప్పి గాల్లో తిప్ప‌డం ద్వారా ఇండియా విజయాన్ని కాస్త ఎమోష‌న‌ల్ చేశాడు. అంతే త‌ప్ప ఏడ‌వ‌లేదు. అయితే ఇది భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఒక మ‌ర‌పురాని మైలురాయిలాంటి విజ‌యం. ఇక్క‌డి నుంచి భార‌త్ మ‌రింత ప‌టిష్ట‌ప‌డుతూ వ‌చ్చింద‌ని అంటారు.  ధోనీ సార‌ధ్యంలో రెండు ప్ర‌పంచ క‌ప్పులు గెలిచిన‌పుడు కూడా ఏడ‌వ‌లేదు. ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశాడు. అస‌లు ధోని గెలిచిన‌పుడే కాదు ఓడిన‌పుడు కూడా ఏమంత భావోద్వేగానికి గురి కాడు. ఐపీఎల్లో ఎన్నో సార్లు అవ‌లీల‌గా ట్రోఫీలు ఎత్తాడు. అంతే స్థాయిలో ఈ సారి త‌న జ‌ట్టు ప‌రాజ‌యం పాలైనా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. గేమ్స్ లో గెలుపోట‌ములు కామ‌న్ అన్న‌ది ధోని మార్క్ సార‌ధ్యం. స‌చిన్ కి అదే చివ‌రి టోర్న‌మెంట్ అయిన‌పుడు ఎవ‌రూ ఏడు మొహం పెట్ట‌లేదు. ఆ ఛాయ‌లు త‌న మొహంలోనూ క‌నిపించ‌లేదు. బ్యాటుకీ బాలుకీ పిచ్ కీ స‌చిన్ కి అంత‌టి అనుబంధం. కానీ వాటిని వ‌దులుతున్నపుడు ఎలాంటి ఏడుపులు పెడ‌బొబ్బ‌లు పెట్ట‌లేద‌త‌ను. మొన్న‌టి ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన‌పుడు ఫైన‌ల్స్ లో సిరాజ్ ఏడ‌వలేదు. కానీ, భార‌త్ గెలిచిన‌పుడు అత‌డు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడ‌న్న‌ది తెలీదు.  ఇదే ఐపీఎల్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ సైతం త‌న ఫ‌స్ట్ మ్యాచ్ లో త‌క్కువ స్కోర్ మాత్ర‌మే చేసిన‌పుడు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఎందుక‌లా అయ్యాడంటే అత‌డు చిన్న‌పిల్లాడు కాబ‌ట్టి అది స‌హ‌జం క‌దా అనుకున్నారంతా. ఆ మాట‌కొస్తే గ‌తంలో వినోద్ కాంబ్లీ శ్రీలంక‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లో ఔట్ అయిన‌పుడు కూడా ఇలాగే భావోద్వేగానికి గుర‌య్యాడు. లేటెస్టుగా ఐపీఎల్ ఫైన‌ల్ చివ‌రి ఓవర్  నుంచే విరాట్ ఏడుపు మొహం పెట్టుకుని క‌నిపించాడు. ఏడుపు వ‌స్తోంద‌ని సైగ చేశాడు. గెలుపు ముందు క్ష‌ణాలు అంటే చివ‌రి ఓవ‌ర్ రెండో బంతి నుంచి ఏడ‌వ‌డం మొద‌లు పెట్టాడు. ఆట‌ల్లో గెలిచిన‌పుడు ఆనందించాలిగానీ ఈ ఏడుపులేంటి? ఇవే ఒక్కోసారి విషాదాంతాల‌కు దారి తీస్తాయ‌న‌డానికిదో నిద‌ర్శ‌నంగా విశ్లేసిస్తున్నారు కొంద‌రు క్రికెట్ ఎన‌లిస్టులు

Hydra

హైదరాబాద్‌లో హైడ్రా నాలుగు నెలలు స్పెషల్‌ డ్రైవ్‌

  హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని  హైడ్రా కమీషనర్  రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు. పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ తెలిపారు. ముఖ్యంగా నగరంలో వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.. ఈ అధ్యయనం ద్వారా సమస్య మూలాలను కనుగొని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.రసూల్‌పురా నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పరిధిలో బేగంపేట, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.  

donald trump and musk became rivas

ట్రంప్, మస్క్ మధ్య ఎక్కడ చెడింది?

విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి? ఇన్నాళ్లూ కలసి మెలసి అలాయ్ బలాయ్ అన్న ఈ బాబాయ్- అబ్బాయ్ ఇప్పుడు సడెన్ గా ఎందుకు విడిపోయినట్టు? ట్రంప్ కీ మస్క్ కి ఎక్కడ చెడినట్టు? విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన ఎలాన్ మస్క్  ఇప్పుడు  బిగ్ బిల్ విషయంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు?  ఇదీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్న. దీనిపైనే ప్రపంచదేశాలలో సామాన్యుల నుంచి అధికారుల వరకూ, దేశాధినేతల నుంచి మేథావుల వరకూ జోరుగా సాగుతున్న చర్చ. ట్రంప్ మీద మస్క్ వరుస విమర్శనాస్త్రాలను గురి పెడుతున్నారు. మొన్న బిగ్ బిల్ ని పంది మాంసంతో పోల్చిన మస్క్.. ఇప్పుడు మరో బాంబు పేల్చారు.. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్‌రీ ఎప్ స్టైన్ తో ట్రంప్ నకు సంబంధాలున్నాయని.. కొత్త అప్ డేట్ ని ట్రంప్ వ్యతిరేకుల చేతికి ఇచ్చారు.  ఏంటీ ఎప్ స్టైన్ స్కామ్ అన్నది అలా ఉంచితే.. మస్క్ ఏంటి ట్రంప్ కి ఇలా రివర్స్ తిరిగాడన్నది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. నిజానికి ఎలాన్ మస్క్ 2024 ఎన్నికల్లో ట్రంప్ కోసం ఏకంగా 288 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఇది భారత కరెన్సీ ప్రకారం చెబితే ఏకంగా పాతిక వందల కోట్ల రూపాయలు. ఇందుకు మస్క్ కి మిగిలింది.. టెస్లా కార్ల షోరూములు ధ్వంసం కావడం, తన కంపెనీ షేర్ ధరలు అమాంతం 50 శాతం పడిపోవడం. ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు తగ్గడం. ఇవన్నీ ఒకెత్తైతే.. ఆయనకు వచ్చిన చెప్పపేరు మరో ఎత్తు.    తన స్నేహితుడు ఐజాక్ మాన్ ను నాసా చీఫ్‌ గా ప్రకటిస్తానని మాటిచ్చిన ట్రంప్ మాట మార్చడంతో.. ఇటు గోడ దెబ్బ అటు చెంపదెబ్బగా మారింది మస్క్ పరిస్థితి. ఒక వేళ బిగ్ బిల్ గానీ అమల్లోకి వస్తే టెస్లా ఈవీల కొనుగోలు దారులకు ఇచ్చే మినహాయింపులు కట్ చేల్సి వస్తుంది. దీని ద్వారా.. మరో 1. 2 బిలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క తాను డోజ్ సలహాదారుగా ఉండి తీసుకున్న నిర్ణయాలు కూడా బెడిసికొట్టాయి. ట్రంప్ పాలనా పరమైన లోపాలన్నిటికీ మస్కే  కారణం అన్న చెడ్డ పేరు అమెరికన్లలోకి భారీగా వెళ్లిపోయింది. దీంతో స్పేస్ ఎక్స్, టెస్లా వంటి తన కంపెనీల ప్రభ మసకబారడం మొదలైంది.   దీన్నిబట్టీ చూస్తే అంతరిక్షంలోకి మనిషిని పంపి యాజ్ ఇటీజ్ నేలకు దించినంత ఈజీ కాదు రాజకీయాలంటే! అని మస్క్ కి తెలిసి వచ్చింది .  కార్లు తయారు చేసి జనం మెప్పు పొందినంత ఈజీ కాదు రాజకీయాల్లో రాణించడం అంటే!అన్న తత్వం మస్క్ కి బెధపడింది.   బేసిగ్గా ఇలాంటి వ్యాపారులు రాజకీయాల్లోకి వచ్చేదే తమ వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని. ఇందుకు రివర్స్ అయితే ఈ రాజకీయాలెందుకు? వాటికి ఇంత భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడమెందుకు? ట్రంప్ కోసం తన గుడ్ విల్ ని, వ్యాపార సామ్రాజ్యన్నీ ఫణంగా పెట్టినందుకు మస్క్ కు మిగిలిందేమిటంటే పూడ్చుకోలేనంత నష్టం.   దీంతో తండ్రి ఎరోన్ మస్క్.. తన కొడుకు ఎలాన్ మస్క్ సలహా ఇచ్చారు. అర్జెంటు గా ఆ ట్రంప్ సహవాసం వీడి.. భారత్ కి రా.. ఇక్కడి ఆలయాలను సందర్శించు. మనశ్శాంతిని పొందు! అని ససలహా ఇచ్చారట. ఇదిలా ఉంటే మస్క్ కూడా భారత్ కి రావల్సి ఉంది. కానీ ఎందుకో వాయిదా పడింది. కారణం.. టెస్లా కార్ల తయారీకి ఇక్కడ అవకాశం లేక పోవడం. కేవలం అమ్మకాలతో సరిపెట్టుకోవల్సి రావడం ఒక కారణం కాగా.. మరొకటి ఇక్కడ అధికార గణంతో ఎక్స్ కంటెంట్ మోడరనేషన్ విషయంలో చిన్న పాటి సమస్యలు తలెత్తాయి. దీంతో మస్క్ భారత్ ట్రిప్ ఆగింది. ప్రస్తుతం మస్క్ న్యూరాలింక్ అనే కొత్త ప్రాజక్ట్ లో ఉన్నారు.. దీన్నిబట్టీ చూస్తే వెన్నుముక విరిగిపోయిన వారికి కొత్త జీవితం ప్రసాదించడం, కంటి చూపు పోయిన వారిని చూడగలిగేలా చేయడం అనే మిషన్లో బిజి బిజిగా ఉన్నారు మస్క్.  ఇలాంటి తన బిజినెస్ ఐడియాలు పొలిటిక్స్ లో వాడ్డం కుదరదని భావించి.. మొదట డోజ్ నుంచి బయటకొచ్చారు మస్క్. తర్వాత ట్రంప్ తీసుకుంటున్న బిగ్ బిల్ వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఎప్ స్టైన్ కి ట్రంప్ కి ఉన్న లింకులు బయట పెట్టి.. నేను ట్రంప్ కి డెడ్ యాంటీ అనే సిగ్నళ్లు పాస్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వెనక తాను లేను. తద్వారా నన్ను ఆడిపోసుకోకండి. నేను కూడా మీలాగా ట్రంప్ బాధితుడ్నే.. అని ఆయన జనాలకు క్లియర్ కట్  మెసేజ్ ఇస్తున్నట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మస్క్ ఇంత భారీ ఎత్తున విరాళాలిచ్చి మరీ.. రాజకీయాల్లోకి రావడం వెనక ఒక ఉద్దేశముందని అంటారు. తాను కూడా ఒకనాటికి ట్రంప్ లా అధ్యక్షా! అనిపించుకోవాలని ఆశ. కానీ, విచిత్రమైన విషయమేంటంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. మస్క్ కి వరుస దెబ్బలు తగలడంతో.. ఇదిగో ఇలా రివర్స్ గేర్ వేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు అమెరికన్ ఎనలిస్టులు.

karnataka government serious on bengaluru stampede

ఆర్సీబీ బిజినెస్ హెడ్ అరెస్టు.. బెంగళూరు సీపీ సస్పెన్షన్

ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై సిద్దరామయ్య సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి  బెంగళూరు పోలీస్ కమిషనర్‌పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. సీపీ దయానంద్‌తో పాటు ఏసీపీ, డీసీపీలను కూడా సస్పెండ్ చేసింది. అలాగే కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్లపై సైతం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే  ఆర్సీబీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు  రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను నియమించారు. ఈ ప్యానెల్ విచారణ జరిపి నెల రోజులలోగా నివేదిక అందించాలని ఆదేశించారు. అాలాగే తొక్కిసలాట  ఘటనపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.ఈ ఘటనకు సంబంధించి  ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోలే సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్  నిఖిల్ సొసలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి.   

corona is spreading rapidly in the country

కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 489 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కు చేరుకుంది. ఇలా ఉండగా కరోనా కారణంగా గత 24 గంటల్లో నలుగురు మరణించారు. కేరళలో ఇద్దరు, పంజాబ్ ,కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 55కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే నిన్న ఒక్క రోజే కొత్తగా 11 మందికి కరోనా సోకింది. ఏపీ, తెలంగాణ లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో ఒకే రోజు మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.  నెల్లూరులో గురువారం (జూన్ 5) ఒక్కరోజే నలుగురికి,  విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది. నెల్లూరు జీజీహెచ్‌లో బుధవారం ఆరుగురికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో గురువారం నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 62కు చేరింది. ఇక  తెలంగాణలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో   యాక్టివ్ కేసుల సంఖ్య 5కు పెరిగింది. 

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ

  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఆర్డీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడో సారి ఈ రోజు ముగిసిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గతంలో పాతిక బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ ఈ సారి 50 బేసిస్ పాయిట్లను తగ్గించింది. ఈ తాజా తగ్గింపుతో రెపో రేటు 6 నుంచి 5.50 శాతానికి దిగివచ్చింది. ఈ తగ్గింపు వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 3.7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.  మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది.  

మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్

ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా  ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు "AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  ఇక‌, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17  మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ  ఫైలు మీదే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. 

అంగరంగ వైభవంగా అఖిల్ జనాబ్ వివాహం

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేనిఅఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున మూడు గంటలకు అఖిల్ జనాబ్ మెడలో తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు  మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్  సహా  టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు.   గురువారం (జూన్ 5) రాత్రి నుంచే వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి.  వెకేషన్ లో ఉన్న అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత దంపతులు కూడా వెకేషన్ ను ముగించుకుని వివాహానికి హాజరయ్యారు. ఇక ఆదివారం (జూన్ 8)న అఖిల్ జనాబ్ ల పెళ్లి రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ హాజరౌతారని తెలుస్తోంది. అలాగే పలువురు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలూ కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.  ఆదివారం (జూన్ 8) వివాహ రిసెప్షన్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ తెలిపింది.  

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం (జూన్ 6) హాజరు కానున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు  ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్​ కేబినెట్​లో ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్​ ప్రశ్నించనుంది.   ఇక మాజీ మంత్రి హరీష్ రావు  సోమవారం (జూన్ 9) కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ఎదుట ఈ నెల 11న హాజరు కానున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఈ  నెల5నే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు కమిషన్ విచారణకు 11కు వాయిదా వేసింది.   అసలు కేసీఆర్, ఈటల, హరీష్ రావులను విచారించకుండానే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని ముందుగా భావించినప్పటికీ  ఆ తరువాత వీరిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకుంది.  విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్​ ఈఎన్​సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్​ వ్యక్తుల నుంచి స్టేట్​మెంట్లను తీసుకున్న కమిషన్, వారి స్టేట్ మెంట్ల ఆధారంగా  తుది నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది.  ఇప్పుడు కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ వాంగ్మూలాలనూ నమోదు చేయాలని కమిషన్ వారికి నోటీసులు పంపింది.